Mar 31, 2025

డాక్టర్ జీకే పదవీ విరమణ

విజయవాడ దూరదర్శన్ కేంద్రం న్యూస్ హెడ్(ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్)గా డాక్టర్ గుత్తికొండ కొండలరావు (జీకే) 2025 మార్చిలో పదవీవిరమణ చేశారు. పాత్రికేయుల్లో ప్రజా సమస్యలపై శాయశక్తుల కృషి చేసిన వారు, ఘనులు, ప్రముఖులు, మణిపూసలాంటి వారు  డాక్టర్ గుత్తికొండ కొండలరావు. అలుపెరగని కలం శ్రామికుడు జీకే. జర్నలిజంలో డాక్టరేట్ చేసిన జీకే ప్రాంతీయ వార్తా విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు.  ప్రజా సమస్యలపై అహరహం శ్రమిస్తూ, తన శక్తిని, సామర్థ్యాన్ని, పరిశ్రమని, తన జీవితాన్నే పరిపూర్ణంగా వెచ్చించిన గొప్ప వ్యక్తి. పశ్చిమగోదావరి జిల్లాలోని ఒక కుగ్రామంలో  జన్మించిన జీకే  ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య అత్తిలి మండలం బల్లిపాడు  ఓరియంటల్ స్కూల్, హైస్కూల్ విద్యను SVSS జూనియర్ కాలేజీ, డిగ్రీ విద్యను నరసాపురంలోని వైఎన్ కాలేజీలో పూర్తి చేశారు. ఆ తర్వాత   ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ, బీజేఎంసీ చేసి, ఎంజెఎంసిలో గోల్డ్ మెడల్ సాధించారు. గిరిజన ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగంపై జీకే చేసిన పీహెచ్‌డీని ఇప్పటి  ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర ప్రసార శాఖా మంత్రి   ముప్పవరపు వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ పరిశోధనను జీకే తన ధర్మపత్ని  శైలజ సహకారంతో పూర్తి చేశారు. మొదటి నుంచి జీకే అన్ని అంశాలలో  సోదరి  స్వర్ణలత, చిన్నాన్న గుత్తికొండ సత్యనారాయణ  సహకారంతో ఈ స్థాయికి ఎదిగారు.  పశ్చిమగోదావరి జిల్లా తిరుపతి పురంలో 1965 మార్చి 10వ తేదిన  గుత్తికొండ సత్తిరాజు, గుత్తికొండ వెంకట నాగరత్నం గార్లకు డాక్టర్ గుత్తికొండ కొండలరావు జన్మించారు. తెలుగు కథకు ప్రపంచ ఖ్యాతిని సాధించిన పాలగుమ్మి పద్మారావు స్వగ్రామం కూడా ఇదే.  కొండలరావు  ప్రాథమిక విద్యాభ్యాసం అంతా తిరుపతిపురం, బల్లిపాడు, అత్తిలిలో జరిగింది. ఆంగ్ల సాహిత్యంలో బీఏ నర్సాపురంలోని వైఎన్ కళాశాలలో చదివారు. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఆంధ్రవిశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. అదే విశ్వవిద్యాలయంలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ పోస్టు గ్రాడ్యుయేషన్ లో గోల్డ్ మెడల్ సాధించారు.


జీకే బాబాయి, మెకానికల్ మెరైన్ ఇంజనీర్ గుత్తికొండ సత్యనారాయణ, చిన్నక్క స్వర్ణలతల ప్రోత్సాహం, ప్రోద్భలంతో కొండలరావు ఈ స్థాయికి ఎదిగారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో  ఆచార్య పి.బాబీవర్థన్  ప్రోత్సాహం, సహాయ సహకారాలతో జర్నలిజంలో డాక్టరేట్ పూర్తి చేశారు. పీహెచ్‌డీ కోసం ఆయన రాసిన ‘ట్రైబల్ అండ్ ఇంటర్‌నెట్’ అనే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. జీకే మొదట్లో కొద్దికాలం ఈనాడులో పనిచేశారు. ఆ తరువాత ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్)కు ఎన్నికయ్యారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ)లో ముంబై, విజయవాడలలో పని చేశారు. క్షేత్రస్థాయి ప్రచార విభాగం(డైరెక్టరేట్ ఫీల్డ్ పబ్లిసిటీ)లో శ్రీకాకుళంలోని మారుమూల ప్రాంతాల్లో, మత్స్యకార గ్రామాల్లో పని చేశారు. క్షేత్రప్రచారాధికారిగా జీకే ఉత్తర కోస్తాలో ఎంతో సేవచేశారు. ఆ తర్వాత ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా సేవలందించారు. తర్వాత విజయవాడ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అధిపతిగా అంకితభావంతో పనిచేసి అందరి మన్ననలు పొందారు. 

