మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ్యులు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. ‘మన మంగళగిరి 2.0’లో మంగళగిరి చరిత్రను సమగ్రంగా రాసినట్లు రచయిత గోవర్థన్ మంగళవారం స్థానిక జర్నలిస్టులకు వివరించారు. స్థానిక విలేకరులకు ఆయన ఈ పుస్తకాన్ని అందజేశారు. మంగళగిరి చరిత్ర అధ్యయనంలో దిట్ట అయిన గోవర్థన్ గతంలో కూడా ‘మన మంగళగిరి’ అనే పేరుతో ఒక పుస్తకం రాశారు. ఈసారి 546 పేజీలతో, మంగళగిరిలోని అన్ని రంగాల సమగ్ర సమాచారంతో దీనిని తీసుకువచ్చారు. ఈ పుస్తకంలోని సమాచార సేకరణ కోసం ఆయన ఎంతో శ్రమించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వానపల్లి బ్రహ్మనాయుడు, సీనియర్ జర్నలిస్ట్ కొలికపూడి రూఫస్ తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
సాహిత్యంలో రజా హుస్సేన్ రికార్డ్
ఫేస్ బుక్ వేదికగా కాఫీ విత్... పేరుతో 3331 ఎపిసోడ్స్ ఫేస్ బుక్ వేదికగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్ అబ్దుల్ రజా హుస్సేన్ సాహ...
-
అమరావతి , ఫిబ్రవరి 18 : రాజ్యాంగపరంగా సంక్రమించిన అధికారాల కింద తాను జారీ చేసిన ఆదేశాలను పాటించడానికి మండలి కార్యదర్శి ఉద్దేశపూర్వకంగా ని...
-
పుష్ప- 2: ది రూల్ సినిమా ట్రైలర్ నవంబర్ 17వ తేదీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైన వి...
-
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది, రచయిత సావిత్రీపతి మాదిరాజు గోవర్థనరావు రాసిన ‘మన మంగళగిరి 2.0’ని ఇటీవల స్థానిక శాసనసభ...
No comments:
Post a Comment