నవంబర్ లో విశాఖలో టెక్-2018
సచివాలయం, సెప్టెంబర్ 10: నవంబర్ 14 నుంచి 17వ తేదీ వరకు
విశాఖపట్నంలో నిర్వహించే టెక్(ట్రాన్స్
ఫార్మింగ్ ఎడ్యుకేషన్ ఫర్ హ్యూమానిటీ)-2018 నిర్వహణ గురించి సచివాలయం 4వ బ్లాక్ సమావేశ
మందిరంలో సోమవారం సాయంత్రం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్
సంబంధిత అధికారులతో చర్చించారు.
ఈ కార్యక్రమాన్ని యునెస్కో-ఎంజీఐఇపీ (మహాత్మా గాంధీ ఇన్
స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ పీస్) సహకారంతో ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ ఆధ్వర్యంలో విశాఖ నోవాటెల్ హోటల్ లో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి ఎంపికైన
పాఠశాలల, జూనియర్
కాలేజీల, డిగ్రీ
కాలేజీల, యూనివర్సిటీల
విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు హాజరవుతారు. 4 రోజులు జరిగే ఈ
కార్యక్రమంలో మూడు వర్క్ షాపులు,
కేటలిటిక్
సెషన్స్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి వివిధ
దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారు. 2017లో కూడా ఇటువంటి కార్యక్రమం విజయవంతంగా
నిర్వహించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవం,
కీలక ఉపన్యాసం, ముగింపు
ఉత్సవం,
హాజరయ్యేవారికి వసతి సౌకర్యం, జాతీయ, అంతర్జాతీయ, స్థానిక మీడియా కవరేజ్, ముఖ్య అథితులకు
ఏర్పాట్లు, సెక్యూరిటీ
తదితర నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలను ఆదిత్యనాథ్ దాస్ సమీక్షించారు. ఈ సమావేశంలో కాలేజీ ఎడ్యుకేషన్ స్పెషల్ కమిషనర్
సుజాత శర్మ, యునెస్కో-ఎంజీఐఇపీ సీనియర్
ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎబల్ కేర్,
యునెస్కో అధికారి సమితా రస్తోగి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అర్చనా చౌదరి తదితరులు పాల్గొన్నారు., అమరావతి.
No comments:
Post a Comment