Jun 14, 2017

27న చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి కార్పోరేషన్ ఏర్పాటు


పరిశ్రమల శాఖ మంత్రి అమరనాధరెడ్డి
·        చిత్తూరు-నెల్లూరు జిల్లాలు కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్ గా ఎంపిక
·        స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు యోచన
·       పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ
·       ఆన్ లైన్ ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహకాల చెల్లింపు
·       పారిశ్రామిక అభివృద్ధి కోసం కొత్త పాలసీల రూపకల్పన
·       ఎంఓయులు జరిగిన వాటిలో 137 పరిశ్రమల ఉత్పత్తి ప్రారంభం
·       పరిశ్రమలకు భూ కేటాయింపుల సరళీకరణ
·       దేశంలో మొదటిసారిగా జిల్లా స్థాయి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులు

      సచివాలయంజూన్ 14: యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్(యుఎన్ఓప్రకటించిన ప్రకారం ఈ నెల 27న జరిగే సూక్ష,చిన్నతరహామధ్యతరహా పరిశ్రల(ఎంఎస్ఎంఈదినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో ఏపీఎంఎస్ఎంఈ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమలుఫుడ్ ప్రాసెసింగ్వ్యవసాయ వాణిజ్యంవాణిజ్యంప్రభుత్వ రంగ సంస్థల శాఖల మంత్రి ఎన్అమరనాధరెడ్డి చెప్పారుసచివాలయంలోని 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో బుధవారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారుకార్పోరేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటిస్తారన్నారుసూక్ష,చిన్నతరహామధ్యతరహా పరిశ్రల ద్వారా అత్యధిక మందికి ఉపాధి లభించే అకాశం ఉందనిఅందు వల్ల ప్రభుత్వం ఆ రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలిపారుతమ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రాష్ట్రంలో 19,193 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈల ద్వారా  2.26 లక్షల మందికి ఉపాధి లభించినట్లు వివరించారుచిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అభించే అవకాశం ఉంటుందనిఅందువల్ల ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు నెలకొల్పాలని నిర్ణయించినట్లు చెప్పారుఇప్పటి వరకు రాష్ట్రంలోని 175 శాసనసభ నియోజకవర్గాల్లో 101 నియోజకవర్గాల్లో ఈ పార్కుల కోసం భూములు ఎంపిక చేసినట్లు తెలిపారుమిగిలిన నియోజకవర్గాల్లో కూడా భూములు గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందన్నారుఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడంలో భాగంగా ఆ సంస్థలకు అవార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారుఈ రంగంలో మూతపడిన పరిశ్రమలను పున:ప్రారంభించేందుకు రూ.160 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్
             మన రాష్ట్రంలో ఉన్న 974 కిలోమీటర్ల  కోస్తా తీరం పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉందిఉపాధి కూడా అత్యధిక మందికి లభించే అవకాశం ఉందిఈ నేపధ్యంలో నెల్లూరు-చిత్తూరు జిల్లాల్లోని 50 కిలోమీటర్ల  ప్రాంతాన్ని కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్ గా కేంద్రం ఎంపిక చేసినట్లు మంత్రి చెప్పారుదీంతో ఆ ప్రాంతంలోని యువతకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉందన్నారుఇప్పటికే ఈ ప్రాంతాన్ని విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ గా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు  అభివృద్ధి చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారుఈ కారిడార్ అభివృద్ధికి ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాక్ రూ.5500 కోట్లుఇతర బ్యాంకులు రూ. 4 వేల కోట్లుఏపీ ప్రభుత్వం రూ.1500 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారుదీంతోపాటు చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ కూడా అభివృద్ధి పరుస్తున్నట్లు చెప్పారునూతనంగా ప్రారంభించే పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి లభించే విధంగా వారికి ఆయా పరిశ్రమల్లో అవసరాలమేరకు ఇంజనీరింగ్ కాలేజీల్లో  స్కిల్ డెవలప్ మెంట్ లో శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. ఇందు కోసం కాలేజీల్లో ప్రత్యేక క్లాసులు నిర్వహించేవిధంగా ఏర్పాట్లు చేస్తామన్నారుఅదేవిధంగా నెల్లూరు-చిత్తూరు జిల్లాల మధ్య స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు తెలిపారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో జిల్లా స్థాయి ర్యాంకులు

       ప్రపంచం బ్యాంకు 2016 నివేదిక ప్రకారం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని మంత్రి చెప్పారుపరిశ్రామిక రంగంలో మనం అనుసరించే విధానాల ఆధారంగా  ఈ ర్యాంక్ ఇచ్చినట్లు తెలిపారుఈ ఏడాది నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో జిల్లా స్థాయిలో ర్యాంకులు ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారుఆయా జిల్లాల్లో పనితీరుఆచరణలో ఎంఓయూల ప్రగతిపారిశ్రామిక అనుమతులుమౌలిక వసతుల కల్పనప్రోత్సాహకాల చెల్లింపు తదితర అంశాల  ఆధారంగా  ర్యాంకులు ఇస్తారని, ఈ విధంగా ర్యాంకులు ఇచ్చే విధానం మొదలు పెట్టిన రాష్ట్రం దేశంలో మనదే మొదటిదని వివరించారు

