Apr 2, 2026

అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం


రాజధాని అమరావతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్(అమెండ్‌మెంట్) బిల్-2026ని రాజ్యసభ గురువారం  ఆమోదించింది.  
మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. ఇది చారిత్రాత్మక దినం అని ఎన్డీఏ నేతలు అభివర్ణించారు. ఈ బిల్లుకు లోక్‌సభ నిన్న ఆమోదం తెలిపింది.  రాజ్యసభ ఆమోదించడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదానికి పంపుతారు.  పార్లమెంటులోని ఉభయసభలు ఆమోదించడంతో ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి ఖరారైంది.  రాష్ట్రపతి సంతకం తర్వాత గెజిట్ విడుదలవడంతో ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభిస్తుంది. బిల్లుపై చర్చలో 11 పార్టీలకు చెందిన మొత్తం 17 మంది ఎంపీలు పాల్గొన్నారు. వైసీపీ మాత్రమే బిల్లుకు వ్యతిరేకంగా వాకౌట్ చేసింది. మిగిలిన 10 పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి.



Apr 1, 2026

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం


అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఈరోజు(01.04.2026) ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై చర్చలో 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు పాల్గొన్నారు.

కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్: లోక్‌సభలో అమరావతి బిల్లుపై చర్చలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగులో మాట్లాడారు. అమరావతి రైతులకు, మహిళలకు కేంద్రమంత్రి అభినందనలు తెలిపారు. రూపాయి ఖర్చు లేకుండా వేల ఎకరాలు అమరావతి కోసం సమీకరించిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. 

ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి:  అమరావతి తొలి ప్రజా రాజధానిగా గుర్తింపు తెచ్చుకుంది. ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుంది. అమరావతి కోసం రాజధాని రైతులు 1631 రోజులు ఉద్యమం చేశారు.

ఎంపీ అప్పలనాయుడు:   రైతుల త్యాగం ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుంది.  తండ్రికి బిడ్డతో ఉండే అనుబంధం ఎలా ఉంటుందో, రైతుకు భూమితో కూడా అలాంటి బంధం ఉంటుంది.  సుమారు 33 వేల ఎకరాల భూమిని రాజధాని నిర్మాణానికి ఇచ్చిన రైతుల త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది.

వైసీపీ సభ్యులు వాక్‌అవుట్: అమరావతి అంశంపై లోక్ సభలో చర్చ జరుగే సమయంలో వైసీపీ సభ్యులు వాక్‌అవుట్ చేశారు. 

Mar 28, 2026

ఆంధ్ర ప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతే : పవన్ కళ్యాణ్


మనసా వాచా కర్మణా మద్దతు 

గత ప్రభుత్వం అమరావతిలో యుద్ధ వాతావరణం సృష్టించింది

భూములు ఇచ్చిన రైతులను హింసించింది

రాజధానిగా అమరావతే ఉండాలని కూటమి కట్టాం 

రాష్ట్రానికి హాని చేసేవాళ్ళు మళ్లీ రారు 

మనమంతా ఒకటే నేల..ఒకటే భాష.. ఒకటే జాతిగా ముందుకెళ్లాలి 

రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది 

సరైన ప్రణాళిక లేకుండా విభజించారు 

రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అకుంఠిత దీక్షతో పని చేస్తున్నారు 

అమరావతి ప్రపంచ శక్తిగా, ప్రజా రాజధాని రూపుదిద్దుకుంటోంది 

అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరే తీర్మానంపై అసెంబ్లీలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ 


‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉందని, అది అమరావతి మాత్రమేన’ని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇష్టపూర్వకంగా ఇచ్చారని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో అమరావతిపై కక్ష కట్టారని, యుద్ధ వాతావరణం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండాపోయిందని, రాజధాని కోసం భూములిచ్చిన రైతులను హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో సమస్యను జటిలం చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరే తీర్మానంపై శనివారం అసెంబ్లీలో మాట్లాడారు. 

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “51 ఏళ్ల వయసులో 58 రోజుల పాటు ఆమరణనిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటానికి ఆయన పోరాటమే మూలం. ఆనాడు తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడకపోయి ఉంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రం అవతరించేది కాదు. ఈ రోజు తెలంగాణలో నాందేడ్, పర్బానీ, బీడ్, శంభాజీనగర్ ప్రాంతాలు ఉండేవి. వాటిని మహారాష్ట్రలో చేర్చారు. అలాగే మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మలబార్, కాసర్ గోడ్, కొచ్చిన్, ట్రావెన్ కోర్ కలిసి కేరళ రాష్ట్రంగా ఏర్పడ్డాయి. బొంబాయి ప్రావిన్స్ నుంచి మహారాష్ట్ర, గుజరాత్ ఏర్పాటు ఏర్పడ్డాయి. పంజాబ్, హర్యానా ఇలా అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ త్యాగంతోనే అవతరించాయి. 

తెలుగు నేల అనే భావనే ఉండేది 

కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించినప్పటి నుంచి ఇప్పటి వరకు రాజధాని కోసం కొట్టుకుంటున్నాం. ఇప్పటికీ రాజధాని, సరైన హైకోర్టు, పరిపాలన భవనాలు లేదని తలచుకుంటే బాధేస్తోంది. రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం చాలా ముఖ్యం. జాతీయ భావాలతో పెరగడంతో ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు అనే భావన మాకెప్పుడూ కలగలేదు. తెలుగునేల అనేదొక్కటే మా భావన. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించలేదు. వాళ్లు చేసిన పొరపాటు వల్లే మనం ఇంకా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయాం. రాష్ట్రంపై ప్రేమతోనే ఎలాంటి షరతులు లేకుండా 2014లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చాను. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సరైన కార్యాలయాలు కూడా లేని క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయని, అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం, బలమైన ఆశావాహ దృక్పథంతో ముందుకెళ్లారు. రాజధాని భూ సమీకరణ అంటే చాలా గొడవలు వస్తాయని భయం ఉండేది. అయితే 80 నుంచి 90 శాతం మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. మెజారిటీ శాతం ప్రజలు ఇష్టపూర్వకంగానే భూములు ఇచ్చారు. ఉద్దండరాయునిపాలెంలో దళిత కులానికి చెందిన కొందరు ఎక్కువ పరిహారం ఇప్పించమని అడిగితే వారికీ న్యాయం చేసి ముందుకు వెళ్లారు. మంత్రి శ్రీ నారాయణ గారి ఆధ్వర్యంలో ఎక్కడా గొడవలు లేకుండా భూ సమీకరణ ప్రక్రియ మొత్తం సానుకూలంగా సాగింది. ఎలాంటి గొడవలు లేకుండా 33 వేల ఎకరాలు సేకరించారు.

