Nov 23, 2016

రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం


v 12,354 చిన్న, పెద్ద పరిశ్రమల స్థాపనకు అనుమతి
v భారీ స్థాయిలో ఫార్మా కంపెనీల రాక
v పవర్ సెక్టార్, సిమెంట్ పరిశ్రమలలో భారీగా పెట్టుబడులు
v హెచ్ పీసీఎల్, ఓఎన్ జీసీ, కోల్గేట్ పామోలివ్,  ఏషియన్ పెయిట్స్ ప్రాజెక్టులు
v విద్యుత్, టెక్స్ టైల్స్, ఫుడ్, ఆగ్రో ప్రాజెక్టుల స్థాపనకు ఏర్పాట్లు

             రాష్ట్రంలో ఒక ఉద్యమంలా పరిశ్రమల స్థాపనకు పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇది అది అని లేదు అన్ని రకాల పరిశ్రమల స్థాపనకు దరకాస్తులు వెల్లువెత్తాయి. ఫార్మాస్యూటికల్స్, హోటల్, పెయింట్స్, ఆగ్రో అండ్ ప్రాసెసింగ్, సిమెంట్, విద్యుత్, వస్త్రాలు-దుస్తులు, ఫెర్టిలైజర్స్, సిమెంట్, ఎలక్ట్రానిక్స్, బెవరేజెస్, గ్రానైట్, సిరామిక్, ఎలక్ట్రికల్, ఐటీ, ఆటోమొబైల్,  పెట్రోకెమికల్స్, ఇంధనం, మినరల్ ఆధారిత పరిశ్రమ, తోళ్ల పరిశ్రమ, ఇంజనీరింగ్, గ్లాస్, బొగ్గు, పర్యాటక, పేపర్, ప్లాస్టిక్, మెరైన్ తదితర రంగాలలో ప్రాజెక్టుల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు.  ప్రభుత్వ రంగంలో కూడా భారీ పరిశ్రమలు స్థాపించనున్నారు. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది ఉద్యోగ అవకాశాలు పెరగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అనేక పారిశ్రామిక ప్రోత్సాహకాలు ప్రకటించింది. అందులో భాగంగా భూ కేటాయింపులు, పన్నుల రాయితీలు కల్పిస్తోంది.  అనుకూలమైన, సులభతరమైన పారిశ్రామిక విధానాలను అవలంభిస్తుండటం వల్ల పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడకు రావడానికి ఆసక్తి చూపుతున్నారు. ఏదైనా ఒక పరిశ్రమ స్థాపించాలంటే అక్కడ తయారైయ్యే ఉత్పత్తి, వాడే ముడిపదార్ధం, ప్రమాదకర వ్యర్థాల తీవ్రత తదితర అంశాల ఆధారంగా 20 నుంచి 30 రకాల అనుమతులు పొందవలసి ఉంటుంది. పరిశ్రమల శాఖ మొదలుకొని కాలుష్యం నియంత్రణ, విద్యుత్, పౌరసరఫరాలు, అటవీ, భూగర్భజలాలు, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, మునిసిపాలిటీ, పంచాయతీరాజ్, వాణిజ్యపన్నులు, రెవెన్యూ, జలవనరులు, కార్మిక, బాయిలర్, సీఏటీ, సీఎస్టీ తదితర అనుమతుల పొందాలి. కొన్ని శాఖలలో మూడునాలుగు రకాల అనుమతులు కూడా పొందవలసి ఉంటుంది.  వివిధ శాఖలలో ఈ అనుమతులు అన్ని పొందడానికి గతంలో అయితే సుదీర్ఘ కాలం పట్టేది. ఇప్పుడు  ఆ జాప్యాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం  సింగిల్ డెస్క్ విధానం ప్రవేశపెట్టింది. కార్యాలయాల చుట్టూ తిరగవసిన అవసరంలేదు. ఈ విధానం ద్వారా కావలసిన అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే 14 రోజులలోనే అనుమతి ఇస్తున్నారు.  ఈ డెస్క్ ప్రారంభమైన 2015 ఏప్రిల్ 29 నుంచి  ఇప్పటి (నవంబర్ 21) వరకు చిన్న, పెద్ద పరిశ్రమల ఏర్పాటు కొరకు 13,347 దరకాస్తులు రాగా, 12,354 కి అనుమతులు మంజూరు చేశారు. మరో 225 దరకాస్తులు సర్వీస్ లెవల్ ఎగ్రిమెంట్ (ఎస్ఎల్ఏ) పరిధిలో పెండింగ్ లో ఉన్నాయి. గత మూడు నెలల కాలంలో వచ్చిన దరకాస్తులను పరిశీలిస్తే సెప్టెబర్ లో 884 దరకాస్తులు రాగా, 840కి అనుమతులు మంజూరు చేశారు. అక్టోబర్ లో 783 రాగా, 729ని అనుమతించారు. ఈ నెలలో 21వ తేదీ వరకు 574 రాగా, 349కి అనుమతులు మంజూరు చేశారు. మిగిలినవి పరిశీలనలో ఉన్నాయి.

