Apr 28, 2025

యుద్ధం అంటే వినాశనమే

ఇస్కఫ్ 20 రాష్ట్ర మహాసభల్లో వక్తల పిలుపు

మదనపల్లి:  మత అసహనం, యుద్ధోన్మాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇస్కఫ్ 20 వ మహాసభ పిలుపు ఇచ్చింది. ఇస్కఫ్, ఆంధ్ర ప్రదేశ్, 20వ మహాసభ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఏప్రిల్ 26, 27 తేదీల్లో ఉత్సాహపూరిత  వాతావరణంలో ఘనంగా జరిగింది. ఏ కారణం చేత అయినా యుద్ధం ఎక్కడ వచ్చినా అది వినాశనానికి దారి తీస్తుందని ఇస్కఫ్ మహాసభ స్పష్టం చేసింది. ప్రపంచ మానవాళికి ఫాసిజం ప్రధాన శత్రువు అని భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం (ఇస్కఫ్) స్పష్టం చేసింది.  రాష్ట్ర అధ్యక్షులు టి ఎస్ సుకుమారన్ అధ్యక్షతన జరిగిన ప్రారంభ సమావేశంలో ముందుగా పెహాల్గావ్ ఉగ్ర దాడిలో అసువులు బాసిన వారికి మహాసభ రెండు నిముషాల మౌనం పాటించి నివాళి అర్పించింది. అనంతరం ఇస్కఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి బిజయ్ కుమార్ పదిహారి ప్రారంభోపన్యాసం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మానవాళి తీవ్రమైన సంక్షోభాల మధ్య జీవిస్తున్నట్టు పదిహారి పేర్కొన్నారు. ఆధిపత్యం కోసం అగ్రరాజ్యాలు యుద్ధ ఉన్మాదాన్ని పెంచుతున్నాయని విమర్శించారు. ఇందులో భాగమే పలస్తీనాపై ఇజ్రాయిల్ దాడి అని గుర్తు చేశారు. భారత దేశంపైన కూడా ఉగ్రదాడి జరిగిందని, అగ్రదేశాలు తమ ఆయుధ వ్యాపారాల కోసం ఉద్రిక్తతలను పెంచుతున్నాయని, అగ్ర రాజ్యాలే ఆయుధాలు అమ్ముతున్నాయని విమర్శించారు. యుద్ధం అనేది మానవాళి వినాశనానికి దారి తీయగలదని ఆందోళన వ్యక్తం చేశారు. మరో వైపు ఫాసిజం జడలు విప్పుతున్నదని  ఆందోళన వ్యక్తం చేశారు. అది మానవాళికి ప్రధాన శత్రువని బిజయ్ కుమార్ పదిహారి పేర్కొన్నారు. హిట్లర్ ఫాసిజానికి వ్యతిరేకంగా నిలబడ్డ నేతల నుంచి  స్ఫూర్తి పొంది పని చేయవలసి ఉన్నదని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రానున్న ఆగస్టు 30 న ఫిడేల్ క్యాస్త్రో జయంతిని దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నట్టు పదిహారి  తెలిపారు. ఇప్పుడు వివిధ దేశాల మధ్య సంబంధాలు బలహీన పడుతున్నాయని, ఈ క్రమంలో ప్రజల మధ్య స్నేహ సంబంధాలను పెంచడం ద్వారానే మానవ సంబంధాలు బలపడుతాయని పేర్కొన్నారు. ఇందుకోసం ఇస్కఫ్ దశాబ్దాలుగా పని చేస్తున్నదని, మరింత చైతన్యవంతంగా పని చేద్దామని పిలుపునిచ్చారు. భారతదేశానికీ అన్ని ప్రపంచ దేశాల ప్రజాలతో స్నేహ, శాంతి పూర్వక సంబంధాల మెరుగు పరచడం ఇస్కఫ్ ఆశయమని స్పష్టం చేశారు.


ఈ మహాసభల్లో పాల్గొనడానికి చెన్నై నుండి ప్రత్యేక అతిధిగా విచ్చేసిన డిప్యూటీ కౌన్సిల్ జనరల్ ఆఫ్ రష్యా సెర్జెయ్ అజారోవ్ సందేశమిచ్చారు. రష్యా -భారతదేశం మధ్య సహకార సంబంధాలకి చాలా విస్తారమైన అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం భారతదేశంతో కలసి పని చేయాలనీ  తాము కోరుకుంటున్నామని చెప్పారు. ఇది పరివర్తన కాలమని, అన్న రంగాల్లో కొత్త శక్తులు  ఉద్భవిస్తున్నాయని, వాటిని నిజమైన అభివృద్ధి కోసం వినియోగించుకోవాలని కోరారు. రష్యా, భారతీయ సంబంధాల విషయంలో రష్యా అధ్యక్షుడు వి. పుతిన్ అంచనాలు చాలా ఉన్నతంగా ఉన్నాయని తెలిపారు. భారతదేశం రష్యాకు దశాబ్దాలు సహజ భాగస్వామి అని, మిత్రదేశంగా ప్రత్యేకమైన సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇరు దేశాల మాధ్య ఉన్న సంబంధాలు పరస్పర ఆర్థిక ప్రయోజనాలకు చెందినవి కాదని పేర్కొన్నారు. నమ్మకం, స్నేహంతో కూడిన గొప్ప దీర్ఘకాలిక సంబంధం అని పేర్కొన్నారు. భారత సమాజం అభివృద్ధికి సోవియట్ కాలం నుంచి ఇప్పటికీ రష్యా పూర్తి అండగా ఉందని తెలిపారు. డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు భారత సామర్థ్యాన్ని,  సాంకేతిక పురోగతిని పెంచడంలో కీలకపాత్ర పోషించాయని చెప్పారు. ఇరుదేశాల ప్రజల మధ్య, ప్రభుత్వాల మధ్య సంస్కృతిక, క్రీడలు, కళా సంబంధాలు బలంగా ఉన్నాయని చెప్పారు. ఇందులో భాగంగానే అనేక సంవత్సరాల నుండి భారతీయ నిపుణులు రష్యాలో శిక్షణ పొందారని తెలిపారు. భారత దేశం సార్వభౌమాధికారంతో స్వతంత్ర రాజ్యంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన సాంకేతిక ప్రోత్సాహాన్ని రష్యా నిత్యం అందిస్తూనే ఉన్నదని తెలిపారు. విద్యకు సంబంధించి చాలా ఉన్నతమైన మేళవింపు ఉన్నదని పేర్కొన్నారు. ఈ చర్యలు స్వయం విశ్వాసాన్ని ప్రోత్సహించడం, దేశ ప్రజలకు ఆర్థిక వ్యవస్థలో రాణించగల శక్తిని అవకాశాలను, అందిస్తాయని పేర్కొన్నారు. భారత్ ఒక శక్తివంతమైన దేశంగా వెలుగొందాలని తాము అభిలషిస్తున్నామని పేర్కొన్నారు. రెండు దేశాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కలిసి పని చేస్తూ ప్రజలకు ప్రయోజనం చేకూర్చే చర్యలకు మార్గం సుగమం చేసుకుందామని పిలుపునిచ్చారు.

ఇస్కఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగితాల రాజశేఖర్ కార్యదర్శి నివేదికను ప్రవేశ పెట్టారు. గత మూడేళ్లలో ఇస్కఫ్ కృషిని వివరించారు. దేశంలో పేట్రేగిపోతున్న మత ఉన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేయడం ఇస్కఫ్ బాధ్యత అని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో గడచిన 19 వ మహాసభ నెల్లూరులో జరిగిన నాటి నించి చేపట్టిన కార్యకలాపాలను వివరించారు.  శాంతి, సంస్కృతీ, ప్రజా కళల గురించి మాట్లాడటానికి ముందు మన దేశంలో మతోన్మాద ప్రమాదం గురించి, మత సామరస్యం పాటించాల్సిన అవసరం గురించి వారం క్రితం జరిగిన దుస్సంఘటన గురించి రాజశేఖర్ చెప్పారు.  2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం జిల్లాలో బైసారన్ అనే ప్రసిద్ధ పర్వత పర్యాటక ప్రదేశంలో జరిగిన ఉగ్రదాడిలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని 26 మంది అమాయక ప్రజలను హత్య చేశారు, ఇంకా పలువురు గాయపడ్డారు. ఈ అమానుష ఉగ్రదాడిని ఇస్కఫ్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.  మృతుల కుటుంబాలకు ఈ రకమైన దాడులు కాశ్మీరి ప్రజల ప్రజాతంత్ర ఆకాంక్షలకు ఏ విధంగా తోడ్పాటుగా ఉండవని, ఏ మతానికీ మేలు చేయవున్నారు. ముఖ్యంగా ఈ దాడిని ఖండిస్తూ కాశ్మీర్ ప్రజలు, ముఖ్యంగా ముస్లింలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసిన తీరు కూడా మనం గమనించాలని అన్నారు.  కేంద్ర ప్రభుత్వం గతంలో ఆర్టికల్ 370, 35ఎ రద్దు చేస్తే మౌలిక సమస్యలు పోతాయని ప్రకటించినప్పటికీ  ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని ఈ ఘటన నిరూపించిందని అన్నారు. ఈ దురంతం పైన సమగ్ర న్యాయ విచారణ అవసరమని,  పౌర సమాజం పని చేసే అవకాశం కల్పించటం, ఇస్కఫ్ లాంటి సంస్థలు చేస్తున్న కృషికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం వుందని రాజశేఖర్ చెప్పారు. మతాన్ని, సంస్కృతి ని కలాగాపులగం చేసి జనాలను మభ్యపెట్టాలని చూస్తున్న శక్తుల నిజ స్వరూపాన్ని చర్చకు పెట్టి సమాజానికి ఒక దిశానిర్దేశం చేయడం మనందరం కర్తవ్యంగా స్వీకరించాలని ఇస్కఫ్ ఉప ప్రధాన కార్యదర్శి సనపల నరసింహులు కోరారు. ఈ సమావేశంలో సిపిఐ అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి యల్ నరసింహులు, ఎస్ కె యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యలు వెంకటరెడ్డి తదితరులు సందేశం ఇచ్చారు. ఈ సమావేశానికి ఇస్కఫ్ ఉప ప్రధాన కార్యదర్శి ఎస్ నరసింహులు, తమిళనాడు ఇస్కఫ్ నేత భాస్కరన్, ఇస్కఫ్, తెలంగాణ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ , ఇస్కఫ్ 20వ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్ష కార్యదర్సులు జి.వీ.శివకుమార్, తుంగా శ్రీధర్ రావు, ఇస్కఫ్, తిరుపతి నాయకుడు   రామచంద్రయ్య, ఇస్కఫ్, కడప జిల్లా సీనియర్ నాయకులు డాక్టర్ తక్కోలు మాచిరెడ్డి, డాక్టర్ పి.సంజీవమ్మ, ఇస్కఫ్, గుంటూరు జిల్లా సీనియర్ నాయకులు బొల్లిముంత కృష్ణ, సి హెచ్ శ్రీదేవి, ఇస్కఫ్ కోశాధికారి కె.సత్యాంజనేయ, అనకాపల్లి నేత M. మాధవరావు, కృష్ణాజిల్లా నుంచి ఆర్. పిచ్చయ్య, బుద్ధవరపు వెంకట్రావు, మోతుకూరి అరుణ్, దోనేపూడి సూరిబాబు,  యువజన సమాఖ్య జాతీయ నేత నక్కి లెనిన్ బాబు, జర్నలిస్టు  సి.ఎన్.క్షేత్రపాల్ రెడ్డి, సిపిఐ మదనపల్లి కార్యదర్శి మురళి, నెల్లూరు జిల్లా నించి రమేష్, వి. రామచంద్ర మూర్తి, అనంతపూర్ నుంచి వసంతబాబు, పలనాడు జిల్లా నుంచి చెన్నకేశవరావు, ఏలూరు జిల్లా నుంచి కడుపు కన్నయ్య, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి లక్ష్మి గణపతి  తదితరులు హాజరయ్యారు.