భూములు ఇచ్చిన రైతులపై కక్ష కట్టారు

2019లో ప్రభుత్వం మారిన తర్వాత అమరావతిపై కక్ష కట్టారు. ముందు నుంచే రాజధానిపై అబాంఢాలు వేశారు. ఇక్కడ రాజధాని లేదని చెప్పారు. సమస్య పరిష్కరించకపోగా మూడు రాజధానుల పేరిట సమస్యను జటిలం చేశారు. చివరికి ఎప్పుడూ ఇళ్లలో నుంచి బయటకు రాని ఆడవారు, శారీరక శ్రమ తప్ప ఏమీ తెలియని రైతులు కూడా రోడ్డెక్కాల్సి వచ్చింది. వారు చేసిన పోరాటాలు, తిన్న దెబ్బలు జనసేన కార్యాలయానికి వచ్చి చూపించారు. మా బిడ్డల భవిష్యత్తు కోసం వస్తే విచక్షణా రహితంగా కొట్టారని, ఎక్కడెక్కడ కొట్టారో చెప్పలేకపోతున్నామని హృదయ విదారకంగా చెప్పుకున్నారు. అమరావతి రైతులకి మద్దతుగా నేను వెళ్తే పోలీసులు ముళ్ల కంచెలు వేసి కూర్చొబెట్టారు. వాటిని దాటుకొని వెళ్లి వారి కన్నీరు, కష్టాలు విన్నాను. మాటలు కూడా రాని బిడ్డలను సైతం వదలలేదు. నాటి అమరావతి - నేడు చూస్తున్న ప్రాంతంలా లేదు. ఈ ప్రాంతంలో ఒక యుద్ధ వాతావరణం ఉండేది. వైసీపీ హయాంలో చట్టసభల్లో శాసన సభ్యులకే రక్షణ లేకపోతే రైతులకి ఎలా ఉంటుంది?  ఒక్క మాటలో చెప్పాలంటే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను హింసించారు. మాకు అండగా నిలబడాలని నాడు అమరావతి రైతులు అడిగితే విషయాన్ని పొత్తులో ఉన్న కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లాను. అప్పుడు ఒక్కటే నిర్ణయం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని బలంగా నిర్ణయం తీసుకున్నాం. కూటమి కట్టడం వెనుక అసలు ఉద్దేశం కూడా రాజధానే. ఈ రోజున అసెంబ్లీ సాక్షిగా బలమైన పాదముద్ర పడింది.

రాష్ట్రానికి హాని చేసేవాళ్ళు మళ్లీ రారు

చట్ట సభల్లో శాసన సభ్యులు ఇచ్చే వాగ్దానాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా తప్పకూడదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానిని ముందుకు తీసుకువెళ్లేందుకు కట్టుబడి ఉంది. చట్ట సభల్లో ఇచ్చే మాటను నిలబెట్టుకోకుంటే ప్రజల్లో విశ్వాసం కోల్పోవాల్సి వస్తుంది. ఒక వేళ మళ్లీ రాష్ట్రానికి హాని చేసేవాళ్ళు వస్తే అన్న అనుమానం చాలా మందిలో ఉంది. వాళ్ళు మళ్లీ రారు. భూమి ఇచ్చిన ప్రతి రైతు రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం కోరుతున్నారు. భవిష్యత్తులో మనమంతా ఒకటే మాట మీద ఉండి అమరావతి రైతాంగానికి అండగా నిలబడాలి. మేము మాట మార్చం. ముందుకే వెళ్తాం.

మనమంతా ఒకటే నేల.. ఒకటే జాతి..

భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికిన ఆంధ్రప్రదేశ్ ఇప్పటికీ ఒక రాజధాని లేక కొట్టుమిట్టాడాల్సి వస్తుంది. కేంద్రం వద్దకు వెళ్లి దేహీ అనాల్సిన పరిస్థితి. ఏది అడగాలన్నా మన గొంతుబలంగా ఉండాలి. అలా ఉండాలి అంటే ప్రాంతాల వారీగా విడదీసి మాట్లాడడం మానేయాలి. మనలో మనకి సబ్ డివిజన్లు పెట్టుకుంటే రాష్ట్రాన్ని ఎవరూ రక్షించలేరు. మనమంతా ఒకటే నేల.. ఒకటే రాష్ట్రం.. ఒకటే భాష.. ఒకటే జాతి అని బలంగా బల్లగుద్ది చెప్పకపోతే మన అనైక్యత ఎదుటివారికి బలం అవుతుంది. మన అనైక్యత వారికి బలం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఒక తరానికి స్థిరత్వం ఇవ్వాలి. రాష్ట్ర విభజన నాటి పరిస్థితులు మళ్లీ ఉత్పన్నం కాకూడదు. స్థిరత్వంతో కూడిన పాలన ఉంటేనే పెట్టుబడులు సాధ్యం.

విజన్ ఉన్న నాయకుడు తరం కోసం ఆలోచిస్తాడు

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో హైదరాబాద్ రూపురేఖలు మారిపోవడం నేను ప్రత్యక్షంగా చూశాను. మేము చూస్తుండగా రోడ్లు వెడల్పు అయ్యాయి. ఆయన్ని అంతా విమర్శించే వారు. దాని విలువ ఈతరం అనుభవిస్తోంది. సాధారణ రాజకీయ నాయకుడు తదుపరి ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. విజన్ ఉన్న నాయకుడు ఒక తరం కోసం ఆలోచిస్తాడు. దార్శనికత కలిగిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదే చేశారు.. సైబరాబాద్ ఆయన సృష్టే. ఆయన నాయకత్వంలో నేడు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక సంఖ్యలో పెట్టుబడులు ఆకర్షిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారే స్వయంగా చెప్పారు.

ప్రపంచ శక్తిగా ప్రజా రాజధాని 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రైతులకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రాజధాని నిర్మాణ ప్రక్రియను పునః ప్రారంభించాం. 2025 మే 2వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా పునర్నిర్మాణ పనులు ప్రారంభించాం. మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేశాం. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నుంచి రూ. 15,000 కోట్లు, హడ్కో నుంచి రూ. 11,000 కోట్లు, నాబార్డు నుంచి రూ. 7,387 కోట్లు సమీకరించి పనులు చేపట్టాం. రాజధానికి పెట్టుబడుల రాక మొదలయ్యింది. ఒకేసారి 15 జాతీయ బ్యాంకులు తమ కార్యాలయాల ఏర్పాటుకి శ్రీకారం చుట్టాయి. మరో రూ. 28,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అమరావతి ఒక సాధారణ రాజధాని కాదు.. ప్రజా రాజధాని. ప్రపంచ శక్తిగా రూపుదిద్దుకోనున్న రాజధాని. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధాని. ఈ మేరకు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తీర్మానానికి జనసేన పార్టీ తరఫున మనసా, వాచా, కర్మణా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను”  అన్నారు.

అమరావతి అజేయం… అజరామరం


ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే ఆత్మ

ఎవరూ టచ్ చేయలేరు... ఇంచ్ కూడా కదల్చలేరు

దేశం గర్వించేలా భవిష్యత్‌ నగరంగా రాజధాని నిర్మాణం

రాష్ట్ర కోసం భూములిచ్చిన రైతులకు పాదాభివందనం

రాజధానిపై రోజుకో మాటతో జగన్‌ది ఊసరవెల్లి రాజకీయం

అమరావతికి చట్టబద్దత కోరుతూ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు

తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన శాసన సభ

అమరావతి, మార్చి 28 :-*  అమరావతే ఆంధ్రప్రదేశ్ ఆత్మ  అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతి అజేయం.. అద్భుతం.. అజరామరం అని, అమరావతితోనే తెలుగు వైభవమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. శాశ్వత రాజధానిగా అమరావతికి చట్ట భద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టారు.  ఈ తీర్మానానికి మద్దతు పలికిన శాసన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియచేశారు. రాజధానిని ఎవరూ టచ్ చేయలేరని, ఇంచ్ కూడా కదిలించలేరని అన్నారు. ఏపీకి ఒక్కటే రాజధాని అని, అది అమరావతి మాత్రమేని పునరుద్ఘాటించారు. 

*అవే కుట్రలు..కుతంత్రాలు*

రాజధానిపై వైసీపీ బుద్ధి ఇంకా మారలేదని, గతంలో చేసిన కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతూనే ఉందని ముఖ్యమంత్రి ఆక్షేపించారు. దీనిపై సీఎం మాట్లాడుతూ...‘రాజ్యాంగంలో రాజధాని అనే పేరే లేదంటారు. వీళ్లకు ఏమైనా ప్రత్యేకమైన రాజ్యాంగం ఉందా? రాజారెడ్డి రాజ్యాంగాన్ని వీళ్లు అనుసరిస్తారు. దేశం అనుసరించేది అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే. విభజన అనంతరం రాష్ట్రానికి రాజధాని విజయవాడ-గుంటూరు మధ్య ఏర్పాటు చేయాలని 46 శాతం మంది కోరుకున్నట్టు శివరామకృష్ణన్ కమిటీ స్పష్టంగా చెప్పింది. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ వివిధ జాతీయ స్థాయి సంస్థలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశాం. ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి బేషరతుగా రాజధానిగా అమరావతికి మద్దతు ఇస్తున్నామని గతంలో చెప్పాడు. కానీ ఇప్పుడు రోజుకో మాటతో ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నాడు. టెక్నాలజీ అందుబాటులో ఉన్న రోజుల్లోనూ రాజకీయ విన్యాసాలు చేస్తున్నాడు. వంద ఎకరాలు తీసుకుని భవనాలు కట్టేసి రాజధాని అని చెప్పేయవచ్చు. కానీ రాష్ట్రానికి ఆర్ధిక వనరులు సమకూరేలా ఓ ప్రాంతం ఉండాలని ఆలోచించాను. ఈ ప్రాంతాంలోని రైతులను సంప్రదించడంతో 58 రోజుల్లోనే 34 వేల ఎకరాలను రైతులు త్యాగం చేశారు. రాష్ట్రం కోసం రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. రాజధాని పట్ల కుట్రలు చేసిన కొందరు వ్యక్తులు తోటలకు నిప్పు పెట్టారు. రుణాలను అడ్డుకునేందుకు ప్రపంచ బ్యాంకుకు ఈ మెయిళ్లు పంపించారు.  కానీ పవిత్రమైన మట్టి, నీరుతో ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం. అందుకే ఇది శాశ్వతంగా నిలుస్తుంది. అమరావతి నిర్మాణ బాధ్యతను పార్లమెంటు తీసుకుంటుందని ప్రధాని కూడా భరోసా ఇచ్చారు. రైతులు ఇచ్చింది కేవలం భూములు మాత్రమే కాదు రాష్ట్రానికి భవిష్యత్తు ఇచ్చారు. సెల్ఫ్ సస్టైయినబుల్ ప్రాజెక్టుగా అమరావతి నిర్మితం అవుతుందని చెప్పాం.. అదే జరిగి తీరుతుంది’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 


*బ్లూ, గ్రీన్ నగరంగా నిర్మితం*

‘రాజధాని ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని వచ్చిన సమయంలో ఓమారు, ఆ తర్వాత మరోమారు, రెండు రోజుల క్రితం అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇలాంటి ఘటనలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నాను. హైదరాబాద్, అమరావతి రెండు నగరాలు అభివృద్ధికి చిరునామాలుగా మారాలి. భవిష్యత్ నగరంగా అమరావతి బ్లూ, గ్రీన్ సిటీగా నిర్మితం అవుతుంది. దేశం గర్వించేలా అమరావతిని నిర్మించి తీరుతాం. రాజధాని ఒకటే..కానీ  అభివృద్ధి మాత్రం అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తాం. మూడు రీజియన్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్లు విస్తృతంగా అభివృద్ధి అవుతాయి’ అని సీఎం అన్నారు. 

