May 12, 2017

అంబేద్కర్ స్మృతివనం నిధులు

రూ.97.64 ఏపీఐఐసీకి అప్పగింత
బాధ్యతలు స్వీకరించిన మంత్రి నక్కా ఆనందబాబు
·       సాంఘీక సంక్షేమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు రూ.41.81 కోట్లు
·       3 గురుకుల పాఠశాల నిర్మాణానికి రూ. 63.36 కోట్లు మంజూరు
·       హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం అంశం పరిశీలిస్తా
·       అభివృద్ధి, సంక్షేమం, 2019 ఎన్నికలే ధ్యేయంగా కృషి

         సచివాలయం, ఏప్రిల్ 17: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి అమరావతిలో నిర్మించే బాబా సాహేబ్ అంబేద్కర్ స్మృతి వనానికి సంబంధించిన రూ.97.64 కోట్ల నిధులు ఏపీఐఐసీకి అప్పగించామని సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి నక్కా ఆనందబాబు చెప్పారు. సచివాలయంలోని 3వ బ్లాక్ లో తనకు కేటాయించిన కార్యాలయంలో సోమవారం ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు హిందూ సాంప్రదాయబద్దంగా పూజలు, క్రైస్తవ ఆచారం ప్రకారం ప్రార్ధనలు నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రిగా అవకాశం ఇచ్చి తన క్యాబినెట్ లో స్థానం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన రెండు శాఖలకు సంబంధించి సంపూర్ణ అవగాన ద్వారా పేద,బడుగు, బలహీన, దళిత వర్గాలకు న్యాయం జరిగేందకు కృషిచేస్తానని చెప్పారు. తమ నేత సీఎం చంద్రబాబు లక్ష్యం మేరకు అభివృద్ధి, సంక్షేమంతోపాటు 2019 ఎన్నికలే ధ్యేయంగా పని చేస్తానన్నారు. చంద్రబాబు నాయకత్వంలో, లోకేష్ బాబు సారధ్యంలో బలహీన, బడుగు వర్గాల మద్దతు తెలుగుదేశం పార్టీకి ఉండేవిధంగా పాటుపడతానని చెప్పారు.
రాష్ట్రంలోని 90 సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.41.81 కోట్లు మంజూరు చేస్తూ తొలి సంతకం చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే హిందూపురం, తుని, సత్తెనపల్లిల్లో సాంఘీక సంక్షేమ పాఠశాలల నిర్మాణం నిమిత్తం రూ.63.36 కోట్ల నిధులు విడుదల చేస్తూ మరో ఫైల్ పై సంతకం చేసినట్లు తెలిపారు. బడ్జెట్ లో కేటాయించిన విధంగా అంబేద్కర్ స్మృతి వనం నిధులు ఏపీఐఐసీకి అప్పగించడం, సాంఘీక సంక్షేమ పాఠశాలలకు నిధులు మంజూరు చేయడం తన చేతులు మీదగా జరిగినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. అంబేద్కర్ స్మృతి వనం ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తానన్నారు.
ఎస్టీ,ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు పక్కదారి మళ్లినట్లు వచ్చిన విమర్శలపై విలేకరులు ప్రశ్నించగా అటువంటిది ఏమీ లేదని చెప్పారు. తనకు కేటాయించిన శాఖలలోని వివిధ అంశాలను పరిశీలించి, సమీక్షా సమావేశాలు నిర్వహించి ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తానన్నారు. భవిష్యత్ లో ఎవరికి కేటాయించిన నిధులు వారికే ఖర్చు చేసేవిధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. గిరిజన పాఠశాల్లో ఉపాధ్యాయులు కొరతగా ఉన్న అంశం తన దృష్టికి కూడా వచ్చిందని, ఈ అంశాన్ని పరిశీలించి పరిష్కరిస్తానన్నారు. హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం అన్నం పెట్టే అంశం పరిశీలిస్తానని మంత్రి ఆనందబాబు చెప్పారు.


జారీ చేసినవారు: పబ్లిసిటీ సెల్, ఐ అండ్ పీఆర్, సచివాలయం.



No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...