అభివృద్ధికి అవార్డులే నిదర్శనం!
Ø 700పైగా అవార్డులు అందుకున్న ఏపీ
Ø జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు
Ø రెండంకెల ఆర్థిక వృద్ధి
Ø ప్రగతి పథంలో ఏపీ
రాజధాని లేకుండా, ఆర్థిక లోటుతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ విభజన సవాళ్లను ఎదుర్కొంటూ అనేక విజయాలను సాధించింది. అనతి కాలంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి తన సత్తాను చాటుకుంది. ఆర్థిక పరిస్థితులను అదిగమిస్తూ ప్రతి రంగం, ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. విభజన చట్టంలోని అనేక అంశాల అమలు విషయంలో కేంద్రం జాప్యం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో పలు పనులను కొనసాగిస్తోంది. ముఖ్యమంత్రి నుంచి ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం పట్టుదలతో అద్వితీయంగా కృషి చేసి లక్ష్యాలను సాధించారు. కొన్ని రంగాల్లో లక్ష్యాలకు మించి విజయం సాధించారు. కృష్ణ-గోదావరి నదుల అనుసందానంతో రాయలసీమకు కూడా సాగు నీరు అందిస్తున్నారు. భూగర్భ జలాలు పెంచడానికి చేపట్టిన చర్యలు ఫలితాలు ఇవ్వడంతో రాయలసీమలో ఉద్యానవన పంటల ఉత్పత్తి పెరిగింది. పారిశ్రామిక వికేంద్రీకరణలో భాగంగా అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాలతోపాటు ప్రతి జిల్లాలో అనేక పరిశ్రమలు స్థాపించారు. ఉపాధి అవకాశాలు పెరిగాయి. సరళతర వాణిజ్యం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో రాష్ట్రం వరుసగా రెండేళ్ల నుంచి మొదటి స్థానంలో నిలిచింది. కార్పోరేట్ పెట్టుబడులను ఆకర్షించడంలో నెంబర్ వన్ గా నిలిచినట్లు రిజర్వు బ్యాంకు ఏపీకి అవార్డు అందజేసింది. దీంతో జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ఏపీ ఫోకస్ అవుతోంది. పెట్టుబడులు రావడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది. గ్రామీణాభివృద్ధిలో కూడా రాష్ట్రం మొదటి స్థానం సాధించింది. ట్రాన్సఫరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా సర్వే ప్రకారం అవినీతి అతి తక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఏపీ 3వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో అభివృద్ధికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పొందిన 702 అవార్డులే అందుకు నిదర్శనం. దక్షిణ భారతదేశంలో నిరంతరం విద్యుత్ సరఫరా చేసిన మొదటి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ అందిస్తూ రికార్డు నెలకొల్పింది. ఎల్ఈడీ బల్బుల వినియోగంలో కూడా రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఇ-ప్రగతిలో రాష్ట్రం దేశంలో అగ్రభాగాన నిలిచింది. లెడ్ బల్బుల ఏర్పాటులో కూడా రాష్ట్రం ముందుంది. అన్నిశాఖలలో నూరు శాతం డిజిటలైజేషన్ దిశగా పనులు జరుగుతున్నాయి. ప్రణాళికాబద్దంగా లక్ష్యాలను రూపొందించుకుని స్థిరమైన రెండంకెల వృద్ధి రేటు సాధించింది. మొత్తం జాతీయ స్థూల అదనపు విలువ (జీవీఏ - గ్రాస్ వ్యాల్యూ యాడెడ్) వృద్ధి రేటుతో పోల్చితే రాష్ట్ర జీవీఏ వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. సమ్మితళిత, స్థిరమైన రెండంకెల వృద్ధిరేటు లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తూ అనేక విజయాలు సాధించింది. మానవ వనరులు, మౌలిక వసతులు, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, రాజకీయ సుస్థిరత, పాలనావిధానం, వ్యాపార అనుకూల వాతావరణం అనే ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకొని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనమిక్ రిసెర్చ్ (ఎన్సీఏఈఆర్) సంస్థ దేశవ్యాప్తంగా 2016లో 29 రాష్ట్రాలు, ఢిల్లీలో సర్వే నిర్వహించింది. ఆర్థిక పరిస్థితులను పరిశీలించినప్పుడు ఏపీలో శరవేగంగా అభివృద్ధి చెందే వాతావరణం ఉన్నట్లు తేలింది. కార్మికుల లభ్యత, కార్గో నిర్వహణ, సులభతరమైన భూకొనుగోలు కార్యకలాపాలు ఏపీ ప్రధాన బలాలని సర్వే నివేదికలో ఆ సంస్థ పేర్కొంది.
