May 4, 2019


రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు
 గంట ముందు వెళ్లడానికి అనుమతి
               సచివాలయం, మే 4: రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులందరూ సాయంత్రం ఒక గంట ముందు వెళ్లడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ శాశ్విత ఉద్యోగులు అందరితోపాటు  ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికి ఇది వర్తిస్తుంది. మే నెల 6 నుంచి జూన్ నెల 5వ తేదీ వరకు ఆ రెండు రోజులతోపాటు అన్ని పని దినాలలో ముస్లిం ఉద్యోగులు తమ మత పరమైన ఆచారాలు నిర్వర్తించడానికి సాయంత్రం ఒక గంట ముందు కార్యాలయం, పాఠశాల వదిలి వెళ్లడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ సమయంలో వారి  సేవలు తప్పనిసరి కానివారందకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...