Feb 13, 2018

సాగరమాల ప్రాజెక్టులపై సీఎస్ సమీక్ష


        సచివాలయం, ఫిబ్రవరి 12: సాగరమాల పథకంలో భాగంగా రాష్ట్రంలో చేపట్టిన, చేపట్టనున్న వివిధ ప్రాజెక్టుల పనులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ సోమవారం సాయంత్రం  సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తు సీఎస్ సమావేశ మందిరంలో సమీక్షించారు. ప్రాజెక్టుల పనులు ఏ దశలో ఉన్నాయో అధికారులు సీఎస్ కు వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ సాగరమాల ప్రాజెక్టుల పనులు నిర్ణయించిన సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పలు అంశాలను లోతుగా చర్చించడంతోపాటు అధికారులు చెప్పిన సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించారు. వివిధ ప్రాజెక్టులకు కేటాయించిన, కేటాయించవలసిన భూములుడీపీఆర్(ప్రాజెక్ట్ పై సమగ్ర సమాచార నివేదిక)కృష్ణపట్నం, కాకినాడ, విశాఖపట్నం, గంగవరం పోర్టులుపోర్టుల నుంచి రోడ్డు, రైలు మార్గాల అనుసంధాన ప్రాజెక్టులు, కాకినాడ-ఉప్పాడ బీచ్ రోడ్డు, కాకినాడ-రాజమండ్రి వయా సామర్లకోట రోడ్డు, భావనపాడుకు రోడ్డు, రైలు మార్గం, విజయవాడ-మచిలీపట్నం రైల్లేలైన్ తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర విభజన, నూతన రాజధాని అమరావతి ఏర్పడిన నేపధ్యంలో శ్రీకాకుళం, అనంతపురం ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే ప్రయాణికుల  సంఖ్య పెరిగిందనిఈ మార్గాల్లో కొత్త రైళ్లు ప్రవేశపెట్టవలసిన అవసరం ఉందని ఏపీఐఐసీ చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య అన్నారు. ఆ మార్గాల్లో కొత్త రైళ్లు కావాలన్న ప్రతిపాదనలను రైల్వే శాఖకే పంపమని రైల్వే అధికారులను సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ ఎండి, ఆర్టీజీ సీఈఓ బాబు., మత్స్యశాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్పోర్ట్స్ డైరెక్టర్ కోయ ప్రవీణ్నెల్లూరు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజుగంగవరం పోర్ట్ డైరెక్టర్ డీటీ నాయక్, పర్యాటక శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా, ఎన్ హెచ్ఏఐ, రైల్వే, నీటిపారుదల తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...