Jun 16, 2017

వ్యవసాయ రంగానికి రూ. రు.87,471 కోట్ల రుణాలు


ఎస్ఎల్ బీసీ సమావేశ నిర్ణయాలు తెలిపిన వ్యవసాయ శాఖ మంత్రి చంద్రమోహన రెడ్డి
Ø ఇన్ పుట్ సబ్సిడీపై రేపు నిర్ణయం
Ø 5,80 లక్షల క్వింటళ్ల మిర్చి, 3 లక్షల క్వింటళ్ల పసుపు కొనుగోలు
Ø కౌలు రైతులకు రూ.లక్ష వరకు వడ్డీలేని రుణం

సచివాలయం, జూన్ 16: వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు వాణిజ్య బ్యాంకులు ఈ ఏడాది(2017-18) రు.87,471 కోట్ల రుణాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్ బీసీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి చెప్పారు. తాము రూ.91,557 కోట్ల రుణాలు ఇవ్వమని కోరగా, ఇంతరకే ఆమోదించినట్లు ఆయన తెలిపారు.  సచివాలయంలో శుక్రవారం మధ్యాహ్నం ఎస్ఎల్ బీసీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన 4వ బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సూక్ష,చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)కు రూ.25వేల కోట్లు, ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ.14,335 కోట్లు, మొత్తం రూ.1,26,806 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. వ్యవసాయం రంగానికి ఇచ్చే రుణాల్లో 10 శాతం అంటే రూ. 8,740 కోట్ల రుణాలు  కౌలు రైతులకు ఇస్తారని తెలిపారు. కౌలు రైతులకు కూడా   లక్ష రూపాయల వరకు వడ్డీలేని రుణం ఇస్తారని చెప్పారు.  రెవెన్యూ ఉద్యోగులు, వెలుగు కార్యకర్తల సమన్వయంతో  రైతులకు రుణ అర్హత పత్రాలు(ఎల్ఈసీ), సాగు ధృవీకరణ పత్రాలు( సీఓసీ) అందజేస్తారని చెప్పారు. ఇప్పటికే మూడు లక్షల మంది రైతులకు ఎల్ఈసీలు జారీ చేశారని, ఇంకా 5.60 లక్షల మందికి ఇవ్వవలసి ఉందని తెలిపారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయం అయినందున ఎల్ఓసీ, సీఓసీలు ఇచ్చిన తరువాత వాణిజ్య బ్యాంకులు తప్పనిసరిగా రుణాలు ఇస్తాయని చెప్పారు.  దేశంలో రైతులకు గురించి ఆలోచన చేస్తున్నది ఏపీ ప్రభుత్వమేనని చెప్పారు. దేశంలో మొదటిసారిగా రైతులకు ఎల్ఓసీ, సీఓసీలు ఇచ్చింది కూడా తమ ప్రభుత్వమేనన్నారు.
ఇన్ పుట్ సబ్సిడీపై రేపు నిర్ణయం
రైతులకు ఇచ్చే ఇన్ పుట్ సబ్సిడీపై రేపు సాయంత్రం 3 గంటలకు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. వ్యవసాయ బీమా హెక్టార్ కు కేంద్రం రూ.6,900లు ఇస్తుందని, అయితే ఇన్ పుట్ సబ్సిడీ, బీమా కలిపి హెక్టార్ కు రూ.15వేల రూపాయల చొప్పున రెండు హెక్టార్లకు రూ.30 వేల రూపాయల వరకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. కేంద్రం ఇచ్చిన దానికి తోడు  మిగిలిన మొత్తాన్ని రాష్ట్రం ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. బీమా రూ.15వేలకు పైన వచ్చినా ఆ మొత్తం రైతులకే ఇస్తామని చెప్పారు.
5,80 లక్షల క్వింటళ్ల మిర్చి కొనుగోలు
రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ. 95 కోట్ల విలువైన 5,80 లక్షల క్వింటళ్ల మిర్చి కొనుగోలు చేసినట్లు తెలిపారు. అలాగే మూడు లక్షల క్వింటళ్ల పసుపు కొనుగోలు చేసినట్లు తెలిపారు. పసుపు ఏ గ్రేడ్ రూ.6,500, బీ గ్రేడ్ రూ.6000 చొప్పున కొనుగోలు చేసినట్లు మంత్రి వివరించారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...