ఆలోచింపజేసిన పాట

ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కళాకారులు ఆలపించిన పాటలు మహాసభ ప్రతినిధులను అలోచింపచేసాయి. ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి చిన్నం పెంచలయ్య, ఆర్ పిచ్చయ్య, గుర్రప్ప, చారులత, నాగరాజుల బృందం సమాజాన్ని విచ్చిన్నం చేస్తున్న వివిధ ప్రతీఘాత శక్తుల నుంచి, యుద్దోన్మాదం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న అశాంతి నుండి మానవాళిని రక్షించు కోవాలని, స్నేహ సంబందాలను మెరుగు పర్చుకోవలసిన ఆవశ్యకతను చెప్పే గీతాలను ఆలపించి సభికులను ఉత్తేజ పరిచారు. తెనాలికి చెందిన బెజ్జంకి నాగమణి ఆలపించిన కొండేపూడి లక్ష్మీనారాయణ రచించిన పాట "పాడరా  ఓ తెలుగువాడా, పాడరా ఓ కలిమిరేడా, పాడరా మన తెలుగుదేశపు భవ్య చరితల దివ్యగీతం" పాటకు ప్రతినిధుల నుంచి మంచి స్పందన వచ్చింది.

సభకు హాజరైన వివిధ జిల్లాల ప్రతినిధులు తమ జిల్లాల్లో జరిపిన కార్యకలాపాలను వివరించారు.  మహాసభల మొదటిరోజు సాయంత్రం కాశ్మీర్ పర్యాటకుల మృతులకు సంతాపంగా ఇస్కఫ్, సిపిఐ, అన్నమయ్య జిల్లా సంయుక్తంగా కొవ్వొత్తుల ర్యాలీ జరిపాయి. మహాసభ ప్రాంగణం నుంచి మదనపల్లి బస్టాండ్ దగ్గర వున్న డాక్టర్ అంబెడ్కర్ విగ్రహం సర్కిల్ వరకు కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. తర్వాత జరిగిన సభలో సిపిఐ, అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి.ఎల్. నరసింహులు, బిజయ్ కుమార్ పదిహరి, కాగితాల రాజశేఖర్ ప్రసంగించారు. 

మహాసభల రెండవ రోజు ఇస్కఫ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా మహాసభ ఎన్నుకుంది. టి. ఎస్. సుకుమారన్, ఆచార్య వి. బాలమోహన్ దాస్, బొల్లిముంత కృష్ణ అధ్యక్ష వర్గంగా, కాగితాల రాజశేఖర్ అధ్యక్షునిగా, ఎస్. నరసింహులు, తుంగ శ్రీధర్ రావు ప్రధాన కార్యదర్శులుగా, ఉప ప్రధాన కార్యదర్శిగా ఎం. M. మాధవరావు,  రాష్ట్ర కార్యదర్శులుగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన కూన అజైబాబు,  నెల్లూరు జిల్లాకు చెందిన ఎస్.వి. రమేష్ బాబు,  గుంటూరు జిల్లాకు చెందిన కాగితాల నిర్మల ఎన్నిక అయ్యారు. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణాజిల్లా ల మహాసభ పూర్తీ అయిన తర్వాత ఈ జిల్లాలకు రాష్ట్ర కార్యదర్శి పదవులు రిజర్వు చేయడమైనది. ఇస్కఫ్ రాష్ట్ర కోశాధికారిగా సత్యాంజనేయ, ప్రచార కార్యదర్శిగా మదనపల్లికి చెందిన జి.వి. శివకుమార్ ఎన్నిక అయ్యారు.

‘కాఫీవిత్ రజా హుస్సేన్’ సాహిత్య ఎపిసోడ్స్ 2000 పూర్తి

 

మంగళగిరి:   ఫేస్‌బుక్‌లో ధారావాహికంగా రాస్తున్న ప్రముఖ జర్నలిస్ట్, కవి, రచయిత, విశ్రాంత అగ్రికల్చర్ మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అబ్దుల్ రజా హుస్సేన్  సాహితీ కాలమ్ ‘కాఫీ విత్’  2000 ఎపి సోడ్‌లు  దాటిన సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆదివారం రాత్రి అభినందన సభ జరిగింది. పాత మంగళగిరిలోని పొట్లాబత్తుని వెంకటేశ్వరరావు కళానిలయంలో (లక్ష్మీ శారీస్ మిద్దె పైన) విశ్వశాంతి కళాపరిషత్ కన్వీనర్ పొట్లాబత్తుని లక్ష్మణరావు  ఆధ్వర్యంలో  ‘ ఓ కప్పుకాఫీ..నాలుగు మంచి మాటలు అంతే’’ అని ఈ కార్యక్రమం నిర్వహించారు. ఫేస్ బుక్ మాధ్యమంగా తెలుగు సాహితీ లోకానికి కాఫీ విత్ శీర్షికతో 2000 సాహితీ, కళా విమర్శలు అందించడం ఓ అరుదైన రికార్డ్. రజా హుస్సేన్ స్వగ్రామంలో ఆయన మిత్రులు, సహా ఉద్యోగులు, శిష్యులు, సాహిత్య అభిమానుల సమక్షంలో ఈ సభ జరగడం విశేషం. ప్రముఖ అభ్యుదయ కవి, మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు అధ్యక్షత వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార చీఫ్ కమిషనర్ షేక్ బాషా మాట్లాడుతూ, జర్నలిజంలో రజా హుస్సేన్ తనకు మార్గదర్శి అన్నారు.

వార్తలు ఎలా రాయాలో తాను రజాహుస్సేన్ దగ్గరే నేర్చుకున్నానని చెప్పారు. ఒక వార్తను అందరూ రాస్తారు గానీ, ఇన్  సైడ్ విశేషాలను కూడా సేకరించి వార్తలను ఆసక్తికరంగా ప్రజెంట్ చేయడంలో రజా హుస్సేన్ దిట్ట అన్నారు. ఆ రోజుల్లో రజా హుస్సేన్ వార్తలు సంచలనం కలిగించాయని తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీలో కమ్యూనిస్టు ప్రతినిధులు లేని లోటు కొట్టొచ్చినట్టు కనబడుతోందని ఆయన చెప్పారు. కాఫీవిత్ శీర్షికలో  2000 కవితలను విశ్లేషించడం   సాహిత్య చరిత్రలోనే సరికొత్త రికార్డని, ఈ శీర్షిక వల్ల ఎందరో కొత్తకవులను సాహితీలోకానికి పరిచయం చేసిన ఘనత రజా హుస్సేన్ కే దక్కుతుందని అభ్యుదయకవి గోలి మధు అన్నారు. ఒక్క ఏడాదిలో వెయ్యి ఎపిసోడ్లు రాయడం చిన్న విషయంకాదని, అదీ సెల్ ఫోన్లోనే టైప్ చేసి పోస్ట్ చేస్తుండటం విశేషమన్నారు.  రజా హుస్సేన్  సరళమైన భాషలో రాసిన సాహిత్యం ద్వారా ప్రజా హుస్సేన్ ఖ్యాతి పొందారన్నారు.  బోధి రేఖా కృష్ణార్జునరావు మాట్లాడుతూ, రజా హుస్సేన్ ది కులమతాలకు అతీతతమైన వ్యక్తిత్వమన్నారు. ఎందరో కవులను, రచయితలను అన్వేషించి వారందరినీ కాఫీవిత్ శీర్షికలో ప్రస్తావించారన్నారు. ఇప్పుడు ‘కళల సిరి.. మంగళగిరి’ అనే పుస్తకాన్ని తెస్తున్నారని తెలిపారు. 

మే నెల 12న మంగళగిరి రాయల్ కన్వెన్షన్ హాలులో  జరగబోయే బుద్ధపూర్ణమ సభలో  ఆ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్టు చెప్పారు.  పొట్లాబత్తుని లక్ష్మణరావు మాట్లాడుతూ…రజా హుస్సేన్ వల్ల మంగళగిరిలో సాహితీ పరిమళాలు వ్యాపిస్తున్నాయని, ఆయన సరళమైన శైలికి చదివించే గొప్ప గుణముందన్నారు. మంగళగిరిలోని తనలాంటి కళాకారులెందరినో ఈ శీర్షికద్వారా సాహితీలోకానికి పరిచయంచేసిన ఘనతరజాహుస్సేన్ కే దక్కుతుందన్నారు.గాయకులు, కమ్యూనిస్టు నాయకులు కంచర్ల కాశయ్యమాట్లాడుతూ.. రజాహుస్సేన్ వల్ల  తాను లోకానికి తెలిశానన్నారు. మట్టిలో మాణిక్యాలనుగుర్తించి, సానబట్టి సాహితీలోకానికి పరిచయం చేయడం చిన్నవిషయం కాదన్నారు. గాయకుడు అల్లక తాతారావు మాట్లాడుతూ… భక్తి పాటలు పాడుకునే తనకు కాఫీవిత్ ద్వారా సాహితీలోకంలో కొత్తజీవితాన్ని ప్రసాదించారని రజాహుస్సేన్ కు కృతజ్ఞతలు తెలిపారు. విశ్రాంత చరిత్రోపన్యాసకులు ఆళ్ల  వెంటక స్వామి మాట్లాడుతూ,  రజాహుస్సేన్ డిగ్రీకళాశాలలో తన కొలీగ్ అన్నారు. కష్టేఫలి అన్నట్లు తన కష్టంతో అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకున్న రజాహుస్సేన్ కృషీవలుడని అన్నారు. తన చదువుకు తగ్గట్టు కృషినికొనసాగించడమే రజాహుస్సేన్ విజయరహస్యమన్నారు.


