Apr 23, 2026

ఏపీలో ప్లాస్టిక్ ఫ్రీ విప్లవం


రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్రీ విప్లవం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుంది. చంద్రబాబు నాయకత్వంలో మానవ వనరులు అభివృద్ధి,  విద్య,  ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేష్ సహకారంతో   స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఈ ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకువెళుతున్నారు. ప్లాస్టిక్ వాడకం పెరిగిపోవడం వల్ల మానవాళికి, పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది.   మనుషులకు, జంతువులకు అత్యంత ప్రమాదకరమైన మైక్రో ప్లాస్టింగ్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసేందుకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్  చర్యలు తీసుకుంటోంది. ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి వందల ఏళ్లు పడుతుంది.  మైక్రో, నానో రూపాల్లో ప్లాస్టిక్ మన శరీరంలోకి, పశువుల కడుపులోకి చొచ్చుకుపోతుంది.   చివరికి పసికందుల రక్తంలోకి కూడా చేరుతోందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.  ఇంతటి ప్రమాదకరమైన  ప్లాస్టిక్‌కు బ్రేక్ వేయాలన్న ఉద్దేశంతో  ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా జనపనార, కాటన్ సంచుల వినియోగాన్ని  ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.  ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టి భావితరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు,  నేలను అందించాలన్నది సీఎం చంద్రబాబు ఆకాంక్ష. ఇందుకు ప్రజల భాగస్వామ్యం కూడా ముఖ్యం. ఇదే అసలైన గేమ్ ఛేంజర్. ఇందుకోసం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ప్లాస్టిక్ కాలుష్యంపై ప్రజలలో,  ఉద్యోగులలో, విద్యార్థులలో  విస్తృత ప్రచారం ద్వారా అవగాహన కల్పిస్తోంది.  ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, రీసైకిల్ చేయడానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.  రాష్ట్రంలోని ఉపాధ్యాయులు,  విద్యార్థులు,  వ్యాపార, వివిధ అసోసియేషన్ల, రిటైర్డ్ ఉద్యోగుల, స్వయం సహాయక సంఘాల,  మహిళా సంఘాల సహకారంతో ఈ గేమ్ ఛేంజర్ ని తీసుకురానుంది.  క్లాత్ బ్యాగ్‌లు, జూట్ బ్యాగ్‌లు, పేపర్ ప్యాకేజింగ్ తయారీకి మహిళా సంఘాలను భాగస్వాములను చేస్తోంది. ‘క్లీన్ ఏపీ – గ్రీన్ ఏపీ’ అన్న నినాదంతో  స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్  ముందుకు వెళుతోంది.




పట్టాభిరామ్ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత రాష్ట్రపతి చేతులమీదుగా కార్పొరేషన్ 5 జాతీయ అవార్డులు అందుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25  అవార్డులలో ఆంధ్రప్రదేశ్‌కు ఐదు జాతీయ పురస్కారాలు లభించాయి.  విజయవాడ, తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లు ఈ అవార్డులను కైవసం చేసుకున్నాయి. స్పెషల్‌ కేటగిరీ మినిస్టీరియల్‌ అవార్డు విశాఖ నగరానికి, రాష్ట్ర స్థాయి మినిస్టీరియల్‌ అవార్డు రాజమహేంద్రవరం నగరానికి, స్వచ్ఛ సూపర్‌లీగ్‌ సిటీస్‌ అవార్డులు విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలకు దక్కాయి. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఏపీ పురపాలక శాఖ ఈ అవార్డులను అందుకుంది. 

రెండు వేలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలతో చెత్తను శుభ్రపర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో చెత్త పేరుకుపోకుండా ఉండేదుకు 75 వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్లు, 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ‘స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా 2025 అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ (గ్గాసులు, కవర్లు, బాటిళ్లు, స్ట్రాలు...)ను పూర్తిగా నిషేధించే చర్యలకు పూనుకుంది. వచ్చే జూన్ నాటికి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం. అమరావతిలోని సచివాలయం నుంచి మొదలు పెట్టి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్  కార్యాలయం,   రాష్ట్రంలోని  26 జిల్లాల్లోని 20 జిల్లాల్లో ఇప్పటికే  62 మునిసిపల్ కార్యాలయాలలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించారు. వాటిని  సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ కార్యాలయాలుగా మార్చారు. ఈ కార్యాలయాల్లో ప్లాస్టిక్ బదులు త్రాగునీటి కోసం గాజు, స్టీల్ బాటిళ్లు ... వంటి ప్రత్యామ్నాయాలను వినియోగిస్తున్నారు.  రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ కార్యాలయాలలో కూడా త్వరలోనే ఈ నిషేధం విధిస్తారు.

స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్‌కు 2025 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక స్కాచ్ గోల్డ్ అవార్డ్ లభించింది. అమరావతిలోని సచివాలయాన్ని అత్యుత్తమ పనితీరుతో దేశంలోనే మొదటిసారిగా ప్లాస్టిక్ ఫ్రీ సెక్రటేరియట్ గా మార్చినందుకు కార్పోరేషన్‌కు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. ఢిల్లీలో మార్చి నెలలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్‌ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ డి.దశరధరామిరెడ్డి ఈ అవార్డుని అందుకున్నారు. ఆ అవార్డును కార్పొరేషన్ ఎండీ బి.అనిల్ కుమార్ రెడ్డి, ఈడీ అర్జునరావులు  స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్‌ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు అందజేశారు. త్వరలో లక్ష్యాన్ని చేరుకునే విధంగా, ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వారిలో చైతన్యం కలిగించే విధంగా ప్రభుత్వం అనేక రూపాలలో ప్రచారం నిర్వహిస్తోంది.  గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన చెత్త పన్నుని కూటమి ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. అంతే, కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  తన స్టైల్లో  చెత్త నుంచి సంపద సృష్టించే ప్రక్రియలను కూడా ప్రారంభించారు.  సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ గ్లాసులు, సీసాలు, కవర్లు, సంచులు.... వంటి వాటిని ఇస్తే ప్రోత్సాహక బహుమతులు ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా  కొన్ని పట్టణాలలో,  గ్రామాలలో అమలు చేస్తున్నారు.  కొన్ని పట్టణాలలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌ సేకరణ కేంద్రానికి వెళ్లి ఇస్తే, అక్కడ నిత్యావసర వస్తువులు వంటి వాటిని బహుమతులుగా ఇస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో  ప్లాస్టిక్ వేస్ట్ ఇస్తే, నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు.  ఇందు కోసం తెనాలి మున్సిపల్‌ కార్యాలయం, శివాజీ చౌక్‌లలో ప్లాస్టిక్‌ ప్రత్యేక  సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు.  విద్యార్థులు పాత పుస్తకాలు, కార్డు బోర్టులు... వంటివాటిని ఇస్తే వారికి ప్రశంసా పత్రాలతోపాటు కొత్త పుస్తకాలు బహుమతిగా అందజేస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి,  వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ‘స్వచ్ఛ రథం’ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని  ప్రారంభించింది. ఇందులో చెత్తను (ప్లాస్టిక్, బాటిళ్లు వంటివి) ఇచ్చి, అందుకు ప్రతిఫలంగా నిత్యావసర సరుకులను పొందుతారు. ఈ కార్యక్రమం ద్వారా చెత్తను రీసైక్లింగ్ చేసి, గ్రామాల పరిశుభ్రతను పెంచుతూ,  ప్రజలకు ప్రయోజనం, పర్యావరణానికి రక్షణ చేకూరుస్తున్నారు.  ప్రస్తుతం 25 ప్రాంతాల్లో స్వచ్ఛ రథాలు పనిచేస్తున్నాయి.  వాటి ద్వారా పొడి చెత్తను సేకరిస్తున్నారు. స్వచ్ఛ రథాల సంఖ్య త్వరలో వందకు పెంచుతారు.

