Apr 21, 2020

క‌రోనా వైర‌స్ - జ‌ర్న‌లిస్టుల‌పై ప్ర‌భావం

క‌రోనా వైర‌స్ వ్యాప్తి సంద‌ర్భంగా దేశంలో 24 గంట‌లూ ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ప‌ని చేసేవారు  వైద్య‌, పారిశుద్ధ్య‌, పోలీస్‌, మిడియా సిబ్బంది. వీరితోపాటు విద్యుత్, గ్యాస్ స‌ర‌ఫ‌రా, ఇత‌ర డెలివ‌రీ సిబ్బంది కూడా సాధార‌ణ ప‌నివేళ‌ల్లో ప‌ని చేస్తున్నారు.  కానీ వీరంద‌రిలో తీవ్రంగా న‌ష్టపోతున్న‌ది జ‌ర్న‌లిస్టులే. వీరు 24 గంట‌లూ అటెన్ష‌న్‌లో ఉండాలి. నిద్ర‌పోతున్నా లేచి ప‌రిగెత్తాలి. కొన్ని సంద‌ర్భాల‌లో వీరి ప‌రిస్థితి చాలా ద‌య‌నీయంగా ఉంటుంది.  వీరు త‌మ బాధ‌లు మ‌రొక‌రికి చెప్పుకోలేరు. చెప్పినా తీర్చేవారు లేరు. ఇది నా అనుభ‌వంతో చెబుతున్నాను. సామాజిక బాధ్య‌త‌కు, వృత్తి ధ‌ర్మానికి నిబ‌ద్ధులు వీరు. అంద‌రినీ హైలెట్ చేస్తారు. వీరిని హైలెట్ చేసేవారు లేరు. వీరి ఆర్థిక ప‌రిస్థితులు మెరుగుప‌డే మార్గం క‌నిపించ‌డంలేదు.  క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా మారుతున్న ప‌రిస్థితుల ప్ర‌భావం వీరిపై తీవ్రంగా ప‌డే ప్ర‌మాదం ఉంది.
- శిరందాసు నాగార్జున‌

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...