ప్రాజెక్టులను, విద్యా సంస్థలను
రాజకీయం చేయవద్దు
మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్
చైర్మన్ ఎండి హిదాయత్
సచివాలయం, జూన్ 25: ప్రాజెక్టులను,
విద్యా సంస్థలను రాజకీయం చేయవద్దని, వాటిని రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని మైనార్టీ
ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఎండి హిదాయత్ ప్రతిపక్షాలను కోరారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు.
పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి జీవనాడి అని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో
శ్రమించి పట్టుదలతో ఇప్పటికి 62 శాతం పూర్తి చేశారని, దేశంలో ఇదో చరిత్ర అని
చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలో ఏ జాతీయ ప్రాజెక్టుకు సంబంధించిన
పనులు 5 శాతం కూడా పూర్తి కాలేదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు
విషయంలో ప్రతి సోమవారంని పోలవరంగా ప్రకటించి 65 సార్లు ప్రత్యక్షంగా గానీ, వర్చువల్
గా గానీ 65 సార్లు చూశారని తెలిపారు. 25 సార్లు ప్రాజెక్టుని సందర్శించారని
చెప్పారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఒకే ప్రాజెక్టుని ఇన్నిసార్లు
సందర్శించలేదన్నారు. ప్రాజెక్టు నిర్మించే ప్రాంతంలోని ముంపు గ్రామాలు ఆ
రాష్ట్రంలో లేకపోతే అటువంటి సమస్యలు పరిష్కారమైన దాఖలాలులేవని తెలిపారు. జూరాల
ప్రాజెక్ట్, కావేరి జలాల వంటి అంశాలను గుర్తు చేశారు. ఈ విషయాలను
దృష్టిలోపెట్టుకొని ముఖ్యమంత్రి ఆ రోజున ముంపు గ్రామాలను ఏపీలో కలపకపోతే ప్రమాణస్వీకారం
చేయనని చెప్పారన్నారు. 2020 నాటికి పోలవరం
ప్రాజెక్ట్ పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. 16 ఏళ్లు మంత్రిగా, దీర్ఘకాలం శాసనసభ్యుడిగా
ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు ఇటువంటి కీలక అంశాలని
తెలియనివి కావన్నారు. అయినా బీజేపీ ప్రతినిధి బృందంతో ఆయన పోలవరం ప్రాజెక్టుని సందర్శించి, దానిని
రాజకీయం చేయడం తగదన్నారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో వాస్తవాలను విస్మరించి, విమర్శలు
చేయడం మంచిదికాదని
హితవు పలికారు.
కన్నాను
తెలుగు జాతి క్షమించదు
రెండుసార్లు
రాష్ట్రానికి ద్రోహం చేసిన కన్నాను తెలుగుజాతి క్షమించదన్నారు. సమైక్యాంద్ర ఉద్యమం
జరిగే రోజుల్లో ఆయన ఢిల్లీ వెళ్లి సీఎం పదవి కోసం సోనియా గాంధీ కాళ్లు
పట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు నరేంద్ర మోడీ కాళ్లు పట్టుకున్నారని
విమర్శించారు. ఆనాడు ఒక్కసారైనా సోనియా వద్ద ఆయన పోలవరం ప్రాజెక్టు విషయం
ప్రస్తావించారా? అని అడిగారు. ఇప్పుడు రాజకీయ లబ్ది కోసం బీజేపీ, వైసీపీ కలసి
దీనిని రాజకీయం చేస్తున్నారన్నారు. ఇప్పుడు పోలవరం విషయంలో కన్నా రాష్ట్రానికి
చేస్తున్న రెండోసారి చేస్తున్న ద్రోహం పరాకాష్ట అన్నారు. వైసీపీ ఎజండాను కన్నా
అమలు చేస్తూరని, ఇటువంటి ద్వంద పార్టీ నాయకత్వం విచిత్రంగా ఉందన్నారు. ఈ రెండు
పార్టీలను చరిత్ర క్షమించదని చెప్పారు. వైసీపీ వారు బీజేపీని, మోడీని
విమర్శించకుడా చంద్రబాబుని విమర్శించడం విధానంగా పెట్టుకున్నారన్నారు. రాష్ట్రంలోని
విద్యా సంస్థలకు రూ.10 వేల కోట్లు అవసరం ఉంటే, నాలుగేళ్లలో రూ.630 కోట్లు మాత్రమే
ఇచ్చారన్నారు. రాష్ట్రంలోని బిజేపీ నేతలు గానీ, వైసీపీ నేతలు గానీ జాతియ
విద్యాసంస్థల అంశం ప్రస్తావించలేకపోతున్నారన్నారు. ఈ ప్రాంత ప్రజలుగా
ప్రాజెక్టులు, విద్యా సంస్థల విషయంలో రాజకీయంగా వ్యవహరించవద్దని
చెబుతున్నామన్నారు. అలా చేస్తే రాష్ట్రం తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందని
హిదాయత్ హెచ్చరించారు.
No comments:
Post a Comment