May 12, 2017

15 నుంచి సచివాలయంలో బయోమెట్రిక్ హాజరు

వెలగపూడి సచివాలయంలో పని చేసే అధికారులు, ఉద్యోగులందరూ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్  ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయ ఉద్యోగులు వారానికి 5 రోజులు పనిచేసే అకాశం ప్రభుత్వం కల్పించిందని, అందువల్ల ఉద్యోగులు అందరూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పని చేయాలని తెలిపారు. ఈ నెల 15 నుంచి సచివాలయంలో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి ఉదయం 10 గంటలకు కార్యాలయంలోని తమ తమ సీట్లలో ఉండాలన్నారు. కార్యాలయం లోపలికి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు తప్పనిసరిగా బయోమెట్రిక్ డివైస్ లో నమోదు చేయాలన్నారు. కొంతమంది అధికారులు, ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరుకావడంలేదని, సమావేశాలకు, సమీక్షలకు అందుబాటులో ఉండటంలేదని తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. సచివాలయ అధికారులు, ఉద్యోగులు బయోమెట్రిక్ విధానాన్ని పాటించే విధంగా సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలని, ఆ మేరకు ఉన్నతాధికారులకు ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
డిప్యూటీ సెక్రటరీ ప్రతిరోజూ హాజరు వివరాలు నమోదు చేస్తారని తెలిపారు. ప్రతి శాఖకు సంబంధించి ఆయా శాఖల కార్యదర్శులు హాజరు వివరాలను కన్సాడిడేట్ చేసి నెలవారీ నివేదికను ముఖ్యమంత్రికి, చీఫ్ సెక్రటరీకి పంపిస్తారని తెలిపారు.

జారీ చేసిన వారు: పబ్లిసిటీ సెల్, సచివాలయం, అమరావతి  సెల్ నెంబర్ : 9949351604


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...