*రాజధానులు కోల్పోతూ వచ్చాం*

‘కృష్ణా- గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని అమరావతిని రాజధానిగా చేసుకుని శాతవాహన రాజులు పరిపాలించారు. బ్రిటిష్ మ్యూజియంలోనూ అమరావతి గ్యాలరీ ఆనాటి చరిత్రను స్పష్టంగా చెప్తోంది.  అంతటి ప్రాచీన, ఘన చరిత్ర మన తెలుగు జాతిది. సంస్కృతీ సంప్రదాయాలతో విలసిల్లిన తెలుగునేల ఇది. బ్రిటిష్ వారు వచ్చాక పరిస్థితులు మారాయి. 200 ఏళ్ల పాటు మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు ప్రాభవం కోల్పోయాం. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాకే మద్రాసీల నుంచి ఆంధ్రులుగా మనకు వచ్చింది. పొట్టిశ్రీరాములు ప్రాణ త్యాగంతో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీ అవతరించింది. మొదట కర్నూలుకు, ఆ తర్వాత హైదరాబాద్‌కు రాజధాని మారింది. ఇప్పుడు అమరావతికి మార్చుకున్నాం. రాజధానులు కోల్పోవటంతో పాటు విమర్శలు, వివక్ష, అవమానాలు భరిస్తూనే వచ్చాం. 1953లో ఆంధ్రరాష్ట్రం, 1956లో ఆంధ్రప్రదేశ్, 2014లో మరోమారు మన రాష్ట్ర అవతరణ తేదీలు మారాయి. మన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఏది చేసుకోవాలో తెలీని గందరగోళం నెలకొంది. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం చేసిన రోజును స్మతీ దినంగా జరుపుకుంటున్నాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు. 


*మోస్ట్ లివబుల్ సిటీగా అమరావతి*

‘1991లో వచ్చిన ఆర్ధిక సంస్కరణల్ని అందిపుచ్చుకున్నాం. 2020 విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకున్నాం. ఐటీ రివల్యూషన్‌ను ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్‌గా అందిపుచ్చుకున్నాం. అప్పుడు చేసిన విజన్ కారణంగా రూ.1.05 లక్షల కోట్లు రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తోంది. సైబరాబాద్‌ను ఇటుకా ఇటుకా పేర్చి నిర్మాణం చేశాం. ఫలితాలు వచ్చాయి. అందుకే మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్ నిలిచింది. ఇప్పుడు అమరావతిని కూడా మోస్ట్ లివబుల్ సిటీగా నిర్మాణం చేస్తున్నాం.  2014 విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు సమన్యాయం చేయాలని కోరాను. ఇప్పుటి వైసీపీ నాయకుడు నాడు పార్లమెంటులో కెమెరాలు నుంచి తప్పించుకు తిరిగాడు. 10 ఏళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినప్పటికీ ఏపీకి సొంత రాజధాని నిర్మాణం చేయాలని ఇక్కడికి వచ్చాం. 9 నెలల్లో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, సచివాలయ ప్రాంగణాలను నిర్మించుకున్నాం. సింగపూర్ సహకారంతో ప్రపంచ స్థాయిలో రాజధాని నిర్మాణం కోసం ప్రణాళికలు ఇవ్వాలని కోరాం. ముందు దేశం బాగుండాలి, అలా ఉండాలంటే మన జాతి బాగుండాలి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. తెలుగు వాళ్లకు చెందిన హైదరాబాద్, అమరావతి తొలి రెండు స్థానాల్లో ఉండాలన్నదే నా సంకల్పం’ అని సీఎం చంద్రబుబ స్పష్టం చేశారు

*ఐదేళ్లు కీచకపర్వం సాగించారు*

‘రాజధాని వల్ల ఏం జరుగుతుందనే వ్యక్తులు హైదరాబాద్ నుంచి ఏడాదికి 1.05 లక్ష కోట్ల మేర వస్తున్న ఆదాయం చూడాలి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రాంతంగా అమరావతి ఉంటుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. 2019లో ఒక్కఛాన్స్‌తో అధికారంలోకి వచ్చి ప్రజావేదిక కూల్చి విధ్వంస పాలన మొదలు పెట్టారు. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కు నెట్టారు. రైతులపై ఉక్కు పాదం మోపారు. కేసులు పెట్టి, బూట్లతో తన్నారు, లాఠీలతో కొట్టారు. అడ్డగోలుగా కేసులు పెట్టి కీచకపర్వం సాగించారు. శాసన మండలిలో సెలెక్ట్ కమిటీతో బిల్లు పాస్ చేయాలని చూశారు. అయినా హైకోర్టు న్యాయస్థానం కాపాడింది. ఈ తరహా పాలన తుగ్లక్ నిర్ణయం అని, పెట్టుబడులు రావని మీడియా పెద్ద ఎత్తున రాసింది. గత పాలనలో నేను, పవన్ కల్యాణ్ సహా అంతా బాధితులమే. కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించాం. మన ప్రభుత్వం ఏర్పడ్డాక అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.15వేల కోట్లు తక్షణ సాయం అందించింది. అమరావతి పనులు రీస్టార్ట్ చేశాం. 2028కి పనులు అన్నీ పూర్తి చేసి అమరావతికి ఒక రూపు తీసుకువస్తాం. 2027 నాటికి ట్రంక్ రోడ్లు, లేఅవుట్స్ సహా వివిధ మౌలిక సదుపాయాలు పూర్తి అవుతాయి. రూ.56 వేల కోట్ల విలువైన 91 పనులు వేగంగా జరుగుతున్నాయి’ అని సీఎం వివరించారు. 

*ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదం*

అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా అమోదించింది. విభజన చట్టం సెక్షన్-5(2)ను సవరించాలని కోరుతూ ‘ఎట్ అమరావతి’ అనే పదాన్ని చట్టంలో చేర్చేలా అసెంబ్లీ తీర్మానించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం నోటిఫై చేసిన ప్రాంతాలకు కూడా రాజధాని పరిధి వర్తింప చేసేలా చట్ట సవరణ కోరుతూ తీర్మానాన్ని ఆమోదించింది. శాసన సభ ఆమోదం పొందిన ఈ తీర్మానాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు రాజ్యసభ ఛైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌కు పంపించారు. అలాగే కేంద్ర హోంమంత్రికి ఆమోదం పొందిన తీర్మానం ప్రతిని స్పీకర్ పంపారు. తీర్మానం కాపీలను అటు కేంద్ర హోం కార్యదర్శి, ఏపీ సీఎస్‌కు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పంపించారు. 

