Dec 5, 2016

ఉత్తమ కథలలో ఒకటి

సాహిత్యం

     ఈనాడు ఆదివారం  అనుబంధం 2016 డిసెంబర్ 4వ తేదీ సంచికలో సునీత గంగవరపు గారు ‘మనసే... ఒక పూలతోట’ అనే కథ రాశారు. చాలా బాగుంది. ఈ ఏడాది ఉత్తమ కథలలో ఒకటిగా ఎంపిక చేయతగినది.  ఇందులో పూల పరిమళం - ప్రకృతి సౌందర్యం ఉంది. ఓ యువతి వ్యథ  - నెగ్గుకొచ్చిన ఓ మహిళ.... వెరసి ఓ జీవితం. ఇది చాలా మందికి చెందిన కథ. వాస్తవ ప్రపంచంలో ఇటువంటి నరకయాతన అనుభవించిన మహిళలు ఎందరో ఉన్నారు.  ఇందులో సావిత్రి పాత్ర చాలా ఉదాత్తంగా ఉంటుంది. ఈ వ్యవస్థలో కొందరు మగాళ్లకు అద్దంపట్టే పాత్ర రాంబాబుది.
          అనుమానంతో భార్య నుంచి వాస్తవాలు రాబట్టడానికి నాటకీయంగా వ్యవహరించే రాంబాబు లాంటి భర్తల వద్ద అమాయకంగా నిజాలు చెప్పి జీవితాలు నాశనం చేసుకున్న, చేసుకుంటున్న, నరకయాతన అనుభవించిన, అనుభవిస్తున్న మహిళలు ఈ సమాజంలో ఎందరో ఉన్నారు. మానసిక వేదన – సుదీర్ఘమైన ఆలోచనలు - నిద్రలేని రాత్రులు- కన్నీళ్లు – అవమాన భారం ...ఇదే వారి జీవితం. రాంబాబు లాంటి మగవాళ్లు సుఖంగా జీవించలేరు. భార్యాబిడ్డలను  సుఖంగా జీవించనివ్వరు.
 
       ఆత్మాభిమానం గల ఓ మహిళ తీసుకునే నిర్ణయమే ఇందులో సావిత్రి తీసుకుంది. జీవితాన్ని గౌరవంగా నెగ్గుకొచ్చింది. కథని చాలా చక్కగా ముగించారు.  పూలకు, పూల తోటకు సావిత్రికి ఉన్న సంబంధంలో ఎంతో స్వచ్ఛత ఉంది. ఆ బంధం అనిర్వచనీయమైంది.

ఈనాడు ఆదివారం అనుబంధంలో వచ్చిన కథ మీ కోసం 






No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...