నగరాల
అభివృద్ధిపై సింగపూర్ బృందంతో సీఎస్ చర్చలు
సచివాలయం,
జూలై 3: రాష్ట్రంలోని నగరాలను విద్య, వైద్య,
ఆదాయ పరంగా అభివృద్ధి చేసే అంశాలపై ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి(సీఎస్)
అనీల్ చంద్ర పునేఠ సింగపూర్ బృందంతో చర్చలు జరిపారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తు సీఎస్ సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం సింగపూర్ బృందం
సీఎస్ తో సమావేశమైంది. అమరావతి, విశాఖపట్నం, కాకినాడ,
తిరుపతి తదితర నగరాలను అన్ని విధాల దేశంలోని ప్రధాన
నగరాల సరసన చేరేవిధంగా అభివృద్ధి చేయడానికి సహకరిస్తామని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్
సింగపూర్,
లీకాన్ ఏవ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, ఆసియా కాంపిటేటివ్ నెస్ ఇన్ స్టిట్యూట్ కో డైరెక్టర్ అసోసియేట్ ప్రొఫెసర్ తాన్ ఖీ జియాప్ చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరుని ఆయన ప్రశంసించారు.
ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం
ప్రకారం సీనియర్ ఐఏఎస్ అధికారులు 4 బృందాలుగా నేషనల్
యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లో శిక్షణ పొందారు. ఆ అంశాల గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 8,
9 తేదీల్లో సింగపూర్లో పర్యటిస్తారు. 9వ తేదీన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లో జరిగే సదస్సులో ఆయన కీలక ఉపన్యాసం
ఇస్తారు.
సీఎం పర్యటన, అక్కడ జరిగే ఎంఓయుల
గురించి చర్చించారు. ఈ సమావేశంలో సింగపూర్ ప్రతినిధి బృందంలోని రిసెర్చ్
అసిస్టెంట్లు సిగ్యాసా శర్మ, మేనేజర్, కో డైరెక్టర్ ప్రత్యేక సహాయకులు లిమ్ తావో ఓఏ, యాప్ క్సిన్ ఇ,
ప్లానింగ్ శాఖ సెక్రటరీ సంజయ్ గుప్త తదితరులు
పాల్గొన్నారు.
No comments:
Post a Comment