Aug 3, 2018


దిగ్విజయంగా కొనసాగుతున్న గ్రామదర్శిని
ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్
Ø గ్రామాల బాటపట్టిన ప్రజా ప్రతినిధులు
Ø 1408 గ్రామాల్లో గ్రామదర్శిని, 378 వార్డుల్లో నగర దర్శిని
Ø మంత్రి లోకేష్ ద్వారా యుతకు మేలు
              సచివాలయం, ఆగస్ట్ 3: రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన వినూత్న కార్యక్రమం ‘గ్రామదర్శిని-గ్రామ వికాసం’ దిగ్విజయంగా కొనసాగుతున్నట్లు శాసన మండలిలో ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో శుక్రవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రభుత్వం ఏర్పడి జూలై 16వ తేదీకి 1,500 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టిన విషయం తెలసిందే. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ గ్రామాలకు వెళ్లి ప్రజలను కలవడానికి, వారి సమస్యలు తెలుసుకోవడానికి ఉపయోగపడే మంచి కార్యక్రమం అన్నారు. ఇప్పటి వరకు 1408 గ్రామాల్లో గ్రామదర్శిని, 378 వార్డుల్లో నగర దర్శిని కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు గ్రామాల్లో, వార్డుల్లో  మంచి స్పందన వస్తున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటించేటప్పుడు ఏవైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు.  పీపుల్స్ ఫస్ట్ పేరుతో ప్రవేశపెట్టిన 1100 విభాగం ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో లోటుపాట్లను కూడా దీని ద్వారా సరిదిద్దుతున్నారని చెప్పారు.

మంత్రి లోకేష్ ద్వారా యుతకు మేలు
        పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ద్వారా యువతకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. ఆయన రాకతో ఉద్యోగ అవకాశాలు పెరిగాయని చెప్పారు. ఆన్ లైన్ పోర్టల్ ఏర్పాటు చేయడం ద్వారా నిరుద్యోగులు తమ పేరు, విద్యార్హతలు వంటి వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఏర్పడిందన్నారు. ఆ విధంగా వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయని తెలిపారు. నిరుద్యోగ యువతకు వారికి ఇష్టమైన రంగాల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం ద్వారా  12 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఈ పథకం దేశంలో ఎక్కడా సరైన రీతిలో అమలు జరగడంలేదన్నారు. మన రాష్ట్రంలో 22-35 సంవత్సరాల మధ్య యువతకు నెలకు రూ.1000లు భృతి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ మేనిఫెస్టోలోని 90 శాతం పైగా అంశాలను అమలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా చంద్రబాబు నాయకత్వంలో ఎంతో అభివృద్ధి జరుగుతోందని, మళ్లీ ఆయనే రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఆయనపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని డొక్కా అన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...