విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి 16,437 టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు
పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
జనవరి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
సర్కారు స్కూళ్లను ప్రైవేటుకుదీటుగా తీర్చిదిద్దేందుకు మంత్రి లోకేష్ చర్యలు
అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్ది ఆంధ్రామోడల్ ఎడ్యుకేషన్ ను తె చ్చేందుకు రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అవిశ్రాంతంగా కృషిచేస్తున్నారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా చర్యలు ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సీ ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేయగా, వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి రిక్రూట్ మెంట్ పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టారు. మెగా డిఎస్సీలో ఎక్కువమంది నిరుద్యోగ టీచర్లకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)ను పారదర్శంగా నిర్వహించారు. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన టెట్ లో 1,87,256 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ప్రభుత్వం అనాలోచితంగా విడుదల చేసిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గొడ్డలిపోటులాంటి జిఓ 117ని రద్దుచేసి, కొత్త డ్రాఫ్ట్ మోడల్ ను సిద్ధం చేశారు. కొత్తపోస్టుల భర్తీ ప్రారంభమయ్యే లోగా విద్యాబోధనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 9,197 ఉపాధ్యాయ స్థానాలను సర్దుబాటు ద్వారా భర్తీచేశారు. ప్రభుత్వస్కూళ్లను రాజకీయాలకు అతీతంగా సిఎంతో సహా ఎటువంటి రాజకీయనేతల ఫోటోలు లేకుండా అకడమిక్ క్యాలెంటర్ రూపొందించారు. విద్యాశాఖకు సంబంధించిన వివిధ పథకాలకు రాజకీయలకు సంబంధం లేని స్ఫూర్తి ప్రదాతల పేర్లు పెట్టారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (SMC) ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడమేగాక దేశంలోనే తొలిసారిగా 44వేల ప్రభుత్వ పాఠశాలల్లో7 డిసెంబర్ 2024న మెగా పేరెంట్-టీచర్ మీటింగ్లు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో పండుగ వాతావరణంలో నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు సలహాలతో విద్యార్థుల్లో విద్యతోపాటు నైతిక విలువలను పెంపొందించేలా పాఠ్యాంశాలు రూపొందించేందుకు చర్యలు చేపట్టారు. రాబోయే అయిదేళ్లలో ఆంధ్రామోడల్ విద్యావ్యవస్థను తయారుచేసేందుకు గత ఆరునెలలుగా మంత్రి లోకేష్ చేస్తున్న ప్రణాళికాబద్ధమైన చర్యలు సత్ఫలితాలస్తున్నాయి.
పాఠ్యాంశాల్లో మార్పులకు చర్యలు
మారుతున్న కాలానికి అనుగుణంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ -2020, నిపుణ్ భారత్ కి అనుగుణంగా పాఠ్యపుస్తకాలు, పాఠ్య ప్రణాళికలో మార్పులకు కసరత్తు ప్రారంభించారు. విద్యాసంస్కరణల్లో యునిసెఫ్ తోపాటు ప్రథమ్, జె-పాల్, మది, లీడర్ షిప్ ఈక్విటి (ఎల్ఎఫ్ఇ) వంటి ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో భాగంగా ఉత్తమ బోధనా పద్ధతులకు శ్రీకారం చుట్టారు. బడిబయట ఉన్న 84,640 మంది విద్యార్థులకు నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ డ్రైటింగ్ సెంటర్లు (NRSTCలు), సీజనల్ హాస్టల్స్ ద్వారా మెయిన్ స్ట్రీమ్ లోకి తెచ్చారు. ప్రతి బిడ్డను సమర్థవంతంగా ట్రాక్ చేయడానికి ICDS, హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్, పాఠశాల విద్యా విభాగాల నుండి డేటాబేస్లను సమగ్రపరిచేందుకు చర్యలు చేపట్టారు. నమోదు చేసుకున్న విద్యార్థులలో 80% మందికి APAAR IDలు రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఐఐటీ మద్రాస్తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చకున్నారు. SCERTలో ఖాళీలను భర్తీ చేశారు. కెజిబివిల్లో 342 మంది బోధన, 991 మంది బోధనేతర సిబ్బందిని నియమించారు. కెరీర్ ప్లానింగ్, మానసిక ఎదుగుదల, సంఘర్షణల పరిష్కారంలో విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి 255 మంది కెరీర్, మానసిక ఆరోగ్య సలహాదారులను నియమించారు. విద్యార్థుల్లో డిజిటల్ సౌలభ్యాన్ని పెంపొందించడం, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు (CwSN) సమగ్ర క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలను పెంపొందించడంలో ఎపి ప్రభుత్వం చేసిన కృషిని కేంద్రం గుర్తించింది. వికలాంగుల హక్కుల చట్టం అమలులో ఉత్తమ రాష్ట్రంగా నిలిపినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సర్వశిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరక్టర్ బి.శ్రీనివాసరావు ఇటీవల డిల్లీలో జాతీయ అవార్డును అందుకున్నారు.
