ఒకనాటి మిస్టర్ ఆంధ్ర
నేడు స్పీకర్
విద్యార్థి దశ నుంచే ఆయన రాజకీయాలలో చురుకుగా
పాల్గొనేవారు. స్టూడెంట్ యూనియన్
నాయకులుగా ఎదిగారు. 1982లో ఆమదాలవలస సహకార చెక్కర కర్మాగారం డైరెక్టర్ గా పని
చేశారు. పాల్గొన్నారు. 1983లో ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరారు. 2007 వరకు ఆ
పార్టీలోనే ఉన్నారు. 1983లో తొలిసారిగా శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. వాక్ఛాతుర్యం కలిగిన సీతారామ్ 1985లో రెండవ
సారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్ గా పని చేశారు. ఇప్పటి వరకు ఆరు సార్లు శాసనసభ్యులుగా
ఎన్నికయ్యారు. 1989లో పైడి శ్రీరామమూర్తితో పోటీ చేసి ఓడిపోయారు. 1991, 1994,
1999లో వరుసగా మూడు సార్లు గెలిచారు. 2004 వరకు శాసనసభ్యులుగా ఉన్నారు. 2004,
2009లో బొడ్డేపల్లి సత్యవతిపై పోటీ చేసి ఓడిపోయారు. 2014లో కూన రవికుమార్ తో పోటీ
చేసి ఓడిపోయారు. ఆయనకు విశేష రాజకీయ
అనుభవం ఉంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రచార ప్రతినిధిగా పనిచేశారు. సీతారామ్ అనర్ఘళంగా ప్రసంగించగల దిట్ట. ఆయనకు
ఆవేశం కూడా కాస్త ఎక్కువే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాప్ వైస్ ప్రసిడెంట్ గా, ప్రింటింగ్ అండ్
స్టేషనరీ, యువజన, ఖాదీ, లిడ్ క్యాప్, క్రీడలు, మున్సిపల్
, చిన్నతరహా పరిశ్రమలు, సమాచార, పర్యాటక, ఎక్సైజ్,
న్యాయ తదితర 18 శాఖలకు 9 ఏళ్లు మంత్రిగా
పనిచేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో టీడీపీ నుంచి ఆ
పార్టీలో చేరారు. ఆ తరువాత ప్రజారాజ్యం
పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో మళ్లీ టీడీపీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ విభజన
సమయంలో 2014లో టీడీపీని వదిలిపెట్టి వైసీపీలో చేరారు. వైసీపీ శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ పార్టీ
అధ్యక్షునిగా, రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యునిగా పని చేశారు. కాళింగ సామాజికవర్గానికి చెందిన తమ్మినేని
ఐదుసార్లు ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడుసార్లు
టీడీపీ నుంచి, ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా, ఇప్పుడు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా
గెలుపొందారు.
-శిరందాసు నాగార్జున
No comments:
Post a Comment