Mar 24, 2026

సాహిత్యంలో రజా హుస్సేన్ రికార్డ్

ఫేస్ బుక్‌ వేదికగా కాఫీ విత్... పేరుతో 3331 ఎపిసోడ్స్ 


ఫేస్ బుక్ వేదికగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్  అబ్దుల్ రజా హుస్సేన్ సాహిత్యంలో ఓ రికార్డ్ సృష్టించి, సాహితీ శిఖరానికి చేరుకున్నారు. కాఫీ విత్..... పేరిట సాహితీ విమర్శలను ప్రారంభించి  ఏకధాటిగా  3331 (మార్చి 21-దాకోజు శివప్రసాద్) ఎపిసోడ్స్ తో కొనసాగిస్తున్నారు. మార్చి 21 రాసిన  ఎపిసోడ్ లో అన్నమయ్య -చలం మధ్య పోలిక వివరించారు. వారిద్దరి మధ్య పోలికేంటని ఆశ్చర్యపోకండి. చదివితే తెలుస్తుంది.   3195 ఎపిసోడ్ లో  కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం పొందిన  నందిని సిధారెడ్డి రచించిన దీర్ఘకవిత “అనిమేష” (ఉపద్రవ గాధకావ్యమ్) నూరుపాళ్ళు అకాడెమీ పురస్కారానికి అర్హమైందని పేర్కొన్నారు. ఈ సాహితీ ప్రవాహం ఆగేదికాదు. ఇలాగే కొనసాగుతుంది. అంతేకాకుండా,  చిత్రకళా పరిమళం -407 ఎపిసోడ్స్, కొత్త పుస్తకం-278(బీఎస్ రాములు ఆత్మకథ),  మనసు విప్పి కాస్సేపు -175(ఆనందో పరబ్రహ్మ), సక్సెస్ స్టోరీలు-192, రమదాన్ - 25 ఎపిసోడ్స్, పచ్చి జ్ఞాపకం...మొదలైన శీర్షికల పేర్లతో వేలకు వేలు  రాశారు. రాస్తున్నారు.  ఈ మధ్య తన కవిత్వానికి, విశ్లేషణలకు అందమైన, అద్భుతమైన ఫొటోలను కూడా జతచేసి మరీ పోస్ట్ చేస్తున్నారు. 

 

మార్చి 21 ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా  ‘‘ప్రజల దగ్గరకు వెళ్ళేది. ప్రజలతో  మమేకమయ్యేది  కవిత్వం .!!’’ అని మొదలుపెట్టి  మనకు తెలిసిన అనేక మంది కవుల ‘ఆకు పచ్చని జ్ఞాపకాలు’ రాశారు.  ఉద్యోగ విరమణ తర్వాత ఆయన రాయడమే పనిగా పెట్టుకున్నారు. అలుపెరగకుండా రాస్తున్నారు. సాహితీ లోతులను తవ్వితీస్తున్నారు.  కొత్త పుస్తకాలను, కొత్త రచయితలను సాహిత్యలోకానికి పరిచయం చేయడమే పనిగా పెట్టుకున్నారు. గతంలో ‘యువ సంతకాలు’ శీర్షికన నాగభైరవ కోటేశ్వరరావు ‘వార్త’ ఆదివారం అనుబంధంలో యువ కవులను పరిచయం చేశారు. అయితే, ఆయన ఓ 200 మందికిలోపే పరిచయం చేశారు. అది పత్రిక అయినందున పరిమితి ఉంటుంది. ఫేస్ బుక్ అయినందున రజా హుస్సేన్ కు ఆ పరిమితిలేదు.  ఓ కవి, ఆయన రాసిన పుస్తకం, రచన, కవిత్వం వెలుగులోకి రావాలంటే, చాలా రకాల సంబంధాలతో ముడిపడి ఉంటుంది. అయితే, రజా హుస్సేన్ కు అవేమీ పట్టవు. మనిషి జీవన శైలి, పుస్తకం, రచన, కవిత్వం నచ్చితే చాలు వెలుగులోకి తీసుకువస్తారు.  ఆ విధంగా కొత్త రచయితలకు ఆరాధ్యుడయ్యారు.

 

రజా హుస్సేన్ రాతల పోకడకు ప్రపంచమే హద్దు. రచయితలు, కవులు, కళాకారులు, నటులు, వృత్తి నిపుణులు..... ఇలా మనిషిలో ఏ నైపుణ్యం ఉన్నా గుర్తించి, మరీ వెలుగులోకి తీసుకురావడం ఆయన ప్రత్యేకత. పురాతన కవుల దగ్గర నుంచి గురజాడ అప్పారావు,  కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ...... వంటి వారు మొదలుకొని ఖలీల్ జిబ్రాన్ .... వంటివారితోపాటు నేటి తరం యువకవుల వరకు.... గోసంగీల జీవితాలపై  పలు రచనలు చేసిన ప్రముఖ తెలుగు రచయిత, పరిశోధకులు గనిశెట్టి రాములు, ఒగ్గు కళకు జీవితాన్ని అంకితం చేసిన తొలి మహిళా కళాకారిణి మల్లారి, జార్ఖండ్ డైనమెట్,  డైనమిక్ చిత్రకారుడు మహతో మనీష్ కుమార్, చిత్రాలయ రాజు  ప్రత్తిపాటి రాజు, బలిజేపల్లి లక్ష్మీకాంతం,  శేషేంద్ర శర్మ, వెల్చాల కొండలరావు, డాక్టర్. వేదాంతం రామలింగశాస్త్రి,  రావిరంగారావు,  గోలి మధు, ఇషాక్ హుస్సేన్(ఇష్క్), షేక్ కరిముల్లా, తేళ్ళ అరుణ, మంజువాణి కొండపి , జ్యోతిర్మయి మళ్ళ, డాక్టర్ రాయదుర్గం విజయలక్ష్మి, పోర్షియా దేవి, భాగ్యలక్ష్మి నల్లా,  నల్లి ధర్మారావు, సినీ ప్రముఖులు కాంచనమాల, కె.విశ్వనాథ్, ఎన్టీఆర్, అక్కినేని, సావిత్రి, జమున....... వంటి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు,   పురాణాలు,  పురాతన భవనాలలో కళా నైపుణ్యం, శ్రీవెంకటేశ్వర శుప్రభాతం...... ఇలా ఎవరినీ, దేనిని వదిలిపెట్టరు.  అన్ని రంగాల వారిని, అన్ని అంశాలను విశ్లేషించారు. సాహితీ పంట పండిస్తున్నారు.  ఎవరి గురించైనా రాసే ముందు అతను ఆస్తికుడా?, నాస్తికుడా?,  హేతువాదా?, ఏ మతం?, ఏ జాతి?,  ఏ కులం?, ఏ పార్టీ?, చేనేత ఉద్యమకారుడా?,  నక్సలైట్ ఉద్యమకారుడా?..... అనేవి అస్సలు పట్టించుకోరు.  అతనిలో తనకు నచ్చిన ప్రతిభ గురించే ఆలోచిస్తారు. అధ్యయనం చేస్తారు. సారం మనకు అందిస్తారు.    


