అదే రోజు సీఎం చే ఎంఎస్ఎంఈ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ప్రారంభం
సచివాలయం, జూన్ 23: యునైటెడ్
నేషన్స్ ప్రకటించిన ప్రకారం ఏపీ ప్రభుత్వం
ఈ నెల 27న ఎంఎస్ఎంఈ(సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమల) దినోత్సం
నిర్వహించనున్నట్లు పరిశ్రమల శాఖ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ
లబ్బీపేటలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో ఉదయం 10 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయి.
రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమంలో మంత్రులు, వివిధ రంగాలకు చెందిన
ప్రముఖులు, బహుళజాతి కంపెనీలు, వివిధ
రంగాలకు చెందిన బ్యాంకుల, జాతీయ స్థాయిలో
ముఖ్య సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. రాష్ట్రంలో సూక్ష్మ,చిన్న, మధ్యతరహా
పరిశ్రమల అభివృద్ధి కోసం అదే రోజు ముఖ్య
మంత్రి చంద్రబాబు నాయుడు ఎంఎస్ఎంఈ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ను ప్రారంభిస్తారు. అంతేకాకుండా
ఆ రోజు ఈ రంగానికి సంబంధించి పలు నిర్ణయాలను ప్రకటిస్తారు. బహుమతులు కూడా
అందజేస్తారు. దేశంలో ఇటువంటి కార్పోరేషన్
ను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా ఏపీ
నిలుస్తుంది.
రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈ
పారిశ్రామికవేత్తలందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. అయితే ఈ వేడుకలో
పాల్గొనదలచినవారు ఆన్ లైన్ లో www.apindustries.gov.in వెబ్ సైట్ లో ముందుగా తమ పేర్లను
నమోదు చేయించుకోవాలని పరిశ్రమల శాఖ కమిషనర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
No comments:
Post a Comment