అకడమిక్, మౌలిక సదుపాయాలకు స్టార్ రేటింగ్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 44వేల పైచిలుకు పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం, ప్రతిభ ఆధారంగా అకడమిక్ స్టార్ రేటింగ్, తరగతి గదుల్లో మౌలిక వసతులు, టాయ్ లెట్లు, తాగునీటి సౌకర్యం వంటి 18 అంశాల ప్రాతిపదికన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఆయా పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న రేటింగ్ మెరుగుదలకు రూట్ మ్యాప్ నిర్దేశించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో టీచ్ టూల్ ఉపయోగించి ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాలను అంచనావేసి బోధనా పద్ధతుల మెరుగుదలకు చర్యలు చేపట్టారు. ప్రధానోపాధ్యాయుల స్వీయ-అవగాహన, స్వీయ-నిర్వహణ, కమ్యూనికేషన్, సమస్యల పరిష్కరంతో సహా కీలక నాయకత్వ సామర్థ్యాల్లో శిక్షణ ఇచ్చారు. విద్యార్థులకు పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం అందించేందుకు ఆయా ప్రాంతాల్లోని అభిరుచులకు తగ్గట్లుగా మెనూ మార్పు చేశారు. జనవరి నుంచి KGBV స్కూళ్లలో డైట్ ఛార్జీలను ₹1,400 నుండి ₹1,600కి పెంచేలా ఉత్తర్వులు జారీచేశారు. మెగా పేరెంట్-టీచర్ సమావేశాల సందర్భంగా, విద్యార్థుల పనితీరుతో పాటు పాఠ్యాంశాలు, పాఠ్యేతర కార్యకలాపాలలో వారు సాధించిన విజయాలను పొందుపరుస్తూ హోలిస్టిక్ రిపోర్ట్ కార్డ్లు తల్లిదండ్రులకు అందజేశారు.హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారిచే స్క్రీనింగ్ చేసిన విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్లను వివరించే హెల్త్ కార్డ్లను కూడా అందజేశారు.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం గత ఆరునెలల్లో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఆయా కళాశాలల పనివేళలను ఉదయం 9నుంచి సాయంత్రం 5వరకు పొడిగించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, KGBVలు, AP మోడల్ స్కూల్లు, AP రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, ఉన్నత పాఠశాల ప్లస్లను కవర్ చేస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 2 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, స్కూల్ బ్యాగ్లు ఉచితంగా అందజేశారు. RJDల పర్యవేక్షణలో జిల్లా, ప్రాంతీయ స్థాయిల్లో అకడమిక్ గైడెన్స్, మానిటరింగ్ సెల్లు ఏర్పాటుచేశారు. 11వ, 12వ తరగతి విద్యార్థుల ఇంటర్నల్ పరీక్షల కోసం కేంద్రీకృత ప్రశ్నపత్రాల తయారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. జనవరి, ఫిబ్రవరి 2025లో నిర్వహించే రెండు ప్రీ-ఫైనల్ పరీక్షలు కూడా ఇదే విధానంలో నిర్వహిస్తారు. వెనుకబడిన విద్యార్థుల ప్రాక్టీస్ కోసం విద్యార్థులందరికీ కొచ్చన్ బ్యాంకులను అందజేశారు. ఉత్తీర్ణత శాతం మెరుగుదలకు ప్రతి 10-15 మంది విద్యార్థులను టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్తో అనుసంధానం చేస్తూ అన్ని జూనియర్ కళాశాలల్లో మెంటర్షిప్ ప్రోగ్రామ్ అమలు చేస్తున్నారు. ఇంటర్మీడియట్ చదివే విద్యార్థుల కోసం రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జనవరి నుంచి మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని నిర్ణయించారు.