సీనియర్ పాత్రికేయుడు, రజా హుస్సేన్ శిష్యుడు శిరందాసు నాగార్జున మాట్లాడుతూ,  మంగళగిరి వీటీజేఎం డిగ్రీ కాలేజీలో  రజా హుస్సేన్ తెలుగు అధ్యాపకులుగా పని చేసే సమయంలో తను, తన భార్య ఇద్దరం ఆయన శిష్యులమని  తెలిపారు.  రాతలో సరళత ఆయన రచనల్లో కనిపిస్తుందన్నారు. సాహితీ లోకలంలో ఎదుగుతున్నవారిని గుర్తించి, వారిని వెలుగులోకి తేవడం రజాహుస్సేన్ దిట్ట అన్నారు. అలాగే, సాహిత్యాన్ని, కేంద్ర సాహిత్య అకాడమీ తీరుని, రాష్ట్ర ఉగాది పురస్కారాల గ్రహీతల ఎంపిక తీరుని నిర్మోహమాటంగా తీవ్ర స్థాయిలో విమర్శించారని గుర్తు చేశారు.  మంగళగిరి టైమ్స్ పాత్రికేయుడు అవ్వారు శ్రీనివాసరావు మాట్లాడుతూ రజా హుస్సేన్ ను తాను అన్నయ్య అంటూ పిలుస్తానని చెప్పారు. తనకుఆయన మార్గదర్శి అన్నారు.


కౌతరపు ప్రసాద్ మాట్లాడుతూ రజాహుస్సేన్ మెత్తగా రాసినా,  లోతైన విశ్లేషణ చేస్తారన్నారు.తనను అభినందించిన అందరికీ రజా హుస్సేన్  కృతజ్ఞతలు తెలిపారు.  తాను పుట్టిపెరిగిన ఊళ్ళో, ఇలా 40 యేళ్ళ తర్వాత మళ్ళీ మిత్రులతో కలిసి కాఫీతో ఆనందం పంచుకోవడం కిక్కెక్కించే విషయమన్నారు. మంగళగిరి తనకు జన్మనివ్వడమే కాకుండా, బతకడానికి నాలుగు అక్షరాలు కూడా నేర్పిందని చెప్పారు.  ఇక్కడే చదువుకొని, ఇక్కడి  డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్ గా పనిచేసే అవకాశం కల్పించిందన్నారు. ఎన్ని జన్మలెత్తి  తాను పుట్టినూరు రుణం తీర్చుకోగలను! అని కృతజ్ఞతలు తెలిపారు. ఫేస్‌బుక్‌లో  గత 10 సంవత్సరాలుగా వేలాది వ్యాసాలు, ఆర్టికల్స్ రాశానన్నారు. అంతకు ముందు  శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ గౌరవాధ్యక్షులు జొన్నాధుల బాబూ శివప్రసాద్ శాలువతో రజా హుస్సేన్ సన్మానించారు. 


యునెస్కో క్లబ్స్ అండ్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ సమన్వయకర్త రామనాధం పరమేశ్వర రావు రజా హుస్సేన్‌కు మహాత్మా గాంధీ బొమ్మ ఉన్న నాణెం బహూకరించారు. అంతకు ముందు పొట్లాబత్తుని లక్ష్మణరావు, కంచర్ల కాశయ్య, అల్లక తాతారావు, కౌతరపు  కవిత, భూపతి,  బాలకృష్ణ, రామచంద్రరావు,   పాటలు పాడి,   ఇవటూరి ప్రసాదరావు ఓ పద్యం పాడి సభికులను అలరించారు.  కాఫీతోపాటు భోజన ఏర్పాటు కూడా చేసిన సభ నిర్వాహకులు పొట్లాబత్తుని లక్ష్మణరావు సభలో ముగింపు మాటలు చెప్పారు.

Apr 26, 2025

మహామహుల మేధో నిలయం- ఆంధ్రవిశ్వవిద్యాలయం

అక్షర క్రమంలో ద్వితీయమైనా, అద్భుతమైన ఆవిష్కరణతో అద్వితీయ ప్రతిభా పాటవాలకు ఆలవాలం ఆంధ్రవిశ్వవిద్యాలయం. సాంస్కృతిక రాజధాని గాను, కళల కాణాచి గాను ప్రపంచపు దృష్టిని ఆకర్షించిన విశాఖ నగర సిగలో ఆణిముత్యం గా విరాజిల్లుతున్న విద్యల కోవెల ఆంధ్రవిశ్వవిద్యాలయం అంటే అతిశయోక్తి కాదేమో!

ఎందరో మేధావుల్ని ప్రపంచానికి అందించిన సర్వ శాస్త్రాల సమాహారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మణిహారం.. వాస్తవానికి విశ్వవిద్యాలయమని వ్యవహరించాల్సి వున్నా, కళలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న సంకల్పమే విశ్వవిద్యాలయాన్ని 'విశ్వకళా పరిషత్తు'గా మలచడం వెనుక గొప్ప నేపధ్యమే ఉంది.. వ్యవస్థాపక ఉపకులపతి సర్ కట్టమంచి రామలింగారెడ్డికి సాహిత్యం, సంగీతం, లలితకళ లంటే ఎక్కువ మక్కువ. 'ముసలమ్మ మరణం' వంటి సంచలన నవల సీ ఆర్ రెడ్డి కలం నుంచి ఉద్భవించిన రచనే.. వసుధా రచయిత కావడం, కళల పట్ల ఉత్తమాభిరుచి ఉండడం వల్ల విశ్వకళాపరిషత్తుగా పేరును ఖరారు చేశారు.. ఇందుకు ఎందరో కవులు, కళాకారుల సూచనలు, సలహాలు కూడా స్వీకరించారు. పేరుకు తగ్గట్టుగానే తొలి విభాగం 'తెలుగు' కావడం ఎందరో ప్రశంసలు అందుకుంది..భాషాసంయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో తెలుగు విభాగం మరింత విశిష్టత సంతరించుకుంది.. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, కవికోకిల గుర్రం జాషువా, ఆధునిక జాషువా గా ప్రసిద్ధి గాంచిన పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్, ప్రముఖ భాషావేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణ మూర్తి, ఆచార్య దోణప్ప,ఆచార్య ఎస్వీ జోగారావు తదితర ఉద్దండులు తెలుగు విభాగం ప్రసాదించిన ప్రముఖులే కావడం విశేషం..
ఇక శాస్త్ర సాంకేతిక రంగాలలో విశ్వవిఖ్యాతి గాంచిన ఎందరో శాస్త్రవేత్తలు ఆంధ్ర కళామతల్లి బడిలో చదివి,ఒడిలో పెరిగిన వారే.. వారిలో ప్రొఫెసర్ సూరి భగవంతం (ఫిజిక్స్ ), ఆచార్య జ్ణానానంద (న్యూక్లియర్ ఫిజిక్స్) ఆచార్య సీ. మహదేవన్ (జియోలజీ) ఆచార్య టీ ఆర్ శేషాద్రి (కెమిస్ట్రీ),ఆచార్య బీ. రామచంద్రరావు( స్పెస్ఫిజిక్స్),ఆచార్య సీ ఎస్ రావు (స్టాటిస్టిక్స్),ఆచార్య సి.వీ. రామన్,(ఫిజిక్స్) ఆచార్య ఆర్. రంగదామరావు (మెటీరియాలజీ),ఆచార్య రామనాధం వంటి దిగ్గజ శాస్త్రవేత్తలు ప్రపంచ స్థాయిలో రాణించారు.. ఆయా రంగాలలో అనేక ఆవిష్కరణలు చేసి ఆంధ్ర విశ్వకళామతల్లి ఖ్యాతిని దశ దిశలా విస్తరింపచేశారు.. నోబెల్ ,భట్నాగర్ అవార్డులతో సహా ఎన్నెన్నో రివార్డులు కైవసం చేసుకున్నారు.. ఉపగ్రహ ప్రయోగాల వ్యవస్థ (ఇస్స్రో )లోను మన శాస్త్రవేత్తలు ఉన్నారంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఔన్నత్యాన్ని కొలిచేందుకు సాధనాలే లేవని చెప్పవచ్చు.. దేశ సమాచార వ్యవస్థకు కేంద్రబిందువు గా పరిగణించే 'నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్'(నిక్ నెట్, న్యూఢిల్లీ)లోను డజన్ల సంఖ్యలో ఆంధ్రవిశ్వవిద్యాలయంలో చదివిన శాస్త్రవేత్తలు ఉండడం గర్వకారణమే కదా.. వీరితో పాటు పాలనా పరంగానూ ఎందరో మేధావుల్ని అందించిన ఘనత ఆంధ్రవిశ్వవిద్యాలయానిదే.. ఇక్కడ చదివిన ఎందరో ఆచార్యులు దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లుగా వెళ్లడం సర్వ సాధారణ విషయంగా మారింది.. ఐ ఐ టీ లతో పాటు అనేక కేంద్రీయ విద్యాలయాలకు సైతం ఉప కులపతులుగా నియామకం కావడం సంతోషించాల్సిన విశేషమే మరి..వీరితో పాటు ఎందరో ఐ ఏ ఎస్ లు, ఐ పీ ఎస్ అధికారులు సైతం ఇక్కడ చదివి, తమ పదవుల్లో రాణించడం చెప్పుకోదగ్గ అంశమే..
కళలకు రూపం-కళాకాంతుల'విశ్వరూపం'
దేశంలోనే తొలిసారిగా విశ్వవిద్యాలయ స్థాయిలో 'రంగస్థల'(థియేటర్ ఆర్ట్స్), విభాగం ప్రారంభమయింది ఇక్కడే.. నటన, దర్శకత్వం లో డిప్లొమా కోర్సులు నిర్వహించిన ఘనత శ్రీ కే వీ గోపాలస్వామి గారిదే.. వారి పేరుతోనే ఆరుబయలు రంగస్థల వేదిక (ఓపెన్ ఎయిర్ థియేటర్)ను ఏర్పాటు చేశారు.. ఆ వేదిక మీద ప్రదర్సన చేయడం ఒక మహదవకాశంగా భావించేవారు.. కానీ అది ఒకప్పటి మాట.. ఇప్పడు దాని స్వరూపమే మార్చేశారు.. అదనపు హంగుల పేరుతో లేనిపోని రంగులు అద్ది ప్రదర్శనకు ఉపయోగించే వీలు లేకుండా చేయడం శోచనీయం.. సంగీతం, నృత్య విభాగాలు కూడా ఆంధ్రవిశ్వకళాపరిషత్తు సొంతం.. ఆచార్య పద్మశ్రీ నేదునూరి కృష్ణ మూర్తి వంటి కళాస్రష్టల నేతృత్వంలో ఏర్పాటైన సంగీత విభాగం ఆరు కచేరీలు,నృత్య విభాగం మూడు ఆరంగేట్రాలతో విలసిల్లు తున్నాయి..ఇక ఆంధ్రవిశ్వకళాపరిషత్తుకు మరో మణిమకుటం 'లలిత కళల'(ఫైన్ ఆర్ట్స్) విభాగం.. ప్రపంచస్థాయి చిత్రకారుల్ని రూపొందించిన విభాగం ఇది..భారత పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహం రూపశిల్పి ఈ విభాగపు ఆచార్యుడు, దివంగత రవిశంకర్ పట్నాయక్.. అది మనకు గర్వకారణమే కదా..
ఘన చరిత్రలో తనకంటూ ఎన్నో పేజీలను లిఖించుకున్న ఆంద్రావిశ్వకళామ తల్లి రాజకీయ ప్రముఖులకు సైతం జన్మ నిచ్చింది.. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, ప్రస్తుత ఒడిశా గవర్నర్ ఆచార్య కంభంపాటి హరిబాబు, రాజ్యసభ మాజీ సభ్యులు, విశ్వహిందీ పరిషత్తు అధ్యక్షులు పద్మ విభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ ,శ్రీ స్టాలిన్ ,ఉత్తమపార్లమెంటెరియన్లుగా పేరు గడించిన ఎంవీఎస్ మూర్తి, కింజరాపు యర్రం నాయుడు పాటు మంత్రులు, శాసనసభ, శాసనమండలి సభ్యులు ఇంకా ఎందరో ఇక్కడ రాజకీయ ఓనమాలు నేర్చిన వారే..
మహామహులకు జన్మనిచ్చిన మన 'న్యాయ కళాశాల'
1945సంవత్సరం లో పురుడు పోసుకున్న న్యాయకళాశాల దేశానికి ఎందరో న్యాయమూర్తులను మన దేశ న్యాయవ్యవస్థ కు అందించింది. కొందరు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు గాను, ఇంకొందరు హైకోర్టు న్యాయమూర్తులు గాను గొప్ప సేవలందించారు.. భారత దేశ ఎన్నికల సంఘానికి చీఫ్ కమీషనర్ గా విధులు నిర్వహించి, ఆ రాజ్యాంగ పదవికే వన్నె తెచ్చారు జీ వీ జీ కృష్ణ మూర్తి.. వారు చదివిందీ మన న్యాయకళాశాలలొనే.. 'బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 'చైర్మన్ గా సేవలందించిన దివంగత డీ వీ సుబ్బారావు ఈ చదువుల తల్లి ముద్దుబిడ్డడే.. అంతేకాదు, 'అంతర్జాతీయ లా కమీషన్' సభ్యులు గా ప్రపంచ గుర్తింపు పొందిన పి. ఎస్. రావు కూడా మన లా కళాశాల పూర్వ విద్యార్ధే.. ప్రతిష్టాత్మక భారత దేశపు పార్లమెంట్ లోని లోక్ సభ స్పీకర్ (సభాపతి )గా రాణించిన దివంగత జీ ఎం సీ బాలయోగి సైతం ఇక్కడ చదివి అంత పెద్ద స్థాయికి ఎదిగిన ఆణిముత్యమే.. ఇంకా జస్టిస్ కే. రామస్వామి, జస్టీస్ అమరేశ్వరి, జస్టిస్ ఐ. పాండురంగారావు, జస్టిస్ ఎన్డీ పట్నాయక్, జస్టిస్ పీ. రామకృష్ణ రావ్, ..ఇంకా మరెందరో న్యాయ నిపుణులు, న్యాయ మూర్తులు ఈ చదువుల తల్లి ఒడిలో పెరిగి పెద్దయిన వారే..
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం,వ్యావహారిక భాషా ఉద్యమం తో పాటు అనేక ఉద్యమాలకు పురుడు పోసిన రణక్షేత్రం ఆంధ్రవిశ్వవిద్యాలయం..మహోన్నత ఆశయాలు, మహత్తర లక్ష్యాలతో తొలి విశ్వవిద్యాలయంగా ఆరంభమై, అంచలంచలుగా ఎదిగి నూరేళ్ళ సంబరాలకు ఉవ్విళ్లూరుతున్న చదువుల తల్లి వందేళ్ల పండుగ ఆరంభోత్సవానికి ఛాన్సలర్ హోదాలో గవర్నర్ ని కానీ, రాష్ట్రాధినేత ముఖ్యమంత్రిని కానీ, కనీసం విద్యాశాఖ మంత్రిని కానీ ఒప్పించి, రప్పించలేకపోవడం వెలితిగానే భావించాలి..ఇంత గొప్ప చదువుల తల్లి సంబరాలను ఇలా సాదా ,సీదాగా నిర్వహించదలచడం వర్సిటీ వైభవాన్ని విస్మరించడం గా పరిగణించాలని అభిమానులు వాపోవడం సమంజసమని గ్రహించాలి..ఎట్టకేలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య మధునామూర్తి ముఖ్య అతిథిగా రావడం కొంతలో కొంతైనా ఊరటనిచ్చే అంశం..
కొసమెరుపు: వివిధ రంగాలలో ప్రావీణ్యం కనబరిచిన ప్రసిద్ధులను 'కళాప్రపూర్ణ'(గౌరవ డాక్టరేట్)తో సత్కరించటం యూనివర్సిటీ సాంప్రదాయం గా వస్తోంది.. ఈ కోవలో 'వేయిపడగల' విశ్వనాధ సత్యనారాయణ గారికి కళాప్రపూర్ణ ఇచ్చిన చాలా కాలానికి గుర్రం జాషువా గారికి కూడా ప్రదానం చేశారట.. ఓసారి పూర్వ విద్యార్థుల సమావేశానికి ఈ ఇద్దరు ప్రముఖులు హాజరయ్యారు.. విశ్వనాధ మాట్లాడుతూ "ఈ మధ్య కాలంలో గుర్రాలు, గాడిదలకు కళాప్రపూర్ణ లు ఇస్తున్నారు" అని వెటకరించారట! దానికి గుర్రం జాషువా గారు "అవును!నిజమే!సుమీ గాడిదలకు ముందుగా ఇచ్చి గుర్రాలకు తరువాత ఇవ్వడం అపచారమే కదా" అని దీటుగా చమత్కరించారట !! మేధావులు ఢీ కొంటే ఇలానే ఉంటుంది మరి!!
(ఏప్రిల్16, ఆంధ్రవిశ్వకళాపరిషత్తు వందేళ్ల పండుగ ఆరంభ సూచకంగా)
ఆచార్య పీటా బాబీ వర్ధన్,
జర్నలిజం విభాగపు పూర్వాధి పతి & డీన్
మీడియా విశ్లేషకులు,ఆంధ్ర విద్యాలయం.

Apr 24, 2025

100 సంవత్సరాల్లో బంగారం ధరలు

1925 నుండి 2025 వరకు 100 సంవత్సరాలలో  10 గ్రాముల బంగారం మార్కెట్ ధరలు 








సంవత్సరం  రూపాయలు 

1925.        18.75

1926.        18.43

1927.        18.37

1928.        18.37

1929.        18.43

1930.        18.05

1931.        18.18

1932.        23.06

1933.        25.05

1934.        28.81

1935.        30.81

1936.        29.81

1937.        30.18

1938.        29.93

1939.        31.75

1940.        36.05

1941.        37.43

1942.        44.05

1943.        51.05

1944.        52.93

1945.        62.00

1946.        83.87

1947.        88.62

1948.        95.87

1949.        96.18

1950.        97.18

1951.        98.00

1952.        76.81

1953.        73.00

1954.        77.00

1955.        79.00

1956.        90.00

1957.      ‌  90.00

1958.     ‌   95.00

1959.      102.00  

1960.      111.00

1961.      119.00

1962.      119.00

1963.        97.00

1964.        63.00

1965.        72.00

1966.        84.00

1967.      102.00

1968.      162.00

1969.      176.00

1970.      184.00

1971.      193.00

1972.      202.00

1973.      278.00

1974.      506.00

1975.      540.00

1976.      572.00

1977.      576.00

1978.      685.00

1979.      937.00

1980.    1330.00

1981.    1700.00

1982.    1645.00

1983.    1800.00

1984.    1970.00

1985.    2130.00

1986.    2140.00

1987.    2570.00

1988.    3130.00

1989.    3140.00

1990.    3200.00

1991.    3466.00

1992.    4334.00

1993.    4140.00

1994.    4598.00

1995.    4680.00

1996.    5160.00

1997.    4725.00

1998.    4045.00

1999.    4680.00

2000.    4400.00

2001.    4300.00

2002.    5000.00

2003.    5600.00

2004.    5850.00

2005.    7000.00

2006.    8400.00

2007.  10800.00

2008.  12500.00

2009.  14500.00

2010.  18500.00

2011.  26400.00

2012.  29500.00

2013.  29600.00

2014.  28734.00

2015.  26845.00

2016.  29560.00

2017.  29920.00

2018.  31730.00

2019.  36080.00

2020.  48480.00

2021.  50000.00

2022.  53000.00

2023.  60000.00

2024.  80000.00

2025.  1,00,000 

తేదీ.21.04.2025న 10 గ్రాముల బంగారం ధర అక్షరాల లక్ష రూపాయలకు చేరింది.

Apr 23, 2025

‘మన మంగళగిరి 2.0’ పరిచయం


మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి  చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ్యులు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ‘మన మంగళగిరి 2.0’లో మంగళగిరి చరిత్రను  సమగ్రంగా రాసినట్లు రచయిత గోవర్థన్ మంగళవారం స్థానిక జర్నలిస్టులకు వివరించారు. స్థానిక విలేకరులకు ఆయన ఈ పుస్తకాన్ని అందజేశారు. మంగళగిరి చరిత్ర అధ్యయనంలో దిట్ట అయిన  గోవర్థన్ గతంలో కూడా ‘మన మంగళగిరి’ అనే పేరుతో ఒక పుస్తకం రాశారు. ఈసారి 546 పేజీలతో, మంగళగిరిలోని అన్ని రంగాల  సమగ్ర సమాచారంతో  దీనిని తీసుకువచ్చారు. ఈ పుస్తకంలోని సమాచార సేకరణ కోసం ఆయన ఎంతో శ్రమించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వానపల్లి బ్రహ్మనాయుడు, సీనియర్ జర్నలిస్ట్ కొలికపూడి రూఫస్ తదితరులు పాల్గొన్నారు. 