అభ్యుదయ కవిత్వం నుంచి ప్రేమ కవిత్వం వరకు మనసుకు హత్తుకునేవిధంగా రజా హుస్సేన్ రాస్తారు. ‘స్పర్శ’ పై ఆయన చాలా అద్భుతంగా  రాశారు. ఆయన చాలా వివరంగా రాసినప్పటికీ,  దానిని చదివితే, మనకు ఇంకా అనేక స్పర్శలు,  వాటి ప్రభావాలు, ఫలితాలు... గుర్తుకు వస్తాయి. ఒక్కో డాక్టర్ స్పర్శని హస్తవాసి అంటారు. అది కూడా అలాంటిదే.  ‘‘ఈ ప్రేమ వుందే మా చెడ్డది…. ఎవరూ… తెలిసి ప్రేమించరు - ప్రేమించాకే …ప్రేమంటే ఏమిటోతెలుస్తుంది’’ అంటారు. మనం చెట్లు నరుక్కుంటూపోతున్నాం.. నగరాలన్నీ కాంక్రీటు వనాలవుతున్నాయి. అభివృద్ధి పేరుతో అడవుల్ని కాంక్రీటు జంగిల్ గా మారుస్తున్నాం.  వన్యజీవులు ఎక్కడ బతకాలి? అని ప్రశ్నిస్తారు.  సుఖం వేరు..ఆనందం వేరు. ఈ రెంటిలో ఆనందమే. పరమోన్నతమైంది..!! అని తెలిపారు. బడి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంపై నోరుజారిన ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావుని ‘ప్రవచనమా... విరోచనమా..?’ అని ఉతికి ఆరేశారు. వందేమాతరం పాటపై కూడా చక్కటి వివరణ ఇచ్చారు. వెంకటేశ్వరుడిని రాజకీయాల్లోకి లాగి నందుకు బాధపడతారు. అలా చేయకండ్రా బాబూ అని వేడుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన తన రచనల ద్వారా మత సామరస్యం కోసం ప్రయత్నిస్తారు. వీటన్నిటినీ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు.  వేల మంది జీవితాలు, వారి రచనలపై స్పందించారు. విమర్శించారు. మెచ్చుకున్నారు. ఆ విధంగా ఆయన జీవితమే సాహిత్యంతో పెనవేసుకుపోయింది.  ఒక్క మనిషి ఇన్ని రాశారా?! అని ఆశ్చర్యపోతున్నారా? అవును. ఫేస్ బుక్ సాక్షిగా ఇది నిజం.  సాహితీ అభిమానులకు రజాహుస్సేన్ రచనలు తిరగేయడం అంటే ఓ పండుగ.  

రజా హుస్సేన్ పేరు కోసమో, సంపాదన కోసం ఇంతటి సాహిత్యాన్ని మనకు అందించడంలేదు. అది ఆయన ప్రవృత్తి. అత్యంత ఇష్టంగా రాస్తారు. సాహితీ వేత్తలన్నా, శ్రమజీవులన్నా ఆయనకు అంత ప్రేమ. కాఫీ విత్..... పేరిట రాసినవాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని తన సొంత ఖర్చులతో పుస్తక రూపంలో తీసుకురావడం కూడా ఆయన ప్రారంభించారు. మొదటిసారిగా ‘కాఫీ విత్ గోలి మధు’ అనే పుస్తకాన్ని బయటకు తెచ్చారు. భవిష్యత్తులో ఆయన రచనలపై ఎంఫిల్,  పీహెచ్‌డీ చేసే అవకాశం ఉంది.  సాహితీ ప్రపంచంలో  ఇంతటి సాహిత్యాన్ని గుమ్మరిస్తున్న రజా హుస్సేన్ కు ఆ స్థాయిలో తగిన గుర్తింపు రాలేదు. అందుకు ఆయన ముక్కుసూటి రాతలే అయి ఉండవచ్చన్నది నా భావన. అయితే, ఆయన సాహిత్య సృష్టిని ఎవరూ మెచ్చుకోకుండా ఉండలేరు.  అభిమానుల ప్రశంసలకు మించిన అవార్డులు ఏముంటాయని రజా హుస్సేన్ అంటారు. అది కూడా నిజమే కదా! అది కూడా కాదు అదే నిజం.