స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కు చంద్రబాబు నాయుడే బ్రాండ్ అంబాసిడర్. ప్రతినెలా 3వ శనివారం స్వచ్ఛాంధ్ర డేగా ప్రకటించి, స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర పేరిట పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలలో సీఎం చంద్రబాబు తప్పనిసరిగా పాల్గొంటున్నారు. 12 వేలకు పైగా ట్రైసైకిల్స్, ఇతర వాహనాల ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఐదు లక్షల ఇళ్లల్లో హోం కంపోస్టు తయారు చేయాలన్నది లక్ష్యం. ప్రస్తుతం 3.91 లక్షల ఇళ్లల్లో జరుగుతోంది. గ్రామీణ ప్రాంతంలో పది లక్షల ఇళ్లల్లో హోం కంపోస్టు తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.  త్వరలోనే ఆ లక్ష్యానికి చేరుకుంటారు.

సర్క్యులర్ ఎకానమీలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లను, పార్కులను ప్రభుత్వం  ఏర్పాటు చేస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి  ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి, వేరు చేసి, శుభ్రపరుస్తారు.  యంత్రాల ద్వారా చిన్న ముక్కలుగా చేసి, కరిగించి, గుళికలు లేదా రేకులు  తయారు చేస్తారు. ఈ గుళికలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తనిఖీ చేస్తారు. వాటిని మళ్లీ కొత్త ప్లాస్టిక్ వస్తువుల తయారీకి ఉపయోగిస్తారు. ఈ రకంగా చేయడం ద్వారా తక్కువ ముడిపదార్థాలతో  కొత్త ప్లాస్టిక్‌ వస్తువులు  ఉత్పత్తి అవుతాయి. భూమిలో ప్లాస్టిక్ పేరుకుపోవడం తగ్గుతుంది. ఆ విధంగా మనం త్వరలోనే స్వచ్ఛ అంధ్రని, స్వర్ణ అంధ్రని చూడబోతున్నాం.

 -      శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ -9440222914

Apr 17, 2026

భార్యకు భర్త ఇచ్చే భరణం... సుప్రీంకోర్టు వ్యాఖ్యానం

 భార్య పోషణ భర్త ప్రాథమిక, నిరంతర బాధ్యత అంటూ సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. భార్య గౌరవప్రదంగా జీవించేలా భర్త ఈ బాధ్యతను నెరవేర్చాల్సి ఉంటుందని పేర్కొంది. భరణం న్యాయబ ద్ధంగా, సహేతుకంగా ఉండాలని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఆగస్టీన్ జార్జి మసీహ్ ల ధర్మాసనం  తెలిపింది. 

 కేస్ నంబర్: SLP (Crl) No. 13247/2024
 కిరణ్ జ్యోతి వర్సెస్ అమిత్ కుమార్ (ఉత్తరాఖండ్)

  ధర్మాసనం:జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఆగస్టీన్ జార్జి మసీహ్.

న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు:

 1. భర్త ఆర్థిక స్తోమత:  భర్త ఆదాయం, ఆస్తులను బట్టి భరణం నిర్ణయించాలి. ఈ కేసులో భర్త ఆదాయం సుమారు నెలకు రూ. 50,000 నుండి 60,000 వరకు ఉందని ప్రాథమికంగా గుర్తించిన కోర్టు, గతంలో ఉన్న రూ. 15,000 భరణాన్ని తక్కువగా భావించి దానిని రూ. 25,000 కు పెంచింది.

 2. మహిళల హక్కులు:  భరణం అనేది భర్త ఇచ్చే భిక్ష కాదని, అది భార్య యొక్క చట్టబద్ధమైన హక్కు అని ధర్మాసనం గుర్తుచేసింది. మహిళ తన పుట్టింటిపై ఆధారపడకుండా, గౌరవప్రదంగా జీవించేలా భర్త భరోసా కల్పించాలని పేర్కొంది.

 3. తక్కువ మొత్తాలపై అభ్యంతరం:  కేవలం రూ. 8,000 లేదా రూ. 10,000 వంటి మొత్తాలు నేటి కాలంలో ఒక వ్యక్తి గౌరవప్రదంగా జీవించడానికి, కనీస అవసరాలు (ఆహారం, వసతి, వైద్యం) తీర్చుకోవడానికి సరిపోవని కోర్టు అభిప్రాయపడింది.

 4. సామాజిక హోదా:  వివాహం తర్వాత దంపతులు కలిసి ఉన్నప్పుడు అనుభవించిన జీవన ప్రమాణాలను (Standard of Living), విడిపోయిన తర్వాత కూడా భార్యకు కల్పించాల్సిన బాధ్యత భర్తపై ఉంటుంది.

 ఫ్యామిలీ కోర్టు తీర్పు:  చంపావత్ ఫ్యామిలీ కోర్టు మొదట రూ. 8,000 నిర్ణయించింది.

 హైకోర్టు సవరణ: ఉత్తరాఖండ్ హైకోర్టు దీనిని రూ. 15,000 కు పెంచింది.

 సుప్రీంకోర్టు అంతిమ తీర్పు: బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆమె అవసరాలను మరియు భర్త ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని దీనిని రూ. 25,000 కు ఖరారు చేసింది.


ఈ తీర్పు దేశవ్యాప్తంగా భరణం కేసులలో ఒక ముఖ్యమైన మార్గదర్శకంగా నిలుస్తుంది.  గౌరవప్రదమైన జీవనం, సహేతుకమైన భరణం అనే అంశాలకు పెద్దపీట వేసింది.

తెలంగాణలో ఏ సామాజిక వర్గం ఎంత ఉందంటే?


https://des.telangana.gov.in/


రాష్ట్రంలో బీసీ జనాభా 46.25 శాతం, ముస్లిం బీసీ జనాభా 10.08 శాతం

ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతం

ఓసీ జనాభా 13.21 శాతం, ముస్లిం ఓసీ జనాభా 2.48 శాతం


తెలంగాణ రాష్ట్రంలో ఏయే సామాజిక వర్గాలు ఎంత శాతం ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో వెల్లడైంది. ఈ అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్‌గా ఉన్న బీసీ ఉప సంఘానికి ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, నోడల్ అధికారి అనుదీప్ దురిశెట్టి సర్వే నివేదికను అందజేశారు.

సర్వేలో 96.9 శాతం మంది లేదా 3.54 కోట్ల మంది పాల్గొన్నారు. 3.1 శాతం మంది లేదా 16 లక్షల మంది సర్వేకు అందుబాటులో లేకుండా దూరంగా ఉన్నారు.

ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో బీసీ జనాభా 46.25 శాతంగా ఉంది. ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45 శాతం, ఓసీలు 15.79 శాతం ఉన్నారు.

సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం, తెలంగాణలో మొత్తం 1,15,79,457 కుటుంబాలు ఉన్నాయి. ఈ సర్వేలో 1,12,15,134 (96.4 శాతం) కుటుంబాలు పాల్గొన్నాయి. సర్వేకు దూరంగా 3,64,323 (3.1 శాతం) కుటుంబాలు ఉన్నాయి. సర్వేలో 3,54,77,554 కోట్ల జనాభా పాల్గొంది. సర్వేకు దూరంగా 16,00,000 మంది ఉన్నారు.

