శాసనసభ ప్రాంగణంలో స్వాతంత్ర్యదినోత్సవాలు
సచివాలయం, ఆగస్ట్ 13: ఈ నెల 15న
లెజిస్లేచర్ కాంప్లెక్స్ 6వ భవనంలో స్వాతంత్ర్యదినోత్సవాలు
నిర్వహిస్తున్నట్లు శాసనసభ కార్యదర్శి కె.వెంకటేశ్వర రావు ఒక
ప్రకటలో తెలిపారు. వేడుకలలో భాగంగా ఆంధ్రప్రదేశ్
శాసన మండలి ప్రాంగణంలో ఉదయం 8 గంటలకు మండలి
అధ్యక్షుడు
ఎన్ఎండీ ఫరూక్, శాసన
సభ ప్రాంగణంలో ఉదయం 8.10 గంటలకు
స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ జాతీయ జెండాలను ఎగురవేస్తారని
పేర్కొన్నారు.
తదనంతరం ఉదయం 9 గంటలకు
సచివాలయం ప్రాంగణంలోని 1వ బ్లాక్ వద్ద
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ జాతీయ జెండాని
ఎగురవేస్తారని సాధారణ పరిపాలనా శాఖ జాయింట్ సెక్రెటరీ మరో ప్రకటనలో తెలిపారు.
No comments:
Post a Comment