Nov 17, 2016

వాణిజ్య పన్నుల ఆదాయం రూ.8283.94 కోట్లు

 §  7 నెలల వివరాలు విడుదల
§  పెట్రో ఉత్పత్తుల నుంచి అత్యధిక ఆదాయం రూ.5110.68 కోట్లు
§  అత్యధికంగా విజయవాడ-II డివిజన్ నుంచి రూ.2666.26 కోట్లు
§  అత్యల్పంగా విజయనగరం డివిజన్ నుంచి రూ. 189.47 కోట్లు
§  అక్టోబర్ లో 24,77,174 వేబిల్లులు ఆన్ లైన్ లో జారీ
§  విస్తరిస్తున్న ఆన్ లైన్ కార్యకలాపాలు
           రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు 7 నెలలో వాణిజ్య పన్నుల ఆదాయం రూ. 8283.94 కోట్లు సమకూరింది. రాష్ట్రంలో ఆదాయపన్ను డివిజన్లు మొత్తం 13  ఉన్నాయి. ఆదాయంలో నాలుగు అంకెలతో మొదటి రెండు స్థానాలలో విజయవాడ-2, విశాఖపట్నం డివిజన్లు ఉన్నాయి. విజయవాడ-2 డివిజన్ నుంచి రూ.2666.26 కోట్లు రాగా, విశాఖపట్నం డివిజన్ నుంచి 1080.76 కోట్లు లభించింది. విజయవాడ-1 డివిజన్ నుంచి రూ.701.91 కోట్లు, చిత్తూరు నుంచి రూ. 587.86 కోట్లు, నెల్లూరు నుంచి రూ.550.88 కోట్లు, కాకినాడ నుంచి రూ. 587.12 కోట్లు, గుంటూరు నుంచి రూ.473.36 కోట్లు, అనంతపురం నుంచి రూ. 316 కోట్లు, ఏలూరు నుంచి రూ. 294.99 కోట్లు, నరసరావుపేట నుంచి రూ. 293.94 కోట్లు, కర్నూలు నుంచి 303.76 కోట్లు, కడప నుంచి రూ. 224.47 కోట్లు, విజయనగరం నుంచి 189.47 కోట్లు ఆదాయం అభించింది.  సర్కిళ్ల వారీగా చూస్తే అత్యధికంగా ఎల్ టీయు విజయవాడ-2 సర్కిల్ నుంచి రూ. 1715.34 కోట్లు వసూలు కాగా, అత్యల్పంగా వినుకొండ సర్కిల్ నుంచి రూ.5.32 కోట్లు వసూలైంది.
పెట్రో ఉత్పత్తుల నుంచి అత్యధిక ఆదాయం
ఉత్పత్తులవారీగా చూస్తే పెట్రో ఉత్పత్తులకు సంబంధించి అత్యధికంగా రూ.5110.68 కోట్లు వచ్చింది. ఆ తరువాత మద్యం ఉత్పత్తుల నుంచి రూ.4888.17 కోట్లు, సిగరెట్ ఉత్పత్తుల నుంచి రూ.407.32 కోట్ల ఆదాయం లభించింది. ఈ ఏడాది అక్టోబర్ వరకు 1,84,756 సంస్థలు రిజిస్టర్ అయ్యాయి. రాష్ట్రంలో ఆధార్ నెంబర్ కలిగి ఉన్న డీలర్లు 1,81,816 మంది ఉన్నారు.
అక్టోబర్ నెల వివరాలు
ఇదిలా ఉండగా, ప్రభుత్వంలోని అన్ని శాఖలలో మాదిరిగానే వాణిజ్య పన్నుల శాఖలో కూడా ఆన్ లైన్ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి.  ఈ శాఖలో లావాదేవీలు చాలా వరకు ఆన్ లైన్ లోనే జరిగిపోతున్నాయి. అక్టోబరు నెలలో ఆన్ లైన్ లో వ్యాట్(వీఏటీ) రిటర్న్ దాఖలు చేసినవారు 1,57,158 మంది, సీఎస్టీ రిటర్న్ దాఖలు చేసిన వారు 95,559 మంది ఉన్నారు. ఆన్ లైన్ లో 59,821 చెల్లింపులు జరిగాయి. 30,058 చెల్లింపులు మాన్యువల్ గా జరిగాయి. అక్టోబర్ లో 24,77,174 వేబిల్లులు ఆన్ లైన్ లో జారీ చేశారు.

జారీ చేసినవారు :  సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...