కరోనా సమయంలో ఆకాశవాణిలో ‘జింగిల్స్’ వంటి కొత్త ప్రయోగాలతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు.  12వేలకు పైగా జింగిల్స్ ప్రసారం చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. కరోనాపై శ్రోతలకు అవగాహన కల్పించడంలో కూడా కొండలరావు క‌ృషి అద్వితీయం.జింగిల్స్ విషయంలో కొండలరావు ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హిరిచందన్ కూడా కొండలరావును ప్రత్యేకంగా అభినందించారు. పలు విశ్వవిద్యాలయాల్లో  జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహించిన సెమినార్లలో ఆయన పరిశోధనా పత్రాలను సమర్పించారు. శ్రీకాకుళంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలోని జర్నలిజం విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యునిగా వ్యవహరిస్తున్నారు. ఆయన రాసిన పరిశోధనాత్మక వ్యాసాలు అనేకం జాతీయ, అంతర్జాతీయ స్థాయి జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. జీకే సేవలను గుర్తించిన తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా   ఏప్రిల్ 14న  విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళా క్షేత్రంలో ‘విశిష్టసేవారత్న’ పురస్కారంతో సత్కరించింది. 


ఈనాడులో రిపోర్టింగ్ విభాగంలో కొంతకాలం పనిచేసి, 1993లో యూపీఎస్సీ ద్వారా ఐఐఎస్‌కు  ఎంపికయ్యారు. బొంబాయిలోని పత్రికా సమాచార కార్యాలయంలో విధులలోకి చేరారు. ఆయన మొట్టమొదటి ఇంటర్వూ దివంగత మదర్ థెరిస్సాను చేశారు.  అంతర్జీతీయ చలన చిత్రోత్సవాల్లో కూడా పాల్గొన్నారు. కొండలరావు  జీకే అనే కలం పేరుతో వందల వ్యాసాలు రాశారు. బొంబాయి నుండి విజయవాడ, శ్రీకాకుళం, విజయనగరంలో పని చేశారు. విజయవాడలో ఆకాశవాణి వార్తా విభాగాధిపతిగా, అసిస్టెంట్  న్యూస్ డైరెక్టర్ గా 2017 నుంచి 2023 వరకు కీలకమైన బాధ్యతలను నిర్వహించారు. ప్రజల్లో కోవిడ్ అవగాహన నిమిత్తమై 8 నుండి 18 సెకండ్ల జింగిల్స్ ని స్వయంగా రూపొందించి , వాటిని వార్తల్లో చొప్పించి, జనానికి  అవగాహన కలిగేలాగా 12 వేల సార్లు ప్రసారం చేసిన రికార్డు ప్రపంచ బ్రాడ్ కాస్ట్ చరిత్రలోనే ఓ రికార్డ్ అయింది. జీకే సేవలను ఏపీ  గవర్నర్ అభినందించారు.   జే టిఎస్ డిప్యూటీ డైరెక్టర్ గా ప్రమోషన్ మీద  దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతిగా విధులు నిర్వహించి, ఇక్కడే ఆయన పదవీ విరమణ చేశారు.  యూట్యూబ్లో నిర్వహించిన లైవ్ ప్రోగ్రాం లో నాలుగు లక్షల మించిన వ్యూస్ తో జాతీయ రికార్డ్ ని కూడా తన ఖాతాలో వేసుకున్నారు.   అంతర్జాతీయ స్థాయి చిత్రకారులు పద్మశ్రీ ఎస్.వి.రామారావు, యూనివర్సిటీ గ్రాంట్ల సంఘం (యూజీసీ) చైర్మన్, డాక్టర్ మహమ్మద్ యూనస్ నోబుల్ లారియేట్,  యునైటెడ్ నేషన్స డైరెక్టర్ ఫన్ ఎన్విరాన్మెంట్ వంటి వారిని  ఇంటర్వ్యూ చేశారు.  జీకే "తెలుగు తేజం", ఆకాశవాణి రిక్రియేషన్ క్లబ్ నుండి "అవార్డు ఆఫ్ అప్రిసియేషన్" వంటి అవార్డులతోపాటు  విశిష్ట సేవారత్న బిరుదుని కూడా జీకే కైవసం చేసుకున్నారు.

                                                              - శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914





No comments:

Post a Comment

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...