Aug 23, 2018


వైద్య ఆరోగ్యశాఖకు ప్రపంచ బ్యాంక్ నిధులు

              సచివాలయం, ఆగస్ట్ 22: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలలో వివిధ వ్యవస్థల బలోపేతానికి నిధులు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంక్ బృందం అంగీకరించింది. మోహినీ కాక్ నాయకత్వంలో ప్రపంచ బ్యాంకు బృందం బుధవారం సచివాలయంలో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యను కలిసింది. సచివాలయం 5వ బ్లాక్ లోని సమావేశ మందిరంలో వారు సమావేశమై నిధులు మంజూరుకు సంబంధించి పలు అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖకు నిధులు మంజూరు చేయడానికి ప్రపంచ బ్యాంక్ బృందం అంగీకారం తెలిపింది. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు పలువురు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!

‘ఎదురీత’ పుస్తక సమీక్ష ఎవరు  ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే  అద్భుతమైన  కవిత్వం రాయగల దిట్ట  ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత...