May 12, 2017

టెక్నాలజీతో అక్రమ మైనింగ్ కు అడ్డుకట్ట

మంత్రి సుజయ కృష్ణ రంగారావు

·       పెట్టుబడిదారులకు రెడ్ టేపిజం లేకుండా రెడ్ కార్పెట్ తో స్వాగతం
·       3 నెలల్లో శాఖలోని అన్ని వ్యవహారాలు ఆన్ లైన్ లోనే
·       అందరికీ అందుబాటులో వ్యాపార అవకాశాల సమాచారం

           సచివాలయం, ఏప్రిల్ 14: ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి అక్రమ మైనింగ్ ని అడ్డుకుంటామని భూగర్బ గనుల శాఖ మంత్రి సుజయ కృష్ణ రంగారావు అన్నారు. సచివాలయం 3వ బ్లాక్ లో తనకు కేటాయించిన కార్యాలయంలో శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. పూజా కార్యక్రమం జరిగిన వెంటనే బాబాసాహేబ్ అంబేద్కర్ చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి రోజున కార్యాలయంలోకి అడుగుపెట్టడం, మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందన్నారు. బాధ్యత గల ప్రతి వ్యక్తి అంబేద్కర్ ఆశయాలు స్పూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే కీలక శాఖలలో ఒకటైన ఈ శాఖను తనకు అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన దన్యవాదాలు తెలపారు. ఈ శాఖ ప్రభుత్వానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో భవిష్యత్ లో కూడా అదేవిధంగా ఉపయోగపడేవిధంగా కృషి చేస్తానన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ లక్ష్యాలను ఏవిధంగా చేరుకోగలిగారో, 2017-18లో కూడా అదేవిధంగా చేరుకుంటామన్నారు. అక్రమ మైనింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పెట్టుబడిదారులను ప్రోత్సహించడానికి రెడ్ టేపిజం లేకుండా, రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అనుసరించి పెట్టుబడులను రాబడతమాని చెప్పారు. తమ శాఖకు సంబంధించి వ్యాపార అవకాశాలు ఏమేరకు ఉన్నాయో ఆ వివరాలను అందరికీ తెలియజేస్తామన్నారు. ప్రస్తుతం తమ శాఖలో చాలా వరకు ఆన్ లైన్ లోనే వ్యవహారాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూడు నెలల్లో పూర్తిగా ఆన్ లైన్ ద్వారానే అన్ని అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఆ రకంగా పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తామని చెప్పారు.
          
విశాఖ పార్టనర్ షిప్ సమ్మిట్ లో దాదాపు పది వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు(ఎంఓయులు) జరిగినట్లు తెలిపారు. వాటిలో 50 శాతానికి పైగా పెట్టుబడులు వచ్చేవిధంగా కృషి చేస్తామని చెప్పారు. తమ శాఖకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మానవతా దృక్పదంతో పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

జారీ చేసినవారు: పబ్లిసిటీ సెల్, ఐ అండ్ పీఆర్, సచివాలయం, అమరావతి.


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...