Aug 13, 2018


శాసనసభ ప్రాంగణంలో స్వాతంత్ర్యదినోత్సవాలు
సచివాలయం, ఆగస్ట్ 13: ఈ నెల 15  లెజిస్లేచర్ కాంప్లెక్స్ 6వ భవనంలో  స్వాతంత్ర్యదినోత్సవాలు నిర్వహిస్తున్నట్లు శాసనసభ కార్యదర్శి కె.వెంకటేశ్వర రావు ఒక ప్రకటలో తెలిపారు.  వేడుకలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రాంగణంలో ఉదయం 8 గంటలకు మండలి అధ్యక్షుడు ఎన్ఎండీ ఫరూక్,  శాసన సభ ప్రాంగణంలో ఉదయం 8.10 గంటలకు  స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ జాతీయ జెండాలను ఎగురవేస్తారని పేర్కొన్నారు.  తదనంతరం ఉదయం 9 గంటలకు సచివాలయం ప్రాంగణంలోని 1వ బ్లాక్ వద్ద ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ జాతీయ జెండాని ఎగురవేస్తారని సాధారణ పరిపాలనా శాఖ జాయింట్ సెక్రెటరీ మరో ప్రకటనలో తెలిపారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...