Apr 20, 2025

తెలుగు జాతి గర్వించదగిన నేత చంద్రబాబు


ప్రపంచంలో వస్తున్న మార్పులను ముందుగానే గమనించగలిగిన దిట్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సాంకేతిక విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి  తెలుగు యువత ప్రపంచం నలుచరుగులా విస్తరించడానికి అవకాశం కల్పించిన దార్శనికుడు.  చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో ఖర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మ దంపతులకు 1950, ఏప్రిల్ 20న జన్మించిన చంద్రబాబు నాయుడు యూరప్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు తన 75వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. నారావారి పల్లెకు  పొరుగునే ఉన్న శేషాపురంలో చంద్రబాబు ప్రాథమిక విద్యాభ్యాసం, చంద్రగిరిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు.  శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి 1972లో బి.ఏ., 1974లో ఆర్థిక శాస్త్రంలో ఎంఏ పూర్తి చేశారు. చిన్నతనంలో ఆరు కిలోమీటర్ల దూరం కాలినడకన పాఠశలకు వెళ్లిన మధ్యతరగతి జీవితపు అనుభవాలను మూటగట్టుకున్న ఓ మామూలు కుర్రాడు రాష్టానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టారు. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగే క్రమంలో  చంద్రబాబు ఎన్నో సంక్షోభాలు, మరెన్నో సంఘర్షణలు, సవాళ్లు ఎదుర్కొన్నారు.  

1977లో  పులిచెర్ల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 47 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నారు.  28 ఏళ్ల వయసులోనే  చంద్రబాబు  1978 ఫిబ్రవరి 25న జరిగిన ఎన్నికల్లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ విజయం సాధించారు. 1978 మార్చి 15న ఎమ్మెల్యేగా తొలిసారి ప్రమాణస్వీకారం చేసిన ఆయన, రెండేళ్లకే 1980 అక్టోబర్ 11న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమ, పురావస్తు శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ రకంగా ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు, నవ్యాంధ్రలో రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదిగారు.  41 ఏళ్లుగా వరుసగా అసెంబ్లీలో ఉన్నారు. ఎవరికీ లేని రికార్డు ఆయనకు ఉంది.  1981, సెప్టెంబర్ 10న   ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకోవడంతో ఆయన దశ ఉజ్వలంగా వెలిగిపోతోంది.  ఎన్టీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రెండు వారాలకు 1983 జనవరి 23న  చంద్రబాబు దంపతులకు  లోకేష్ జన్మించారు. 

1984 మే 27న ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వంలో కర్షక పరిషత్ చైర్మన్‌గా నియామితులయ్యారు. 1985లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1989లో ఎన్టీఆర్ స్వయంగా  ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతిపక్ష నాయకునిగా చంద్రబాబుకు బాధ్యతలు అప్పగించారు. చంద్రబాబు నాయుడు ఓ పక్క రాజకీయ నాయకుడిగా పార్టీని చక్కదిద్దుతూ, మరో పక్క 1992లో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌ను స్థాపించారు. 1995 ఆగస్టు సంక్షోభం నుంచి తెలుగుదేశం పార్టీని కాపాడారు. 1995 సెప్టెంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1996లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కేంద్రంలో మొదటిసారిగా కాంగ్రెస్‌, బీజేపీలు లేని తృతీయ ఫ్రంట్‌ (యునైటెడ్ ఫ్రంట్) చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆ విధంగా ఆయన జాతీయ స్థాయి నాయకునిగా ఎదిగిపోయారు.  రెండు కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటులో, ముగ్గురు ప్రధానుల ఎంపికలో, ఇద్దరు రాష్ట్రపతుల ఎంపిక విషయంలో చంద్రబాబు  దేశ రాజకీయాల్లో  అత్యంత కీల పాత్ర  పోషించారు. 

1997 మార్చిలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులలో ఒకరైన బిల్ గేట్స్‌తో భేటీ అయ్యారు. 1999 ఫిబ్రవరి 28న హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించారు.  ఆ విధంగా తన ఆలోచనల ద్వారా ప్రపంచ వ్యాపార, ఐటీ దిగ్గజాలను ఆకర్షించే స్థాయికి ఎదిగారు. 1998 మార్చి 19న చంద్రబాబు జాతీయ కన్వీనర్‌గా ఎన్డీఏ ఏర్పాటైంది. 

1999 జనవరి 26లో ‘ఆంధ్రప్రదేశ్ విజన్: 2020’ పేరుతో చంద్రబాబు విడుదల చేసిన దార్శనిక పత్రం ఫలితమే సైబరాబాద్ ఏర్పాటు. ఆ తర్వాత హైదరాబాద్ ముఖచిత్రం మారిపోయింది.  1999 అక్టోబర్ 25న చంద్రబాబు అధ్యక్షతన స్వర్ణాంధ్రప్రదేశ్ నినాదంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. దాంతో, ఆయన రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2003 అక్టోబరు 1న తిరుపతి బ్రహ్మొత్సవాలకు వెళ్ళే సమయంలో అలిపిరి వద్ద నక్సలైట్లు క్లేమోర్ మైన్లు పేల్చి చంద్రబాబు నాయుడిపై హత్యాప్రయత్నం చేశారు. కానీ, అదృష్టవశాత్తూ చంద్రబాబు ఆ ప్రమాదం నుండి గాయాలతో బయటపడ్డాడు.

2014లో రాష్ర్టం విడిపోయిన తర్వాత, నవ్యాంధ్రలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ జనసేనలను కలుపుకుని ఘనవిజయం సాధించారు. 2014 జూన్‌ 8న  ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మైదానంలో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2015 మార్చి 30న దేశంలో మొదటి నదుల అనుసంధాన ప్రాజెక్టు 'పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు'కు శంకుస్థాపన చేశారు. 2015 సెప్టెంబర్ 17న  కృష్ణా - గోదావరి నదుల పవిత్ర సంగమం జరిగింది. 2015 అక్టోబరు 22న  ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.  పాలనలో భరోసాకు మరో పేరు, దార్శనికత కలిగిన ప్రజానేత, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన చంద్రబాబు నాయకత్వంలో 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించింది. దాంతో చంద్రబాబు నాలుగవసారి ముఖ్యమంత్రి అయ్యారు. అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూ, పేదరికం లేని సమాజ నిర్మాణంలో భాగం పీ4 విధానాన్ని ప్రకటించి విజయవంతంగా కొనసాగిస్తున్నారు. 

పరిపాలనా దక్షతతో అనేక సంస్కరణ తీసుకువచ్చిన చంద్రబాబు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ నేతగా పేరుఘడించారు. 1998లో అమెరికాలోని ఇల్లినాయిస్ గవర్నర్ జిమ్ ఎడ్గార్ చంద్రబాబు గౌరవార్ధం సెప్టెంబర్ 24వ తేదీని 'నాయుడు డే'గా ప్రకటించారు.   ఇండియా టుడే వార్తా సంస్థ చంద్రబాబును 'ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం'గా పేర్కొంది. ఎకనామిక్ టైం వార్తా సంస్థ 'బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్'గా ప్రకటించింది.  అమెరికాకు చెందిన ఒరాకిల్ కార్పొరేషన్ మాస పత్రిక 'ప్రాఫిట్' చంద్రబాబును 'హిడెన్ సెవెన్ వర్కింగ్ వండర్స్‌లో ఒకరు' అని పేర్కొంది. బీబీసీ కూడా 'సైబర్ సావీ చీఫ్ మినిస్టర్' అంది. సిఎన్ఎన్ వార్త సంస్థ ‘సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అని పేర్కంది.  టైమ్ ఆసియా సంస్థ 'సౌత్ ఆసియన్ ఆఫ్ ది ఇయర్ 1999' అవార్డును చంద్రబాబుకు ప్రకటించింది. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, సింగపూర్ మాజీ ప్రధాని గో చోక్ టోంగ్... తదితరులు భారతదేశానికి వచ్చినప్పుడు తమ షెడ్యూల్‌లో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి చంద్రబాబు నాయుడుతో సమావేశమవడాన్ని తప్పనిసరి చేసుకుంటారు.  

2003 జూన్ 26న ‘ప్రజాస్వామ్యంలో ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఈ-పరిపాలన’ అనే అంశాలపై ఐక్యరాజ్యసమితిలో చంద్రబాబు ప్రసంగించారు. తెలుగువారు గర్వించదగ్గ ఇంతటి మహానేత చంద్రబాబు నాయుడు  “అదృష్టాన్ని నేనెప్పుడూ నమ్ముకోలేదు. నా కష్టాన్నే నమ్ముకున్నాను” అని స్పష్టంగా చెప్పారు. అదే మనకు ఆదర్శం కావాలని ఆశిస్తూ, నారా చంద్రబాబు నాయుడుకు 75వ జన్మదిన శుభాకాంక్షలు.

- శిరందాసు నాగార్జు, సీనియర్ జర్నలిస్ట్- 9440222914


పేదరికంలేని సమాజసృష్టే చంద్రబాబు లక్ష్యం

నేడు 75వ పుట్టినరోజు - వజ్రోత్సవం 

దేశం, రాష్ట్రం అభివ‌ృద్ధి, పేదరికం లేని సమాజ సృష్టి ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు లక్ష్యం. తన  47 ఏళ్ల రాజకీయ జీవితం, ముఖ్యమంత్రిగా 15వ ఏట కొనసాగుతున్న  చంద్రబాబు ఈ రోజు తన 75వ పుట్టినరోజు (వజ్రోత్సవం) వేడుకలను కుటుంబ సభ్యులో యూరప్‌లో జరుపుకుంటున్నారు.   సమర్థవంతమైన రాజకీయ నేతలు రాజకీయాల్లో విజయం సాధించడంతోపాటు పరిపాలనా సామర్థ్యం కలిగి ఉండి, ఆర్థిక వ్యవస్థను క్రమపద్దతిలో పెట్టి ఆర్థికాభివృద్ధి సాధించడం  ముఖ్యంగా భావిస్తారు. ఈ మూడు లక్షణాల్లో  చంద్రబాబు తన సమర్థతను ప్రదర్శించి,  శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారు.ఆర్థికాభివృద్ధి సాధించాలంటే ఆర్థిక అంశాలపై అవగాహన ఉండాలి. దేశ, విదేశాల్లోని ఆర్థిక సంస్థల నుంచి ఎంతైనా అప్పు తేవచ్చు. అయితే తీసుకువచ్చిన డబ్బుని సమర్థవంతంగా వినియోగించి (మనీ మేనేజ్ మెంట్) ఫలితాలను సాధించాలి. ఆర్థిక వ్యవస్థను అద్వితీయమైన రీతిలో చక్కదిద్దటంలో  దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుని చంద్రబాబు ఆదర్శంగా తీసుకున్నారు. సంస్కరణలు, సరళీకరణ విధానాలతో ఆర్థిక వ్యవస్థను అద్భుతమైన రీతిలో చక్కదిద్దడంలో చంద్రబాబు  దిట్ట. సంక్షోభాల్ని సవాలుగా తీసుకుని  ముందుకు వెళ్లడం ఆయనకున్న ప్రధాన లక్షణం. ఆధునికతను అందిపుచ్చుకుని, అటు ఐటీ, ఇటు పారిశ్రామిక రంగంలో అభివృద్ధిని సాధించడంలో, సంపదను సృష్టించడంలో ఆయనకు ఆయనే సాటి.   పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఆయన  స్వర్ణా ఆంధ్ర@2047లో భాగంగా ఆయన ఇప్పుడు  జీరో పావర్టీ - P4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్‌షిప్) విధానాన్ని రూపొందించారు.  ఈ విధానంలో మార్గదర్శులు (ఆర్థికంగా సంపన్నులు) బంగారు కుటుంబాల(పేదలు)ను ఆదుకుంటారు. ఇది మంచి ఫలితాలను ఇస్తోంది.  


ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాముఖ్యాన్ని అందరికంటే ముందుగా గ్రహించి,  ఐటీకి  విశేష ప్రాధాన్యతనిచ్చి లక్షలాది మంది యువతకు బంగారు భవిష్యత్తు కల్పించారు. అన్ని సామాజిక రుగ్మతలకు విరుగుడు ‘విద్య’ ఒక్కటే అని నమ్మి,  ప్రాథమిక విద్య మొదలుకొని సాంకేతిక ఉన్నత విద్య వరకు ఎనలేని ప్రోత్సాహం కల్పించారు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఐటీ నిపుణులుగా తెలుగువారు ఉండటానికి మూల కారణం చంద్రబాబు. ఇది అందరూ అంగీకరించే విషయం. ఒక్క మాటలో చెప్పాలంటే  చంద్రబాబు నాయుడు ఆధునికతలో దార్శనికులు. సమాజంలో సంపద సృష్టించడంలో ఆరితేరిన ఆర్థిక నిపుణుడు. 

చంద్రబాబు నాయుడు 28 ఏళ్లకే 1978లో మొట్ట మొదటి సారిగా ఎమ్మెల్యే, వెంటనే మంత్రి అయ్యారు. ఇక రాజకీయాలలో  తిరిగి చూడనేలేదు.అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని రాజకీయంగా ఎదిగి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండుసార్లు(9 సంవత్సరాలు), నవ్యాంధ్రకు రెండు సార్లు, మొత్తం నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు.  పరిపాలనా దక్షుడిగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆధునిక ఆంధ్రప్రదేశ్‌లో  రాజకీయ సమీకరణలను తనకు అనుకూలంగా అత్యద్భుతంగా  మలచుకొని 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. జనాభా ఎక్కువ, ఆదాయం తక్కువగా వచ్చే ప్రాంతాన్ని ఏపీగా విభజించి, రాజధాని లేని, నిండా అప్పుల్లో మునిగిన ఏపీని అప్పగించారు. అయినా,  చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో చంద్రబాబు ఒక పక్క నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టి,  మరో పక్క వినూత్నమైన రీతిలో అభివృద్ధి వ్యూహాలను అనుసరించి సమ్మిళిత వృద్ధి సాధించారు.నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి  భూ సమీకరణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టం. వేల ఎకరాలు సమీకరించడం మాటలుకాదు. అంత భూమిని రైతులు ఇవ్వడానికి అంగీకరించరు. ఒకవేళ అంగీకరించినా అసలే లోటుబడ్జెట్ లో ఉన్న రాష్ట్ర ఆర్థిక స్థితి అందుకు అవకాశం ఇవ్వదు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు తనదైన తీరులో స్పందించారు. పూలింగ్ ద్వారా భూ సమీకరణ విధానం అతని ఆలోచనే. రైతులకు సమన్యాయం అందించే విధంగా  ఓ కొత్త విధానం మన రాష్ట్రంలో రూపుదిద్దుకుంది. ఇప్పటి వరకు 25 రెవెన్యూ గ్రామాల (29 గ్రామాలు)కు చెందిన 25,871 మంది రైతులు 32,513 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఇంత భూమి ఈ విధంగా సమీకరించలేదు. స్వచ్ఛందంగా కూడా ఇలా ఇంత భూ సమీకరణ చేయవచ్చని చేసి చూపించి చంద్రబాబు ఓ కొత్త వరవడి సృష్టించారు. 2014-2019 మధ్య కాలంలో చంద్రబాబు తన సమర్థతతో దయనీయ స్థితిలో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టినా, 2019 ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులుపెట్టినా, జైల్లో పెట్టినా పడిలేచిన కెరటంలా చంద్రబాబు మళ్లీ దూసుకొచ్చారు. సంక్షోభాలను ఎదుర్కోవడం ఆయనకు కొత్తేమీకాదు. తనదైన రాజకీయ వ్యూహాలతో  మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు.   రాజధాని అమరావతిలో  అర్థంతరంగా  నిలిపివేసిన నిర్మాణాలను కొనసాగించడానికి పూనుకున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  రాజధాని అమరావతి నిర్మాణ పనులను మే 2న పున:ప్రారంభిస్తారు.  అమరావతిని అన్ని హంగులతో ఓ అద్వితీయమైన మహానగరంగా రూపొందించడానికి  తుళ్లూరు, అమరావతి, తాటికొండ, మంగళగిరి ప్రాంతాల్లో మరో 44 వేల ఎకరాల భూ సేకరించాలన్న ఆలోచనలో  చంద్రబాబు ఉన్నారు.    అపార రాజకీయ, పాలనా  అనుభవంతో  చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపిస్తారని ఆశిద్దాం. చంద్రబాబుకు 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు. 

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్  - 9440222914

Apr 17, 2025

మంగళగిరి ప్రెస్ క్లబ్ కార్యవర్గం


 మంగళగిరి:మంగళగిరి ప్రెస్ క్లబ్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది.మంగళగిరి మండలంలో ఉన్న జర్నలిస్టులు అందరూ ఏకమై ‘మంగళగిరి ప్రెస్‌క్లబ్’ పేరుని ఖరారు చేశారు. మంగళగిరి మెయిన్ బజార్‌లోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సమావేశమై ప్రెస్ క్లబ్ నూతన కమిటీని కూడా గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లబ్ అధ్యక్షుడిగా వానపల్లి బ్రహ్మనాయుడు(ఆంధ్రజ్యోతి), ప్రధాన కార్యదర్శిగా బందెల దయాకర్(మహాన్యూస్), కోశాధికారిగా బత్తుల సాంబశివరావు, గౌరవాధ్యక్షులుగా కూరపాటి మురళి రాజు, ఉపాధ్యక్షులుగా షేక్ సుభాని, మట్టుకొయ్య కృష్ణ, బాపనపల్లి శ్రీనివాసరావులను ఎన్నుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా నువ్వుల శ్రీహరి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బి.మల్లేశ్వరరావు, కార్యదర్శులుగా దొప్పలపూడి రాము, మెడకాయల మస్తాన్, మంచికలపూడి సిరిబాబు, సహాయకార్యదర్శులుగా చెదలవాడ సాయిచంద్, నాయుడు నాగరాజు, గండికోట దుర్గారావులను ఎన్నుకున్నారు. 

కార్యవర్గ సభ్యులుగా శిరందాసు విజయ భాస్కర్, విడేల సాయి శ్రీనివాస్, కె.అభిరామ్ కృష్ణారెడ్డి, ఎం. శివనాగి రెడ్డి, బత్తెన శ్రీనివాసరావు, ఆరేపల్లి రాజు, వేముల రాంబాబు, తిరుమల శెట్టి శ్రీనివాసరావు, మద్దెల కిషోర్, ఉద్దంటి రమేష్, పి.రమేష్ కె.వెంకటేష్, శివరాత్రి శ్రీనివాసరావు, బండారు సాంబ, జీవై సాయి కృష్ణ, చిన్ని కాజాలను ఎన్నుకున్నారు. ప్రెస్‌క్లబ్ గౌరవ సలహాదారులుగా కొలికిపూడి రూఫస్, శిరందాసు నాగార్జున, త్రిపురమల్లు సతీష్, ఎన్వీ శివన్నారాయణ, గోరంట్ల లక్ష్మీనారాయణ, శిరందాసు శ్రీనివాసరావు, ఈపూరి రాజారత్నం, ఐ.వెంకటేశ్వరరెడ్డి, అన్నవరపు ప్రభాకర్‌లను ఎన్నుకున్నారు.

జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి

మంగళగిరిలో దీర్ఘకాలంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులందరినీ ఏకతాటిపై నడిపించి, ఐక్యంగా కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన అధ్యక్షకార్యదర్శులు చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా, ప్రధానంగా ఇళ్ల స్థలాల సాధన, హెల్త్ ఇన్సూరెన్స్, జర్నలిస్ట్ పిల్లలకు స్కూల్ ఫీజు రాయితీ, ప్రమాద బీమా వంటి ప్రయోజనాలను పొందేందుకు కృషి చేస్తామన్నారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రెస్‌క్లబ్ సభ్యులకు సహాయం అందించేందుకు ఒక సంక్షేమ నిధిని కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు. స్థానిక శాసనసభ్యులు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను ప్రెస్‌క్లబ్ సభ్యులందరూ తర్వలో మర్యాదపూర్వకంగా కలిసి, తమ సమస్యలను వివరిస్తామని చెప్పారు.

Apr 13, 2025

 

           తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత  నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు ఉద్యోగ జీవితం గుంటూరు జిల్లా మంగళగిరి నుంచే ప్రారంభమైంది. అలాగే, ఆయన మనవడు నారా లోకేష్ రాజకీయ జీవితం కూడా మంగళగిరి నుంచే ప్రారంభమైంది. సినిమాల్లోకి రాకముందు ఎన్టీఆర్  మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం చేశారు. 1947లో ఎన్టీఆర్ డిగ్రీ పూర్తి అయిన తర్వాత, మద్రాసు సర్వీసు కమిషన్ నిర్వహించిన పరీక్ష రాశారు. పరీక్ష రాసిన 1100 మంది నుండి  ఏడుగురిని మాత్రమే ఎంపిక చేశారు. ఆ ఏడుగురిలో ఎన్టీఆర్ ఉన్నారు. ఆ విధంగా ఆయనకు  అప్పుడు మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది.ఆయన దేసంతా సినిమాలపై ఉండటంతో ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేదు.  ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల్లో నటించేందుకు వెళ్ళిపోయారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మంగళగిరిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 1986 ఏప్రిల్ 9న మంగళగిరిలో  ఎన్టీఆర్ ప్రభుత్వ హాస్పిటల్‌కి శంకుస్థాపన చేసి, తన హయాంలోనే పూర్తి చేయించారు. ఎన్టీఆర్ హయాంలోనే మంగళగిరి సమీపంలోని చిన్న కాకానిలో  యార్లగడ్డ వెంకన్న చౌదరి క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ కాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు యార్లగడ్డ వెంకన్న చౌదరి రూ. 30 లక్షల విరాళమిచ్చారు. అందుకే దీనికి ఆయన పేరు పెట్టారు. ఆ తర్వాత దీనిని యార్లగడ్డ వెంకన్న చౌదరి ఆంకాలజీ లివింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ గా మార్చారు. 1989లో  ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ ఏర్పడినప్పుడు మొదటి గ్రంథాలయాన్ని ఎన్టీఆర్ మంగళగిరిలోనే ప్రారంభించారు. ఈ విధంగా ఎన్టీఆర్‌కు అనేక విధాల మంగళగిరితో అనుబంధం ఉంది.



