సంచార క్యాన్సర్
స్క్రీనింగ్ బస్ ని ప్రారంభించిన సీఎం
సచివాలయం, జూలై 4: మణిపాల్ ఆస్పత్రివారు సంచార
క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన బస్ (ఆంకాలజీ బస్)ని
సచివాలయం 1వ బ్లాక్ వద్ద బుధవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ప్రారంభించారు. కార్పోరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా విజయవాడ మణిపాల్ ఆస్పత్రివారు దీనిని
ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత ప్రజలను క్యాన్సర్ నుంచి
రక్షించడానికి, క్యాన్సర్ ని ముందస్తుగా కనుగొనడానికి ఇది ఉపయోగపడుతుంది. నోటి,
గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ కనుగొనడానికి ఇది సహాయపడుతుంది. ఈ బస్ లో నోటి
పరీక్షలు, రొమ్ము స్క్రీనింగ్, మోగ్రఫీ, పాప్ స్మియర్, బయాప్సి, ల్యాబ్ పరీక్షలు
అందుబాటులో ఉంటాయి. డాక్లర్లు, శిక్షణ పొందిన నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది
24 గంటలూ అందుబాటులో ఉంటారు.
ఆంకాలజీ
బస్ ప్రారంభించిన సందర్భంగా మణిపాల్ ఆస్పత్రి విజయవాడ యూనిట్ హెడ్ డాక్టర్ సుధాకర్
కంటిపూడి మాట్లాడుతూ క్యాన్సర్ అధిక ముప్పుకలిగిన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి,
పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లోని 9,930 గ్రామాల్లోకి ఈ
బస్సు వెళుతుందని చెప్పారు. ఈ మధ్య కాలంలో స్త్రీలలో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్,
పురుషలలో నోటి క్యాన్సర్ ఎక్కువగా ఉంటుదని తెలిపారు. అందరూ ముందస్తు పరీక్షలు
చేయించుకోవడం చాలా ముఖ్యం అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు
క్యాన్సర్ వ్యాధి పరీక్షలు ఇప్పుడు అందుబాటులోకి తేగలిగామన్నారు. ఈ కార్యక్రమంలో
డాక్టర్లు ధర్మేంద్ర, రామకృష్ణ, మాదవ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment