Aug 29, 2018


హరికృష్ణ మృతికి మండలి చైర్మన్ ఫరూక్ దిగ్భ్రాంతి
           
  
సచివాలయం, ఆగస్ట్ 29: ప్రముఖ సినీ నటులు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం నల్గొండ సమీపంలోని అన్నేపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ఎన్ఎండి ఫరూక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. స్వర్గీయ నందమూరి తారకరావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన సందర్భంగా ఆయన పిలుపు మేరకు తాము పార్టీలో చేరినట్లు తెలిపారు. ఆ నాడు ఎన్టీఆర్ ప్రారంభించిన చైతన్య రథాన్ని హరికృష్ణ స్వయంగా డ్రైవ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పార్టీకి ఎనలేని సేవచేశారన్నారు. హరికృష్ణ తనకు అత్యంత సన్నిహితులని, ఆయన లేని లోటు తనకు వ్యక్తిగతంగానూ, పార్టీకీ తీరనిలోటని ఫరూక్ పేర్కొన్నారు.

No comments:

Post a Comment

గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!

‘ఎదురీత’ పుస్తక సమీక్ష ఎవరు  ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే  అద్భుతమైన  కవిత్వం రాయగల దిట్ట  ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత...