సామాజిక బాధ్యతగా గ్రామీణాభివృద్ధి
జాతీయ రుర్బన్ మిషన్ పనులను సమీక్షించిన సీఎస్
సచివాలయం, నవంబర్ 19: గ్రామీణాభివృద్ధిని సామాజిక బాధ్యతగా భావించాలని సంబంధిత శాఖల అధికారులను
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పునీఠ ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ సీఎస్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం జాతీయ రుర్బన్ మిషన్ రాష్ట్ర స్థాయి ఎన్ ఫోర్స్
మెంట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మిషన్ పనులను సీఎస్ సమీక్షించారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాశ్యత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ పథకాల ప్రచారం బాగుందని, గ్రామదర్శిని
కార్యక్రమాలకు వెళ్లినప్పుడు గుర్తించినట్లు చెప్పి, వారిని
అభినందించారు.
ఈ పథకానికి సంబంధించి జిల్లా స్థాయిలో, మండల
స్థాయిలో బాధ్యులు ఉత్సాహంగా పనిచేయాలని సీఎస్ చెప్పారు.
రాష్ట్రంలో పథకం అమలు తీరుని అధికారులు సీఎస్
కు వివరించారు.
13 జిల్లాలు 13 క్లస్టర్లుగా
ఉంటాయని,
అలాగే ప్రతి మండలం ఒక క్లస్టర్ గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మండలం ఒక క్లస్టర్ యూనిట్ గా అభివృద్ధికి రివైజ్డ్ ప్రణాళికలు
రూపొందించినట్లు తెలిపారు. గ్రామాలలో వీధి లైట్లు, పారిశుద్ధ్యం, మంచినీరు, విద్య, సమాజిక మౌలికసదుపాయాలు, నైపుణ్య శిక్షణ వంటి 16 అంశాలకు మండలానికి ఒక కోటి రూపాయలు నిధులు ఖర్చు చేయవచ్చని వివరించారు. మొదటి దశలో అనంతపురం, చిత్తూరు, నెల్లూరు,
ప్రకాశం,
విశాఖపట్నం 5 జిల్లాలలో, రెండు, మూడు దశలలో మిగిలిన జిల్లాల్లో ఈ పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో సీఈఓ, మండలంలో ఎంపీడీఓ బాధ్యులుగా ఉంటారని తెలిపారు. ఆరోగ్యం,
వ్యాధులు,
తల్లిబిడ్డలకు పౌష్టికాహారం వంటి విషయాలలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు
వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది తెలిపారు. ఈ సమావేశంలో కార్మిక
శాఖ ముఖ్య కార్యదర్శి జెఎస్ వి ప్రసాద్, పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ
ద్వివేది, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ పి.రంజిత్ బాషా తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment