Nov 19, 2018


సమాచార వ్యూహం ముఖ్యం
జీపీడీపీ సమీక్షాసమావేశంలో సీఎస్

                సచివాలయం, నవంబర్ 19: గ్రామీణాభివృద్ధి విషయంలో అన్ని శాఖలకు సంబంధించి సమాచార వ్యూహం చాలా ముఖ్యమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పునీఠ అన్నారు. సచివాలయం 1వ బ్లాక్ సీఎస్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం  గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక(జీపీడీపీ)పై ఆయన సమీక్షించారు. జిల్లాల్లో జీపీడీపీ సమావేశాలు నిర్వహించినప్పుడు ఆయా జిల్లాల్లో అన్ని శాఖలకు సంబంధించినవారిని  కూడా ఆహ్వానించాలని చెప్పారు. అవసరమైతే ఒక వాట్స్ ప్ గ్రూప్ ని కూడా ఏర్పాటు చేసుకోమని సలహా ఇచ్చారు. గ్రామపంచాయతీల అభివృద్ధి విషయంలో అన్ని శాఖలు బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వీటన్నిటితోపాటు పనులు సకాలంలో పూర్తి కావడం కూడా ముఖ్యమని సీఎస్ చెప్పారు.
                  జీపీడీపీ కింద చేపట్టిన చర్యలను అధికారులు సీఎస్ కు వివరించారు. ఇందులో వివిధ శాఖలకు సంబంధించి 29 రకాల పనులు ఉన్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖలో -క్రాప్, సాయిల్ టెస్ట్ లు లాంటివి,  రెవెన్యూ, ఫిషరీస్, నరేగా, పేదరిక నిర్మూలన, సామాజిక వనాలు, ఆరోగ్యకేంద్రాలు, పారిశుద్ధ్యం, అంగన్ వాడీ కేంద్రాలు,  భూగర్భ మురుగునీటిపారుదల వ్యవస్థ వంటి పనులు చేపట్టినట్లు వివరించారు. వర్షాలు, కరువు నివారణ చర్యలు, చెత్త, కంపోస్ట్, త్రాగునీరు, కేంద్ర నిధులు వంటి అంశాలను చర్చించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్, సాంఘీక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి జెఎస్ వి ప్రసాద్,  పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి, పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా,  పౌరసరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ పి.రంజిత్ బాషా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి  తదితరులు పాల్గొన్నారు.

ముఖేష్ కుమార్ మీనాకు అభినందనలు
            విజయవాడలో మూడు రోజులపాటు ఎఫ్‌1హెచ్‌2, ఎఫ్‌4 పవర్‌ బోట్‌ పోటీలను అత్యద్భుతంగా నిర్వహించారని  పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాను సీఎస్ పునీఠ ప్రత్యేకంగా అభినందించారు. లక్ష మందికి పైగా ప్రజలు హాజరయ్యారని, కార్యక్రమం విజయవంతంమయిందని ఆయన అన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...