సచివాలయం,
జనవరి 1: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయం 1వ బ్లాక్ లోని తన ఛాంబర్ లో సోమవారం మధ్యాహ్నం పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా(పీఆర్ఎస్ఐ) అమరావతి ఛాప్టర్ ని ఆవిష్కరించారు.
ఛాప్టర్ ఫలకం, బ్రోచర్ తోపాటు, ఫ్లెక్సీపై సంతకం చేసి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను
జనబాహుళ్యంలోకి తీసుకువెళుతున్న రాష్ట్ర పౌరసంబంధాల అధికారుల(పీఆర్ఓల) పాత్రను కొనియాడారు. నూతన రాజధానిలో ఏర్పాటు చేస్తున్న పీఆర్ఎస్ఐ కొత్త
ఛాప్టర్ అందుకు కృషి చేయాలన్నారు. ఏపీ సోలార్ పవర్ కార్పోరేషన్ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్,
అమరావతి ఛాప్టర్ చైర్మన్ వీఎస్ఆర్ నాయుడు మాట్లాడుతూ
దేశంలో పీఆర్ఎస్ఐ ఛాప్టర్లు 25 ఉన్నాయని, ఇది 26వదని తెలిపారు. ఛాప్టర్ ఆవిష్కరించిన సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో పని చేసే పీఆర్ఓలు అందరూ ఛాప్టర్
లో సభ్యులుగా ఉంటారని తెలిపారు. అమరావతిలో ఛాప్టర్ కార్యాలయం ఏర్పాటుకు తమ పూర్తి
సహాయ సహకారాలు అందిస్తామని మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హామీ
ఇచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఛాప్టర్ సభ్యులు పీఎన్ భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు
ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...
-
నారా చంద్రబాబు : ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్ కొణిదెల పవన్ కల్యాణ్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి స...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
-
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ...
No comments:
Post a Comment