Jun 23, 2024

శంకర నారాయణ డిక్షనరీ కథ

ఇంగ్లీషువాడు సప్తసముద్రాలు దాటి వచ్చేశాడు.

ముందు వ్యాపారం చేయడానికి... తరువాత అధికారం చెలాయించడానికి....

వాడి భాష మనకి రాదు...

వాడు "గాడ్ ఈజ్ గుడ్" అనేవాడు.

మనకి అది "గాడిదగుడ్డు" గా అర్థమైంది.

మనం "రాజమహేంద్రి" అన్నాం...

వాడికి "రాజమండ్రి"లా వినిపించింది.

మన మాట వాడికి అర్ధమయ్యేది కాదు... వాడి భాష మనకి బోధపడేది కాదు.

వ్యాపారం, పరిపాలన వాళ్ల అవసరం కనుక తెల్ల అధికారులు ఒక్కొక్కరూ తెలుగు పదాలను పట్టుకున్నారు. డిక్షనరీలు తయారు చేశారు. 1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ తయారుచేశాడు. 1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారుచేశాడు. మన మాటలు వాడికి అర్థమయ్యాయి. కానీ వాడి మాటలు మనకి అర్ధం కావాలి కదా. అవసరం వాడిది. అందుకే జాన్ కార్నిక్ మారిస్ అనే వాడు ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ తయారు చేశాడు. ఆ తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో డిక్షనరీ 1852 లో (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి సరిగ్గా అయిదేళ్ల ముందు) తయారు చేశాడు.

చాలా మంది తెల్ల అధికారులు దుబాషీలను పెట్టుకున్నారు. దుబాషీలంటే ద్విభాషీలు. అటుది ఇటు ఇటుది అటు వివరించి చెప్పగలవారు వీరు. కానీ అందరికీ అంత దృశ్యం ఉండేది కాదు. వీళ్లు ముక్కస్యముక్కానువాదం చేసేవారు.

గుడిమెట్ల బంగారయ్య అంటే .....  Temple steps golden father అని..

పత్తికొండ నాగప్ప అంటే  cotton mountain cobra father అని 

తోటకూర అంటే Garden to come  అనీ చిత్ర విచిత్రంగా అను"వధించే" వారు.

అలాంటి సమయంలో తెల్లోడి భాషను తెల్లోడి కన్నా తేటతెల్లంగా నేర్చుకుని, ధారాళంగా మాట్లాడేయడం అంటే మాటలు కాదు. ఇంకా ఇంగ్లండుకు పోయి ఉన్నత విద్య నేర్చుకోవడం వంటివి అలవాటు కాలేదు. అలాంటి రోజుల్లో తెల్లోడే తెల్లబోయేలా ఇంగ్లీషు మాట్లాడే వాడికి బోలెడంత డిమాండ్ ఉండేది.

అలాంటి వాడే మన పావులూరి శంకరనారాయణ శ్రేష్ఠి. సొంతూరు నెల్లూరు. కానీ మద్రాసులో స్థిరపడ్డారు. తండ్రి రామానుజం చెట్టి నుంచి ఇంగ్లీషు నేర్చుకున్నారు. తండ్రిలాగానే దుబాషీ అయ్యారు. తండ్రి గంజాంలో రస్సెల్ అనే తెల్లదొరకు దుబాషీగా పనిచేసేవాడు. ఈయన విజయనగరం మహారాజా, జయపురం మహారాజా, పిఠాపురం, కొచ్చి, నూజివీడు జమీందారీ కుటుంబాల పిల్లలకు ఇంగ్లీషు చదువులు చెప్పారు. ఆ తరువాత మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో లెక్కల మేస్టారుగా పనిచేశారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో పరీక్షాధికారిగా కూడా పనిచేశారు. అంటే తన జీవిత కాలంలో ఆయన తమిళనాడు రాజధాని మద్రాసు, ఒరిస్సాలోని గంజాం, జయపురం, మన రాష్ట్రంలోని విజయనగరం, పిఠాపురం, నూజివీడు, నెల్లూరు, కేరళలోని కొచ్చి లను సందర్శించాడన్న మాట. 

రాచబిడ్డలకు చదువులు చెబుతున్నప్పుడే ఆయన వారి సౌలభ్యం కోసం ఇంగ్లీషు పదాలు, వాటి తెలుగు అర్థాల జాబితాను తయారు చేశారు. తరువాత దాన్నే వ్యవస్థీకరించి తెలుగువాడు తయారు చేసిన తొలి ఇంగ్లీషు తెలుగు డిక్షనరీని తయారు చేశారు. అంతే కాదు ... ఆయన తమిళ - ఇంగ్లీషు, ఇంగ్లీషు - తమిళ డిక్షనరీలను కూడా తయారు చేశారు. 1900 ప్రాంతంలో తెలుగు - ఇంగ్లీషు డిక్షనరీ కూడా తయారు చేశారు. తన అవసరం కోసం ఇంగ్లీషు వాడు తయారు చేసినవి కాకుండా మన అవసరం కోసం మనవాడు తయారుచేసిన మొట్టమొదటి డిక్షనరీలు ఇవేనేమో!

ఆయన తయారుచేసిన తెలుగు డిక్షనరీ 1897లో ప్రచురితమైంది. దాని పేరే శంకరనారాయణ డిక్షనరీ. అప్పటి నుంచీ ఇంగ్లీషు నేర్చుకోవాలనుకున్న వారందరికీ శంకరనారాయణ డిక్షనరీయే ఆధారమైంది. అందరికీ ఆధునిక వేదమైంది. ఆయన బతికుండగానే అయిదు ముద్రణలకు నోచుకుంది. ప్రతి ముద్రణకీ కొత్త పదాలు జోడయ్యాయి. ఆయన 1924-25 ప్రాంతంలో చనిపోయారు. ఆ తరువాత 1927 లో గిడుగు సీతాపతి గారు, 1951 లో చిలుకూరి నారాయణ రావు గారు, తరువాత వేదం లక్ష్మీనారాయణ గారు కొత్తకొత్త పదాలను జోడించారు. 1953 లో నారాయణ అయ్యర్ దీనిని పరిష్కరించారు. ఇలా 1897 నుంచి 1953 వరకూ పదకొండు సార్లు పునర్ముద్రణ పొందింది ఈ డిక్షనరీ. కోస్తా జిల్లాల్లో ఇప్పటికీ ఈ డిక్షనరీయే ప్రామాణికం. తరతరాల విద్యార్థులకు ఇది హస్త భూషణంగా నిలిచింది. అనుమానం వస్తే చాలు ఆ పుస్తకం తీస్తారు. అంత ప్రజాదరణ ఉంది ఈ డిక్షనరీకి. 2004 అక్టోబర్లో విజయవాడకు చెందిన విక్టరీ పబ్లిషర్స్ దీన్ని మళ్లీ ముద్రించారు. ఆగస్టు 2005 నాటికి మలి ముద్రణ అవసరమైంది. మళ్లీ 2006, 2007లలో పునర్ముద్రించాల్సి వచ్చింది. ఈ నిఘంటువు ప్రజాదరణకు ఇదే నిదర్శనం.

కోస్తా, తమిళనాడుల్లో ఆంగ్ల భాష నేర్చుకోవడంలో ఆయన పాత్ర అనన్యసామాన్యం. ఆయన పేరుతోనే ఆయన వ్రాసిన డిక్షనరీ పేరొందింది. ఇప్పటికీ శంకరనారాయణ డిక్షనరీ అంటే ప్రామాణికమే.  పావులూరి శంకరనారాయణ శ్రేష్ఠి ఇప్పుడు లేరు. ఆయన పోయి దాదాపు తొంభై ఏళ్లు దాటింది. కానీ లక్షలాది మంది విద్యార్థులు ఆంగ్ల పదం విషయంలో అనుమానం రాగానే శంకరనారాయణ డిక్షనరీ చూస్తారు. 