భారీ స్థాయిలో ఫార్మా కంపెనీల రాక
       వివిధ రంగాలను పరిశీలిస్తే ఫార్మా కంపెనీలు తమ యూనిట్లను స్థాపించడానికి ఎక్కువగా ముందుకు వచ్చాయి. ఇప్పటికే ఉన్న కంపెనీలతోపాటు కొత్త కంపెనీలు కూడా తమ యూనిట్లను రాష్ట్రంలో నెలకొల్పనున్నాయి.  గ్లోకెమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్,  డాక్టర్ రెడ్డి ల్యాబరేటరీస్, దివిస్ లేబరేటరీస్ లిమిటెడ్,  హెటీరో డ్రగ్స్ లిమిటెడ్, హోనార్ ల్యాబ్, ఇనోజెంట్ లేబరేటరీ, లారస్ ల్యాబ్స్, లీ ఫార్మా, లుపిన్ లిమిటెడ్, మైలాన్ లేబరేటరీస్, ఫాలన్ ఎక్స్ లాబ్, రాక్స్ ఫార్మా, శ్రీనీ ఫార్మాస్యూటికల్స్, వసుధా ఫార్మా, విజయశ్రీ ఫార్మా,  డార్విన్ ఫార్మా, ఇసాయ్ ఫార్మాస్యూటికల్స్, ఎమ్మెన్నార్ ఫార్మా, ఎసెంటియా అడ్వాన్స్ డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, గిల్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, బయోకాన్ లిమిటెడ్, బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్, అక్తినోస్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, గొంగిటి రవీంద్రా రెడ్డి, గ్రాన్యూవల్ ఓమ్మికెమ్ ప్రైవేట్ లిమిటెడ్, గ్రీన్ టెక్ లేబరేటరీస్, హర్ష ఇంగ్రెడియంట్స్, హత్రి ఫార్మా వంటి సంస్థలు తమ యూనిట్లను స్థాపించనున్నాయి.
ఆ తరువాత ఫుడ్, ఆగ్రో, టెక్స్ టైల్స్ పరిశ్రమల స్థాపనకు ఎక్కువగా అనుమతులు పొందారు.  పవర్ సెక్టార్, సిమెంట్ పరిశ్రమలలో భారీగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. పలు పరిశ్రమలు విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు స్థాపించనున్నాయి. సోలార్ పవర్ ప్రాజెక్టులు ప్రారంభించడానికి కూడా పలువురు ముందుకు వచ్చారు.  ఆల్ట్రాటెక్, సెట్టినాడు, రామ్ కో  వంటి సిమెంట్ ఫ్యాక్టరీలు నెలకొల్పనున్నారు. ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్ మెంట్ కంపెనీ, ఆంధ్ర ప్రదేశ్ పవర్ జెనరేషన్ కార్పోరేషన్ లు  రెండు భారీ ప్రాజెక్టులు చేపట్టనున్నాయి.
      హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(హెచ్ పీసీఎల్), ఆయిల్ నేచుల్ గ్యాస్ కార్పోరేషన్(ఓఎన్ జీసీ), కోల్గేట్ పామోలివ్,  ఏషియన్ పెయింట్స్, లూయిస్ డ్రేఫస్ కమోడిటీస్ లిమిటెడ్, జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్ మెంట్, ఇసుజు మోటార్స్, దయానిధి సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, సిటీమోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలు తమ ప్రాజెక్టులను ప్రారంభించనున్నాయి. ఇప్పటికే అనుమతించిన ప్రాజెక్టులను ప్రారంభిస్తే రాష్ట్రంలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతాయి. యువతకు ఉపాధికి ఢోకా ఉండదు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగి ఆర్థిక వృద్ధి ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంటుంది.

జారీ చేసినవారు: రిసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగం,  సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
apspecialnews@gmail.com


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...