Apr 26, 2019


2021 మార్చి 1 నుంచి జనాభా లెక్కల సేకరణ

             సచివాలయం, ఏప్రిల్ 26: కేంద్ర ప్రభుత్వం 2021లో దేశంలోని జనాభా లెక్కలను సేకరించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వులు ఆధారంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్ శుక్రవారం ఇక్కడ జీఓ జారీ చేశారు. ఆ జీఓ ప్రకారం  దేశమంతా 2021 మార్చి 1వ తేదీ  00.00 గంటల సమయాన్ని ప్రామాణికంగా తీసుకొని జనాభా లెక్కలను సేకరిస్తారు. జమ్మూ-కాశ్మీర్, ఉత్తరా ఖండ్, హిమాచల్ ప్రదేశ్ లలోని మంచు గడ్డకట్టే కొండ ప్రాంతాలలో మాత్రం అంతకంటే ముందుగానే 2020 అక్టోబర్ 1వ తేదీ 00.00 గంటలను ప్రామాణికంగా తీసుకొని జనాభా లెక్కలు సేకరిస్తారు.


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...