Jun 20, 2024

తెనాలి గురించి : కొడవటిగంటి కుటుంబరావు

 83  సంవత్సరాల  క్రితం  " తెనాలి " పట్టణం గురించి ఆంధ్రపత్రిక లో ప్రచురితమైన వ్యాసం .

1.

గుంటూరు వారున్నారు,

చేబ్రోలు వారున్నారు,

ఒంగోలు వారున్నారు,

తెనాలివారు లేరు.

నేనెరిగినంత మట్టుకు లేరు. రామలింగడు తప్ప.


రామలింగడివల్ల

తెనాలికి ప్రసిద్ధి వచ్చిందా,

తెనాలి వల్ల రామలింగడు ప్రసిద్ధికి వచ్చాడా ?


చెట్టు ముందా, 

విత్తు ముందా వంటి ప్రశ్న ఇది

ఆ విషయం ఎవరూ తేల్చలేరు.


2. 

రెండు సికింద్రాబాదులూ,

రెండు హైదరాబాదులూ,

రెండు అన్నవరాలు,

రెండు పూండ్లలూ 

-ఒకటే తెనాలి.

'ప్రపంచమంతటికీ!'


అందుకనే

రామలింగడా పేరు 

ఇంటి పేరు చేసుకున్నాడేమో.


3.

రామలింగడి కాలం వదిలి

వర్తమానానికి వస్తే 

తెనాలి చాలా విషయాలకు ప్రసిద్ధి కెక్కింది.


బియ్యానికి, 

కాఫీ హొటెళ్ళకూ,

పత్రికల అమ్మకానికీ

దోమలకూ,

వానాకాలం బురద రోడ్లకు,

వగైరాలకు.


4.

తెనాలి బియ్యం లండన్లో కూడా చెప్పుకుంటారు అని నేను నమ్మకంగా విన్నాను.

తెనాలి కాఫీ హొటెళ్ళు జగత్ప్రఖ్యాతి గలవి.

తెనాలి చుట్టు పట్ల వారంతా

ఒక్కొక్కప్పుడు 20 మైళ్ళనించి కూడా 

-ఉదయం పూట రైళ్ళ మీదా,

 జట్కా బళ్ళ మీదా,

నడిచి తెనాలి చేరుకుంటారు.

తెనాలిలో చెప్పుకోదగ్గ అయ్యరు హొటలు లేదు.

కాఫీ ఇవ్వడం అయ్యర్లకే చేతనవుననే అనుమానం ఎవరికైనా ఉంటే

తెనాలి పోయి కాఫీ తాగి చూడండి.

మా తెనాలి వాళ్ళు

నలుగురువచ్చి 

మద్రాసులో కాఫీ హొటళ్ళు ప్రారంభిస్తే 

అరవాళ్ళు 

పంజాలు తెంచుకొని 

పట్నం వదిలి పారిపోతారు.


5. 

తెనాలి వాళ్ళు 

పత్రికలు చదవడంలో కూడా ప్రధములు

ఆంధ్రదేశం మొత్తం మీద అమ్ముడుపోయే పత్రికల సంఖ్యలో 

ఏ పదో వంతో తెనాలిలో అమ్ముడుపోతుంది.

అది రామలింగడి ఆశీర్వాదం కావచ్చు,

సాహితీ సమితి పుట్టిన ప్రభావం కావచ్చు.


6. 

తెనాలి దోమలు 

దాదాపు విశాఖపట్నం దోమలంత ఉంటై. 


ఒక దోమలషో పెట్టి 

(బేబీ షో పెట్టినట్టు) 

అందులో విశాఖపట్నం దోమనీ

తెనాలి దోమనీ తూకం వేస్తే

విశాఖపట్నం దోమకి

డిపాజిట్ కూడా నమ్మకం లేదు


7. 

వేసవి కాలమంటే జ్ఞాపకం వచ్చింది ,

వేసవి కాలంలో మా ఊరు బెజవాడ వారికీ ,

గుంటూరు వారికి సిమ్లా  లాంటిది.


8. 

తెనాలి నాటకాలకి, 

నటులకీ ప్రసిద్ధి కెక్కింది.

మొదటి నాట్య కళా పరిషత్తు తెనాలిలో జరిగింది.

మిగిలిన ఆంధ్రదేశమంతా కలిసి ఎంతమంది పెద్దా చిన్నా నటులున్నారో తెనాల్లో అంతమంది ఉన్నారు.

అసలు ప్రతీ తెనాలివాడూ వేషధారే.


అంత దాకా ఎందుకు 

తెనాలి నటుడు లేని టాకీ ఉందీ? 


9. 

నాట్యకళ 

మా తెనాలి వారి కంత బాగా తెలుసు కనకనే

మా తెనాల్లో పై ఊళ్ళవాళ్లు పరాభవం పొందారు.

పైనుంచి వచ్చి తెనాలి వారిని మెప్పించి పోయినవాడు గట్టిగా లెక్కిస్తే ఒక్క బళ్ళారి రాఘవాచారి గారే.


10. 

తెనాలిలో అనిర్వచనీయమైన ఆకర్షణ ఉంది.

అది తెనాలి వాళ్ళ కన్నా

పై వాళ్ళకు తెలుస్తుంది.

తెనాలి నుండి బదిలీ అయిపోయి పోవలసి వస్తే ఉద్యోగానికి నీళ్ళొదలిన వాళ్లున్నారు.


ఏ పని మీదో వచ్చి 

తెనాలిలో వేళ్ళతో సహా పాతుకు పోయిన వాళ్ళున్నారు.

ఇంకే పనీ లేక తెనాలిలో ఉండటమే

జీవితాశయంగా పెట్టుకున్న వాళ్లు కూడా ఉన్నారు.


ఇందులో 

అతిశయోక్తి ఏమీ లేదు.

ఏ బస్తీలో కన్నా తెనాల్లో నిరుద్యోగులు అధికంగా ఉండటానికి కారణం ఈ ఆకర్షణే.

తెనాలి గురించి " వెధవ తెనాలి " అంటుంటే నమ్మకండి.

గవర్నరు గిరి వచ్చినా చేయడానికి

తెనాలి వాడు 

తెనాలి వదలడు.


11. 

మరి కొన్ని బస్తీల మాదిరిగా

తెనాలి అట్టే గొప్పవారిని చెప్పుకోక పోవడానికి కారణం..


బుద్ధిమంతుడు సులభంగా ఊహించవచ్చు.


మా తెనాలి వాళ్ళం 

ఇతర ఊళ్ళ మాదిరిగా 

ఒక వ్యక్తిని ఆరాధించి పైకెత్తం.


మా చవిలి నాగేశ్వర రావుకీ

మా గోవిందురాజు సుబ్బారావుగారికి

మా స్థానం వారికి,

మా మాధవపెద్దికి,

ఇతరులు బ్రహ్మరధం పట్టొచ్చు గాక

మేం పట్టం.


మాకు వాళ్ళు 

మామూలు మనుష్యులే.


వారిని ఆరాధిస్తూ కూర్చుంటే

ప్రపంచం ఆరాధించే మనుష్యుల్ని మేమెట్లా సృష్టించగలుగుతాం ?


మనుష్యుల్ని తయారు చేసి లోకం మీద వదలటం మాత్రమే మా వంతు.

