ఏపీ ఎస్సీ కార్పోరేషన్ కు ఐఎస్ఓ
సర్టిఫికెట్
సచివాలయం, సెప్టెంబర్ 26: ఆంధ్రప్రదేశ్
ఎస్సీ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పోరేషన్ కు ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించింది. దేశంలో ఈ
సర్టిఫికెట్ లభించిన మొదటి ఎస్సీ కార్పోరేషన్ ఇదే కావడం విశేషం. తాడేపల్లిలోని
ఎస్పీ కార్పోరేషన్ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్
సమీక్షా సమావేశంలో ఐఎస్ఓ ప్రతినిధి ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికెట్ ని చైర్మన్ జూపూడి
ప్రభాకర రావు, మేనేజింగ్ డైరెక్టర్ విజయ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా జూపూడి
మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడం ద్వారా దేశంలో ఏ రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్
కు లేని విధంగా ఆంద్రప్రదేశ్ ఎస్సీ కార్పోరేషన్ కు ఐఎస్ఓ గుర్తింపు రావడం చాలా
ఆనందంగా ఉందన్నారు. వినూత్న పథకాలు
ప్రవేశపెట్టి కార్పోరేషన్ ద్వారా సమర్థవంతంగా ఎస్సీలకు ఆర్థిక సహాయం అందజేసినందుకు
ఈ ఘనత సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల అధికారులు, బోర్డ్ ఆఫ్
డైరెక్టర్స్ కు ఆయన అభినందనలు తెలిపారు.
No comments:
Post a Comment