బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు
డిమాండ్
అమరావతి, మే 22: ఓబీసీలకు క్రీమిలేయర్ నిబంధన ఎత్తివేయాలని బీసీ
సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు
బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం
కేంద్రరాష్ట్ర
ప్రభుత్వం బీసీ సాధారణ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు క్రిమిలేయర్ వర్తించదని
తెలిపారు. గ్రూప్ 3, గ్రూప్ 4 స్థాయిలో మొదట ఉద్యోగ నియామకం పొంది ప్రమోషన్
ద్వారా జిల్లా అధికారి అయినా,
వారి
వార్షికాదాయం రూ.8 లక్షలు దాటినా
వారు కూడా క్రీమిలేయర్ కిందకు రారని, వారి పిల్లలు ఓబిసిలుగా పరిగణించాలని
తెలిపారు. ఐఏఎస్ఐపీఎస్ఐఎఫ్ఎస్, గ్రూప్ వన్ ఉద్యోగాలలో
నియామితులైనవారు, తల్లిదండ్రులు
నేరుగా గ్రూప్ 2 ఉద్యోగంలో
నియమితులైన వారి పిల్లలు మాత్రమే క్రిమిలేయర్ కిందకు వస్తారని వివరించారు. సాధారణ
ఉద్యోగులు
ఉపాధ్యాయుల వార్షిక ఆదాయము రూ.8 లక్షలు దాటినా వారి పిల్లలకు
క్రిమిలేయర్ వర్తించదని చెప్పారు. అయితే చాలా మంది రెవెన్యూ సిబ్బంది తహసీల్దార్లు
క్రిమిలేయర్ పై సరైన అవగాహన లేక సాధారణ బిసి ఉద్యోగులు ఉపాధ్యాయుల వార్షికాదాయం
రూ.8 లక్షలు దాటితే, వారి పిల్లలకు ఓబిసి సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని పేర్కొన్నారు. దాంతో
వారి పిల్లలు కేంద్ర, రాష్ట్ర
ప్రభుత్వ ఉద్యోగాలలో కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఐఐటి ఇంజనీరింగ్, మెడికల్ వంటి కోర్సులలో రిజర్వేషన్లు
కోల్పోతున్నారని ఆయన తెలిపారు. ఈ విధంగా బీసీలకు తీవ్ర అన్యాయం
జరుగుతుందన్నారు. ఈ నేపధ్యంలో క్రీమిలేయర్
నిబంధన ఎత్తివేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీఎస్టీవికలాంగులుమహిళలు
వంటి తొమ్మిది వర్గాల వారు రిజర్వేషన్లు పొందుతున్నారని వారికెవరికీ లేనిక్రీమిలేయర్ నిబంధన ఒక్క బీసీ
వర్గానికే ఎందుకు విధించారని ఆయన ప్రశ్నించారు.
రిజర్వేషన్ల సిద్ధాంతానికి పునాది సామాజిక వివక్షసాంఘిక వెనుకబాటుతనం విద్యారంగంలో వెనుకబాటుతనమే కానీ ఆర్థిక
వెనుకబాటుతనం కాదన్నారు. ఈ విషయాన్ని
రాజ్యాంగం ప్రకారం నియమించిన రెండు జాతీయ కమిషన్లు మండల్ కమిషన్కాకా
కలేల్కర్ కమిషన్ రిపోర్టుల్లో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. రాజ్యాంగ రచయితల
దృక్పథంలో గానీసామాజిక శాస్త్రవేత్తల దృక్పథంలో గానీ కేవలం సామాజిక వివక్ష
కారణంగానే రిజర్వేషన్లు పెట్టాలని స్పష్టం చేశారన్నారు. రిజర్వేషన్లపై అనేక
సిద్ధాంతపరమైన చర్చలు జరిగాయనిసమాజాన్ని సమాజ నిర్మాణాన్ని లోతుగా
అధ్యయనం చేసిన సామాజిక శాస్త్రవేత్తలు కూడా కులపరమైనవిధానాన్ని ఆధారంగా తీసుకొని
రిజర్వేషన్లు
పెట్టాలని సూచించారని తెలిపారు. బీసీలకు కల్పించిన 27 శాతం రిజర్వేషన్లను పూర్తిగా అమలు
చేయకుండా క్రీమిలేయర్ నిబంధన పెట్టడం అన్యాయమని, ఆ షరతును వెంటనే తొలగించాలని ఆయన
కోరారు. కేంద్రంలో వెనుకబడిన కులాల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను
ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేసిన రోజునే బీసీల సమస్యలు
పరిష్కారమవుతాయని, ఆశించిన లక్ష్యాలను సాధించగలుగుతామని శంకరరావు స్పష్టం చేశారు.
No comments:
Post a Comment