May 25, 2018


‘ఆపరేషన్ గరుడ’లో భాగమే రమణదీక్షితులు ఆరోపణలు
బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య
v ఐవైఆర్ కృష్ణారావు నమ్మక ద్రోహి
v ఈ నాటకానికి కర్త, కర్మ, క్రియ అమిత్ షా
v అర్చకులు జీతాలు రెట్టింపు చేసిన ఘతన బాబుదే!
v తొలిసారిగా  బ్రాహ్మణ కార్పోరేషన్ ఏర్పాటు
v 92 వేల పేద బ్రాహ్మణులకు లబ్ధి
               సచివాలయం, మే 25: భారతీయ జనతా పార్టీ ఆడిస్తున్న నాటకం ‘ఆపరేషన్ గరుడ’లో భాగమే టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు, మాజీ ఈఓ ఐవైఆర్ కృష్ణారావు ఆరోపణలని బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య అన్నారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో శుక్రవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. టీటీడీ ఆలయ పవిత్రతకు భంగం కలిగేవిధంగా వారు వ్యవహరిస్తున్నరన్నారు. దీక్షితులు వీఐపీ భక్తులకు ప్రత్యేక పూజలు జరిపించి, వారి సేవలో తరించేవాడన్నారు. 1952లో నమోదు చేసిన రికార్డుల ప్రకారం పింక్ డైమండ్ అనేది లేదన్నారు. పోటు సంపెంగ ప్రాకారం దక్షిణంవైపు మార్చడానికి ఆగమ శాస్త్రం ప్రకారం అభ్యంతరం ఏమీ ఉండదలని 1999లో దీక్షితులు స్వహస్తాలతో రాసి ఇచ్చారని తెలిపారు. ప్రధాన ఆలయానికి, వేయి కాళ్ల మండపానికి సంబంధంలేదని, దానికి కూల్చివేయడానికి అభ్యంతరం ఏమీలేదని ఆనాడు దీక్షితులు సంతకం చేసి ఇచ్చిన పత్రం ఉందన్నారు. దేవస్థానం అనుమతిలేకుండా ఆయన ప్రైవేటుగా యాగాలు చేస్తున్నారని చెప్పారు. వైఎస్ హయాంలో ఏడు కొండలు దేనికి రెండు కొండలు చాలు అని జీఓ తీసుకువచ్చినప్పుడు దీక్షితులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఏడు కొండలివాడితో పెట్టుకున్నవారు ఏమైపోయారో అందరికీ తెలుసన్నారు. స్వామి ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు బాంబు బ్లాస్టింగ్ నుంచి బయటపడ్డారని చెప్పారు.  సాటి అనువంశిక అర్చకులను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారని, వారికి ఇబ్బందికరమైన డ్యూటీలు వేసి, సెలవులు మంజూరు చేయకుండా వేధించేవారని తెలిపారు. ముఖ్యమైన కార్యక్రమాలలో వారిని పాల్గొనకుండా చేసేవారని, ఏకపక్ష నిర్ణయాలతో  వారిని అవమానించి అవహేళన చేసేవారని  ఆరోపించారు. దీక్షితులు జీవన విధానం, వ్యవహార శైలి కూడా అభ్యంతరకరంగా ఉంటుందని, టీ షర్టులు వేసుకొని తిరిగేవారని, చెన్నై వెళితే ఆడి, బీఎండబ్లూ వంటి కార్లలో తిరుగుతూ భోగాలు అనుభవిస్తారని విమర్శించారు. దీక్షితులు ఆడే నాటకానికి కర్త, కర్మ, క్రియ అన్నీ అమిత్ షా అన్నారు. ఈ నాటకం ఆపకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సమర్ధుడై నాయకుడుగా పేర్కొన్నారు. నాటకాలు కట్టిపెట్టకపోతే కేసులు పెడతాం కబడ్ధార్ అని  దీక్షితులు, ఐవైఆర్ లను హెచ్చరించారు. వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఎంతలో ఉండాలో అంతలో ఉండాలన్నారు.
ఐవైఆర్ కృష్ణారావు నమ్మక ద్రోహి
          ఐవైఆర్ కృష్ణారావు నమ్మక ద్రోహి అని, అన్నం పెట్టిన చేతినే కరిచిన విశ్వాసఘాతకుడని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయన ‘ఎవరు రాజధాని అమరావతి?’ అనే పుస్తకం రాయడాన్ని నీతిమాలిన చర్యగా పేర్కొన్నారు. రాజధాని అభివృద్ధి చెందితే అన్ని కులాలవారితోపాటు బ్రాహ్మణ యువతకు కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. టీటీడి పరిధిలోని పురాతన దేవాలయాల నిర్వహణ కేంద్ర పురావస్తు శాఖ చేపట్టాలని కేంద్రానికి నివేదిక పంపిన ద్రోహి ఐవైఆర్ అన్నారు.
తొలిసారిగా  బ్రాహ్మణ కార్పోరేషన్ ఏర్పాటు
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత బ్రాహ్మణుల గురించి ఆలోచించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనన్నారు. తొలిసారిగా బ్రాహ్మణ కార్పోరేషన్ ఏర్పాటు చేసి వారి సంక్షేమం కోసం నిధులు కేటాయించారని చెప్పారు. ఇప్పటి వరకు రూ.215 కోట్లు మంజూరు చేశారని, ఈ ఏడాదికి మరో రూ.85 కోట్లు కేటాయించారని చెప్పారు. వివిధ పథకాల ద్వారా 92వేల మంది పేద బ్రాహ్మణులు లబ్ది పొందినట్లు తెలిపారు. అర్చకులు జీతాలు రెట్టింపు చేసిన ఘతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనన్నారు. 65 ఏళ్ల నిబంధన అనేది టీటీడీకి మాత్రమే వర్తిస్తుందని, రాష్ట్రంలోని అర్చకులు ఓపిక ఉన్నంతవరకు కొనసాగవచ్చని తెలిపారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో ధూపదీప నైవేధ్యాలకు ప్రతేక నిధులు కూడా ఆయనే కేటాయించారని తెలిపారు. చంద్రబాబు నాయుడు బ్రాహ్మణులకు చేసిన మేలు మరువలేనిదన్నారు. దీక్షితులు, ఐవైఆర్ ఇద్దరూ బ్రాహ్మణులను టీడీపీ నుంచి వేరు చేయడానికి చేసే ప్రయత్నాలు ఫలించవని ఆనంద సూర్య చెప్పారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...