Sep 10, 2018


నవంబర్ లో విశాఖలో టెక్-2018
                 కార్యక్రమ నిర్వహణను సమీక్షించిన  ఆదిత్యనాథ్ దాస్
 
                         సచివాలయం, సెప్టెంబర్ 10: నవంబర్ 14 నుంచి 17వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహించే టెక్(ట్రాన్స్ ఫార్మింగ్ ఎడ్యుకేషన్ ఫర్ హ్యూమానిటీ)-2018 నిర్వహణ గురించి సచివాలయం 4వ బ్లాక్ సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమాన్ని యునెస్కో-ఎంజీఐఇపీ (మహాత్మా గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ పీస్) సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో విశాఖ నోవాటెల్ హోటల్ లో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి ఎంపికైన పాఠశాలల, జూనియర్ కాలేజీల, డిగ్రీ కాలేజీల, యూనివర్సిటీల విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు హాజరవుతారు. 4 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో మూడు వర్క్ షాపులు, కేటలిటిక్ సెషన్స్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారు. 2017లో కూడా ఇటువంటి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవం, కీలక ఉపన్యాసం, ముగింపు ఉత్సవం, హాజరయ్యేవారికి వసతి సౌకర్యం, జాతీయ, అంతర్జాతీయ, స్థానిక మీడియా కవరేజ్, ముఖ్య అథితులకు ఏర్పాట్లు, సెక్యూరిటీ తదితర నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలను ఆదిత్యనాథ్ దాస్ సమీక్షించారు.  ఈ సమావేశంలో కాలేజీ ఎడ్యుకేషన్ స్పెషల్ కమిషనర్ సుజాత శర్మ, యునెస్కో-ఎంజీఐఇపీ సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎబల్ కేర్, యునెస్కో అధికారి సమితా రస్తోగి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అర్చనా చౌదరి తదితరులు పాల్గొన్నారు., అమరావతి.

No comments:

Post a Comment

గోలి మధు కలానికి పదును, స్పీడు, ఎరుపు ఎక్కువ!

‘ఎదురీత’ పుస్తక సమీక్ష ఎవరు  ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించి, ఇట్టే  అద్భుతమైన  కవిత్వం రాయగల దిట్ట  ప్రముఖ అభ్యుదయ కవి గోలి మధు. ఆయన కవిత...