Apr 6, 2019


జనాభాలో, ఓటర్లలో
తూర్పు ఫస్ట్ – గుంటూరు సెకండ్
v యువ ఓటర్లలో  గుంటూరు టాప్
v ఈ ఎన్నికల్లో  వృద్ధుల ఓట్లే కీలకం     
                      
  రాష్ట్రంలోని జనాభా, ఓటర్ల గణాంకాల వివరాల ప్రకారం చాలా అంశాలలో తూర్పు గోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉంటే, గుంటూరు జిల్లా రెండవ స్థానంలో ఉంది. ఓటర్లు, పురుష, మహిళా ఓటర్లు, జనాభా, పురుష, మహిళా జనాభా విషయంలో తూర్పుగోదావరి జిల్లా మొదటి స్థానంలో ఉంటే, గుంటూరు జిల్లా రెండవ స్థానంలో ఉంది. అయితే 18-19 ఏళ్ల మధ్య వయసున్న యువ ఓటర్ల విషయంలో మొత్తం 10,15,219 మంది ఉండగా గుంటూరు మొదటి (1,01,189) స్థానంలో, కర్నూలు ద్వితీయ(99,442), కృష్ణా జిల్లా తృతీయ (97,935) స్థానంలో ఉన్నాయి. స్త్రీ, పురుష ఓటర్ల నిష్పత్తిలో వెయ్యి మంది పురుషులకు 1046 మంది స్త్రీలతో గుంటూరు మొదటి స్థానంలో, నెల్లూరు ద్వితీయ (1039), కృష్ణా తృతీయ (1031) స్థానంలో ఉన్నాయి. 2019 మార్చి 25 నాటికి రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3,93,45,717 మంది ఉండగా, 42,04,436 మందితో తూర్పుగోదావరి జిల్లా మొదటి స్థానంలో, 39, 74, 491 మందితో గుంటూరు జిల్లా ద్వితీయ స్థానంలో, 35,78,458 మందితో విశాఖపట్నం జిల్లా తృతీయ స్థానంలో ఉన్నాయి. మహిళా ఓటర్లు మొత్తం 1,98,79,421 మంది ఉండగా,  21,23,332 మందితో తూర్పుగోదావరి జిల్లా, 20,31,269 మందితో గుంటూరు, 18,02,631 మందితో విశాఖపట్నం, పురుష ఓటర్లు మొత్తం 1,94,62,339 మంది ఉండగా, 20,80,751 మందితో తూర్పుగోదావరి జిల్లా, 19,42,760 మందితో గుంటూరు జిల్లా, 17,75,630 మందితో విశాఖపట్నం జిల్లాలు వరుసగా మొదటి మూడు స్థానాలలో నిలిచాయి. స్త్రీ – పురుష ఓటర్ల నిష్పత్తిలో వెయ్యి మంది పురుషులకు గుంటూరులో 1046 స్త్రీలు ఉండగా, నెల్లూరులో 1,039 మంది, కృష్ణా జిల్లాలో 1,031 మంది ఉన్నారు.  సర్వీస్ ఓట్లు మొత్తం 56,908 ఉండగా, 15,140తో శ్రీకాకుళం మొదటి స్థానంలో,7,297తో ప్రకాశం ద్వితీయ స్థానంలో, 6,158తో విశాఖపట్నం జిల్లా తృతీయ స్థానంలో ఉన్నాయి. థర్డ్ జండర్ ఓట్లు మొత్తం 3,957 ఉండగా, 533తో కర్నూలు, 462తో గుంటూరు, 374తో నెల్లూరు వరుసగా మొదటి మూడు స్థానాలలో ఉన్నాయి. విదేశీ ఓట్లు మొత్తం 5,323 ఉండగా, 1,068 ఓట్లతో కడప, 879తో గుంటూరు, 839 ఓట్లతో కృష్ణా జిల్లాలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో ఉన్నాయి.

జనాభాలో తూర్పు, గుంటూరు, కృష్ణా
           2019 జనాభా లెక్కల(అంచనా) ప్రకారం రాష్ట్రంలో 5,30,01,971 మంది జనాభా ఉండగా, 54,96,839 మందితో తూర్పు గోదావరి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 52,69,062 మందితో గుంటూరు జిల్లా ద్వితీయ, 47,24,006 మందితో కృష్ణా జిల్లా తృతీయ స్థానంలో ఉన్నాయి. పురుషలు 27,29,597, స్త్రీలు 27,67,242తో తూర్పు గోదావరి జిల్లా మొదటి స్థానంలో, పురుషులు 26,30,881, స్త్రీలు 26,38,180తో గుంటూరు జిల్లా రెండవ స్థానంలో, పురుషులు 23,53,757, స్త్రీలు 23,70,249తో కృష్ణా జిల్లా 3వ స్థానంలో ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం పురుషులు 2,64,42,077 మంది, స్త్రీలు 2,65,59,894 మంది, అంటే పురుషుల కంటే స్త్రీలు 1,17,817 మంది ఎక్కువగా ఉన్నారు. ఓటర్ల విషయానికి వచ్చేసరికి రాష్ట్రంలో పురుష ఓటర్లు 1,94,62,339 మంది ఉండగా, స్ల్రీ ఓటర్లు 1,98,79,421 మంది, అంటే పురుషుల కంటే స్త్రీ ఓటర్లు 4,17,082 మంది ఎక్కువగా ఉన్నారు. జనాభాలో లక్షా 17 వేల మంది స్త్రీలు ఎక్కువగా ఉంటే, ఓటర్ల వద్దకు వచ్చేసరికి 4 లక్షల 17 వేల మంది అధికంగా ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం పురుషులకంటే మహిళలు ఎక్కువ కాలం జీవిస్తారని అర్ధమవుతోంది. యువత, మధ్య వయసు వారికంటే వృద్ధులే ఓపికతో పోలింగ్ బూత్ ల వద్ద వెళ్లి ఓట్లు వేస్తారు. ప్రభుత్వం నుంచి పెన్షన్ అందుకునేవారు  54,28,247 మంది ఉన్నారు. వారిలో వృద్ధులే అధిక సంఖ్యలో ఉంటారు.  ఈ ఎన్నికలలో వృద్ధులు, వృద్ధ మహిళల ఓట్లు కీలకంగా ఉంటాయి.
-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...