మాస్టర్ అంజిని,

బసవలింగాన్ని,

పిల్లమర్రి సుందర రామయ్యనూ

మేమే తయారు చేసాం.


భీమవరపు నరసింహరావునూ, 

ప్రభల సత్యన్నారాయణనూ,

మేమే తయారు చేసాం.


ములుగు శివానందం గారు 

మా వాడు.

మా గొప్ప వాళ్ళెవరూ

మా ఊళ్ళో ఉండరు.

దేశాలు పట్టి పోతారు.

కాంచనమాలది మా ఊరే

ఆవిడా అంతే. 


మూడు కాలువలు నడుమ నడిచేదే తెనాలి

ఇలా ప్యారీస్ లోనూ

తెనాలి లోనే ఉంటుంది


అందుకే

తెనాలిని

ఆంధ్రా ప్యారీస్ అంటారు 


ఆంధ్రపత్రిక

12-2-1941

(కొకు వ్యాస ప్రపంచం నుంచి )

Jun 18, 2024

ఏపీ సెక్రటేరియట్‌లో మంత్రుల ఛాంబర్లు

ఏపీ సెక్రటేరియట్‌లో ఎవరికి ఏ ఛాంబర్ ?

అమరావతి:  ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా కొణిదెల పవన్ కల్యాణ్ తోపాటు ఇతర మంత్రులకు జీఏడీ (జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్) ఛాంబర్లు కేటాయించింది.

బ్లాక్-01 : సీఎం నారా చంద్రబాబు


బ్లాక్-02 : ఏడుగురు మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

మంత్రి నాదెండ్ల మనోహర్

పొంగూరి నారాయణ

కందుల దుర్గేష్

వంగలపూడి అనిత

పయ్యావుల కేశవ్

ఆనం రామనారాయణ రెడ్డి


బ్లాక్-03 : ఐదుగురు మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు

గొట్టిపాటి రవికుమార్

కొల్లు రవీంద్ర

గుమ్మిడి సంధ్యారాణి

డోలా బాల వీరాంజనేయుల స్వామి

ఎన్ఎండీ ఫరూక్


బ్లాక్-04 : ఎనిమిది మంది మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు

నారా లోకేష్

అనగాని సత్యప్రసాద్

కింజరపు అచ్చెన్నాయుడు

ఎస్. సవిత

టీజీ భరత్

మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

కొలుసు పార్థసారథి

నిమ్మల రామానాయుడు


బ్లాక్-05 : ఐదుగురు మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు

బీసీ జనార్జన్ రెడ్డి

కొండపల్లి శ్రీనివాస్

వాసంశెట్టి

సత్యకుమార్‌

Jun 14, 2024

ఏపీ మంత్రుల శాఖలు

 

  • నారా చంద్రబాబు : ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్

  • కొణిదెల పవన్ కల్యాణ్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,  గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం, అటవీ, పర్యావరణం, సైన్స్‌ అండ్ టెక్నాలజీ శాఖలు

  • నారా లోకేష్‌ : మానవ వనరులు అభివృద్ధి, విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్ శాఖలు

  • కింజరాపు అచ్చెన్నాయుడు : వ్యవసాయశాఖ

  • నాదెండ్ల మనోహర్‌ : ఆహారం, పౌరసరఫరాల శాఖ

  • వంగలపూడి అనిత : హోం మంత్రిత్వ శాఖ

  • పొంగూరు నారాయణ : పురపాలకశాఖ, పట్టణాభివృద్ధి

  •  కొల్లు రవీంద్ర : గనులు, ఎక్సైజ్ శాఖ 

  • సత్యకుమార్‌ యాదవ్‌ : ఆరోగ్యశాఖ

  • నిమ్మల రామానాయుడు : నీటిపారుదల శాఖ

  • మహ్మద్‌ ఫరూఖ్‌ : న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమం

  • ఆనం రామనారాయణరెడ్డి : దేవాదాయ శాఖ

  • పయ్యావుల కేశవ్‌ : ఆర్థిక శాఖ

  • అనగాని సత్యప్రసాద్‌ : రెవెన్యూ శాఖ

  • కొలుసు పార్థసారథి: హౌసింగ్‌, I &PR శాఖలు

  • డోలా బాలవీరాంజనేయస్వామి: సాంఘిక సంక్షేమ శాఖ

  • గొట్టిపాటి రవికుమార్‌ : విద్యుత్‌ శాఖ

  • కందుల దుర్గేష్‌ : పర్యాటకం, సాంస్కృతిక శాఖలు, సినిమాటోగ్రఫీ

  • గుమ్మడి సంధ్యారాణి : స్త్రీ, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖలు

  • బీసీ జనార్థన్‌ : రహదారులు, భవనాల శాఖలు

  • టీజీ భరత్‌: పరిశ్రమల శాఖ

  • ఎస్‌.సవిత : బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ శాఖలు

  • వాసంశెట్టి సుభాష్‌ : కార్మిక, ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌

  • కొండపల్లి శ్రీనివాస్‌ : సూక్ష, చిన్నతరహా,మధ్యతరహా(MSME),   గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(SERP), NRI ఎంపర్‌పమెంట్‌ శాఖలు

  • మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి: రవాణా, యువజన, క్రీడా శాఖలు

Jun 12, 2024

ఏపీ మంత్రి మండలి - 2024

 ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రి మండలి సభ్యులు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. 


ఏపీ మంత్రి మండలి

1. నారా చంద్రబాబు నాయుడు 

2. కొణిదెల పవన్ కళ్యాణ్ -  జనసేన - పిఠాపురం

3.  కింజరాపు అచ్చెన్నాయుడు  

4.  కొల్లు రవీంద్ర 

5. నాదెండ్ల మనోహర్ - జనసేన - తెనాలి

6.  పి.నారాయణ 

7. వంగలపూడి అనిత 

8.  సత్యకుమార్ యాదవ్ 

9. నిమ్మల రామానాయుడు

10.  ఎన్.ఎమ్.డి.ఫరూక్ 

11.  ఆనం రామనారాయణరెడ్డి 

12.  పయ్యావుల కేశవ్ 

13.  అనగాని సత్యప్రసాద్ గా

14.  కొలుసు పార్థసారధి 

15.  డోలా బాలవీరాంజనేయస్వామి 

16.  గొట్టిపాటి రవి 

17.   కందుల దుర్గేష్ 

18.  గుమ్మడి సంధ్యారాణి 

19. బీసీ జనార్థన్ రెడ్డి 

20. టీజీ భరత్ 

21. ఎస్.సవిత 

22. శ్రీవాసంశెట్టి సుభాష్ 

23.  కొండపల్లి శ్రీనివాస్ 

24.  మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి

25. నారా లోకేష్ 

Jun 5, 2024

చేనేతకు అండగా గుత్తికొండ ధనుంజయ

టీడీపీ పుట్టినప్పటి నుంచి అంటిపెట్టుకుని ఉన్న ధనుంజయ

కళా,సాహితీ రంగాలకు కూడా విస్తరించిన గుత్తికొండ సేవలు

పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించిన కృషీవలుడు ధనుంజయ

మంగళగిరిలో లోకేష్  గెలుపు కోసం గుత్తికొండ విశేష కృషి 

చేనేత రంగంలో కార్మికవర్గ నేతగా గుత్తికొండ ధనుంజయ రావు అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఆయన రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీ పుట్టుకతోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ధనుంజయ టీడీపీని వదలలేదు. అదే ఆయన ప్రత్యేక. ఎన్టీఆర్ గారిపై అపార అభిమానం అతనిని పార్టీవైపు మళ్లించింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారంటే  ఆపార గౌరవం. ఆయన విధానాలకు బాగా ఆకర్షితులయ్యారు. ఆయన బీసీలకు ఇచ్చే ప్రాధాన్యతకు ధనుంజయ ఆకర్షితులయ్యారు. చంద్రబాబు గారి పరిపాలనాదక్షతకు ముగ్ధులయ్యారు. చంద్రబాబు గారి నాయకత్వంలో చేనేతల సంక్షేమం కోసం కృషి చేస్తూ , బీసీలలో, చేనేత వర్గాల్లో మంచి గుర్తింపుని, గౌరవాన్ని పొందుతున్నారు. పదవుల కోసం ప్రాకులాడే మనిషి కాదు. టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్నారు. అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా చేనేత సమస్యలపై పోరాడటం ఆయన నైజం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేనేత కార్మికులకు పథకాలు రావడానికి కృషి చేశారు. 