జనాభాలో పురుషులు 1,79,21,183 (50.51 శాతం) మంది, మహిళలు 1,75,42,597 (49.45 శాతం) మంది ఉండగా, థర్డ్ జెండర్ 13,774 (0.04 శాతం) మంది ఉన్నారు.

సామాజిక వర్గాల వారీగా చూస్తే బీసీ జనాభా 1,64,09,179 (46.25 శాతం), ఎస్సీ 61,84,319 (17.43 శాతం), ఎస్టీ 37,05,929 (10.45 శాతం), ఓసీ 47,21,115 (13.21 శాతం), ముస్లిం బీసీ 35,76,588 (10.08 శాతం), ముస్లిం ఓసీ జనాభా 8,80,424 (2.48 శాతం) ఉన్నారు.

తెలంగాణలో 7 కులాల చేతుల్లోనే సగానికి పైగా భూమి

రాష్ట్ర కులగణన సర్వేలో భూ యాజమాన్యానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర జనాభాలో 32 శాతంగా ఉన్న రెడ్డి, యాదవ, లంబాడీ, ముదిరాజ్, మున్నూరుకాపు, కురుమ, కోయ కులాలు మొత్తం భూముల్లో 51.4 శాతాన్ని కలిగి ఉన్నాయి. 4.8 శాతం జనాభా కలిగిన రెడ్డి సామాజిక వర్గం అత్యధికంగా 13.5 శాతం భూమితో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఎస్సీ మాదిగ వంటి సామాజిక వర్గాల్లో 90 శాతం కుటుంబాలకు 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నట్లు సర్వే తేల్చింది.


తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మొత్తం భూముల్లో సగానికి పైగా కేవలం ఏడు కులాల యాజమాన్యంలోనే ఉందని తేలింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేలో భూ యాజమాన్యానికి సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం సాగు భూమి 1.37 కోట్ల ఎకరాలు కాగా.. సగానికి పైగా రెడ్డి, యాదవ, లంబాడీ, ముదిరాజ్, మున్నూరుకాపు, కురుమ, కోయ కులాల చేతుల్లో ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్ర జనాభాలో వీరు 32 శాతం కాగా.. వీరి వద్ద ఉన్న భూమి మాత్రం 51.4 శాతంగా ఉంది. అంటే జనాభా నిష్పత్తి కన్నా భూ యాజమాన్యం వీరి వద్దే అధికంగా ఉంది.

ఓసీ విభాగంలోని రెడ్డి కులం భూ యాజమాన్యంలో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్ర జనాభాలో ఈ కులం వాటా కేవలం 4.8 శాతం కాగా.. రాష్ట్రంలోని మొత్తం భూముల్లో 13.5 శాతం భూమి వీరి యాజమాన్యంలోనే ఉంది. వీరితో పాటు మరో 25 కులాలు తమ జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ భూమిని కలిగి ఉండగా.. మిగిలిన అనేక కులాలు జనాభా కంటే తక్కువ భూమితో సరిపెట్టుకుంటున్నాయి. రెడ్డి కులం తర్వాత 5.7 శాతం ఉన్న యాదవ కులం వారి వద్ద 8.7 శాతం భూమి ఉంది. ఎస్టీ లంబాడా జనాభా 6.8 కాగా.. భూమి 8.6 ఉంది. ముదిరాజ్ జనాభా 7.4 శాతం కాగా.. భూమి 7.8 శాతం కలిగి ఉంది. మున్నూరు కాపు 3.9 శాతం జనాభా ఉండగా.. భూమి 6.4 శాతం కలిగి ఉన్నారు. కురమ 2.2 శాతం జనాభా ఉండగా.. భూమి 3.6 శాతం ఉంది. కోయ 1.2 శాతం ఉండగా.. భూమి 2.8 శాతం కలిగి ఉన్నారు. ఇలా ఈ ఏడు కులాల మెుత్తం జనాభా 32 శాతం కాగా.. వీరి వద్ద ఉన్న భూమి మాత్రం 51.4 శాతంగా ఉంది.

బీసీ-బి కేటగిరీకి చెందిన కురుబ, కురుమ కులాల్లో భూమి ఉన్న కుటుంబాల సంఖ్య అత్యధికంగా ఉంది. ఈ కులాల్లో దాదాపు 62 శాతం కుటుంబాలకు సొంత భూమి ఉంది. వీరి తర్వాత ఆరేవాళ్లు, ఎస్టీ విభాగంలో కోయ, లంబాడీలు, ఎస్సీ విభాగంలో మాదాసి కులాల్లో దాదాపు 60 శాతం కుటుంబాలు భూ యాజమాన్యం కలిగి ఉన్నాయి. అయితే, ఓసీ విభాగంలోని రాజులు, బ్రాహ్మణులు, ముస్లింలు, జైన్లలో భూమి ఉన్న కుటుంబాల శాతం 10 కంటే తక్కువగా ఉండటం విశేషం. ఎస్సీ మాదిగ 10.3 శాతం ఉండగా.. భూమి 6.5 శాతంగా ఉంది. ముస్లిం 7.9 శాతం జనాభా కాగా.. భూమి 2.0 శాతం ఉంది. ఓసీ వెలమ 0.4 శాతం జనాబా ఉండగా.. భూమి 1 శాతం ఉంది.

పెద్ద కమతాలు (5-20 ఎకరాలు): ఓసీ రాజులు, బ్రాహ్మణులు, కాపులు, ఎస్టీ గోండు, కోయ కులాల్లో భూమి ఉన్న వారిలో 30 శాతం కుటుంబాలకు 5 నుంచి 20 ఎకరాల వరకు భూమి ఉంది.

చిన్న కమతాలు (5 ఎకరాల లోపు): ఎస్సీ బేడ, మాదిగ కులాల్లో 90 శాతం కుటుంబాలకు 5 ఎకరాల కన్నా తక్కువ భూమి మాత్రమే ఉంది.

భారీ కమతాలు (20 ఎకరాల పైబడి): 20 ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్న కుటుంబాలు అత్యధికంగా జైన్లలో (8.2 శాతం), రాజుల్లో (7.5 శాతం), బ్రాహ్మణుల్లో (6.8 శాతం), బీసీ గంగిరెడ్లవారిలో (6 శాతం) ఉన్నాయి.

----------------------

పద్మశాలీలను బలిచేశారు

కాంగ్రెస్‌ సర్కార్‌ చేపట్టిన కులగణనలో పద్మశాలీలకు తీవ్ర అన్యాయం జరిగింది. గత ప్రభుత్వం చేపట్టిన సర్వేలో 2015లో 18 లక్షల జనాభాను చూపించారు. సర్కార్‌ తాజాగా ప్రకటించిన కులగణన సర్వేలో పద్మశాలీలను కేవలం 11,79,031గా చూపించింది. 11 ఏండ్లలో జనాభా పెరగాలి కానీ తగ్గుతుందా? ఇది పూర్తిగా బీసీల్లో పద్మశాలీలను అణగదొక్కే ప్రయత్నంగానే భావిస్తున్నాం. ఉద్దేశపూర్వకంగానే జనాభాను తక్కువగా చూపిస్తున్నారు. వాస్తవానికి 30 లక్షల నుంచి 35 లక్షల జనాభా ఉన్నది. 18 లక్షల ఉన్న జనాభా 11 లక్షలకు ఏట్లా వస్తది? అందులో 19 ఉపకులాలు ఉండగా ఉపకులాలు ఊసేలేదు. వారికి నచ్చినట్టు మార్పులు చేసుకొని డిక్లేర్‌ చేసుకున్నారు. ఎక్కువ జనాభా చూపిస్తే ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ల అధికారం కోసం, సీట్ల కోసం పద్మశాలీలను బలిపెట్టారు.

– వల్లకాటి రాజ్‌కుమార్‌, తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం అధ్యక్షుడు

Apr 16, 2026

కార్పోరేట్ ఎంఎన్‌సీ కంపెనీల కథ



నోటితో చెప్పలేక కళ్ళతో మొత్తుకుంటున్నా వినకుండా ఆ నరకాల్లో పడేసి  మన కన్నతల్లిదండ్రుల్ని మనమే అనాధల్ని చేసి ప్రేమ పేరుతో కర్కశంగా చంపాలా ?! అలా చస్తే నిజంగా ఎవరికి లాభం?!?!

కార్పొరేట్ హాస్పటల్స్ కుట్రలు - ఒక సంపూర్ణ విశ్లేషణ

- డాక్టర్ గౌతమ్ కశ్యప్


"ఇది అందరికీ ఎంతో ఎంతో ముఖ్యమైన విషయం - దీనిని అమెరికన్ పరిశోధకులే కనుగొని విస్తుపోయిన రహస్యం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందా? లేక కార్పొరేట్ కంపెనీల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉందా? అని తేల్చే పచ్చి నిజం ఇది."


అది 1961వ సంవత్సరం..

అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో 'రోసెటో' (Roseto) అనే ఒక చిన్న గ్రామం ఉంది. దాని చుట్టుపక్కల అత్యాధునిక సౌకర్యాలతో ఎన్నో కార్పొరేట్ ఆసుపత్రులు, ఫార్మా కంపెనీల నిధులతో నడిచే ల్యాబ్‌లు, పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. కానీ అక్కడ వారికి ఒక వింతైన, నమ్మశక్యం కాని పరిస్థితి ఎదురైంది. రోసెటో ఊరి నుంచి ఒక్క పేషెంట్ కూడా ఆసుపత్రులకు రావడం లేదు!

ఏ వ్యాపార సంస్థకైనా కస్టమర్స్ రాకపోతే అది ఆ వ్యాపార మనుగడకే ప్రమాదం. ఇక్కడ కూడా కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి, ల్యాబ్‌లు ఉన్నాయి, ఫార్మా కంపెనీల మందులు సిద్ధంగా ఉన్నాయి. ఆసుపత్రులకు రోగులు రాకపోతే అది వారి వ్యాపారానికి అతిపెద్ద నష్టం. అందుకే, అక్కడ ప్రజలు పరీక్షలు చేయించుకోవడం లేదేమో అని చుట్టుపక్కల హాస్పిటల్స్ యాజమాన్యాలు పోటీపడి మెడికల్ క్యాంపులు పెట్టాయి. జనం రాలేదు. ఇది వారికి ఆశ్చర్యం వేసి, టెస్టుల ఖర్చులకు భయపడి రాలేదేమో అని చివరికి 'ఉచిత పరీక్షల' పేరుతో ఆకర్షించే ప్రయత్నం చేశాయి. అయినా ఒక్క పేషంటూ రాలేదు. ఆ రోసెటో జనం మాత్రం "మాకు ఏ జబ్బు లేదు, మీ పరీక్షలు మాకు అక్కర్లేదు" అని ముఖం చాటేశారు.

ఉచిత పరీక్షలకు కూడా ఎందుకు రావడం లేదో అర్థంకాక ఎంక్వైరీ చేస్తే, అక్కడ అసలు జనానికి జబ్బులే రావడం లేదని తెలిసింది! అమెరికాతో సహా ప్రపంచమంతా కోట్ల మంది జబ్బులతో బాధపడుతుంటే, ఈ ఒక్క ఊరిలో ఎందుకు జబ్బులు లేవో తెలుసుకోవడానికి పరిశోధన బృందాలు రంగంలోకి దిగాయి. ఇక్కడ వారి లక్ష్యం ప్రజల ఆరోగ్యం పట్ల ప్రేమ కాదు—అక్కడ ఏదైనా 'రహస్యంగా రోగాలు రాకుండా చేసే కారణమేదైనా' తెలిస్తే.. దానిని కోట్ల కోట్ల డాలర్ల వ్యాపారంగా మార్చుకోవాలనే అత్యాశతో కూడిన అపరిమిత ఉత్సాహం!

ఈ మిస్టరీని ఛేదించడానికి డాక్టర్ స్టీవర్ట్ వోల్ఫ్ (Head of Oklahoma Medical Research Foundation) రంగంలోకి దిగారు. ఆయన ఏదో మామూలుగా వెళ్లలేదు.. దాదాపు 50 మంది నిపుణులతో కూడిన ఒక భారీ వైజ్ఞానిక సైన్యాన్ని వెంటబెట్టుకుని మందీ మార్బలంతో ఆ ఊరి మీద పడ్డారు. ఆ బృందంలో గుండె నిపుణులు, సామాజిక శాస్త్రవేత్తలు, గణాంక నిపుణులు ఉన్నారు. వీరు 1961 నుండి దాదాపు 30 ఏళ్ల పాటు ఆ ఊరిని ఒక ప్రయోగశాలగా మార్చి, 1895 నుండి ఉన్న ప్రతి మరణ ధృవీకరణ పత్రాన్ని జల్లెడ పట్టారు.

అక్కడ వారు గమనించిన ఒక పచ్చి నిజం ఏమిటంటే—నేడు మనం చూస్తున్న MNC కంపెనీల 'ఆహార-వైద్య' మాయాజాలం అక్కడ పని చేయడం లేదు. బయటి ప్రపంచంలో MNC కంపెనీలు ఒక వైపు హోటళ్ల ద్వారా అమ్ముతున్న వారి రుచికరమైన, ప్రాణాంతకమైన ఆహారాలను అమ్ముతూ రోగాలను సృష్టిస్తుంటే, మరో వైపు అవే కంపెనీల పెట్టుబడులు ఉన్న ఆసుపత్రులు మందులు, సర్జరీలను అమ్ముతూ కోట్లు గడిస్తున్నాయి. కానీ రోసెటోలో పరిస్థితి వేరు. వారి ఆరోగ్య రహస్యం ఏ ఫార్మా కంపెనీ మందుల్లోనూ లేదు, ఏ కార్పొరేట్ హాస్పిటల్ చేసే సర్జరీలోనూ లేదు. అది వారి 'సామాజిక ఐక్యత' (Social Bonding) లో ఉంది!

అక్కడ ఎవరూ ఒంటరిగా భోజనం చేయరు, మనుషుల మధ్య అహంకారాలు లేవు. ఒకరి కష్ట సుఖాల్లో మరొకరు మనస్ఫూర్తిగా పాలుపంచుకుంటారు. ప్రతి రోజూ ఏదో ఒక పండగే వారికి! ఒకరు వండుకున్నది మరొకరికి పెట్టి తింటారు. "నాకు ఏదైనా అయితే నా వెనుక నా ఊరంతా ఉంది" అనే అచంచలమైన భరోసా ఆ ఊరు వారిలో నిండుగా ఉంది. అదే వారిని జబ్బుల బారి నుండి కాపాడుతోంది.