నేను 2014లో ప్రముఖ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ‘రామ్ గోపాల్ వర్మకు తిక్క: ఒక పరిశీలన’ శీర్షికన  రాస్తూ,  భవిష్యత్ లో అతనిపై  యూనివర్సీటీలలో  సినిమా - జర్నలిజం - సైకాలజీ - యాడ్స్ - కామర్స్ -హిస్టరీ...వంటి  డిపార్ట్ మెంట్లలో  పీహెచ్ డీలు చేసే అవకాశం ఉందని రాశాను. అయిదేళ్ల తర్వాత అతనిపై పీహెచ్ డీ చేయడం మొదలైంది.  అలాగే, సాహిత్య గని అయిన రజా హుస్సేన్ రచనలపై కూడా తప్పక పీహెచ్ డీ చేస్తారని భావిస్తున్నాను.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914





Mar 22, 2026

సాహితీ వనంలో విరబూసిన రజా హుస్సేన్

ఫేస్ బుక్‌లో కాఫీ విత్... పేరుతో 3220 ఎపిసోడ్స్ రికార్డ్


ఫేస్ బుక్ వేదికగా ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, జర్నలిస్ట్  అబ్దుల్ రజా హుస్సేన్ సాహిత్యంలో ఓ రికార్డ్ సృష్టించి, సాహితీ శిఖరానికి చేరుకున్నారు. కాఫీ విత్..... పేరిట సాహితీ విమర్శలను ప్రారంభించి  ఏకధాటిగా  3220 (మార్చి 21-అన్నమయ్య / చలం) ఎపిసోడ్స్ తో కొనసాగిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో అన్నమయ్య -చలం మధ్య పోలిక వివరించారు. వారిద్దరి మధ్య పోలికేంటని ఆశ్చర్యపోకండి. చదివితే తెలుస్తుంది.   3195 ఎపిసోడ్ లో  కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం పొందిన  నందిని సిధారెడ్డి రచించిన దీర్ఘకవిత “అనిమేష” (ఉపద్రవ గాధకావ్యమ్) నూరుపాళ్ళు అకాడెమీ పురస్కారానికి అర్హమైందని పేర్కొన్నారు.ఈ సాహితీ ప్రవాహం ఆగేదికాదు. ఇలాగే కొనసాగుతుంది. అంతేకాకుండా,  చిత్రకళా పరిమళం -407 ఎపిసోడ్స్, కొత్త పుస్తకం-278(బీఎస్ రాములు ఆత్మకథ),  మనసు విప్పి కాస్సేపు -175(ఆనందో పరబ్రహ్మ), సక్సెస్ స్టోరీలు-192, రమదాన్ - 25 ఎపిసోడ్స్, పచ్చి జ్ఞాపకం...మొదలైన శీర్షికల పేర్లతో వేలకు వేలు  రాశారు. రాస్తున్నారు.  ఈ మధ్య తన కవిత్వానికి, విశ్లేషణలకు అందమైన, అద్భుతమైన ఫొటోలను కూడా జతచేసి మరీ పోస్ట్ చేస్తున్నారు. 

 మార్చి 21 ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా  ‘‘ప్రజల దగ్గరకు వెళ్ళేది. ప్రజలతో  మమేకమయ్యేది  కవిత్వం .!!’’ అని మొదలుపెట్టి  మనకు తెలిసిన అనేక మంది కవుల ‘ఆకు పచ్చని జ్ఞాపకాలు’ రాశారు.  ఉద్యోగ విరమణ తర్వాత ఆయన రాయడమే పనిగా పెట్టుకున్నారు. అలుపెరగకుండా రాస్తున్నారు. సాహితీ లోతులను తవ్వితీస్తున్నారు.  కొత్త పుస్తకాలను, కొత్త రచయితలను సాహిత్యలోకానికి పరిచయం చేయడమే పనిగా పెట్టుకున్నారు. గతంలో ‘యువ సంతకాలు’ శీర్షికన నాగభైరవ కోటేశ్వరరావు ‘వార్త’ ఆదివారం అనుబంధంలో యువ కవులను పరిచయం చేశారు. అయితే, ఆయన ఓ 200 మందికిలోపే పరిచయం చేశారు. అది పత్రిక అయినందున పరిమితి ఉంటుంది. ఫేస్ బుక్ అయినందున రజా హుస్సేన్ కు ఆ పరిమితిలేదు.  ఓ కవి, ఆయన రాసిన పుస్తకం, రచన, కవిత్వం వెలుగులోకి రావాలంటే, చాలా రకాల సంబంధాలతో ముడిపడి ఉంటుంది. అయితే, రజా హుస్సేన్ కు అవేమీ పట్టవు. మనిషి జీవన శైలి, పుస్తకం, రచన, కవిత్వం నచ్చితే చాలు వెలుగులోకి తీసుకువస్తారు.  ఆ విధంగా కొత్త రచయితలకు ఆరాధ్యుడయ్యారు.

 రజా హుస్సేన్ రాతల పోకడకు ప్రపంచమే హద్దు. రచయితలు, కవులు, కళాకారులు, నటులు, వృత్తి నిపుణులు..... ఇలా మనిషిలో ఏ నైపుణ్యం ఉన్నా గుర్తించి, మరీ వెలుగులోకి తీసుకురావడం ఆయన ప్రత్యేకత. పురాతన కవుల దగ్గర నుంచి గురజాడ అప్పారావు,  కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ...... వంటి వారు మొదలుకొని ఖలీల్ జిబ్రాన్ .... వంటివారితోపాటు నేటి తరం యువకవుల వరకు.... గోసంగీల జీవితాలపై  పలు రచనలు చేసిన ప్రముఖ తెలుగు రచయిత, పరిశోధకులు గనిశెట్టి రాములు, ఒగ్గు కళకు జీవితాన్ని అంకితం చేసిన తొలి మహిళా కళాకారిణి మల్లారి, జార్ఖండ్ డైనమెట్,  డైనమిక్ చిత్రకారుడు మహతో మనీష్ కుమార్, చిత్రాలయ రాజు  ప్రత్తిపాటి రాజు, బలిజేపల్లి లక్ష్మీకాంతం,  శేషేంద్ర శర్మ, వెల్చాల కొండలరావు, డాక్టర్. వేదాంతం రామలింగశాస్త్రి,  రావిరంగారావు,  గోలి మధు, ఇషాక్ హుస్సేన్(ఇష్క్), షేక్ కరిముల్లా, తేళ్ళ అరుణ, మంజువాణి కొండపి , జ్యోతిర్మయి మళ్ళ, డాక్టర్ రాయదుర్గం విజయలక్ష్మి, పోర్షియా దేవి, భాగ్యలక్ష్మి నల్లా,  నల్లి ధర్మారావు, సినీ ప్రముఖులు కాంచనమాల, కె.విశ్వనాథ్, ఎన్టీఆర్, అక్కినేని, సావిత్రి, జమున....... వంటి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు,   పురాణాలు,  పురాతన భవనాలలో కళా నైపుణ్యం, శ్రీవెంకటేశ్వర శుప్రభాతం...... ఇలా ఎవరినీ, దేనిని వదిలిపెట్టరు.  అన్ని రంగాల వారిని, అన్ని అంశాలను విశ్లేషించారు. సాహితీ పంట పండిస్తున్నారు.  ఎవరి గురించైనా రాసే ముందు అతను ఆస్తికుడా?, నాస్తికుడా?,  హేతువాదా?, ఏ మతం?, ఏ జాతి?,  ఏ కులం?, ఏ పార్టీ?, చేనేత ఉద్యమకారుడా?,  నక్సలైట్ ఉద్యమకారుడా?..... అనేవి అస్సలు పట్టించుకోరు.  అతనిలో తనకు నచ్చిన ప్రతిభ గురించే ఆలోచిస్తారు. అధ్యయనం చేస్తారు. సారం మనకు అందిస్తారు.    

