Sep 28, 2018


గిరిజన నేతల హత్య అమానుషం

ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు
         
                సచివాలయం, సెప్టెంబర్ 28: నక్సలైట్లు ఏ వర్గాల కోసం పని చేస్తున్నారో ఆ వర్గాలకు ప్రతినిధులుగా ఎదుగుతున్నవారిని కాల్చి హత్య చేయడం అమానుష చర్యగా ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు పేర్కొన్నారు. విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలను  టీడీపీ ఖండిస్తుందన్నారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వేశ్వర్రావు 2007-09 మధ్య కాలంలో తనతోపాటు శాసన మండలి సభ్యులుగా ఉన్నారని, ఆ తరువాత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని చెప్పారు. ఆయన టీడీపీలో చేరినందుకు రూ.12 కోట్లు తీసుకున్నారని, ఆ డబ్బుతో మైనింగ్ నిర్వహిస్తున్నారని అందువల్లే ఆయనను నక్సల్స్ హత్య చేసినట్లు  ప్రతిపక్ష వైసీపీ నేతల ఆరోపణలు సాక్షి పత్రికలో ప్రచురించారని చెప్పారు. అంతా వారు దగ్గర ఉండి చూసినట్లుగా లేదా వారి మనిషి అక్కడ ఉన్నట్లు రాశారన్నారు. పోలీసుల విచారణలో అవన్నీ చెప్పాలన్నారు.  వైసీపీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తే ఇలాగే జరుగుతుందని అర్దం వచ్చేవిధంగా మాట్లాడుతున్నారని,  వారిని వ్యతిరేకిస్తే ఇతరులతో కలిసి హత్య చేయిస్తారా? అని ప్రశ్నించారు. హత్యలు జరిగిన సమీపంలోనే ప్రతిపక్ష నేత జగన్మోహన రెడ్డి పాదయాత్ర చేస్తున్నారని, సంఘటనా స్థలానికి ఎందుకు వెళ్లలేదని అడిగారు. వైసీపీ నేతలు ఈ విధంగా వ్యవహరించడం భావ్యం కాదన్నారు. సర్వేస్వరరావు ప్రజల మధ్య ఉన్న మనిషని, అటువంటి వ్యక్తిని హత్య చేసిన నక్సల్స్ వ్యవహారాలు, తెలివితేటలు తెలియనివికావని అన్నారు. వైసీపీ వారిలో మిత్ర వైరుధ్యం కనిపించడంలేదని, శత్రువైరుధ్యంకనిపిస్తోందని, అది తప్పుడు విధానమని ఆయన పేర్కొన్నారు. టిడీపీని తిట్టడం వైసీపీకి అలవాటైపోయిందన్నారు. నక్సల్స్ చర్యని వైసీపీ ఖండించకపోవడం అన్యాయం అన్నారు. ఆ పార్టీ ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు విరుద్ధంగా పని చేస్తోందన్నారు. వారికి ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందా? అని ప్రశ్నించారు.

ఎన్నికల సమయంలో బీజేపీ ఎత్తుగడలు
            ఎన్నికల సమయంలో తమ పబ్బం గడుపుకోవడానికి బీజేపీ సీబీఐ, ఇన్ కంమ్ టాక్స్ విభాగాలను వాడుకుంటుందని, ఇది వారి ఎన్నికల ఎత్తుగడలో ఒక భాగమని  జూపూడి విమర్శించారు. హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటీ దాడులు ఆ తరహావేనన్నారు. ఓటుకు నోటు కేసని అంటున్నారని, అందులో చంద్రబాబు పేరును కూడా వారు ప్రస్తావిస్తున్నారని చెప్పారు. ఆయనపై ఎటువంటి కేసు ఫైల్ కాలేదని, కోర్టు కూడా అతనిని నిందితునిగా పేర్కొనలేదని తెలిపారు. గతంలో తమిళనాడులో శశికళ, పళనిస్వామి, పన్నీరు సెల్వంలను ఇబ్బంది పెట్టి తమ పబ్బం గడుపుకున్నారన్నారు. కర్ణాటకలో కుమారస్వామిని కూడా అలాగే ఇబ్బంది పెట్టారన్నారు. తెలంగాణలో జగ్గారెడ్డిపై కూడా పోలీసులతో దాడులు చేయిస్తున్నారన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ మిలాఖత్ అయి వ్యతిరేక పార్టీలపై ఎన్నికల సందర్భంగా దాడులు చేయిస్తున్నాయని ఆరోపించారు. ఇటువంటి చర్యలను నేర ప్రవృత్తిగా భావించవలసి ఉంటుందన్నారు. ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నవారే ఇలాంటి చర్యలు చేపడతారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇలా చేయడాన్ని తాము విమర్శిస్తున్నామని చెప్పారు.

ఎస్సీఎస్టీలకు క్రీమిలేయర్ వర్తించదు
                ఎస్సీఎస్టీలకు క్రీమిలేయర్ వర్తించదని జూపూడి చెప్పారు. రాజ్యాంతంలోని 341, 342 ఆర్టికల్స్ కి ఇది విరుద్ధమన్నారు.  ఈ విషయమై గతంలో కోర్టు తీర్పు తెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. క్రీమిలేయర్ ఆర్థికంగా వెనుకబడినవారైన బీసీలకు మాత్రమే వర్తిస్తుందని, అంటరానితనానికి గురైన ఎస్సీ, ఎస్టీలకు వర్తించదని కోర్టు తీర్పు చెప్పినట్లు జూపూడి తెలిపారు.



No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...