స్థానిక
ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్
బీసీ సంక్షేమ సంఘం
డిమాండ్
సచివాలయం, ఏప్రిల్ 22: పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్
కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు
ఒక వినతి పత్రాన్ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు సోమవారం మధ్యాహ్నం
సచివాలయం 1వ బ్లాక్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యంకు
అందజేశారు. రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికలలో
చట్ట ప్రకారం బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ను పరిరక్షించవలసిన బాధ్యత
రాష్ట్రప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. గతంలో ఉమ్మడి హైకోర్టు ఈ రిజర్వేషన్లక
సంబంధించి దాఖలైన ఒక పిటిషన్ ను విచారించి 34 శాతం రిజర్వేషన్ కొనసాగించాలని
ఆదేశించినట్లు తెలిపారు. అలాగే బీసీల జనగణనకు సంబంధించి డేటా కోర్టుకు
సమర్పించాలని కూడా ఆదేశించింది. కోర్టు
ఆదేశాల ప్రకారం గత ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ కల్పించారని, అయితే కోర్టు కోరిన
ప్రకారం తెలంగాణ ప్రభుత్వం గానీ, ఏపీ ప్రభుత్వం గానీ డేటాని ఇంతవరకు సమర్పించలేదని
తెలిపారు. దాంతో తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ని 34 శాతం నుంచి 21
శాతానికి కుదించి అమలు చేస్తున్నారన్నారు. ఏపీలో కూడా అటువంటి పరిస్థితి ఏర్పడే
ప్రమాదం ఉందని హెచ్చరించారు. సాధారణ ఎన్నికలకు ముందు పంచాయతీ ఎన్నికలు జరుగకుండా ఈ
రెండు ప్రభుత్వాలు జాగ్రత్తపడ్డాయని విమర్శించారు. ఈ ప్రభుత్వాలు వ్యవహరించే తీరు
ద్వారా బీసీ వ్యతిరేకత స్పష్టమవుతోందన్నారు. ఇది బీసీలపై కుట్ర తప్ప మరొకటి కాదని
పేర్కొన్నారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నేతలు కోరారు. రాష్ట్రప్రభుత్వం తరపున
గవర్నర్ నరసింహన్ తగిన చర్యలు తీసుకొని బీసీలకు చట్టప్రకారం 34 శాతం రిజర్వేషన్లను
పరిరక్షించవలసిందిగా కేశన శంకరరావు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శిని కలిసినవారిలో సంఘం రాష్ట్ర నేతలు తన్నీరు ఆంజనేయులు, కుమ్మర క్రాంతి
కుమార్, పరసా రంగనాథ్, దూళిపూడి ఏసుబాబు, అన్నం శివరాఘవయ్య, నాగలింగం, అంగిరేకుల
గోపి తదితరులు ఉన్నారు.
అమరావతి మీడియా హౌస్
9346619396
9440222914
No comments:
Post a Comment