May 19, 2019


ఆన్ లైన్ లో రీపోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీఈఓ

       సచివాలయం, మే 19: సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది ఆదివారం ఉదయం రీపోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాల లోపల సిబ్బంది పనితీరుని, బయట ఓటర్లు బారులు తీరి ఉండటాన్ని ఆయన గమనించారు. పోలింగ్ కేంద్రం లోపలకు ఇతరులు ఎవరూ రావడానికి వీలులేదని, ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే పోలింగ్ అధికారికి ఫోన్ చేసి కనుక్కోమని కంట్రోల్ రూమ్ లోని అధికారులను ఆదేశించారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే తనకు తెలియజేయమని చెప్పారు. ఏజంట్లు అందరూ ఉన్నారో లేరో కూడా గమనించమని వారికి చెప్పారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా వారికి ఫోన్ చేసి అడుగుతున్నామని, 7 కేంద్రాలలో రీపోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్లు  జాయింట్ సీఈఓ నాగమణి సీఈఓకి వివరించారు. ఆ తరువాత అదనపు సీఈఓ సుజాత శర్మ కూడా కంట్రోల్ రూమ్ కు వచ్చి పోలింగ్ జరుగుతున్న తీరుని ఆన్ లైన్ లో పరిశీలించారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...