Aug 20, 2018

సచివాలయంలో సద్భావన దినోత్సవ ప్రతిజ్ఞ 
           సచివాలయం, ఆగస్ట్ 20: రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సోమవారం ఉదయం  సచివాలయంలో సద్భావన దినోత్సవం నిర్వహించారు. 1వ బ్లాక్ లో ప్రభుత్వ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి సాధారణ పరిపాలన సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. సిబ్బంది నిలబడి ‘‘కులం, ప్రాంతం, మతం లేదా భాషతో సంబంధం లేకుండా భారత ప్రజలందరి భావోద్వేగ ఏకత్వం మరియు సామరస్యం కోసం కృషి చేస్తామని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంతేగాక, హింసకు పాల్పడకుండా చర్చలు మరియు రాజ్యాంగపరమైన మార్గాల ద్వారా మాలో ఉన్న అన్ని విభేదాలను పరిష్కరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.’’ అని ప్రతిజ్ఞ చేశారు.

No comments:

Post a Comment

గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!

‘ఎదురీత’ పుస్తక సమీక్ష ఎవరు  ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే  అద్భుతమైన  కవిత్వం రాయగల దిట్ట  ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత...