నూతన సీఎస్ అనీల్ చంద్రపునేఠకు పలువురి శుభాకాంక్షలు
సచివాలయం, అక్టోబర్ 1: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొత్తగా బాధ్యతలు
స్వీకరించిన అనిల్ చంద్ర పునేఠను సచివాలయం 1వ బ్లాక్ లోని తన కార్యాలయంలో సోమవారం
ఉదయం పలువురు రాజకీయ ప్రముఖులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులు కలుసుకొని
పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపినవారిలో ఎంపీ
మురళీ మోహన్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఎల్వీఆర్కే ప్రసాద్, ప్రభుత్వ
మీడియా సలహాదారు ఆర్.కృష్ణయ్య, డీజీపీ ఆర్పీ ఠాకూర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు
మన్మోహన్ సింగ్, సాంబశివరావు, పూనమ్ మాలకొండయ్య, నీరబ్ కుమార్ ప్రసాద్, జెఎస్వీ
ప్రసాద్, ఆర్టీసీ ఎండీ సురేంద్ర బాబు, ఫైర్
సర్వీసుల డీజీ కె.సత్యనారాయణ, ముఖ్య కార్యదర్శులు ఎస్ఎస్ రావత్, గోపాలకృష్ణ
ద్వివేది, ప్రవీణ్ కుమార్, ఉదయలక్ష్మి, కార్యదర్శులు రవిచంద్ర, బి.శ్రీధర్, ఎంకె
మీనా, వెంకటరమణ, అమరావతి మెట్రో రైల్ కార్పోరేషన్ ఎండీ రామకృష్ణా రెడ్డి, ఆర్టీజీ
సీఈఓ అహ్మద్ బాబు, సర్వే అండ్ ల్యాండ్ కమిషనర్ విజయమోహన్, ఆర్ అండ్ ఆర్ కమిషనర్
జీ.రేఖారాణీ, టూరిజం కార్పోరేషన్ ఎండీ హిమాంచు శుక్లా తదితరులు ఉన్నారు. ఏపీ
ఎన్జీఓ అధ్యక్షులు అశోక్ బాబు, ఆ సంఘ ప్రతినిధులు, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు
బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆ సంఘ ప్రతినిధులు, వీఆర్వో సంఘ ప్రతినిధులు, వివిధ శాఖల
ఉన్నతాధికారులు కూడా సీఎస్ ను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
No comments:
Post a Comment