14 సంవత్సరాల వయసులో చేనేత మగ్గం నేస్తూ.. అప్పుడే పుట్టిన తెలుగుదేశం పార్టీలో చిన్న వయసు అయినప్పటికీ సభ్యత్వం రెండు రూపాయలు కట్టి తీసుకున్నారు.  ఎన్టీఆర్ మీద అభిమానంతో ఆయన ఎక్కడ సభలు పెట్టినా అక్కడికి వెళ్లేవారు. మొట్టమొదటిసారిగా మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా 1983లో, 1985లో పోటీ చేసిన డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారికి, 1989లో ఎలయన్స్ లో సిపిఎం అభ్యర్థి సింహాద్రి శివారెడ్డికి, 1994 సిపిఎం అభ్యర్థి నిమ్మగడ్డ రామ్మోహన్ రావు, 1999లో బిజెపి అభ్యర్థి ఎడ్లపాటి రఘునాథ బాబుకి, 2004లో బిజెపి అభ్యర్థి తమ్మిశెట్టి జానకి దేవికి, 2009లో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన మాదల రాజేంద్ర గారికి, 2014లో గంజి చిరంజీవికి, 2019లొ నారా లోకేష్ గారికి ఎన్నికల్లోమద్దతుగా పనిచేశారు. ఇప్పుడు2024 లో కూడ నారా లోకేష్ గారికి అంకితభావంతో పనిచేశారు. 1988లో పట్టణ తెలుగు నాడు చేనేత కార్మిక సంఘం ఉపాధ్యక్షులుగా, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులుగా 1994 వరకు పనిచేశారు. 1995 నుండి పట్టణ తెలుగు నాడు చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శిగా నిరంతరం శ్రమిస్తున్నారు. 2006లో అప్పుడే కొత్తగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర చేనేత విభాగం ఏర్పాటు చేయగా, రాష్ట్ర కార్యవర్గంలో చేనేత విభాగం రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా 2019 వరకు కొనసాగారు. 2022 నుండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. బీసీలను కూడగట్టడంలో విశేష కృషి చేశారు. బీసీలను పార్టీవైపు మళ్లించడానికి నిరంతరం శ్రమించి బీసీ నేతగా ఎదిగారు. 

2006లో మాదాల రాజేంద్ర గారు మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేస్తున్న టైంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న చేనేత ఆరోగ్య బీమా కార్డులు చేనేత కార్మికులకు ఇప్పించటంలో ధనుంజయ కృషి ఎంతో ఉంది.  బీమా కోసం కార్మికులు చెల్లించాల్సిన సొమ్ము మొత్తాన్ని రాజేంద్ర గారు చెల్లించారు.  దాదాపు 3,000 మంది చేనేత కుటుంబాలకు కార్డులు వరుసగా మూడు సంవత్సరాలు అందజేసి, వారికి అండగా నిలిచారు.  ఆ విధంగా  తెలుగుదేశం పార్టీ చేనేత విభాగం తరఫున గుత్తికొండ ధనంజయరావు విశేష కృషి చేశారు. ఇది పార్టీకి ఎంతో మేలు చేకూర్చింది. ఇప్పటికీ చేనేత కుటుంబాల్లో మళ్లీ ఆరోగ్య భీమా కార్డులు కావాలని అడుగుతూ ఉంటారు.

అంతేకాకుండా ఒక పక్క పార్టీ కార్యక్రమాల్లో నిరంతరం పనిచేస్తూ, సామాజిక కార్యక్రమాల్లో పద్మశాలి సంఘాల్లో పనిచేస్తూ చేనేత కార్మికులకు అన్ని రకాలుగా అండగా ఉన్నారు. చేనేత ఉద్యమాల్లో ముఖ్యంగా మంగళగిరి చేనేత కార్మికుల వేతనాలు పెంచే విషయంలో చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీతో కలిసి పోరాటం చేయటంలో ముందుంటారు. 2004లో అధికారం కోల్పోయిన తర్వాత ఏర్పడిన నిమ్మల కృష్ణప్ప నేతృత్వం లోని రాష్ట్ర చేనేత విభాగం కమిటీలు ముఖ్య పాత్ర పోషించాయి.  రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటన చేసి చేనేత సమస్యలపై చంద్రబాబుకు ఒక నివేది అందించారు. అప్పట్లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో చేనేత కార్మికులకు ఇస్తున్న రాయితీలు అక్కడున్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేయడం కోసం చంద్రబాబు గారు, నిమ్మల కిష్టప్ప నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీలో కూడా గుత్తికొండ ధనుంజయరావు ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో పర్యటించిన కమిటీ నివేదిక ఆధారంగానే 2014లో ఏర్పడిన చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం వాటిలో కొన్ని సంక్షేమ పథకాలను, రాయితీలను చేనేత కార్మికులకు  అందించింది.

 చేనేత కులాల్లో, ముఖ్యంగా పద్మశాలీ కులంలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది.  అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. దీనికి ముందు అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం జాతీయ ఉపాధ్యక్షులుగా పనిచేశారు. తిరుపతి తిరుచానూరు అఖిలభారత పద్మశాలి అన్న సత్ర కమిటీ సభ్యులుగా పని చేశారు. పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ సభ్యులుగా, మంగళగిరి బ్రాంచ్ ప్రధాన కార్యదర్శిగా, మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం ఉపాధ్యక్షులుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు.

పార్టీ, చేనేత రంగంలోనే కాకుండా కళారంగంతో కూడా ఆయనకు అనుబంధం ఉంది. ఆ రంగంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల కాలంలో మంగళగిరి ప్రాంతంలో సాహితీ కళా రంగాలకు ప్రాధాన్యత కొరబడింది. కళాభిమానులు, సాహితీ అభిమానులు, పెద్దలు మళ్లీ కళాసాహితీ రంగాలకు ప్రాణం పోయాలని తీర్మానం చేసి, గుత్తికొండ ధనుంజయరావుని  మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గా ఎన్నుకున్నారు. మూడు సంవత్సరాల క్రితం మంగళగిరి సాహితీ కళా వేదిక ఆవిర్భవించింది. దానికి కన్వీనర్ గా గుత్తికొండ ధనంజయరావు  కొనసాగుతున్నారు. ఈ మూడు సంవత్సరాల కాలంలో సాహితీ కళా రంగాల వైభవాన్ని తీసుకురావటంలో ముందున్నారు.

1987 నుంచి 1991 వరకు మంగళగిరి రత్నాల చెరువు ప్రాంతంలో కూలి పనులకు వెళ్లే 14 సంవత్సరాలలోపు పిల్లలకు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వ పథకమైన "అనియత విద్య" ద్వారా ధనుంజయరావు ఎంతోమంది పిల్లలకు విద్యను అందించారు. తరువాత శ్రామిక నగర్లో ఒక అరుణోదయ పబ్లిక్ స్కూల్ స్థాపించి వందలాది మంది పిల్లలకు విద్యాబోధన చేశారు. 2000 సంవత్సరంలో స్థాపించిన అభయ సేవా సమితి ఉపాధ్యక్షులుగా అనేక ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటుకు కృషి చేశారు. 

ప్రస్తుతం వివిధ హోదాలలో  గుత్తికొండ ధనుంజయరావు అటు పార్టీకి, ఇటు చేనేత, కుల, కళా, సాహితీ సంఘాల తరఫున ప్రజా సేవను కొనసాగిస్తున్నారు. 


గుత్తికొండ ధనుంజయరావు నిర్వహించిన, నిర్వహించే పదవులు: 

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టిడిపి బీసీ సెల్. 

జాతీయ కార్యదర్శి, అఖిల భారత పద్మశాలి సంఘం. 

కేంద్ర కమిటీ సభ్యులు,  పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్. 

ప్రధాన కార్యదర్శి, పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ మంగళగిరి బ్రాంచ్. 

ఉపాధ్యక్షులు, మంగళగిరి పట్టణ పద్మశాలియ బహుత్తమ సంఘం. 

కన్వీనర్, మంగళగిరి సాహితీ కళావేదిక

మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్

Jun 4, 2024

ఆంధ్రప్రదేశ్- 2024 ఎమ్మెల్యేలు

2024 ఎన్నికల్లో ఏపీ శాసనసభకు వైసీపీ  175 ఎమ్మెల్యే,  25 ఎంపీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసింది.  టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమిలో  టీడీపీ 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ, బీజేపీ 10 ఎమ్మెల్యే, 6 ఎంపీ,  జనసేన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లలో పోటీ చేశాయి.

గెలిచిన స్థానాలు

టీడీపీ - 135

జనసేన -  21

బీజేపీ    -   8


వైసీపీ -  11

మొత్తం   -   175

1. శ్రీకాకుళం

ఆమదాలవలస - కూన రవి కుమార్ (టీడీపీ)

ఎచ్చెర్ల - ఈశ్వరరావు.ఎన్ -(బీజేపీ)

ఇచ్ఛాపురం - బెందాలం అశోక్ (టీడీపీ)

నరసన్నపేట - బగ్గు రమణమూర్తి (టీడీపీ)

పాలకొండ - జయకృష్ణ నిమ్మక (జనసేన)

పలాస - గౌతు శిరీష (టీడీపీ)

పాతపట్నం- మామిడి గోవిందరావు -(టీడీపీ)

రాజాం - కొండ్రు మురళి మోహన్ (టీడీపీ)

శ్రీకాకుళం - గొండు శంకర్ (టీడీపీ)

టెక్కలి - కింజారపు అచ్చెన్నాయుడు (టీడీపీ)


2. విజయనగరం

బొబ్బిలి - ఆర్.వీ.ఎస్.కే.కే. రంగా రావు@ బేబీ నాయన(టీడీపీ)

చీపురుపల్లి - కిమిడి కళావెంకట రావు (టీడీపీ)

గజపతినగరం - కొండపల్లి శ్రీనివాస్ (టీడీపీ)

కురుపాం - తోయక జగదీశ్వరి (టీడీపీ)

నెల్లిమర్ల - లోకం నాగ మాధవి(జనసేన పార్టీ)

పార్వతీపురం - బోనెల విజయ్ చంద్ర (టీడీపీ)

సాలూరు- గుమ్మిడి సంధ్యారాణి (టీడీపీ)

శృంగవరపుకోట - కోళ్ల లలిత కుమారి(టీడీపీ)

విజయనగరం - అదితి విజయలక్ష్మి గజపతి రాజు పూసపాటి(టీడీపీ)


3. విశాఖపట్నం

అనకాపల్లి- కొణతాల రామకృష్ణ (జనసేన)

అరకు- రేగం మత్యలింగం-(వైసీపీ)

భీమిలి- గంటా శ్రీనివాసరావు(టీడీపీ)

చోడవరం - కేఎస్ఎన్ఎస్ రాజు (టీడీపీ)

గాజువాక- పల్లా శ్రీనివాసరావు (టీడీపీ)

మాడుగుల- బండారు సత్యనారాయణ మూర్తి (టీడీపీ)

నర్సీపట్నం- అయ్యన్నపాత్రుడు చింతకాయల (టీడీపీ)

పాడేరు- మత్స్యరాస విశ్వేశ్వరరాజు -(వైసీపీ)

పాయకరావుపేట - వంగలపూడి అనిత (టీడీపీ)

పెందుర్తి- పంచకర్ల రమేశ్ బాబు (జనసేన)

విశాఖపట్నం తూర్పు - రామకృష్ణ బాబు వెలగపూడి (టీడీపీ)

విశాఖపట్నం ఉత్తరం - విష్ణు కుమార్ రాజు (బీజేపీ)

విశాఖట్నం దక్షిణ- సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ (జనసేన)

విశాఖపట్నం పశ్చిమ - గణబాబు (టీడీపీ)

యలమంచిలి- సుందరపు విజయకుమార్ (జనసేన)


4. తూర్పు గోదావరి

అమలాపురం - అయితాబత్తుల ఆనందరావు (టీడీపీ)

అనపర్తి - నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (బీజేపీ)

జగ్గంపేట - జ్యోతుల నెహ్రూ (టీడీపీ)

కాకినాడ సిటీ - వనమాడి వెంకటేశ్వరరావు (టీడీపీ)

కాకినాడ రూరల్ - పంతం నానాజీ (జనసేన)

కొత్తపేట - బండారు సత్యానందరావు(టీడీపీ)

మండపేట - జోగేశ్వర రావు (టీడీపీ)

ముమ్మిడివరం - దాట్ల సుబ్బరాజు (టీడీపీ)

పి.గన్నవరం - గిడ్డి సత్యనారాయణ (జనసేన)

పెద్దాపురం - చిన్న రాజప్ప నిమ్మకాయల (టీడీపీ)

పిఠాపురం - పవన్ కల్యాణ్ (జనసేన)

ప్రత్తిపాడు - వరుపుల సత్యప్రభ (టీడీపీ)

రాజమండ్రి సిటీ - ఆదిరెడ్డి శ్రీనివాస్

రాజమండ్రి రూరల్ - గోరంట్ల బుచ్చయ్య చౌదరి (టీడీపీ)

రాజానగరం - బత్తుల బలరామకృష్ణ (జనసేన)

రామచంద్రాపురం - వాసంశెట్టి సుభాష్ (టీడీపీ)

రంపచోడవరం - మిరియాల శిరీశ దేవి (టీడీపీ)

రాజోలు - దేవ వరప్రసాద్ (జనసేన)

తుని - దివ్య యనమాల (టీడీపీ)


5. పశ్చిమ గోదావరి

ఆచంట - పితాని సత్యనారాయణ (టీడీపీ)

భీమవరం - పులవర్తి ఆంజనేయులు(జనసేన)

చింతలపూడి - రోషన్ కుమార్ సొంగ (టీడీపీ)

దెందులూరు - చింతమనేని ప్రభాకర్ (టీడీపీ)

ఏలూరు - రాధాకృష్ణయ్య బడేటి (టీడీపీ)

గోపాలపురం - మద్దిపాటి వెంకటరాజు (టీడీపీ)

నిడదవోలు - కందుల దుర్గేశ్ (జనసేన)

కొవ్వూరు - ముప్పిడి వెంకటేశ్వరరావు (టీడీపీ)

నరసాపురం- బొమ్మిడి నారాయణ నాయకర్ (జనసేన)

పాలకొల్లు - నిమ్మల రామానాయుడు (టీడీపీ)

పోలవరం - చిర్రి బాలరాజు (జనసేన)

తాడేపల్లిగూడెం - బొలిశెట్టి శ్రీనివాస్ (జనసేన)

తణుకు - అరిమిల్లి రాధాకృష్ణ (టీడీపీ)

ఉండి - రఘురామ కృష్ణరాజు (టీడీపీ)

ఉంగుటూరు - ధర్మరాజు పత్సమట్ల (జనసేన)


6.కృష్ణా

అవనిగడ్డ- బుద్ధప్రసాద్ మండలి (జనసేన)

గన్నవరం - యార్లగడ్డ వెంకట రావు (టీడీపీ)

గుడివాడ - వెనిగండ్ల రాము (టీడీపీ)

జగ్గయ్యపేట - రాజగోపాల్ శ్రీరామ్ (తాతయ్య) టీడీపీ

కైకలూరు - కామినేని శ్రీనివాస్ (బీజేపీ)

మచిలీపట్నం - కొల్లు రవీంద్ర (టీడీపీ)

మైలవరం - వసంత వెెంకట కృష్ణప్రసాద్ (టీడీపీ)

నందిగామ- తంగిరాల సౌమ్య-(టీడీపీ)

నూజివీడు- కొలుసు పార్థసారథి(టీడీపీ)

పామర్రు - రాజా వర్ల కుమార్ (టీడీపీ)

పెడన- కాగిత కృష్ణ ప్రసాద్-(టీడీపీ)

పెనమలూరు - బోడె ప్రసాద్ (టీడీపీ)

తిరువూరు - కొలికపూడి శ్రీనివాస రావు (టీడీపీ)

విజయవాడ సెంట్రల్ - బోండా ఉమా మహేశ్వర రావు (టీడీపీ)

విజయవాడ తూర్పు - గద్దె రామ్మోహన్ (టీడీపీ)

విజయవాడ పశ్చిమ - యలమంచిలి సత్యనారాయణ చౌదరి -(బీజేపీ)


7. గుంటూరు

బాపట్ల - వేగేశ్న నరేంద్ర వర్మ రాజు-(టీడీపీ)

చిలకలూరిపేట- ప్రత్తిపాటి పుల్లారావు (టీడీపీ)

గుంటూరు తూర్పు - మొహమ్మద్ నజీర్ అహ్మద్ (టీడీపీ)

గుంటూరు పశ్చిమ- గల్లా మాధవి-(టీడీపీ)

గురజాల- యరపతినేని శ్రీనిసవాసరావు-(టీడీపీ)

మాచర్ల - జూలకంటి బ్రహ్మానంద రెడ్డి (టీడీపీ)

మంగళగిరి- నారా లోకేశ్-(టీడీపీ)

నరసరావుపేట- అరవింద బాబు చదలవాడ-(టీడీపీ)

పెదకూరపాడు- భాష్యం ప్రవీణ్-(టీడీపీ)

పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (టీడీపీ)

ప్రత్తిపాడు - బి. రామాంజనేయులు (టీడీపీ)

రేపల్లె- అనగాని సత్య ప్రసాద్ -(టీడీపీ)

సత్తెనపల్లి- కన్నా లక్ష్మీనారాయణ-(టీడీపీ)

తాడికొండ - తెనాలి శ్రవణ్ కుమార్ (టీడీపీ)

తెనాలి - నాదెండ్ల మనోహర్ (జనసేన)

వేమూరు- ఆనంద బాబు నక్కా-(టీడీపీ)

వినుకొండ- గొనుగుంట్ల వెంకట శివ సీతారామ ఆంజనేయులు-(టీడీపీ)


8. ప్రకాశం

అద్దంకి- గొట్టిపాటి రవికుమార్ -(టీడీపీ)

చీరాల- మద్దులూరి మాలకొండయ్య -(టీడీపీ)

దర్శి - బీ.శివ ప్రసాద్ రెడ్డి (వైసీపీ)

గిద్దలూరు - ఎం. అశోక్ రెడ్డి (టీడీపీ)

కందుకూరు- ఇంటూరి నాగేశ్వరరావు -(టీడీపీ)

కనిగిరి- డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి ముక్కు -(టీడీపీ)

కొండపి- డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి -(టీడీపీ)

మార్కాపురం - కందుల నారాయణ రెడ్డి (టీడీపీ)

ఒంగోలు- దామచర్ల జనార్దన రావు -(టీడీపీ)

పర్చూరు- ఏలూరి సాంబశివరావు-(టీడీపీ)

సంతనూతలపాడు - విజయ్ కుమార్ (టీడీపీ)

యర్రగొండపాలెం- చంద్రశేఖర్ తాటిపత్రి -(వైసీపీ)


9. నెల్లూరు

ఆత్మకూరు- ఆనం రామనారాయణ రెడ్డి -(టీడీపీ)

గూడూరు - సునీల్ కుమార్ (టీడీపీ)

కావలి- దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి-(టీడీపీ)

కోవూరు- ప్రశాంతి రెడ్డి వేమిరెడ్డి-(టీడీపీ)

నెల్లూరు సిటీ- నారాయణ పొంగూరు -(టీడీపీ)

నెల్లూరు రూరల్- కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి-(టీడీపీ)

సర్వేపల్లి - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (టీడీపీ)

సూళ్లూరుపేట- నెలవల విజయశ్రీ-(టీడీపీ)

ఉదయగిరి- కాకర్ల సురేశ్ -(టీడీపీ)

వెంకటగిరి - కురుగొండ్ల రామకృష్ణ (టీడీపీ)


10.కర్నూలు

ఆదోని- డాక్టర్ పార్థసారథి వాల్మీకి-(బీజేపీ)

ఆళ్లగడ్డ - భూమా అఖిల ప్రియ(టీడీపీ)

ఆలూరు - బీ. విరూపాక్షి(వైసీపీ)

బనగానపల్లె - బీ.సీ జనార్థన్ రెడ్డి(టీడీపీ)

డోన్ - కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి (టీడీపీ)

కోడుమూరు- బొగ్గుల దస్తగిరి-(టీడీపీ)

కర్నూలు- టీజీ భరత్ -(టీడీపీ)

మంత్రాలయం- వై.బాలనాగిరెడ్డి -(వైసీపీ)

నందికొట్కూరు- జయ సూర్య-(టీడీపీ)

నంద్యాల- నాస్యం మొహమ్మద్ ఫరూఖ్ -(టీడీపీ)

పాణ్యం- గౌరు చరితారెడ్డి -(టీడీపీ)

పత్తికొండ- కేఈ శ్యామ్ కుమార్ -(టీడీపీ)

శ్రీశైలం- బుడ్డా రాజశేఖర్ రెడ్డి -(టీడీపీ)

ఎమ్మిగనూరు- బి.జయనాగేశ్వర రెడ్డి -(టీడీపీ)


11.అనంతపురం

అనంతపురం అర్బన్ - దగ్గుపాటి ప్రసాద్ (టీడీపీ)

ధర్మవరం- సత్యకుమార్ యాదవ్ -(బీజేపీ)

గుంతకల్లు- గుమ్మనూరు జయరాం -(టీడీపీ)

హిందూపురం - నందమూరి బాలకృష్ణ (టీడీపీ)

కదిరి - కందికుంట వెంకట ప్రసాద్ (టీడీపీ)

కళ్యాణదుర్గం - సురేంద్ర బాబు (టీడీపీ)

మడకశిర - ఎంస్.రాజు (టీడీపీ)

పెనుకొండ- ఎస్.సవిత -(టీడీపీ)

పుట్టపర్తి - పల్లె సింధూర రెడ్డి (టీడీపీ)

రాప్తాడు - పరిటాల సునీతమ్మ (టీడీపీ)

రాయదుర్గం - కాల్వ శ్రీనివాసులు (టీడీపీ)

శింగనమల - బండారు శ్రావణి (టీడీపీ)

తాడిపత్రి - జేసీ. అశ్మిత్ రెడ్డి (టీడీపీ)

ఉరవకొండ - పయ్యావుల కేశవ్ (టీడీపీ)


12.కడప

బద్వేలు - దాసరి సుధ (వైసీపీ)

జమ్మలముడుగు - ఆదినారాయణ రెడ్డి (బీజేపీ)

కడప - రెడ్డప్ప గారి మాధవి (టీడీపీ)

కమలాపురం - పుత్తా కృష్ణా చైతన్య రెడ్డి (టీడీపీ)

రైల్వే కోడూరు - అరవ శ్రీధర్(జనసేన పార్టీ)

మైదుకూరు - పుట్ట సుధాకర్ (టీడీపీ)

ప్రొద్దుటూరు - వరదరాజుల రెడ్డి (టీడీపీ)

పులివెందుల - వైఎస్ జగన్మోహన్ రెడ్డి (వైసీపీ)

రాయచోటి - మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి(టీడీపీ)

రాజంపేట - అకేపాటి అమర్నాథ్ రెడ్డి(వైసీపీ)


13.చిత్తూరు

చంద్రగిరి - వెంకట మణి ప్రసాద్ పులివర్తి(టీడీపీ)

చిత్తూరు - గురజాల జగన్ మోహన్ (టీడీపీ)

గంగాధర నెల్లూరు - డాక్టర్. వీఎం థామస్ (టీడీపీ)

కుప్పం - నారా చంద్రబాబు నాయుడు(టీడీపీ)

మదనపల్లె - షాహజాన్ బాషా (టీడీపీ)

నగరి - గాలి భాను ప్రకాష్(టీడీపీ)

పలమనేరు - అమర్నాథ రెడ్డి (టీడీపీ)

పీలేరు - నల్లారి కిషన్ కుమార్ రెడ్డి(టీడీపీ)

పుంగనూరు - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -(వైసీపీ)

పూతలపట్టు - కె. మురళి మోహన్ (టీడీపీ)

సత్యవేడు - కోనేటి ఆదిమూలం (టీడీపీ)

శ్రీకాళహస్తి - బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి(టీడీపీ)

తంబళ్లపల్లె - ద్వారకానాథ రెడ్డి(వైసీపీ)

తిరుపతి - ఆరణి శ్రీనివాస్ (జనసేన)


పోలింగ్ తేది: మే 13, 2024

ఫలితాల తేదీ : జూన్ 4, 2024

 టీడీపీ, జనసేన-బీజేపీ కూటమి

 వైసీపీ ఒంటరిగా పోటీ 


సుమారు 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు 

సుమారు 3,33,40,333 (80.66 శాతం) మంది ఓటు వేశారు.   