మన పూర్వీకులు కూడా జబ్బును శరీరంలో కాకుండా మనసు మూలాల్లో వెతికారు. మనం కుందేళ్లలా ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తాం అనే దానికంటే, ఎంతమందితో కలిసి మనస్ఫూర్తిగా నవ్వాం అనేదే మన ఆయుష్షును పెంచుతుంది.


రోసెటోపై కార్పొరేట్ దాడి - ఒక ఆత్మీయ వ్యవస్థ విధ్వంసం

1961లో రోసెటో రహస్యం బయటపడటమే ఒక సంచలనం. కానీ "మనుషులు కలిసి ఉంటే జబ్బులు రావు" అనే సత్యం గనుక ప్రపంచానికి తెలిస్తే, తమ వేల కోట్ల డాలర్ల మందుల వ్యాపారం, జంక్ ఫుడ్ సామ్రాజ్యం కుప్పకూలిపోతుందని MNC కంపెనీలు గ్రహించాయి. అందుకే, ఆ సత్యం బయటకు వచ్చిన మరుసటి క్షణం నుంచే ఒక వ్యూహాత్మక యుద్ధాన్ని మొదలుపెట్టాయి. ఆత్మీయ బంధాల పై దాడి చేయడానికి సినిమా స్టార్లు, ఫేక్ సైకాలజిస్టులతో ఒక రకమైన 'సాంస్కృతిక యుద్ధం' (Cultural War) మొదలుపెట్టాయి.

ఆ కాలక్రమం (Timeline) మరియు కుట్రల వివరాలు ఇక్కడ చూడండి:

1964 జూన్ 8 - JAMA సంచలనం: అత్యంత ప్రతిష్టాత్మకమైన Journal of the American Medical Association (JAMA) లో ఈ పరిశోధన వివరాలు అధికారికంగా ప్రచురితమయ్యాయి. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే, ఫార్మా మరియు ఫుడ్ MNC కంపెనీలు తమ ఉనికిని కాపాడుకోవడానికి మీడియాను అస్త్రంగా చేసుకున్నాయి. అప్పటికే అమెరికాలో ప్రాచుర్యం పొందుతున్న టీవీ మాధ్యమాన్ని వాడుకుని, ప్రముఖ సినిమా స్టార్లతో ఇంటర్వ్యూలు ఇప్పించారు. ఆ ఇంటర్వ్యూలలో వారు "మాకు ప్రైవసీ (Privacy) ముఖ్యం, ఒంటరిగా గడపడం వల్లనే మేము ఇంత అందంగా, ఆరోగ్యంగా ఉన్నాం" అని అబద్ధాలు చెప్పించారు. రోసెటోలో ఉన్న ఉమ్మడి భోజనాలు, వీధి కబుర్లను 'పాత కాలపు పద్ధతులు'గా, 'అనాగరికత'గా చిత్రించారు.


FDA ద్వారా కుట్ర: రోసెటో పరిశోధన వెలువడిన కొద్ది నెలలకే (అక్టోబర్ 1964), FDA (Food and Drug Administration) ద్వారా వంట నూనెలపై కొత్త నిబంధనలు తెచ్చాయి. రోసెటో ప్రజలు వాడే సహజమైన కొవ్వులు (Lard) ప్రాణాంతకమని, వారు తయారు చేసే పారిశ్రామిక నూనెలే శ్రేష్ఠమని ప్రచారం చేయించాయి.

ఫేక్ సైకాలజిస్టుల విశ్లేషణలు & భయం: కార్పొరేట్ కంపెనీలు కొందరు పేరున్న సైకాలజిస్టులను కొనుగోలు చేసి, పత్రికల్లో వ్యాసాలు రాయించాయి. "మనుషులు అతిగా కలవడం వల్ల మానసిక స్వేచ్ఛ హరించుకుపోతుంది, అది ఒత్తిడికి దారితీస్తుంది" అని తప్పుడు సిద్ధాంతాలను ప్రచారం చేశారు. ఆత్మీయతను 'సామాజిక భారం'గా (Social Burden) మార్చడానికి ప్రయత్నించారు. పెయిడ్ డాక్టర్ల ద్వారా "ఒకరిని ఒకరు తాకడం, కలిసి భోజనం చేయడం వల్ల ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తాయి" అని ప్రజలను భయపెట్టారు. ఆత్మీయత అనే 'మందు'ను అంటువ్యాధులకు 'కారణం'గా మార్చేశారు.

వ్యక్తిత్వవాదం (Individualism) అనే విషం: 1970ల నాటికి రోసెటోలోకి విలాసవంతమైన వస్తువులను, టీవీలను ప్రవేశపెట్టాయి. "మీకంటూ ఒక ప్రత్యేక గది, ప్రత్యేక కారు ఉంటేనే గౌరవం" అని నూరిపోశాయి. దీనివల్ల ప్రజల మధ్య పోటీ పెరిగి, ఒకరి ఇళ్ల మధ్య ఒకరు భౌతికమైన మరియు మానసికమైన 'కంచెలు' (Fences) నిర్మించుకోవడం మొదలుపెట్టారు.

విధ్వంసం - తుది అంకం

ఈ నిరంతర ప్రచార దాడి వల్ల రోసెటోలోని యువత మెల్లగా తమ పెద్దల నుండి, సంప్రదాయాల నుండి దూరమవ్వడం మొదలైంది. ఆత్మీయ బంధాల కంటే 'వ్యక్తిగత విలాసాలే' జీవితాల్లో ఎంతో గొప్పవనే ఫిలాసఫీలో, ఆ భ్రమలో పూర్తిగా పడిపోయారు. సామాజిక దూరం పెరిగింది, MNC కంపెనీల జంక్ ఫుడ్ ఇంట్లోకి వచ్చింది, ఆత్మీయత ఆవిరైపోయింది.

ఫలితంగా.. మొట్టమొదటి సారిగా, 1971వ సంవత్సరంలో, రోసెటో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 55 ఏళ్ల లోపు వయసున్న వ్యక్తి తీవ్రమైన గుండెపోటుకు గురయ్యాడు. ఆయన తన ఇంట్లో, తన వారి మధ్య కన్నుమూయలేదు. పక్కనే ఉన్న కార్పొరేట్ ఆసుపత్రిలో చేరి, ఐసియులోని యంత్రాల మధ్య, ఒంటరిగా 1971, జూన్ 15 తేదీన తుది శ్వాస విడిచాడు. 

అదీ కార్పొరేట్ కంపెనీలు సాధించిన విజయం. ఇలా కార్పోరేట్ హాస్పటల్స్ ఎందరినో యంత్రాల మధ్య ఈనాటికీ హత్య చేస్తున్నాయి. ఇంట్లో చస్తే ఆ హాస్పటల్స్ వాళ్ళకి డబ్బులు రావు. ఈ విషయం మనకు అస్సలు అర్థమే కావడం లేదు. పైగా పరువు మర్యాదల పేరుతో లక్షలు తగలేసి మన సొంత వాళ్ళని మనమే చిత్రహింసల పాలు చేసి ఒంటరిగా ఆ యంత్రాల మధ్య అనాధల్ని చేసి దారుణ మరణాలకు గురిచేస్తున్నాం. ప్రస్థుతం మనం ప్రేమ ఉన్నదని అందరికీ చూపించుకోవడానికి ఎవరేమనుకుంటారో అనే సామాజిక రుగ్మతలో చిక్కుకుని మనకు ప్రేమ పంచి ఇచ్చిన వాళ్ళకు చిరి క్షణాల్లో నరకం చూపిస్తున్నాం అదీ బతికుండగానే.... హు.. 