పారిశ్రామిక ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాల అమలు ప్రాతిపదికగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ, ప్రమోషన్ (డిఐపిపి) కార్యాలయం అందించిన తాజా వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ 96.75 శాతం ప్రగతి సూచీని నమోదు చేసుకుంది. భాగస్వామ్య సదస్సుల నిర్వహణ, అనేక ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి వేల కోట్ల రూపాయల పెట్టుబుడుల ఒప్పందాలు చేసుకున్న నేపథ్యంలో సులభత వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా ప్రథమ స్థానానికి దూసుకు వెళ్ళిందని డిఐపిపి పేర్కొంది. ఎలక్ట్రానిక్ రంగంలో రాష్ట్రం దూసుకుపోతోంది. దేశంలో తయారయ్యే ప్రతి 10 సెల్ఫోన్లలో 3 మన రాష్ట్రంలోనే తయారవుతున్నాయి. పేదలకు శాశ్వత గృహాలు నిర్మించాలనే లక్ష్యంతో అత్యధిక ఇళ్లను కట్టించి ఇస్తున్న మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. పంచాయతీరాజ్, ఇ-ప్రగతి, విద్యుత్, గృహ నిర్మానం వంటి రంగంలో రాష్ట్రానికి అవార్డుల పంట పండింది. దక్షిణ భారతదేశంలో నిరంతరం విద్యుత్ సరఫరా చేసిన మొదటి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ అందిస్తూ రికార్డు నెలకొల్పింది. ఎల్ఈడీ బల్బుల వినియోగంలో కూడా రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఇ-ప్రగతిలో రాష్ట్రం దేశంలో అగ్రభాగాన నిలిచింది. లెడ్ బల్బుల ఏర్పాటులో కూడా రాష్ట్రం ముందుంది. అన్నిశాఖలలో నూరు శాతం డిజిటలైజేషన్ దిశగా పనులు జరుగుతున్నాయి. ఎనర్జీ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ అత్యధికంగా 107 అవార్డులు సాధించి అగ్రభాగాన నిలిచింది. మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ 91 అవార్డులు, పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ 82, వైద్య ఆరోగ్య శాఖ 55, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ 38, పాఠశాల విద్యాశాఖ 33, జలవనరుల శాఖ 30, యూత్ అడ్వాన్స్ మెంట్, టూరిజం అండ్ కల్చరల్ శాఖ (వైఏటీ అండ్ సీ) 20 అవార్డులు సాధించాయి. ఉపాధి హామీ పథకం అమలులో అనేక విభాగాలలో దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్ధానంలో నిలిచింది. ఈ నిధులను రాష్ట్రం సమర్థవంతంగా వినియోగించుకొంటూ గ్రామీణులకు ఉపాధి కల్పిస్తూనే స్థిరాస్థిని పెంచుతోంది. కేంద్ర పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తమ రాష్ట్రాలకు ప్రకటించిన అవార్డులలో అత్యధికంగా ఏపీ సొంతం చేసుకుంది. గ్రామీణ వ్యాపారవేత్తల విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అయిదుగురికి, అనంతపురం జిల్లాకు చెందిన ఒకరికి స్కోచ్ అవార్డులు దక్కాయి. విశాఖలో సొంతంగా స్థలాలు ఉండి, ఇళ్లు నిర్మించుకోవాలని ఆశగా ఉన్న లబ్దిదారుల కోసం చేసిన వినూత్న ప్రయోగానికి గోల్డెన్ అవార్డ్ వరించింది. లబ్దిదారులకి నేరుగా బ్యాంక్ ద్వారా డబ్బు పంపించడం వంటి ప్రతిభకి ఈ అవార్డ్ వచ్చింది. జాతీయ స్థాయి జల అవార్డులలో ఉత్తమ రాష్ట్రం విభాగంలో ఆంధ్రప్రదేశ్కు మూడో స్థానం దక్కింది. ఈ శాఖకు 30 అవార్డులు వచ్చాయి. నీటి వనరుల విభాగంలో ఏపీ జల వనరుల శాఖకు కేంద్రం 2019 అవార్డు ప్రకటించింది. భూగర్భజలాల పెంపుపై ఏపికి జాతీయ పురస్కారం లభించింది. జలవనరుల శాఖ నైపుణ్యాభివృద్ధి విభాగానికి గ్లోబల్ ప్లాటినమ్ అవార్డు-2019 లభించింది. జల చైతన్యంలో, రైతాంగానికి సాధికారత కల్పించడంలో, నైపుణ్యాభివృద్ధికి ఆ శాఖ కృషికి ఈ అవార్డు దక్కింది. భూగర్భ జలాల పెంపులో అనంతపురం జిల్లాకు మొదటి స్థానం, నదుల పునరుజ్జీవనంలో కర్నూలుకు మొదటి స్థానం, వాటర్ రీచార్జిలో విశాఖకు రెండో స్థానం, రివైవల్ ఆఫ్ వాటర్ విభాగంలో కడప జిల్లాకు మొదటి స్థానం లభించాయి. జిల్లా, మండల స్థాయిలో నీరు-ప్రగతిపై అవగాహనకు శ్వేతపత్రాలు విడుదల చేసిన జలవనరుల శాఖ కృషిని ఎనర్జీ ఎన్విరాన్మెట్ ఫౌండేషన్ ఇండియా గుర్తించి పురస్కారం ప్రకటించింది. ఆంధ్రపదేశ్ రాష్ట్రం జాతీయ స్థాయిలో 2018కి ‘ఉత్తమ జాతీయ టూరిజం అవార్డు’ అందుకుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ, తిరుపతి,సూళ్లూరుపేట, కావలి నిలిచాయి. కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం ప్రాజెక్టు, వంశధార, ఆఫ్షోర్ రిజర్వాయర్ తదితర ప్రాజెక్టులకు సంబంధించి తీసుకున్న చర్యలు, రెవెన్యూ వ్యవస్థలో తీసుకొచ్చిన సరికొత్త విధానాలకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ కెవిఎస్ చక్రధర్ బాబు 2019లో జాతీయస్థాయి ఈ-గవర్నెన్స్ అవార్డు అందుకున్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఏపీ వివిధ రంగాల్లో అనేక అవార్డులు సాధించి ప్రగతిప్రథాన నడుస్తోంది.
- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914
No comments:
Post a Comment