May 12, 2017

ఉద్యమ స్పూర్తితో నీటి సంరక్షణ

సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన
మంత్రి శిద్ధా రాఘవరావు

సచివాలయం, ఏప్రిల్ 20: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యమ స్పూర్తితో నీటి సంరక్షణ చర్యలు చేపట్టినట్లు అటవీ, శాస్త్ర,సాంకేతిక శాఖల మంత్రి మంత్రి శిద్ధా రాఘవరావు చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా సచివాలయం 5వ బ్లాక్ లో మంత్రి కేక్ కట్ చేశారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం రాత్రి పగలు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో వృద్ధిరేటు డబుల్ డిజిట్ సాధించామని, చక్కటి రాజధాని నిర్మించుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వం నీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. 90 రోజులపాటు నీరు-చెట్టు కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. జలవనరుల ప్రాజెక్టులు పూర్తి చేసి కరువు రహిత రాష్ట్రంగా రూపొందిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఓ చరిత్రగా నిలుస్తుందని పేర్కొన్నారు. 2018 నాటికి దీనిని పూర్తి చేయాలని సీఎం పట్టుదలతో ఉన్నట్లు తెలిపారు. దీంతో కరువు తొలగిపోతుందన్నారు.
2018 నాటికి వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తి చేసి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి నీరందిస్తారని మంత్రి చెప్పారు. నీటి సంరక్షణలో విద్యార్థులను, ప్రజాప్రతినిధులను అందరినీ భాగస్వాములను చేస్తున్నారని, చెక్ డ్యామ్ లు నిర్మిస్తున్నారని తద్వారా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందన్నారు. నదుల అనుసంధానం ప్రక్రియ మొదలుపెట్టి,  పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి నీరు తరలించి వేల ఎకరాలు సాగులోకి తీసుకువచ్చారని తెలిపారు. ఈ ప్రాజెక్టుని 18 నెలల్లో పూర్తి చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి శిద్ధా అన్నారు.


జారీ చేసినవారు: పబ్లిసిటీ సెల్, ఐ అండ్ పీఆర్, సచివాలయం.



No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...