ఇప్పుడు ఎన్టీఆర్ కుమార్తె నారా భువనేశ్వరి కుమారుడు, ఆయన మనవడు నారా లోకేష్ రాజకీయ జీవితానికి పునాది పడింది ఇక్కడే. ఆయన 2018లో ఎమ్మెల్సీగా ఎన్నికై, మంత్రి అయినప్పటికీ,  2019 ఎన్నికల్లో  లోకేష్ మొదటిసారిగా మంగళగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అనుకోకుండా ఎన్నికలకు 20 రోజుల ముందే ఆయన ఇక్కడ పోటీచేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. తక్కువ సమయం ఉండటం వల్ల, ఆ ఎన్నికల్లో ఆయన  5,337 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓడిపోయినప్పటికీ ఏమాత్రం జంకకుండా, మళ్లీ మంగళగిరిలోనే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. మంగళగిరి ప్రజలనే నమ్ముకున్నారు.  ఓడిపోయినప్పటికీ ఈ నియోజకవర్గంలో  29 రకాల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలకు చేరువయ్యారు. ముఖ్యంగా మంగళగిరిలో పద్మశాలీ సామాజిక వర్గానికి చేనేత కార్మికుల సంఖ్య అధికం. ఆ సామాజిక వర్గంవారే ఇక్కడ అంతకు ముందు నాలుగుసార్లు గెలిచారు.  వారి సంక్షేమం, ఉపాధి కోసం అనేక చర్యలు చేపట్టారు. అలాగే, పేదల కోసం, మహిళల కోసం విద్య, వైద్యం, కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు, అన్న క్యాంటిన్.. వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు. ఓడిపోయినా నియోజ‌క‌వ‌ర్గాన్ని వీడిపోలేదు. ఓడిన చోటే గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో ప‌ని చేశారు. అలాగే, పాదయాత్ర ద్వారా యువశక్తిని కూడగట్టారు.  2024లో ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలోనే లోకేష్ పోటీ చేశారు.5,337 ఓట్ల తేడాతో ఓడిపోయినందున, 53 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించమని ఆయన కోరారు.  కుప్పం కంటే ఒక్క ఓటైనా ఎక్కువ సాధిస్తానని తండ్రి చంద్రబాబు నాయుడుకు చెప్పారు.  కానీ, ఈ నియోజకవర్గ ప్రజలు ఏకంగా 91,413 ఓట్ల మెజార్టీలో గెలిపించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల కంటే అధిక మెజార్టీ సాధించారు. మెజార్టీలో రాష్ట్రంలోనే మూడవ స్థానంలో నిలిపారు.  రేపు ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలే నారా లోకేష్‌ని  ముఖ్యమంత్రిని కూడా చేస్తారు.  39 ఏళ్ల తర్వాత ఇక్కడ టీడీపీకి విజయాన్ని చేకూర్చారు. గతంలో 1983, 1985లో రెండు సార్లు మాత్రమే, అదీ ఎంఎస్ఎస్ కోటేశ్వరారావు గెలిచారు. ఆ తర్వాత ఇక్కడ టీడీపీ గెలవలేదు. 

ప్రజల నమ్మకాన్ని ఒమ్ముచేయకుండా లోకేష్ ఈ నియోజకవర్గంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. మంగళగిరిని దేశంలోనే నెంబర్ వన్ గా చేయాలన్నది ఆయన లక్ష్యం. ఆ దిశగానే చర్యలు కొనసాగుతున్నాయి. మన ఇల్లు - మన లోకేష్ కార్యక్రమం చేపట్టి పేద ప్రజల చిరకాల కలని నిజం చేశారు. పేదలు ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుని నివాసం ఉంటున్నారో, అక్కడే వారిని శాశ్విత హక్కుపట్టాలు అందజేశారు. బహిరంగ మార్కెట్‌లో రూ. 1,000 కోట్ల విలువైన ఆస్తిపై మూడు వేల మందికి శాశ్వత హక్కును కల్పించారు.  జీరో పావర్టీ -పీ4 విధానాన్ని కూడా మంగళగిరి నియోజకవర్గంలోనే ప్రారంభించి, మొదటి బంగారు కుటుంబాలను కూడా ఇక్కడివారినే ఎంపిక చేశారు.  మంగళగిరి ప్రజల చిరకాల కోరిక అయిన 100 పడకల ఆస్పత్రికి ఈరోజు నారా లోకేష్ శంకుస్థాపన చేస్తారు.
 
ఇది కూడా తాత ఎన్టీఆర్‌తో ముడిపడిన విషయం. 1986 ఏప్రిల్ 9న మంగళగిరిలో   ప్రభుత్వ హాస్పిటల్‌కి ఎన్టీఆర్ శంకుస్థాపన చేశారు.39 ఏళ్ల తర్వాత అదే ఆస్పత్రిని నారా లోకేష్ మంత్రి మండలిని ఒప్పించి వంద పడకల ఆస్పత్రిగా పెంచారు.  తాత ఎన్టీఆర్  చిన్నకాకానిలో ఏ నెలలో, ఎక్కడైతే  యార్లగడ్డ వెంకన్న చౌదరి క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారో, అదే ప్రదేశంలో, అదే  ఏప్రిల్ నెలలో ఈరోజు   వంద పడకల ఆస్పత్రికి నారా లోకేష్ శంకుస్థాప చేస్తారు. అయితే, బాధాకరమైన విషయం ఏమిటంటే, మంగళగిరి నియోజకవర్గం బీసీలు, ముఖ్యంగా చేనేత వర్గం పద్మశాలీల చేయిజారిపోయింది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని కూటమి ప్రభుత్వం వారిలో పలువురికి నామినేటెడ్ పదవులలో తగిన ప్రాధాన్యత ఇస్తోంది. ఆ రకంగా వారికి న్యాయం జరుగుతోంది.  అలాగే, వచ్చే ఎన్నికలలో ముఖ్యమంత్రిని కూడా ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజలే ఎన్నుకుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహంలేదు. 

శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914






Apr 11, 2025

కోదండరాముడికి పద్మశాలీయులు పట్టువస్త్రాల సమర్పణ


ఒంటిమిట్ట: కడప జిల్లా ఒంటిమిట్టలో జరిగే శ్రీ కోదండ రాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని పద్మశాలి ఆడపడుచైన అమ్మవారి తరపున ఈరోజు స్వామివారికి పద్మశాలియ వంశస్థులు పట్టు వస్త్రములు సమర్పించారు. గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా మేళ తాళాల మధ్య వేద పండితుల మంత్రాల నడుమ బ్రహ్మాండంగా జరిగింది. స్వామివారికి మంగళగిరి మునిసిపల్ మాజీ చైర్మన్, ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవితోపాటు పద్మశాలీ పెద్దలు, మహిళలు పెద్దఎత్తున పాల్గొని వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన పద్మశాలి వంశస్థులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా గంజి చిరంజీవి మాట్లాడుతూ, పద్మశాలి అయిన మనకు ఇటువంటి గొప్ప అవకాశాలు రావడం పూర్వజన్మ సుకృతం అన్నారు. స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు అమ్మవారి తరఫున మనందరం కలిసి స్వామివారికి వస్త్ర సమర్పణ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. స్వామివారి కల్యాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరవుతున్నారని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు చేసే అవకాశం మన కులానికి మరెన్నో రావాలని అన్నారు. పద్మశాలి అంటే పట్టు వస్త్రాలు నేసే వారు మాత్రమే కాదని, పట్టుదల ఉన్నవారు కూడా అని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకి దేవి, పద్మశాలి కార్పోరేషన్ మాజీ చైర్మన్ జింకా విజయలక్ష్మి, బీసీ సంఘం నాయకులు పారేపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.



Apr 10, 2025

కూటమి ప్రభుత్వంలో చేనేత రంగానికి మహర్దశ


వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించే  చేనేత రంగానికి ఏపీలో మహర్దశ పట్టనుంది. అనేక ఆటుపోట్లకు తట్టుకుని దేశ వారసత్వ సంపదగా చేనేత నిలిచింది. జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించిన చేనేత వస్త్ర పరిశ్రమ రాష్ట్రంలో మళ్లీ కళకళలాడే పరిస్థితి రానుంది. చేనేత కార్మికుల చిరకాల డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కటిగా తీరుస్తున్నాయి. అటు కేంద్రంలోని ఎన్‌డీఏ(జాతీయ ప్రజాస్వామ్య కూటమి) ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలోని  కూటమి (టీడీపీ+జనసేన+బీజేపీ) ప్రభుత్వం చేనేత రంగంపై దృష్టిపెట్టాయి. ఎన్నికల హామీ మేరకు రోజుకో వరాన్ని  ప్రకటిస్తున్నాయి. అలాగే, చేనేత కార్మిక సంఘాల డిమాండ్లను కూడా పరిగణలోని తీసుకుని చేనేత కుటుంబాల సంక్షేమం కోసం అనే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. చేనేత కార్మికుల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు నెలకు 500 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇచ్చేందుకు ఏపీ మంత్రి మండలి ఆమోదించింది. దీంతో,  93 వేల చేనేత కుటుంబాలకు, 10,534 మరమగ్గాల యజమానులకు ప్రయోజనం చేకూరుతుంది.  మర మగ్గాలపై కూడా చేనేత రంగానికి చెందిన కార్మికులే వస్తాలను తయాలు చేస్తారు. చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు రూ.96.76 కోట్లు, పవర్‌లూమ్‌ యూనిట్లకు ఉచిత విద్యుత్‌కు అయ్యే ఖర్చు రూ.28.16 కోట్లను ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తుంది. చేనేత కార్మికులకు 90 శాతం సబ్సిడీతో పనిముట్లు  ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.  అలాగే, బీపీఎల్ (దారిద్ర్యరేఖకు దిగువన) కుటుంబాలకు ఇంటి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులు కాకుండా,  చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం  అదనంగా రూ.50 వేల ఆర్థిక సహకారం అందజేస్తామని ఇంతకు ముందే ప్రకటించింది. ముడిపదార్థాల సరఫరా పథకం కింద నూలుపై 15 శాతం సబ్సిడీ ఇస్తున్నారు.

