కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్
ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి
కొత్త
ప్రభుత్వానికి సంఘం అధ్యక్షుడు సుమన్ విజ్ఞప్తి
నూతన
సీఎం జగన్మోహన రెడ్డికి అభినందనలు
అమరావతి, మే 27: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్
ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కొత్తగా ఏర్పడే వైఎస్ జగన్మోహన రెడ్డి
ప్రభుత్వానికి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.సుమన్ సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి
చేశారు. ఈ నెల 30న
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్మోహన రెడ్డికి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్
ఉద్యోగుల సంఘం తరపున అభినందనలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా రాష్ట్రంలో
కాంట్రాక్ట్, ఔట్
సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్న కొత్త ప్రభుత్వ న్యాయం చేయాలని ఆయన
కోరారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలలో దాదాపు లక్షా 80వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్
ఉద్యోగులు ఉన్నట్లు తెలిపారు. తమకు ఉద్యోగ భద్రత, పే స్కేల్, టైమ్ స్కేల్, సమాన పనికి సమాన
వేతనం లేదని పేర్కొన్నారు. క్రమబద్ధీకరణ ఊసే లేదన్నారు. 2015 - 2018 మధ్య కాలంలో జరిగిన
శాసనసభ సమావేశాలలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను
వెంటనే రెగ్యులరైజ్ (పర్మినెంట్) చేయమని కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మీరు
చేయకపోతే తాము అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తామని అసెంబ్లీ సాక్షిగా గట్టిగా
చెప్పారని గుర్తు చేశారు. అంతేకాకుండా 2019 ఎన్నికల ప్రచారంలో
భాగంగా ఎన్నికల ప్రచారంలో ఆదోనిలో మాట్లాడుతూ అన్ని శాఖల్లో ఉన్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్
ఉద్యోగులను విద్యార్హతలు ఆధారంగా అవకాశం ఉన్నంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్
చేస్తామని, సమాన
పనికి సమాన వేతనం ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తమకు ఉద్యోగ
భద్రత కల్పించాలని, అర్హతల
ఆధారంగా పర్మినెంట్ చేయాలని, ఆరోగ్యశ్రీ వర్తింపచేయాలని, పెన్షన్
వర్తింపజేయాలన్నారు. రెండు సందర్భాలలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను
నెరవేర్చాలని సుమన్ కోరారు.
No comments:
Post a Comment