ఇది వరకు ఇళ్ళల్లో వయసు ఉడిగిపోయాక మనందర్నీ చూస్తూ మాట్లాడుతూ హాయిగా పండులా రాలి చాలా సహజంగా సంతోషంగా ప్రకృతిలోకి వెళ్ళిపోయేవారు ఇప్పుడు????

 ఇవన్నీ నగ్న సత్యాలు. ఒంటరిగా ఏకాంతంగా ఏ డాక్టర్నైనా అడగండి. ఇవి నిజాలో కాదో...

ఒకప్పటి దాకా భారతదేశంలో కూడా మనకు ఇలాంటి వ్యవస్థే ఉండేది. అమ్మో అమ్మమ్మో ఒక పెద్ద స్టీల్ బేసిన్ లో అందరికీ కలిపి అన్నం ముద్దలు కలిపి పెట్టడం, మనం తినడం గుర్తుందా?! అట్లతద్ది నాడు పొద్దున్నే పెరుగన్నం పెట్టడం, మనం పోటీలు పడుతూ తినడం, ఆడుకోమ్మని చెపితే బయటికి వెళ్ళడం, కచ్చికతో పుల్ల పెట్టి పళ్ళు తోముకోవడం.. ఇప్పుడు ఏమైపోయాయ్?!! అలా ఇప్పుడు ఎక్కడన్నా కనబడితే మనమే మనల్ని తక్కువగా చూస్తూ వెక్కిరించుకుంటున్నాం.

మనమీద మనకున్న నమ్మకాన్ని కార్పొరేట్ కంపెనీలు ఎలా విచ్చిన్నం చేస్తాయో, ఎలా వారి క్రిందికి తెచ్చుకుంటాయో అర్థమైంది అనుకుంటాను. మేల్కొనండి! మన ఆరోగ్యం మన ఆత్మీయతలోనే ఉంది.


- Dr. Gautham Kashyap PhD.,


ఆధారాలు (Proofs):

Evidence 1:

"The Roseto Effect" is a well-documented medical phenomenon. Dr. Stewart Wolf led a massive team of over 50 professionals, including physicians and sociologists, starting in 1961. Their findings were published in the book "The Roseto Story" (University of Oklahoma Press, 1979) and "The Power of Clan" (1993). They analyzed medical records dating back to 1895 to confirm that social cohesion was the primary driver of their health.

Source: The Roseto Story: An Anatomy of Health by Stewart Wolf and John G. Bruhn. Page No: 15-40 (Chapter: The Mystery of Roseto).

తెలుగు అనువాదం:

రోసెటో ప్రభావం (The Roseto Effect): డాక్టర్ స్టీవర్ట్ వోల్ఫ్ మరియు సోషియాలజిస్ట్ జాన్ బ్రున్ 1961 నుండి దాదాపు 30 ఏళ్ల పాటు జరిపిన పరిశోధనలో ఈ నిజాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. వారు రాసిన "The Roseto Story" (యూనివర్సిటీ ఆఫ్ ఓక్లహోమా ప్రెస్, 1979) మరియు "The Power of Clan" (1993) పుస్తకాల్లో రోసెటో ప్రజల గుండె ఆరోగ్యం వారి ఆహారం వల్ల కాక, వారి మధ్య ఉన్న 'కుટુંంబ ఆత్మీయత' (Clan Power) వల్ల కలిగిందని నిరూపించారు.

ఆధారం: The Roseto Story: An Anatomy of Health - రచయితలు: స్టీవర్ట్ వోల్ఫ్ మరియు జాన్ జి. బ్రున్. పేజీ నంబర్: 15-40.

Evidence 2:

"Corporate interests in the late 1960s utilized 'Expert Bias' by hiring psychologists to promote individualism as a sign of progress. Television advertisements featuring celebrities equated health with consumer products and private lifestyles. This 'Social Engineering' was designed to break the communal bonds that the Roseto study had identified as life-saving. By labeling traditional closeness as 'unhygienic' and 'regressive', they successfully dismantled the social fabric by 1970."

Source: The Power of Clan: The Influence of Neighborliness on Health and Longevity by Stewart Wolf and John G. Bruhn. Page No: 140-155.

తెలుగు అనువాదం:

కృత్రిమ సామాజిక మార్పు: 1960 ల చివరలో కార్పొరేట్ శక్తులు 'నిపుణుల' ద్వారా వ్యక్తిత్వవాదాన్ని (Individualism) ప్రగతికి చిహ్నంగా ప్రచారం చేశాయి. టీవీ ప్రకటనలు మరియు సినిమా స్టార్లు విలాసవంతమైన వస్తువులనే ఆరోగ్యానికి మూలంగా చిత్రించాయి. రోసెటోలోని ఆత్మీయ బంధాలను 'అనాగరికత'గా, 'అపరిశుభ్రత'గా ముద్ర వేయడం ద్వారా, ఆ సామాజిక వ్యవస్థను 1970 నాటికి విజయవంతంగా విచ్ఛిన్నం చేశారు. దీని ఫలితంగానే, 1960ల మధ్య వరకు అక్కడ వారికి బిపిలూ, షుగర్ లూ, పెరాలిసిస్ లూ, గుండెపోటు మరణాలు శూన్యంగా ఉన్న అదే రోసెటోలో.. సరికొత్త అమెరికన్ వినియోగదారీ సంస్కృతి వల్ల సామాజిక బంధాలు తెగిపోవడంతో, 1971లో మొదటిసారి ఒక వ్యక్తి ఆసుపత్రిలో ఒంటరిగా యంత్రాల మధ్య గుండెపోటుతో మరణించాడు.

ఆధారం: The Power of Clan - రచయితలు: స్టీవర్ట్ వోల్ఫ్,  జాన్ జి. బ్రున్. పేజీ నంబర్: 140-155.

Apr 15, 2026

గుత్తికొండ ధనుంజయకు దక్కిన పార్టీ అధిష్ఠానం పదవి

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యునిగా నియమించిన చంద్రబాబు 



గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన పద్మశాలీ ప్రముఖులు, చేనేత కార్మిక నేత, మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్  గుత్తికొండ ధనుంజయ రావును ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు  నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమించారు.  టీడీపీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న ధనుంజయకు దక్కిన గౌరవంగా చేనేత వర్గం వారు భావిస్తున్నారు.  పార్టీ అధిష్ఠానవర్గం 26 మందిలో ధనుంజయకు స్థానం లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి తను చేసిన సేవలను గుర్తించి తనని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా నియమించినందుకు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు, మంగళగిరి శాసనసభ్యులు, మంత్రి నారా లోకేష్ కు ధనుంజయ కృతజ్ఞతలు తెలిపారు. 

