Sep 26, 2018


ఏపీ ఎస్సీ కార్పోరేషన్ కు ఐఎస్ఓ సర్టిఫికెట్
                సచివాలయం, సెప్టెంబర్ 26: ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పోరేషన్ కు ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించింది. దేశంలో ఈ సర్టిఫికెట్ లభించిన మొదటి ఎస్సీ కార్పోరేషన్ ఇదే కావడం విశేషం. తాడేపల్లిలోని ఎస్పీ కార్పోరేషన్ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ సమీక్షా సమావేశంలో ఐఎస్ఓ ప్రతినిధి ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికెట్ ని చైర్మన్ జూపూడి ప్రభాకర రావు, మేనేజింగ్ డైరెక్టర్ విజయ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా జూపూడి మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడం ద్వారా దేశంలో ఏ రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ కు లేని విధంగా ఆంద్రప్రదేశ్ ఎస్సీ కార్పోరేషన్ కు ఐఎస్ఓ గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు.  వినూత్న పథకాలు ప్రవేశపెట్టి కార్పోరేషన్ ద్వారా సమర్థవంతంగా ఎస్సీలకు ఆర్థిక సహాయం అందజేసినందుకు ఈ ఘనత సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల అధికారులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కు ఆయన అభినందనలు తెలిపారు.

No comments:

Post a Comment

మంగళగిరిలో ముగ్గురు ప్రముఖులకు సన్మానం

  మంగళగిరి: మంగళగిరి మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో మూడు రంగాలలో  ముగ్గురు నగర ప్రముఖులు గుత్తికొండ ధనుంజయ రావు, గోలి మధు, శిరందాసు నాగార్జున ...