Nov 27, 2018


బీసీ స్టడీ సర్కిళ్లలో కోచింగ్ ప్రారంభించాలి
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర రావు
                సచివాలయం, నవంబర్ 26: రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఉన్న బీసీ స్టడీ సర్కిళ్లలో కోచింగ్ ప్రోగ్రామ్స్ ప్రారంభించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర రావు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఉదయ లక్ష్మి, బీసీ కార్పోరేషన్ డైరెక్టర్ రామారావుని కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం మధ్యాహ్నం సచివాలయంలో వారికి వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1, గ్రూప్-2, పంచాయతీ సెక్రటరీ, పోలీస్ శాఖలో సబ్ ఇనస్టెక్టర్లు, కానిస్టేబుళ్లు మొదలైన పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసిందని ఆయన తెలిపారు. బీసీ స్టడీ సర్కిళ్లలో ఆ పోస్టులకు సంబంధించిన పోటీ పరీక్షలకు కోచింగ్ కార్యక్రమాలు ప్రారంభం కావలసి ఉందని, అయితే ఎక్కడా ప్రారంభం కాలేదని ఆయన వివరించారు. కోచింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలుసుకునేందుకు నిరుపేద బీసీ విద్యార్థులు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో చేరే ఆర్థిక స్థోమతలేని బీసీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. వారి పరిస్థితిని దృష్టిలోపెట్టుకొని  ప్రభుత్వం వెంటనే స్పందించి కోచింగ్ కార్యక్రమాలు ప్రారంభించాలని శంకరరావు  కోరారు. ముఖ్య కార్యదర్శి ఉదయ లక్ష్మి స్పందిస్తూ వెంటనే తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. బీసీ స్టడీ సర్కిళ్లలో కోచింగ్ ప్రోగ్రామ్స్ ప్రారంభించేలా చూస్తానని చెప్పారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...