చేనేత రంగంలో కార్మికవర్గ నేతగా గుత్తికొండ ధనుంజయ రావు అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు. ఆయన రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీ పుట్టుకతోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ధనుంజయ టీడీపీని వదలలేదు. అదే ఆయన ప్రత్యేక. ఎన్టీఆర్ పై అపార అభిమానం అతనిని పార్టీ వైపు మళ్లించింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అంటే  ఆపార గౌరవం. ఆయన విధానాలకు బాగా ఆకర్షితులయ్యారు. ఆయన బీసీలకు ఇచ్చే ప్రాధాన్యతకు ధనుంజయ ఆకర్షితులయ్యారు. చంద్రబాబు పరిపాలనాదక్షతకు ముగ్ధులయ్యారు. చంద్రబాబు నాయకత్వంలో చేనేతల సంక్షేమం కోసం కృషి చేస్తూ , బీసీలలో, చేనేత వర్గాల్లో మంచి గుర్తింపుని, గౌరవాన్ని పొందుతున్నారు.  పదవుల కోసం ప్రాకులాడే మనిషి కాదు. టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్నారు. అధికార పక్షంలో ఉన్నా,  ప్రతిపక్షంలో ఉన్నా చేనేత సమస్యలపై పోరాడటం ఆయన నైజం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేనేత కార్మికులకు పథకాలు రావడానికి కృషి చేశారు. 


14 సంవత్సరాల వయసులో చేనేత మగ్గం నేస్తూ.. అప్పుడే పుట్టిన తెలుగుదేశం పార్టీలో చిన్న వయసు అయినప్పటికీ సభ్యత్వం రెండు రూపాయలు కట్టి తీసుకున్నారు.  ఎన్టీఆర్ మీద అభిమానంతో ఆయన ఎక్కడ సభలు పెట్టినా అక్కడికి వెళ్లేవారు. మొట్టమొదటిసారిగా మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా 1983లో, 1985లో పోటీ చేసిన డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావుకి, 1989లో ఎలయన్స్ లో సిపిఎం అభ్యర్థి సింహాద్రి శివారెడ్డికి, 1994 సిపిఎం అభ్యర్థి నిమ్మగడ్డ రామ్మోహన్ రావు, 1999లో బిజెపి అభ్యర్థి ఎడ్లపాటి రఘునాథ బాబుకి, 2004లో బిజెపి అభ్యర్థి తమ్మిశెట్టి జానకి దేవికి, 2009లో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన మాదల రాజేంద్రకి,  2014లో గంజి చిరంజీవికి,  2019లొ నారా లోకేష్ కి ఎన్నికల్లోమద్దతుగా పనిచేశారు. 2024 లో నారా లోకేష్ గెలుపు కోసం అంకితభావంతో పనిచేశారు. 1988లో పట్టణ తెలుగు నాడు చేనేత కార్మిక సంఘం ఉపాధ్యక్షులుగా, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులుగా 1994 వరకు పనిచేశారు. 1995 నుండి పట్టణ తెలుగు నాడు చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శిగా నిరంతరం శ్రమిస్తున్నారు.  2006లో అప్పుడే కొత్తగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర చేనేత విభాగం ఏర్పాటు చేయగా,  రాష్ట్ర కార్యవర్గంలో చేనేత విభాగం రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా 2019 వరకు కొనసాగారు.  2022 నుండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. బీసీలను కూడగట్టడంలో విశేష కృషి చేశారు. బీసీలను పార్టీవైపు మళ్లించడానికి నిరంతరం శ్రమించి బీసీ నేతగా ఎదిగారు. 

2006లో మాదాల రాజేంద్ర  మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేస్తున్న టైంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న చేనేత ఆరోగ్య బీమా కార్డులు చేనేత కార్మికులకు ఇప్పించటంలో ధనుంజయ కృషి ఎంతో ఉంది.  బీమా కోసం కార్మికులు చెల్లించాల్సిన సొమ్ము మొత్తాన్ని ఆనాడు రాజేంద్ర  చెల్లించారు.  దాదాపు 3,000 మంది చేనేత కుటుంబాలకు కార్డులు వరుసగా మూడు సంవత్సరాలు అందజేసి, వారికి అండగా నిలిచారు.  ఆ విధంగా  తెలుగుదేశం పార్టీ చేనేత విభాగం తరఫున గుత్తికొండ ధనంజయరావు విశేష కృషి చేశారు. ఇది పార్టీకి ఎంతో మేలు చేకూర్చింది. ఇప్పటికీ చేనేత కుటుంబాల్లో మళ్లీ ఆరోగ్య భీమా కార్డులు కావాలని అడుగుతూ ఉంటారు.


అంతేకాకుండా, ఒక పక్క పార్టీ కార్యక్రమాల్లో నిరంతరం పనిచేస్తూ, సామాజిక కార్యక్రమాల్లో పద్మశాలి సంఘాల్లో పనిచేస్తూ చేనేత కార్మికులకు అన్ని రకాలుగా అండగా ఉన్నారు.  చేనేత ఉద్యమాల్లో ముఖ్యంగా మంగళగిరి చేనేత కార్మికుల వేతనాలు పెంచే విషయంలో చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీతో కలిసి పోరాటం చేయటంలో ముందుంటారు.  2004లో అధికారం కోల్పోయిన తర్వాత ఏర్పడిన నిమ్మల కృష్ణప్ప నేతృత్వం లోని  రాష్ట్ర చేనేత విభాగం కమిటీలు ముఖ్య పాత్ర పోషించాయి.  రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటన చేసి చేనేత సమస్యలపై చంద్రబాబుకు ఒక నివేది అందించారు. అప్పట్లో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో చేనేత కార్మికులకు ఇస్తున్న రాయితీలు అక్కడున్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేయడం కోసం చంద్రబాబు, నిమ్మల కిష్టప్ప నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీలో కూడా గుత్తికొండ ధనుంజయరావు ఉన్నారు.  రెండు రాష్ట్రాల్లో పర్యటించిన కమిటీ నివేదిక ఆధారంగానే 2014లో ఏర్పడిన చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం వాటిలో కొన్ని సంక్షేమ పథకాలను, రాయితీలను చేనేత కార్మికులకు  అందించింది.


 చేనేత కులాల్లో, ముఖ్యంగా పద్మశాలీ కులంలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది.  అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. తిరుపతి తిరుచానూరు అఖిలభారత పద్మశాలి అన్న సత్ర కమిటీ సభ్యులుగా పని చేశారు. పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ సభ్యులుగా, మంగళగిరి బ్రాంచ్ ప్రధాన కార్యదర్శిగా,  మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం అధ్యక్షులుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు.


పార్టీ, చేనేత రంగంలోనే కాకుండా కళారంగంతో కూడా ఆయనకు అనుబంధం ఉంది. ఆ రంగంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టీడీపీ నేతగానే కాకుండా  సామాజిక కార్యకర్తగా కూడా ఆయనకు మంచి పేరుంది. మంగళగిరిలో టీడీపీ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ధనుంజయే.  ఇటీవల కాలంలో మంగళగిరి ప్రాంతంలో సాహితీ కళా రంగాలకు ప్రాధాన్యత కొరబడింది. కళాభిమానులు, సాహితీ అభిమానులు, పెద్దలు మళ్లీ కళాసాహితీ రంగాలకు ప్రాణం పోయాలని తీర్మానం చేసి, గుత్తికొండ ధనుంజయరావుని  మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గా ఎన్నుకున్నారు. అయిదేళ్ల క్రితం మంగళగిరి సాహితీ కళా వేదిక ఆవిర్భవించింది. దానికి కన్వీనర్ గా గుత్తికొండ ధనంజయరావు  కొనసాగుతున్నారు. ఈ కాలంలో సాహితీ కళా రంగాల వైభవాన్ని తీసుకురావటంలో ముందున్నారు.


