జిల్లా
కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు
మార్చి లోపల అన్ని లక్ష్యాలను
పూర్తి చేయాలి

ఎన్టీఆర్ జలసిరి-2లో భాగంగా 35
వేల బోర్వెల్స్ తవ్వాలని లక్ష్యం కాగా, జిల్లాల వారీగా పూర్తి చేసిన బోర్ వెల్స్ వివరాలు ఆయా జిల్లా కలెక్టర్లు సీఎస్
కు తెలిపారు.
కృష్ణా జిల్లాలో 2500 బోర్లకు 389
మాత్రమే పూర్తి చేసినట్లు తెలుసుకొని పనులలో వేగం
పెంచాలని ఆదేశించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం జనవరి చివరికి 17,591 బోర్ వెల్స్ తవ్వించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మార్చి నాటికి మొత్తం లక్ష్యాన్ని పూర్తి చేయాలని చెప్పారు. వ్యర్థాల నుంచి ఇంధన
ఉత్పత్తికి సంబంధించి రాజమండ్రి, ఒంగోలు, కర్నూలు,
నెల్లూరు తదితర చోట్ల జిందాల్, ఎస్ ఎల్ గ్రూప్ ల ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నట్లు, కొన్ని పనులు 2018లో, మరి కొన్ని పనులు 2019లో పూర్తి అవుతాయని, ఏడు మున్సిపాలిటీలలో స్థల సమస్యలు
ఉన్నట్లు మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.కరికాల వలవన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ కు
తెలిపారు.
గిరిజన ప్రాంతాల్లో త్రాగునీరు, రోడ్ల
సౌకర్యాల సమీక్ష సందర్భంగా 1057
పనులు మంజూరైనట్లు, వాటిలో 286 పూర్తి చేసినట్లు, 701 పనులు జరుగుతున్నట్లు, 286 నివాస ప్రాంతాలకు
త్రాగునీరు అందజేస్తున్నట్లు గిరిజన సంక్షేమ
శాఖ ప్రిన్సిల్ సెక్రటరీ రామ్ ప్రకాష్ సిసోడియా వివరించారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పనులు జరుగుతున్న
తీరు పట్ల సీఎస్ సంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) 33 పనులకు రూ.5.62 కోట్లు, జాతీయ గ్రామీణ త్రాగునీటి కార్యక్రమం(ఎన్ఆర్డీడబ్ల్యూపి) కింద 325 పనులకు రూ.44.62 కోట్లు, ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక కింద సీఎం నిధుల
నుంచి 699 పనులకు రూ. 104.99 కోట్లు మంజూరైనట్లు వివరించారు. 2623 కిలోమీటర్ల రోడ్ల
నిర్మాణానికి రూ.808.46 కోట్లతో 1398 పనులు మంజూరైనట్లు, వాటిలో కొన్ని పనులు పూర్తి కాగా, మిగిలిన పనులు వివిధ దశలలో జరుగుతున్నట్లు
తెలిపారు. పాడేరు, రంపచోడవరం, పార్వతీపురం గిరిజన ప్రాంత
అభివృద్ధి సంస్థల ప్రాజెక్ట్ అధికారులతో కూడా సీఎస్ మాట్లాడి ఆయా ప్రాంతాల పనులను సమీక్షించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఇంజనీర్లతో సమావేశమై నిర్ణయించిన లక్ష్యాల మేరకు పనులు పూర్తి
చేయాలని చెప్పారు. పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల సమన్వయంతో పనులు
చేయించాలన్నారు. విశాఖ
నగరంతోపాటు జిల్లాలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని
ఆ జిల్లా కలెక్టర్ కు చెప్పారు. ప్లానింగ్
విభానికి సంబంధించిన పలు అంశాలను కూడా సమీక్షించారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్, వైద్యం, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం, మీ సేవా కేంద్రాలు, ఇమ్యునైజేషన్, విద్య తదితర అంశాలన్ని ప్రస్తావనకు వచ్చాయి. వివిధ జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ అధికారులు పలు సమస్యలను వివరించగా, వాటికి పరిష్కార మార్గాలను చెప్పారు. చివరిగా సీఎస్ మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధికి, గ్రీనరీకి, ఎన్టీఆర్ జలసిరి, గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రణాళికా విభాగానికి సంబంధించి డేటా విషయంలో
జాగ్రత్త వహించాలని చెప్పారు. జిల్లా
కలెక్టర్లకు, సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు సీఎస్ దినేష్ కుమార్ నూతన
సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డి, ప్రణాళిక శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి సంజయ్ గుప్తా, గృహ నిర్మాణ శాఖ ఎక్స్
అఫిషియో కార్యదర్శి కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్ శాఖ
కమిషనర్ బి.రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment