సచివాలయం, ఫిబ్రవరి 28: ప్రగతి
కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని
తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్
ద్వారా ప్రధానమంత్రి కౌశల్ వికాస్
యోజన(పీఎంకెవివై), ప్రధాన మంత్రి ముద్ర(మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్
రీఫైనాన్స్ ఏజెన్సీ) యోజన(పీఎంఎంవై) పథకాలను సమీక్షించారు. సచివాలయం ఒకటవ బ్లాక్
మొదటి అంతస్తు సీఎస్ సమావేశ మందిరం నుంచి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్
కుమార్ ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్
కార్పోరేషన్(ఎన్ఎస్ డీసీ) ద్వారా 75 శాతం పీఎంకెవివై నిధులు వినియోగించి యువతకు నైపుణ్య
శిక్షణ ఇప్పించినట్లు అధికారులు ప్రధానికి
వివరించారు. మొత్తం వ్యయంలో రాష్ట్రాలు 25 శాతం నిధులు భరిస్తాయని చెప్పారు. స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సుల వివరాలు,
పరిశ్రమలు, ప్రైవేటు రంగ భాగస్వామ్య
గురించి తెలిపారు. 33 భాగస్వామ్య పరిశ్రమలు రూ.100 కోట్లు సహాయం అందించినట్లు
చెప్పారు. ఈ పథకం ద్వారా శిక్షణ పొంది ఉపాధి పొందినవారి వివరాలు తెలిపారు. ముద్ర పథకం ద్వారా రుణాలు తీసుకున్న,
చెల్లించినవారి వివరాలు చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సాంఘీక సంక్షేమ
శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్, పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది
తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!
‘ఎదురీత’ పుస్తక సమీక్ష ఎవరు ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే అద్భుతమైన కవిత్వం రాయగల దిట్ట ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
-
కేంద్ర నిధులలో అధిక వాటా రాబట్టే విధంగా ప్రణాళికలు రాష్ట్రీయ కృషి వికాస్ యోజనపై సీఎస్ సమీక్ష సచివాలయం, మార్చి 27: రా...
-
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ...
No comments:
Post a Comment