May 12, 2017

శివసేన చర్యలను ఖండించిన మంత్రి కాలవ


        సచివాలయం: ఏప్రిల్ 6: భారత పార్లమెంటరీ వ్యవస్థలో అత్యంత ప్రాముఖ్యత గల లోక్ సభలో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు పట్ల శివసేన సభ్యులు దురుసుగా ప్రవర్తించడాన్ని సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు ఖండించారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ వద్ద గురువారం మధ్యాహ్నం ఆయన మాట్లాడుతూ అశోక్ గజపతి రాజు మూడున్నర దశాబ్దాలపాటు మచ్చలేనినాయకునిగా పేరు గఢించారన్నారు. అనేక పదవులు అలంకరించి, ఆ పదవులకే వన్నె తెచ్చిన, విలువలకు కట్టుబడిన తమ పార్టీ సీనియర్ నేత అని. అటువంటి వ్యక్తిపై శివసేన సభ్యులు దాడి చేసినంత పని చేయడం అత్యంత దారుణం అన్నారు. పార్లమెంటరీ విలువలువలను దిగజార్చేవిధంగా వారు ప్రవర్తించారని విమర్శించారు. లోక్ సభ వాయిదాపడిన వెంటనే మంత్రి స్థానం వద్దకు వెళ్లి ఆయనను  దూషించడం విచారకరం అన్నారు.

శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ విమానయాన సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తిస్తే, విమానయాన సంస్థలు చర్యలు తీసుకోవడం పట్ల ఆ పార్టీ సభ్యులు లోక్ సభలో గొడవ చేశారని చెప్పారు. వారి సమస్యలు చెప్పారు, డిమాండ్లు చెప్పారని, అందులో తప్పులేదన్నారు. శివసేన పార్టీ ముఖ్య నేత అనంత గీత్ వంటి వారు కేంద్ర మంత్రి పట్ల  దురుసుగా ప్రవర్తించడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు కాలవ విజ్ఞప్తి చేశారు. 

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...