అభ్యుదయ కవిత్వం నుంచి ప్రేమ కవిత్వం వరకు మనసుకు హత్తుకునేవిధంగా రజా హుస్సేన్ రాస్తారు. ‘స్పర్శ’ పై ఆయన చాలా అద్భుతంగా  రాశారు. ఆయన చాలా వివరంగా రాసినప్పటికీ,  దానిని చదివితే, మనకు ఇంకా అనేక స్పర్శలు,  వాటి ప్రభావాలు, ఫలితాలు... గుర్తుకు వస్తాయి. ఒక్కో డాక్టర్ స్పర్శని హస్తవాసి అంటారు. అది కూడా అలాంటిదే.  ‘‘ఈ ప్రేమ వుందే మా చెడ్డది…. ఎవరూ… తెలిసి ప్రేమించరు - ప్రేమించాకే …ప్రేమంటే ఏమిటోతెలుస్తుంది’’ అంటారు. మనం చెట్లు నరుక్కుంటూపోతున్నాం.. నగరాలన్నీ కాంక్రీటు వనాలవుతున్నాయి. అభివృద్ధి పేరుతో అడవుల్ని కాంక్రీటు జంగిల్ గా మారుస్తున్నాం.  వన్యజీవులు ఎక్కడ బతకాలి? అని ప్రశ్నిస్తారు.  సుఖం వేరు..ఆనందం వేరు. ఈ రెంటిలో ఆనందమే. పరమోన్నతమైంది..!! అని తెలిపారు. బడి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంపై నోరుజారిన ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావుని ‘ప్రవచనమా... విరోచనమా..?’ అని ఉతికి ఆరేశారు. వందేమాతరం పాటపై కూడా చక్కటి వివరణ ఇచ్చారు. వెంకటేశ్వరుడిని రాజకీయాల్లోకి లాగి నందుకు బాధపడతారు. అలా చేయకండ్రా బాబూ అని వేడుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన తన రచనల ద్వారా మత సామరస్యం కోసం ప్రయత్నిస్తారు. వీటన్నిటినీ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు.  వేల మంది జీవితాలు, వారి రచనలపై స్పందించారు. విమర్శించారు. మెచ్చుకున్నారు. ఆ విధంగా ఆయన జీవితమే సాహిత్యంతో పెనవేసుకుపోయింది.  ఒక్క మనిషి ఇన్ని రాశారా?! అని ఆశ్చర్యపోతున్నారా? అవును. ఫేస్ బుక్ సాక్షిగా ఇది నిజం.  సాహితీ అభిమానులకు రజాహుస్సేన్ రచనలు తిరగేయడం అంటే ఓ పండుగ.  

రజా హుస్సేన్ పేరు కోసమో, సంపాదన కోసం ఇంతటి సాహిత్యాన్ని మనకు అందించడంలేదు. అది ఆయన ప్రవృత్తి. అత్యంత ఇష్టంగా రాస్తారు. సాహితీ వేత్తలన్నా, శ్రమజీవులన్నా ఆయనకు అంత ప్రేమ. కాఫీ విత్..... పేరిట రాసినవాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని తన సొంత ఖర్చులతో పుస్తక రూపంలో తీసుకురావడం కూడా ఆయన ప్రారంభించారు. మొదటిసారిగా ‘కాఫీ విత్ గోలి మధు’ అనే పుస్తకాన్ని బయటకు తెచ్చారు. భవిష్యత్తులో ఆయన రచనలపై ఎంఫిల్,  పీహెచ్‌డీ చేసే అవకాశం ఉంది.  సాహితీ ప్రపంచంలో  ఇంతటి సాహిత్యాన్ని గుమ్మరిస్తున్న రజా హుస్సేన్ కు ఆ స్థాయిలో తగిన గుర్తింపు రాలేదు. అందుకు ఆయన ముక్కుసూటి రాతలే అయి ఉండవచ్చన్నది నా భావన. అయితే, ఆయన సాహిత్య సృష్టిని ఎవరూ మెచ్చుకోకుండా ఉండలేరు.  అభిమానుల ప్రశంసలకు మించిన అవార్డులు ఏముంటాయని రజా హుస్సేన్ అంటారు. అది కూడా నిజమే కదా! అది కూడా కాదు అదే నిజం.

నేను 2014లో ప్రముఖ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ‘రామ్ గోపాల్ వర్మకు తిక్క: ఒక పరిశీలన’ శీర్షికన  రాస్తూ,  భవిష్యత్ లో అతనిపై  యూనివర్సీటీలలో  సినిమా - జర్నలిజం - సైకాలజీ - యాడ్స్ - కామర్స్ -హిస్టరీ...వంటి  డిపార్ట్ మెంట్లలో  పీహెచ్ డీలు చేసే అవకాశం ఉందని రాశాను. అయిదేళ్ల తర్వాత అతనిపై పీహెచ్ డీ చేయడం మొదలైంది.  అలాగే, సాహిత్య గని అయిన రజా హుస్సేన్ రచనలపై కూడా తప్పక పీహెచ్ డీ చేస్తారని భావిస్తున్నాను.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914



అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం

రాజధాని అమరావతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్(అమెండ్‌మెంట్) బిల్-2026ని రాజ్యసభ గురువారం  ఆమోదించింది.   మూజువాణి ఓటుతో బిల్లు ఆమోద...