రాబోయే ఆరునెలలకు రూట్ మ్యాప్!
ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రమాణాలు మెరుగుపర్చేందుకు రాబోయే ఆరునెలల్లో చేపట్టాల్సిన చర్యలపై రూట్ మ్యాప్ రూపొందించారు. స్కూళ్లవారీగా ఆయా పాఠశాలల వాస్తవ స్థితిని తెలుసుకునేందుకు "ఒక పాఠశాల-ఒక యాప్" పేరుతో సమగ్ర డాష్బోర్డ్ సిద్ధమవుతోంది. రాష్ట్రస్థాయి సైన్స్ ఎక్సో పో, జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నేతృత్వంలో స్పోర్ట్స్/గేమ్స్ మీట్ నిర్వహించాలని నిర్ణయించారు. విద్యాసంవత్సరం చివరి పనిదినం రోజున మరోమారు మెగా PTM నిర్వహించి విద్యాప్రమాణాల మెరుగుదలకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించాలని నిర్ణయించారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాడే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద 1 నుండి 12 తరగతులకు కొత్త యూనిఫారాలు, బ్యాగ్లను అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠ్యపుస్తకాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు పోటీ పరీక్షల మెటీరియల్, మాన్యువల్, నోట్బుక్లు, రికార్డులను అందజేయాలని నిర్ణయించారు. స్టార్ రేటింగ్ను మెరుగుపరచడానికి పాఠశాల వారీగా ప్రణాళికలు రూపొందించారు. 2025-26 విద్యా సంవత్సరం నుండి 1 నుండి 12 తరగతుల పాఠ్యాంశాల్లో సమూల మార్పులు తేవాలని నిర్ణయించారు. IIT మద్రాస్తో కలిసి విద్యా శక్తి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేసేలా చర్యలు చేపట్టారు. పాఠశాల నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రధానోపాధ్యాయుల కోసం ఆన్లైన్ నాయకత్వ కోర్సులను నిర్వహించాలని నిర్ణయించారు. అకడమిక్ క్యాలెండర్ ను సమర్థవంతంగా అమలుచేయడంతోపాటు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుదల, ఫిజికల్, వర్చువల్ విద్యను ఏకీకృతం చేయడం ద్వారా మెరుగైన బోధన విధానాలను అమలు చేయాలని నిర్ణయించారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాల పెంపుదలకు ఫిజికల్ ఎడ్యుకేషన్ పై దృష్టి సారించారు. ఇందులో భాగంగా స్పోర్ట్స్ కిట్స్ అందజేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హైస్కూళ్ళలో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటుకు చేయాలని నిర్ణయించారు. ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ఇంటర్మీడియట్ బోర్డ్ సర్టిఫికేషన్తో పాటు నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ ( NSQF), నేషనల్ కౌన్సిల్ ఫర్ వెకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (NCVET ) సహకారంతో 11,12వ తరగతుల వృత్తి విద్యార్ధులకు డ్యుయల్ ధృవీకరణ పత్రాలను అందజేసేలా కసరత్తు చేస్తున్నారు. అన్ని ముఖ్యమైన అకడమిక్ అప్డేట్లు, సమాచారాన్ని అందజేసేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో WhatsApp గ్రూపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించి నూరుశాతం APAAR IDలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు గత ఆరునెలలుగా మంత్రి లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి.
No comments:
Post a Comment