 కేంద్ర ప్రభుత్వ చేనేత ఉత్పత్తులపై విధించే  జీఎస్‌టీని తిరిగి చెల్లించేందు( రీయింబర్స్‌మెంట్) రాష్ట్ర ప్రభుత్వం  చర్యలు తీసుకుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 10 చేనేత క్లస్టర్లను మంజూరు చేసింది. చేనేత కార్మికుల్ని ప్రోత్సహిస్తూ, కొత్త డిజైన్ల ద్వారా ఆదాయం పెంచుకునేందుకు కేంద్రం క్లస్టర్ల విధాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రంలోని కాకినాడ, తూర్పుగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో  ఒక్కొక్కటి, తిరుపతి జిల్లాలో  రెండు క్లస్టర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. పల్నాడు, గుంటూరు, బాపట్ల, తిరుపతి పరిధిలో క్లస్టర్ల ఏర్పాటుకు పనులు మొదలయ్యాయి.  ఈ క్లస్టర్ల కోసం తొలి విడతగా కేంద్రం రూ.5 కోట్లు విడుదల చేసింది. మిగిలినవాటికి మరో రూ.2 కోట్ల మంజూరుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ క్లస్టర్ల ఏర్పాటుతో రెండు వేలమంది చేనేత కళాకారులకు లబ్ధి కలుగుతుంది. కూటమి ప్రభుత్వం రాయదుర్గంలోని టెక్స్‌టైల్ పార్కుని అభివృద్ధి చేయడంతోపాటు మంగళగిరిలో  తమిళనాడులోని కంచి తరహాలో మెగా హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం మంగళగిరిలోని ఆటోనగర్‌కు ఆనుకుని  10.80 ఎకరాల స్థలాన్ని కూడా  చేనేత జౌళిశాఖ అధికారులు పరిశీలించారు.

తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి చేనేతకు అండగా నిలుస్తోంది. ఎన్టీఆర్ హయాంలోనూ, ఆ తర్వాత  చంద్రబాబు నాయుడు పాలనా కాలంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  అనేక పథకాలు ప్రవేశపెట్టారు. చేనేత కార్మికులకు  ఉపాధి కల్పన కోసం ఎన్టీఆర్ హయాంలో జనతా వస్త్రాల పథకం ప్రవేశపెట్టారు. చేనేత సహకార సొసైటీలను బలోపేతం చేసి వారికి పని కల్పించారు. ఆప్కో ద్వారా సహకార సంఘాలలో నిల్వలను కొనుగోలు చేయించారు. వారికి ఆరోగ్యభద్రత కార్డులు అందజేశారు. 50 ఏళ్లు దాటిన చేనేత  కార్మికులు లక్షా 11 వేల మందికి రూ.2 వేలు చొప్పున పెన్షన్ అందించారు. నూలు, రంగులు, రసాయనాలపై  సబ్సిడీలు అందించారు. 23వేల మంది చేనేత కార్మికుల రుణాలు చంద్రన్న చేయూత పథకం  ద్వారా రూ.110 కోట్ల వరకు రద్దు చేశారు. పావలా వడ్డీ పథకం ద్వారా 55,500 మంది నేతన్నలకు రూ.26.62 కోట్లు రుణాలు ఇచ్చారు. రాష్ట్రంలోని 2.5 లక్షల మంది చేనేత కార్మికుల ప్రయోజనం కోసం టీడీపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. చేనేత కార్మికుల పొదుపు పథకాన్ని అమలు చేశారు. ప్రాథమిక చేనేత సహకార సంఘ సభ్యుడు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.12,500లు ఆర్థిక సహాయం అందించారు. ప్రధాన నగరాల్లో చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి, కార్మికులకు ఆర్థికంగా చేయూతనిచ్చారు. మంగళగిరిలో 2024 ఫిబ్రవరిలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  చేనేత కార్మికుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా 20 మగ్గాలతో వీవర్స్ శాలను ప్రారంభించారు. ఇక్కడ అధునాతన మగ్గాలతోపాటు కుట్టు శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడివారికి టెక్నాలజీపరంగా సహకరించేందుకు, చీరలను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూపుకు చెందిన తనేరా ముందుకొచ్చింది.  మంగళగిరి చేనేతకు తానే బ్రాండ్ అంబాసిడర్ అని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.   రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి  వీవర్ శాలల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అలాగే,  ఎమ్మిగనూరు, రాయదుర్గం, మైలవరం, పామిడిలలో టెక్స్ టైల్స్ పార్కులు,  చీరాలలో హ్యాండ్లూమ్ పార్క్ తో పాటు టెక్స్ టైల్స్ పార్కు నిర్మించాలని నిర్ణయించింది. అలాగే, మంగళగిరిలో చేనేత కార్మికులకు కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. 

చేనేతకు ప్రధాన సమస్య మార్కెటింగ్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్‌లోకి మన చేనేత ఉత్పత్తులను చొప్పించాలి. అంది అసంఘటింతంగా ఉన్న ఈ కార్మికులకు సాధ్యంకాదు. చేనేత కార్మికులు తమ వృత్తితో అంత్యంత నైపుణ్యం కలిగినవారే గానీ, వారికి మార్కెటింగ్ తెలియదు. పటిష్టమైన మార్కెటింగ్ వ్యవస్థని ప్రభుత్వాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్, ఎగ్జిబిషన్ల ద్వారా చేనేత వస్త్రాలకు విస్తృతమైన మార్కెటింగ్‌ని కల్పిస్తే, వారి ఉత్పత్తులు అమ్ముడుపోయి, వారికి ఉపాధి లభిస్తుంది. పనికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఈ అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిపెడితే  చేనేత కార్మికులకు న్యాయం జరుగుతుంది.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914

Apr 4, 2025

65 ఏళ్లు దాటిన వృద్ధులకు ఉచిత దర్శనం

 


65 ఏళ్లు దాటిన వృద్ధులకు  తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుడి ఉచిత దర్శనం.  రెండు స్లాట్‌లు కేటాయించారు.   ఒకటి 10 AM, మరొకటి 3 PM.   మీరు ఫోటో IDతో పాటు వయస్సు రుజువు సమర్పించాలి.  S1 కౌంటర్‌కి నివేదించాలి.   వంతెన దిగువన ఉన్న గ్యాలరీ నుండి ఆలయం  కుడి గోడకు రహదారిని దాటండి.   మీరు ఏ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు.   ఉత్తమ సీట్లు అందుబాటులో ఉన్నాయి.   కూర్చున్న తర్వాత, వేడి వేడి సాంబార్ అన్నం, పెరుగు, అన్నం, వేడి పాలు ఇస్తారు.  ఇదంతా ఉచితం.   ఆలయ నిష్క్రమణ ద్వారం వద్ద కార్ పార్కింగ్ ప్రాంతం నుండి, కౌంటర్ వద్ద మిమ్మల్ని డ్రాప్ చేయడానికి బ్యాటరీ కారు అందుబాటులో ఉంది.   వీక్షించినప్పుడు అన్ని ఇతర పంక్తులు నిలిపివేస్తారు.   ఎటువంటి ఒత్తిడి లేదా బలవంతం లేకుండా సీనియర్ సిటిజన్లు మాత్రమే సందర్శించడానికి అనుమతిస్తారు.   దర్శన క్యూ తర్వాత మీరు 30 నిమిషాలలోపు దర్శనం నుండి నిష్క్రమించవచ్చు.    TTD హెల్ప్‌లైన్ తిరుమల 08772277777


Apr 3, 2025

మంత్రి వర్గం మొబైల్ నంబర్లు


1. ఎన్ .చంద్రబాబు నాయుడు,ముఖ్యమంత్రి
     మొబైల్ :  99635-10004/ 97057-10004

2. కె. పవన్ కళ్యాణ్,    ఉప ముఖ్యమంత్రి
    మొబైల్ :  93813-09696     pawan.k786@gmail.com

3. ఎన్. లోకేష్ : 0863-2499999   lokeshnara@gmail.com

4. కె. అచ్చెన్నాయుడు : 94401- 96777    katchannaidu@gmail.com

5. కొల్లు రవీంద్ర  :  99851-22254     kolluravindra@gmail.com

6. నాదెండ్ల మనోహర్   :  98490-00006    nadendalamanohar@gmail.com

7. పి.నారాయణ  :  98481-72501  narayanaponguru@gmail.com

8. వంగలపూడి అనిత  :  80994-88888/ 90955-48888
    anithavangalapudi@gmail.com

9. సత్యకుమార్ యాదవ్  :   98105-09999/  74829-99999
    satyaosd@gmail.com

10. ఎన్. రామానాయుడు : 92477-31129  ramanaidunimmala@gmail.com

11. ఎన్.ఎం.డి.ఫరూక్  : 98496-99920  ministerfarook@gmail.com

12. ఎ.రామనారాయణరెడ్డి : 98490- 48855/94412-20555
     ananmramanarayanareddy139@gmail.com

13. పయ్యావుల కేశవ్ : 98480-32984   payyavulakeshav@gmail.com

14. ఎ. సత్య ప్రసాద్  : 99120-77777/96764-47777
     anaganimla@hotmail.com

15. కె. పార్ధసారధి  : 98483-04112/ 96983-59999
    nitinkrishna1811@gmail. com

16. డి. వీరాంజనేయస్వామి : 98491-94903 doctorswamydola@mail.com

17. జి. రవికుమార్  : 98485-25717 gravikumarmlaaaddanki@gmail.com

18. కందుల దుర్గేష్ : 91128-99999   lakshmidurgesh@gmail.com

19. జి.సంధ్యారాణి  : 94916-99633   sandhyatdp@gmail.com

20. బి.సి. జనార్ధనరెడ్డి  : 94944-94944/94410- 43333
      bcjreddy2@gmail.com

21. టి.జి. భరత్ : 98483-59999 tgbharath@hotmail.com

22. ఎస్.సవిత : 94406-10201/ 83091-70485
     savithahpe1@gmail.com

23. వాసంశెట్టి సుభాష్ : 95344-44999 subashforrcp@gmail.com

24.  కొండపల్లి శ్రీనివాస్  : 91771-12349  skondapalli9@gmail.com

25. ఎం.రామ్ ప్రసాద్ రెడ్డి  : 63610-27470  prasadreddy3@gmail.com

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...