Jun 3, 2024

20 మంది స్ఫూర్తి ప్రదాతలు

11:08 pm

20 మంది స్ఫూర్తి ప్రదాతలుస్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపినవారు ఉంటారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్‌, లాల్‌ బహదూర్‌ శాస్త్రి, భగత్‌ సింగ్‌… ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉంటారు. వీరే కాకుండా మన నిజ జీవితంలో తారసపడే వాళ్లు, అంటే… రైళ్లలో స్కేళ్లు, పెన్నులు అమ్మే అంధులు, తోపుడు బండిపై పండ్లు అమ్ముకొని జీవించే 70- 80 ఏళ్ల వృద్ధులు వంటి వారు కూడా ఉంటారు. ఎవరిపై ఆధారపడకుండా కష్టపడి తమకాళ్లపై తాము నిలబడి బతకాలనే నిజాయితీ, తాపత్రయం వారిలో ఉంటుంది. అదే స్ఫూర్తి. తెలుగు భాషపై మంచి పట్టున్న ప్రముఖ సాహితీ విమర్శకులు అబ్దుల్‌ రజా హుస్సేన్‌ పాఠకులకు ఆకట్టుకునే విధంగా ‘స్ఫూర్తి ప్రదాతలు’ అనే పుస్తకం రాశారు. అత్యంత సామాన్యులు ఆర్థికంగా బలహీనులు, శారీరకలోపం ఉన్నవారు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉన్నతంగా జీవిస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలిచినవారి గురించి రజా హుస్సేన్‌ తనదైన శైలిలో అద్భుతంగా వివరించారు. వివిధ రంగాలకు చెందిన సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన ఓ 20 మంది స్ఫూర్తి ప్రదాతల గురించి ముఖపుస్తక మాద్యమంగా రాశారు. దానినే పుస్తకం రూపంలో తీసుకువచ్చారు. వారిలో ఆచార్య మన్నవ సత్యనారాయణ ఒకరు. పుట్టుకతోనే చూపులేని ఆయన ప్రాథమిక విద్య నుంచి పీజీ వరకు ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. అడవి బాపిరాజు నవలలపై పరిశోధన చేసి డాక్టరేట్‌ పొందారు. తాను చదివిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోనే ఆచార్య పీఠాన్ని అలంకరించారు. ఆ స్థాయికి నడిపించిన, ఆయన తండ్రి వెంకటరామయ్య కూడా స్ఫూర్తిమంతులే. జన్మత: అంథుడైన లక్కోజు సంజీవరాయశర్మ గణిత శాస్త్రంలో ప్రావీణ్యత పొంది, గణితావధానంలో దిట్టగా నిలిచి, గణిత బ్రహ్మగా కీర్తి పొందారు. అంకెలు ఎలా ఉంటాయో తెలియని ఆయన, నాలుగు వేల ఏళ్ల వరకు సరిపోయే క్యాలండర్‌ని సృష్టించారు.
అలోక్‌ సాగర్‌ ఢిల్లీ ఐఐటీ విద్యార్థి. ప్రతిష్టాత్మక హోస్టన్‌ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్‌, ఆ తర్వాత పోస్ట్‌ డాక్టరేట్‌ కూడా పూర్తి చేసి, ఆయన చదివిన ఢిల్లీ ఐఐటీలోనే ప్రొఫెసర్‌గా చేశారు. అంతటి మహామనిషి ఇప్పుడు ఓ గిరిజన ప్రాంతంలో తలుపు కూడా లేని ఓ పూరి గుడిసెలో ఉంటూ గిరిజనాభివృద్ధికి పాటుపడుతున్నారు. గిరిజన పిల్లలకు చదువు చెబుతున్నారు. ఓ మూడు జతల దుస్తులు, ఓ టవల్‌, ఓ పాత సైకిల్‌ ఆయన ఆస్తి. తెలుగు సాహిత్యంలో తళుక్కుమన్న మెరుపు తీగె అందే నారాయణ స్వామి. చేనేత కార్మికుడైన ఆయన 33 ఏళ్ల తర్వాత కంటిచూపు కోల్పోయారు. ఆయన 1935-1975 మధ్య జీవితాలను కథలుగా రాశారు. ఆయన కథలను అప్పటి ప్రఖ్యాత కథకులు తల్లావఝుల శివశంకర శాస్త్రి, మల్లాది రామకృష్ణ శాస్త్రిలు పూనుకొని నారాయణస్వామి కథలను అచ్చు వేయించారంటే ఆయన ఎంత గొప్పకథకుడో మనం అర్థం చేసుకోవచ్చు. చింతక్రింది కనకయ్య 1944లోనే విద్య విలువ తెలుసుకుని తన స్వగ్రామం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఓ విద్యాసంస్థ నెలకొల్పేందేకు అప్పట్లోనే రూ.26వేల రూపాయలు ఇచ్చారు. ఆయన పేరుతోనే ఆ స్కూల్‌ని ఇప్పటికీ నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో చదివిన అనేక మంది రాష్ట్రం, దేశంలోనే కాకుండా వివిధ దేశాలలో ఉన్నత సంస్థల్లో ప్రముఖ హోదాలలో పనులు చేశారు. చేస్తున్నారు. తెలుగు మాస్టార్‌ పూసపాటి నాగేశ్వరరావు. పద్య కావ్యాలు రాయడంలో, అవధానాలు చేయడంలో దిట్ట. తెలుగులో ఇద్దరు జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు విశ్వనాథ సత్యనారాయణ, ప్రముఖ కవి డాక్టర్‌ సి.నారాయణ రెడ్డి పూసపాటి నాగేశ్వరరావు అవధానాన్ని మెచ్చుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఏకంగా పూసపాటి వారి కాలికి గండపెండేరం తొడిగారు.
కందుకూరి పైడిరాజుకు కాళ్లు కదలవు, మెడ నిలవదు. చిత్రలేఖనమే అతని ఆయుధం. 7వ తరగతి తర్వాత అతనికి కష్టాలు ప్రారంభమయ్యాయి. మొదట కాళ్లు, కీళ్ల నొప్పులు. తర్వాత మెడ నిలవని పరిస్థితి. తండ్రి నింపిన ధైర్యంతో గురువులు, శిక్షణ లేకుండానే చిత్రకారుడిగా ఎదిగారు. స్వప్న అగస్టీన్‌కు రెండు చేతులూ లేవు. అయినా అధైర్యపడలేదు. కాలి వేళ్లతోనే పెన్సిల్‌, కుంచె పట్టుకుని చిత్రాలు గీయడం మొదలుపెట్టింది. చిత్రకళా ప్రపంచంలో ఓ స్థానాన్ని సంపాదించుకుంది. కళ కళ కోసం కాదు, సమాజం కోసం అని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు ప్రముఖ చిత్రకారులు దాకోజు శివప్రసాద్‌. బొమ్మలు ఫ్రీగా గీసివ్వడం ఆయన ప్రత్యేకత. ఎవరికో తెలుసా? అబద్ధం ఆడనంటే ఓ బొమ్మ, మందుకొట్టనంటే ఓ బొమ్మ, పొగతాగనంటే ఓ బొమ్మ గీసిస్తారు. ప్రకృతి ఉపాధ్యాయుడు కొమెర జాజి. ప్రకృతి ఆరాధకుడు. మొక్కలు, పక్షులే అతని ప్రపంచం. వనమూలికా వైద్యం గురించి పుస్తకాలు రాశారు. సంకల్ప బలం ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చని నిరూపించారు. నటుడిగా, చేనేత కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించిన పొట్లాబత్తుని లక్ష్మణరావు. చేనేత కార్మికుడి నుంచి మాస్టర్‌ వీవర్‌ గా, మంగళగిరిలో నాణ్యత గల వస్త్ర నిలయంగా పేరుగాంచిన లక్ష్మీశారీ హౌస్‌ వ్యవస్థాపకుడిగా ఎదిగారు. పొట్ట కూటికోసం నేత నేసిన ఓ కార్మికుడు ఇప్పుడు వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. కళాకారుడి నుంచి కళాపోషకుడిగా ఎదిగారు.
తిమ్మక్కకు 110 సంవత్సరాల వయసు. ఆమెకు చదువులేదు. తల్లిదండ్రులు దినసరి కూలీలయినందున కడుపేదరికం అనుభవించింది. ఆమె శ్వాస, ధ్యాస, భాష, చివరికి ఆమె ఊపిరి కూడా చెట్లే. పర్యావరణ ప్రేమికురాలిగా ‘పద్మశ్రీ’ అందుకుంది. అంటే ఆమె ఎంత స్ఫూర్తిమంతురాలో అర్థం చేసుకోండి. పర్యావరణ ఉద్యమ తొలి సేనాని రేచల్‌ లూయిస్‌ కార్సన్‌. పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడిన యోధురాలు. దోమలను సంహరించే డీడీటీ (ణఱషష్ట్రశ్రీశీతీశీ-ణఱజూష్ట్రవఅyశ్రీ-ుతీఱషష్ట్రశ్రీశీతీశీవ్‌ష్ట్రaఅవ) మందు వల్ల పర్యావరణానికి జరిగే హాని, మానవాళికి జరిగే నష్టం గురించి రేచల్‌ ప్రపంచానికి చాటిచెప్పారు. వాస్తవ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులతో వచ్చిన ఓ సునామీనే తట్టుకున్న నిజమైన మహిళాభ్యుదయవాది గోలి పార్వతీదేవి. భర్త మానసిక పరిస్థితి బాగోలేక ఇల్లు వదిలివెళ్లిపోయారు. కడుపేదరికం. ఇద్దరు పిల్లలు. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కొంటూ, ఎంఏ పూర్తి చేసి, డీఎస్సీ రాశారు. ప్రభుత్వ టీచర్‌ ఉద్యోగం పొందారు. ఇద్దరు పిల్లలను ప్రయోజకులను చేశారు. ఓ సాధారణ పేద మహిళ ధీరవనితగా నిలిచిన తీరుని రజాహుస్సేన్‌ పాఠకుల్ని ఆకట్టుకునే విధంగా వివరించారు.
సంగీత లోకంలో ఓ వేగుచుక్క, ఫిడేలు వాయిద్య పరికరానికి ఓ రూపంగా నిలిచిన మన తెలుగువాడు ‘ఫిడేలు నాయుడు’గా కీర్తి పొందిన వెంకటస్వామి నాయుడు, మరుగుజ్జు అయినా ఇస్లామిక్‌ సంస్కృతికి అద్దంపట్టే, ఆకాశాన్ని తాకే ఆలోచనలతో గొప్ప చిత్రాలను గీసిన మహాచిత్రకారుడు కైసర్‌ అబ్బాస్‌, 91 ఏళ్ల వయసులోనూ పేదల డాక్టర్‌గా, మదర్‌ ఆఫ్‌ ఇండోర్‌గా నిలిచి, పద్మశ్రీ అవార్డు అందుకున్న గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ భక్తియాదవ్‌, ఇంగ్లీష్‌ చానల్‌ ఈది మెగల్లాన్‌ సంధిని దాటిన ధీరుడు – మన తెలుగువాడు మధు నాగరాజు గురించి రాశారు. మనుషుల్లో ఇలాంటివారుంటారా అని ఆశ్చర్యం కలిగించేటంతటి ఖద్దరు గాంధీగా పేరుపొందిన కలువకొలను వెంకట్రామయ్య, గోదావరి డెల్టా పితామహుడు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ వంటివారి గురించిన వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. పదవ తరగతికి నాన్‌ డిటెయిల్‌గా సిఫారసు చేయతగిన పుస్తకం ఈ ‘స్ఫూర్తి ప్రదాతలు’.
– శిరందాసు నాగార్జున, 9440222914

తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

 ఈరోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుగంటే...గోంగూర తెలుగంటే...గోదారి తెలుగంటే...గొబ్బిళ్ళు తెలుగంటే...గోరింట తెలుగంటే...గు...