1987 నుంచి 1991 వరకు మంగళగిరి రత్నాల చెరువు ప్రాంతంలో కూలి పనులకు వెళ్లే 14 సంవత్సరాలలోపు పిల్లలకు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వ పథకమైన "అనియత విద్య" ద్వారా ధనుంజయరావు ఎంతోమంది పిల్లలకు విద్యను అందించారు. తరువాత శ్రామిక నగర్ లో ఒక అరుణోదయ పబ్లిక్ స్కూల్ స్థాపించి వందలాది మంది పిల్లలకు విద్యాబోధన చేశారు. 2000 సంవత్సరంలో స్థాపించిన అభయ సేవా సమితి ఉపాధ్యక్షులుగా అనేక ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటుకు కృషి చేశారు.  


గుత్తికొండ సీతారామయ్య, లక్ష్మీకాంతమ్మ దంపతులకు ధనుంజయ రావు 1968 జూన్ 1వ తేదీన జన్మించారు. ధనుంజయ తోబుట్టువులు మొత్తం ఏడుగురు. ఆయన  ప్రాథమిక విద్య 5వ తరగతి వరకు మంగళగిరి మూర్తి స్కూల్ లో చదివారు. ఆ తర్వాత చింతక్రిది కనకయ్య హైస్కూల్ లో 6వ తరగతి చదివారు.  వివిధ కారణాల వల్ల చదువు మానివేశారు. ఆ తర్వాత 1989లో ప్రైవేటుగా ఆంధ్ర యూనివర్సిటీ మెట్రిక్ పరీక్ష రాసి పాసయ్యారు.  1990 మే 5న గుంటూరుకు చెందిన  కాకుమాను పాపయ్య, తేరోజమ్మల కుమార్తె విజయకుమారిని వివాహం చేసుకున్నారు. వారికి  ముగ్గురు కుమార్తెలు. ముగ్గురుకీ వివాహలయ్యాయి.  పెద్ద కుమార్తె జయశ్రీ- పెద్దల్లుడు అలుగూరి శివ నాగరాజు, రెండవ కుమార్తె మౌనిక, -రెండవ అల్లుడు మునగపాటి భార్గవ్ సాయి, మూడో కుమార్తె సాయి లక్ష్మి – మూడోవ అల్లుడు అవ్వారు నవీన్. ప్రస్తుతం వివిధ హోదాలలో  గుత్తికొండ ధనుంజయరావు అటు పార్టీకి, ఇటు చేనేత,  కుల,  కళా, సాహితీ రంగాలలో  తనదైన ప్రతిభతో ప్రజా సేవ కొనసాగిస్తున్నారు.

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914











Apr 2, 2026

అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం


రాజధాని అమరావతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్(అమెండ్‌మెంట్) బిల్-2026ని రాజ్యసభ గురువారం  ఆమోదించింది.  
మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. ఇది చారిత్రాత్మక దినం అని ఎన్డీఏ నేతలు అభివర్ణించారు. ఈ బిల్లుకు లోక్‌సభ నిన్న ఆమోదం తెలిపింది.  రాజ్యసభ ఆమోదించడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదానికి పంపుతారు.  పార్లమెంటులోని ఉభయసభలు ఆమోదించడంతో ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి ఖరారైంది.  రాష్ట్రపతి సంతకం తర్వాత గెజిట్ విడుదలవడంతో ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభిస్తుంది. బిల్లుపై చర్చలో 11 పార్టీలకు చెందిన మొత్తం 17 మంది ఎంపీలు పాల్గొన్నారు. వైసీపీ మాత్రమే బిల్లుకు వ్యతిరేకంగా వాకౌట్ చేసింది. మిగిలిన 10 పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి.



అమరావతి... కీలక ఘట్టాలు




2014 జూన్‌ 2: ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో హైదరాబాద్‌ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా మారింది.

2014 సెప్టెంబరు 1: గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని ప్రాంతాన్ని ఖరారు చేశారు.

2014 సెప్టెంబరు 3: గ్రీన్‌ ఫీల్డ్‌ విధానంలో రాజధాని నగరాన్ని నిర్మించాలని అసెంబ్లీ తీర్మానం చేసింది.

2014 డిసెంబరు 8: రాజధానిపై మాస్టర్‌ ప్లాన్‌ తయారీకి సింగపూర్‌ సంస్థలతో ఒప్పందం.

2014 డిసెంబరు 30: సీఆర్‌డీఏ చట్టం అమల్లోకి వచ్చింది. అమరావతిలో రాజధాని ఏర్పాటుకు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి.

2015 జనవరి: రాజధాని కోసం భూ సమీకరణ ప్రారంభమైంది.

2015 మార్చి: 29 గ్రామాల్లో సుమారు 33 వేల ఎకరాల సమీకరణకు రైతుల అంగీకారం లభించింది.

2015 ఏప్రిల్‌ 23: రాజధాని నగరానికి అధికారికంగా అమరావతి పేరు పెట్టారు.

2015 జూలై 20: రాజధాని మాస్టర్‌ ప్లాన్లను సింగపూర్‌ బృందం ప్రభుత్వానికి అందజేసింది.

2015 అక్టోబరు 22: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతికి శంకుస్థాపన చేశారు. అన్ని ప్రాంతాల నుంచి మట్టి, నీరు తెచ్చారు.

2016 ఫిబ్రవరి: మాస్టర్‌ డెవల్‌పమెంట్‌ ప్లాన్‌ నోటిఫై చేశారు.

2016 జూన్‌: ఏపీ సచివాలయం, ప్రభుత్వ విభాగాలు అమరావతి ప్రాంతం నుంచి పనిచేయడం ప్రారంభం.

2018 డిసెంబరు: సచివాలయ టవర్స్‌కు శంకుస్థాపన.

2019 ఫిబ్రవరి: హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన.

2019 మే: వైసీపీ ప్రభుత్వంలో అమరావతిపై కుట్రలు ప్రారంభం.

2019 డిసెంబరు 17: వైసీపీ మూడు రాజధానుల ప్రకటన

2020 జూలై 31: సీఆర్‌డీఏ చట్టం రద్దు చేశారు. మూడు రాజధానుల బిల్లు పెట్టారు. శాసనమండలిలో టీడీపీ వ్యతిరేకించింది. అప్పటి మండలి చైర్మన్‌ మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపారు.

2021 డిసెంబరు 13: న్యాయ వివాదాలతో మూడు రాజధానుల చట్టం ఉపసంహరించుకున్నారు. సీఆర్‌డీఏ చట్టం పునరుద్ధరణ.

2022 మార్చి 5: అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని ఏపీ హైకోర్టు తీర్పు.

2024 జూన్‌ 2: పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది. హైదరాబాద్‌ తెలంగాణకు పరిమితమైంది.

2025 మే 2: ప్రధాని మోదీ రాజధాని పనులను పునఃప్రారంభించారు.

2026 మార్చి 28: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతే ఉండాలని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.

2026 ఏప్రిల్‌ 1: రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర పునర్‌విభజన సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

2026 ఏప్రిల్‌ 2: సదరు బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.

ఏపీలో ప్లాస్టిక్ ఫ్రీ విప్లవం

రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్రీ విప్లవం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దక్కుతుంది. చంద్రబాబు నాయకత్వంలో మానవ వనరులు అభివృద్ధి,  విద్య...