పారిశ్రామికీకరణకు నిబంధనలు సరళతరం
          రాష్ట్రంలో పారిశ్రామిక విస్తరణకు భూకేటాయింపుఅనుమతుల నిబంధనలను సరళతరం చేసినట్లుపెట్టుబడులు రాబట్టడానికి ఈ రంగంలో చాలా మార్పులు చేసినట్లు మంత్రి తెలిపారుపరిశ్రమ స్థాపించడానికి కావలసిన 39 అనుమతులు 21 రోజుల్లో ఇస్తున్నట్లు చెప్పారువాటిలో 34 అనుమతులు 10 నుంచి 15 రోజుల్లోనే ఇస్తున్నట్లు తెలిపారుముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు అయిదు రకాల ముఖ్యమైన పారిశ్రామిక ప్రోత్సాహకాలను త్వరితగతిన ఆన్ లైన్ లోనే చెల్లించే ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  ప్రోత్సహకాలకు సంబంధించి ఇప్పటి వరకు 7939 దరఖాస్తులు ఆన్ లైన్ పోర్టల్ ద్వారా అందుకున్నట్లు తెలిపారు. 2014 జూన్ నుంచి ప్రోత్సహకాల కింద రూ.2567.11 కోట్లు ప్రభుత్వం విడుల చేసినట్లు మంత్రి వివరించారుపెండింగ్ లో ఉన్న వాటిని కూడా త్వరగా పరిష్కరించమని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
మన రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి పెద్ద పెద్ద కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారురూ.10 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే మెగా పరిశ్రమల్లో ఉపాధి ఆధారంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వడానికి నూతన నిబంధనలు రూపొందిస్తున్నట్లు చెప్పారుఎంఓయులను అమలు పరచడానికి ప్రభుత్వం తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నట్లు చెప్పారుఇప్పటి వరకు జరిగిన ఎంఓయూలకు సంబంధించి 137 పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించినట్లు తెలిపారుఅటు రైతులకు ఉపయోగపడేఇటు ఉపాధికి అవకాశాలు ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారుఈ రంగంలో రూ.10,747.88 కోట్ల పెట్టుబడులతో 1,09,886 మందికి ఉపాధి లభించే 340 ఎంఓయూలు జరిగినట్లు చెప్పారువాటిలో రూ.1,141.17 కోట్ల పెట్టుబడులతో 26,801 మందికి ఉపాధి కల్పించిన 115 ప్రాజెక్టులు ఉత్పత్తి ప్రారంభించినట్లు తెలిపారుమిగిలినవి కూడా వివిద దశల్లో ఉన్నట్లు చెప్పారుఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ పాలసీని రూపొందించి టెక్స్ టైల్సిల్క్ టెక్స్ టైల్ పార్కులను ప్రోత్సహించనున్నట్లు మంత్రి చెప్పారు.  పారిశ్రామిక రంగంలో ఎస్సీ,ఎస్టీలనుమహిళలను ప్రోత్సహించడంలో భాగంగా వారికి అదనంగా ప్రోత్సహకాలు ఇస్తున్నట్లు తెలిపారువెనుకబడిన జిల్లాల్లో దాదాపు రూ.6,500 కోట్ల వరకు పెట్టుబడులు రాబట్టడానికి వెనుకబడిన జిల్లాల ఆల్ట్రా మెగా ఇంటిగ్రేటెడ్ ఆటోమొబైల్ పాలసీని రూపొందించినట్లు చెప్పారుఆటోమొబైల్ రంగంలో అతి పెద్ద సంస్థ అయిన కియా మోటార్స్ రూ.13,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడానికి నూతన పాలసీ ఉపయోగపడిందన్నారు.
విశాఖలో 2016, 2017లో జరిగిన రెండు భాగస్వామ్య సదస్సుల్లో అన్ని విభాగాల్లో 1569 ప్రాజెక్టులకు సంబంధించి ఎంఓయులు జరిగాయని చెప్పారువీటి ద్వారా రూ.16,87,845 కోట్ల పెట్టుబడులు, 30,74,933 మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని మంత్రి వివరించారువాటిలో ఇప్పటికే రూ.32,735 కోట్ల పెట్టుబడులతో 137 ప్రాజెక్టులు ప్రారంభమైనట్లు, 80,981 మందికి ఉపాధి లభిస్తున్నట్లు చెప్పారు రూ.5,00,732 కోట్ల పెట్టుబడితో 13,02,902 మందికి ఉపాధి లభించే 311 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నట్లు మంత్రి వివరించారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...