రేపు బీటీ నాయుడు ప్రమాణస్వీకారం
కాకతీయ యూనిర్సిటీ నుంచి సైకాలజీలో
మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన నాయుడు ఎస్వీ యూనివర్సిటీలో లా డిగ్రీ పూర్తి చేశారు.
రాయలసీమ ఫ్యాక్షనిజంపై ఉస్మానియా యూనివర్సిటీకి పరిశోధనా పత్రం సమర్పించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బీసీల
సంక్షేమం కోసం కృషి చేశారు. అనేక సమాజిక ఉద్యమాలలో చురుకుగా పని చేసిన అనుభవం
ఉంది. 1994లో టీడీపీలో చేరిన ఆయన పార్టీలో
అంచలంచలుగా ఎదిగారు. పార్టీ లీగల్ సెల్ ఆదోని
నియోజకవర్గ అధ్యక్షుడుగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధికార ప్రతినిధిగా,
మూడు సార్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, మూడు సార్లు రాష్ట్ర కార్యనిర్వాహక
కార్యదర్శిగా అనేక పదవులు సమర్ధవంతంగా నిర్వహించారు. అంతే కాకుండా దళిత ఐక్యవేదిక
జిల్లా ఉపాధ్యక్షుడిగా, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఏఎల్) రాష్ట్ర
ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా అనేక పదవులు నిర్వహించారు. కర్నూలు లోక్ సభ
స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా 2004, 2014లలో పోటీ చేసి ఓడిపోయారు. గ్రామ
స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణానికి, బీసీలు, వాల్మీకుల
అభ్యున్నతికి, సామాజాభివృద్ధికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా శాసన మండలి
సభ్యునిగా ఎన్నికయ్యారు. మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ బుధవారం మధ్యాహ్నం 2.34 గంటలకు
శాసనసభ ప్రాంగణంలో ఆయన చేత ఎమ్మెల్సీగా
ప్రమాణం చేయిస్తారు.
No comments:
Post a Comment