పారిశుద్ధ్య
పనులకు అధిక ప్రాధాన్యత
గ్రామాలలో భూగర్భ మురుగునీటిపారుదల వ్యవస్థపై సీఎస్ సమీక్ష
సచివాలయం, నవంబర్ 19: గ్రామీణ
ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వ
ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పునీఠ
అధికారులను ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ సీఎస్ సమావేశ
మందిరంలో సోమవారం మధ్యాహ్నం గ్రామాల్లో
భూగర్భ మురుగునీటిపారుదల వ్యవస్థ తీరుని ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముగురునీటి
పారుదల వ్యవస్థ సక్రమంగా పనిచేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రామాల్లో ప్రస్తుత
పరిస్థితులను, చేపట్టిన
చర్యలను అధికారులు సీఎస్ కు వివరించారు. రెండు వేల మంది కంటే తక్కువగా జనాభా ఉండే గ్రామాల్లో సోక్ పిట్ లు ఏర్పాటు
చేస్తామని, అందుకు
సంబంధించి సర్వే జరుగుతున్నట్లు తెలిపారు. రెండు వేలకు మించి జనాభా ఉన్న గ్రామాల్లో తప్పనిసరిగా భూగర్భ మురుగునీటి
పారుదల వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. మండలానికి
ఒక మల్టీపర్పస్ డ్రైన్ క్లీనింగ్ మిషన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. స్వచ్ఛాంధ్ర, ఎస్సీ కార్పోరేషన్ల
సహకారంతో కాలువల శుభ్రత పనులను థర్డ్ పార్టీకి అప్పగించనున్నట్లు తెలిపారు. కాలువలలో మురుగునీరు
పారుదలకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
ముఖ్య కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి, కమిషనర్ పి.రంజిత్ బాషా తదితరులు
పాల్గొన్నారు.
No comments:
Post a Comment